గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, డిసెంబర్ 03, 2014

"చంద్రబాబు ప‌చ్చి మోస‌కారి" -మంత్రి జగదీశ్ రెడ్డి

chandrababu


విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన 54 శాతం విద్యుత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఇవ్వడం లేదు. ఏపీలో మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. ఇంత పచ్చిగా ఒక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న బాబు తీరుపై జనంలో అలజడి మొదలైంది. మోసాలకు త్వరలో ప్రతిఫలం అనుభవించక తప్పదు అని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

-ఏపీ పాలన పక్కనపెట్టి బాబు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు
-సీమాంధ్ర మీడియాది పక్షపాత ధోరణి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఎలాంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు, అన్ని పనులు చేస్తున్న కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీచేయకుండా బాబు మోసాలకు పాల్పడుతున్నా సీమాంధ్ర మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మోసం సీమాంధ్ర మీడియాకు పట్టదా? ఇంత అన్యాయం జరుగుతున్నా అక్కడి ప్రజల గురించి పట్టించుకోరా అని బాబు పక్షపాత వైఖరిని నిల దీశారు. చంద్రబాబు ఏమీ చేయకున్నా సొంత మీడియా గుంపుతో ఏదో చేశాననే ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, తొమ్మిదేండ్ల పాలనా అనుభవంతోనే అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని చురకలంటించారు. ఆ రాష్ర్టాన్ని పరిపాలించకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఎద్దేవాచేశారు. సీమాంధ్ర మీడియా కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని హెచ్చరించారు. తెలంగాణ పది జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు ఏపీలోని ఒక్క అనంతపురంలో జరిగితే సీమాంధ్ర మీడియా ఒక్క ముక్కా రాయడం లేదని, ఇక్కడ మాత్రం పేజీలు నింపి, తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి