గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 30, 2014

వ్యతిరేకిస్తున్నా...ముంపు విలీన జీవో వెలువరించటం అప్రజాస్వామికం!

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో నెంబర్ 18411ను నిరసిస్తూ పోలవరం ముంపు మండలాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆదివారం ఖమ్మంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జీవో ప్రతులను, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని అనేక విధాలుగా ఆందోళన చేస్తూన్నప్పటికీ వారి సమస్యను పరిష్కరించకుండా ఆగమేఘాల మీద ఏపీ ప్రభుత్వం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జీవోను జారీ చేయడం అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. అఖిలపక్ష నాయకులు కుక్కునూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఉత్తర్వు ప్రతులను దహనం చేశారు.

ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వింజరం రేవు వద్ద గోదావరి నదిలో నాయకులు జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. భద్రాచలంలో టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విద్యార్థి కార్యాచరణ వేదిక చేపట్టిన మూడో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధినేని పూర్ణచందర్‌రావు మాట్లాడుతూ ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం వలన ఐదు వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ముంపు మండలాల్లో సోమవారం తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పోలవరం వ్యతిరేక కమిటీ కన్వీనర్ వట్టం నారాయణదొర పిలుపునిచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి