గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 26, 2014

విభజన ప్రక్రియ జాప్యంపై సీఎస్ సీరియస్...

-వారంలోగా పూర్తి చేయాలని ఆదేశం
వివిధశాఖల్లో జరుగుతున్న విభజన ప్రక్రియ జాప్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సీరియస్ అయ్యారు. వారంలో ప్రక్రియ పూర్తి చేయాలని అన్నిశాఖల ముఖ్య కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులకు పైబడుతున్నా.. విభజనకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల్లో సిబ్బందిని నియమించుకోవాలని, చాంబర్లు, పేషీల ఏర్పాటు పూర్తిచేయాలని సూచించారు. కంప్యూటర్లతోపాటు ఇతర సౌకర్యాలను త్వరితగతిన కల్పించి, పాలన సజావుగా సాగేలా చూడాలని, నిబంధనల ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులు సత్వరమే తమ స్థానాల్లో విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణకు సంబంధించిన ఫైళ్లు అన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

సమాచారం ఎప్పుడు కోరితే అప్పుడు తెచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫైళ్లు, సిబ్బందిని ఇక్కడినుంచి వెంటనే ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీ బ్లాకులోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీఏడీ, టూరిజం, ఎల్ బ్లాకులోని ఐటీ డిపార్టుమెంట్ ఫైళ్లు ఇంకా ఖాళీకాకపోవడం పట్ల ఆయన అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థలు, విభాగాలకు తెలంగాణ లోగోతో ఉన్న బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సలహాదారులకు వాహనాలు, పేషీలను సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున కీలకశాఖలైన వైద్య, విద్య, వ్యవసాయం, ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, రోడ్లు-భవనాలవంటి శాఖలు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. వారంలో వీలైనంత త్వరగా పూర్తి స్థాయి సమాచారాన్ని ఉంచుకోవాలని సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి