గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 25, 2014

ఉమ్మడి విద్యామండలిలో...ఆంధ్రా జులుం...!?


క్రైస్తవ సోదరులకు
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

ఉన్నత విద్యామండలిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్ర అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్‌ఈ)కి సహకరిస్తున్నారన్న సాకుతో ఉద్యోగుల జీతాలను నిలిపేస్తున్నారు. ఉమ్మడి నిధుల్లో తెలంగాణకు సంబంధించిన 48 శాతం నిధులున్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు నవంబర్ నెల జీతం ఇంకా ఇవ్వలేదు. ఉమ్మడి విద్యామండలి జీతం తీసుకొంటూ.. తెలంగాణ విద్యామండలికి పనిచేస్తున్నారని సాకులు చూపిస్తున్నారు. ఆయన పేరును ఉద్యోగుల రిజిస్టర్ నుంచి తొలగించారు. బయోమెట్రిక్ యంత్రం నుంచి తన వేలిముద్రలను కూడా తొలగించినట్లు సత్యనారాయణ వెల్లడించారు. గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆయన, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆయన 2004లో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగానూ పోటీచేశారు. 2007లో 21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత...
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటైనా... దానికి సిబ్బంది, విధులు, నిధుల విభజన జరుగలేదు. దీంతో టీఎస్సీహెచ్‌ఈకి సత్యనారాయణ...తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

అటు విభజన పూర్తికాకపోవడంతో ఉమ్మడి ఉన్నత విద్యామండలి తరఫున సమాచారహక్కు చట్టం, మానవ వనరుల అభివృద్ధి విభాగం వంటి కార్యకలాపాలు కూడా సత్యనారాయణ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 


ఇప్పుడు దాన్నే సాకుగా చూపిస్తూ ఆయన నవంబర్ జీతాన్ని నిలిపివేసి ఆయనను మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఉమ్మడి విద్యామండలిలో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది తెలంగాణ విద్యామండలి కోసం పని చేయవద్దంటూ ఏపీ అధికారులు హుకుం జారీచేశారు.

ఒకవేళ అలాచేస్తే రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించారు. రెండు, మూడు రోజుల్లో జీతాల చెల్లింపుపై సానుకూల నిర్ణయం రాకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం చర్యలు తీసుకొంటామని టీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు వెంకటాచలం, మల్లేశం హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 24, 2014

ఏపీఎండీసీ నిధుల పంపకానికి...ఆంధ్రా సర్కారు...నో...

-నిధుల సర్దుబాటుకు ససేమిరా
-రుణమిస్తూ గట్టెక్కించే యత్నం
-అడ్డదారిలో ఏపీఎండీసీకి 15 కోట్లు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)లో పుష్కలంగా ఉన్న నిధులను జనాభా ప్రాతిపదికన పంచడానికి మనసొప్పని ఆంధ్రా ఆధిపత్యం వైపరీత్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని నిబంధనలను తుంగలో తొక్కి, తెలంగాణకు రావాల్సిన వాటాను పంచకుండా ఏవో సాకుల్ని ఏపీ ప్రభుత్వం చూపుతున్నది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నిధుల పంపకాల్లో విభిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఏపీఎండీసీలో రూ.700 కోట్లకు పైగా నిధులు బ్యాంకు ఉమ్మడి ఖాతాల్లో నిల్వ ఉన్నాయి. 
వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని చట్టం చెబుతున్నది. అయినా డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించకుండా, నిపుణుల కమిటీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆరు నెలలు పూర్తయినా నిధులను మాత్రం ఇవ్వకుండా తప్పించుకునేందుకు కుట్రలు సాగిస్తున్నారు.
జీరో బ్యాలెన్స్‌తోనే తెలంగాణ ఉద్యోగుల విభజన చేపట్టడంతో, ఆర్థిక ఇబ్బందుల మధ్య తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్ర ఖాతాల్లోని నిధులను దొడ్డిదారిన డ్రా చేస్తున్న ఉదంతాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతో ఆంధ్రా సర్కారు రూట్ మార్చింది. 

అడ్డదారుల్లో నిధులను వినియోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో జీఓ నం.400, తేదీ.17-12-2014 ద్వారా తాజాగా ఏపీఎండీసీకి ఆంధ్రా సర్కారు రూ.16 కోట్లు రుణంగా ఇచ్చింది.
ఓ సంస్థకు ప్రభుత్వమే రుణమిచ్చిన వైనం ఎక్కడా జరగలేదని, ఇదే తొలిసారిగా అధికారులు చెప్పుకుంటున్నారు.
తమ ప్రాంతం నుంచే ఆదాయం అత్యధికంగా వస్తున్నదనే ఏకైక కారణాన్ని తెర మీదికి తీసుకొస్తూ, ఉమ్మడి ఖాతాల్లోని నిధులను జనాభా ప్రాతిపదికన పంచుకోవడానికి మాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం.

19 ప్రభుత్వ రంగ సంస్థల్లో
ఒకటీ, రెండు సంస్థలకు మాత్రమే ఆంధ్రా ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తున్నదని,
మిగిలిన అన్ని సంస్థలకూ తెలంగాణ పది జిల్లాల నుంచే 70 శాతానికి పైగా నిధులు సమకూరుతున్నాయని
అధికారులు పేర్కొన్నారు.

అన్ని సంస్థల నుంచి జనాభా ప్రాతిపదికన 5 శాతం వాటా ఆంధ్రాకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నష్టపోతున్నది.
కానీ ఏపీఎండీసీలో మాత్రం జనాభా ప్రాతిపదికన కాకుండా లొకేషన్ పద్ధతిన పంచాలని కోరుకోవడం అనైతిక చర్య అని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇకనైనా చట్ట ప్రకారం రూపొందిన ఏపీఎండీసీ డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించేందుకు ప్రయత్నించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్యోగులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 23, 2014

ముంపు తెలంగాణలో.. పరిహారం ఆంధ్రలో...???!!!

-పులిచింతలలో మునిగిన మన అటవీ భూములపై సీమాంధ్ర కుట్ర
-నల్లగొండ జిల్లాలో ముంపునకు గురైన 375 హెక్టార్లు
-పరిహారంగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూమి కేటాయింపు
పులిచింతల ప్రాజెక్టు.. కృష్ణానదిపై నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మితమైన జలాశయం. రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో 13,915 ఎకరాలు తనలో కలిపేసుకున్న ఈ ప్రాజెక్టు మన రాష్ర్టానికి ఒరగబెడుతున్న ప్రయోజనం శూన్యం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం 13 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు సీమాంధ్ర పాలకులు. 1988లో ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి శంకుస్థాపన చేసుకుని, 2004లో వైఎస్ చేతులతో మరోసారి శిలాఫలకం వేయించుకుంది. 

pond


2006లో అన్ని అనుమతులూ తెచ్చుకుని కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చుకుంది. 2013 డిసెంబర్ 7న అసంపూర్తి నిర్మాణాన్నే ఆగమేఘాల మీద ప్రారంభించారు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. రూ.1850 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురైన నల్లగొండ జిల్లాకు ఉపయోగం లేదు.

నిర్మాణం డిజైన్‌నే తమకు అనుకూలంగా మలుచుకున్న నాటి పాలకుల దుర్బుద్ధి ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పరిహారం విషయంలో ఇక్కడి ప్రాంతంపై చిన్నచూపు చూడడమే కాదు.. కోల్పోయిన అటవీ భూములకు పరిహారంగాను సీమాంధ్రలో భూములు కేటాయించడం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలను బలపరుస్తున్నది.

-తెలంగాణకు 375 హెక్టార్ల అటవీ భూమి నష్టం
పులిచింతల ప్రాజెక్టులో నల్లగొండ జిల్లాలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లో 13,915 హెక్టార్ల భూమి ముంపునకు గురైంది. మూడు మండలాల్లో 13 గ్రామాలు నిర్వాసిత పల్లెలుగా మారాయి. ఈ ముంపునకు గురైన భూముల్లో జిల్లాలోని 375.27 హెక్టార్ల అటవీ భూములు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లా వైపు సైతం 13 గ్రామాలను ముంపునకు గురి చేసిన ఈ జలాశయం బ్యాక్ వాటర్‌లో అక్కడ కూడా భారీగానే భూములు నీట మునిగాయి. మన రాష్ట్రం వైపు 375 హెక్టార్ల అటవీ భూమితోపాటు ఏపీలోని గుంటూరు జిల్లాలో కూడా 793 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురైంది.

ఎక్కడైనా అటవీ భూములు ప్రాజెక్టుల్లో నీట మునిగినప్పుడు పరిహారంగా డబ్బులు కాకుండా తిరిగి భూమినే ఇవ్వాలని అటవీశాఖ కోరుతున్నది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల్లోనే.. నాటి సమైక్య ప్రభుత్వం పరిహారంగా మొత్తం 1168.27 హెక్టార్లకు బదులు 1170 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు అప్పగించింది. అప్పగించిన భూమి మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగపాయ గ్రామంలో 587, 588 సర్వే నంబర్లలో ఉంది. రాష్ట్ర విభజన జరగక ముందు జరిగిన ఈ కేటాయింపుతో తెలంగాణ 375 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయినట్లయ్యింది.

అటవీశాఖకు పరిహార భూ కేటాయింపుల కోసం పులిచింతల ప్రాజెక్టు వ్యయం నుంచి కోట్లాది రూపాయలను నాటి ప్రభుత్వానికి చెల్లించి మరీ 1170 హెక్టార్ల భూమి కొనుగోలు చేశారు. నాటి పాలకులు, అధికారులు కుమ్మక్కై కుట్ర పూరితంగానే ప్రకాశం జిల్లాలో భూ కేటాయింపు చేసినట్లు తెలుస్తున్నది. అనవసరంగా మన రాష్ట్రంలోని వ్యవసాయ భూమిని అటవీశాఖకు ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతో ఇక్కడి అధికారులు నాడు మిన్నకుండి పోయినట్లు సమాచారం.

నాటి అలసత్వం ఫలితం.. నేడు తెలంగాణ రాష్ర్టానికి చెందిన 375 హెక్టార్ల అటవీ భూమి పక్క రాష్ట్రం లెక్కల్లోకి చేరిపోయింది. ఉపయోగం అంతా తమ ప్రాంతానికే ఉండడంతో ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని నిర్వాసితుల బాగోగులన్నీ చూసుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. ప్రకాశం జిల్లాలో కేటాయించిన భూమిలో 375 హెక్టార్లను మన రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి బదిలీ చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, డిసెంబర్ 08, 2014

ఆప్కోలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసినా.. ఆంధ్రా ఉద్యోగులపై చర్యలు శూన్యం!!!

-తెలంగాణ అధికారిపై చేయిచేసుకున్న వ్యక్తికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన ఆంధ్రా అధికారులు

ఆప్కో లో తెలంగాణ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులపై దాడులు జరిగినా ఆప్కోలోని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా దాడుల జరిపిన ఆంధ్రా సిబ్బందికే వత్తాసు పలుకుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కైరంకొండ యాదగిరి అనంతపురంలో డిస్ట్రిక్ట్ట్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. బదిలీపై రిలీవ్ కావడానికి గత సెప్టెంబర్ 10న అనంతపురం వెళ్లిన ఆయనపై ఆప్కో సేల్స్ మేనేజర్ ప్రకాశ్, మరో ఉద్యోగి దాడికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యాదగిరికి గుండెపోటు వచ్చింది. వెంటనే దవాఖానలో చేర్చడంవల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆయనకు సికింద్రాబాద్ డీఎంవోగా పోస్టింగ్ ఇచ్చారు. 
దాడికి పాల్పడిన ప్రకాశ్‌ను సస్పెండ్‌చేసి ఆ తర్వాత నామమాత్రపు దర్యాప్తు జరిపారు. చివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆంధ్రా ఉన్నతాధికారులు పోస్టింగ్ ఇచ్చారు. ఆప్కో అనంతపురం డైరెక్టర్ శ్రీనివాసులు ప్రోద్బలంతోనే అతనికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆప్కోను వెంటనే విభజించి, సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, డిసెంబర్ 07, 2014

చిక్కులు లేని భూసేకరణ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం!!!

water


వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టి నాలుగేండ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లందిస్తాం. అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగం.. ఇదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఎంతో ఆత్మవిశ్వాసంతో.. సాహసంతో సీఎం తనకు తాను విధించుకున్న ఈ సవాలును నిజం చేసేందుకు అధికార యత్రాంగం నడుం కట్టింది.
-వాటర్ గ్రిడ్‌కు రైట్ ఆఫ్ వే!
-గుజరాత్ నమూనాలో ప్రత్యేక చట్టం
-న్యాయవివాదాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు
-రక్షిత మంచినీరు రాజ్యాంగ బాధ్యతగా పరిగణన
-పైపులైన్లు, రిజర్వాయర్లకు భూమి తప్పనిసరి

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు గుజరాత్ నమూనాను అనుసరించాలని భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి రైట్ ఆఫ్ వే చట్టం అమలు చేసింది. అదే నమూనాను ఇక్కడా అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రధాన సమస్య భూ సేకరణే..


ఇవాళ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా భూ సేకరణ పెద్ద సమస్యగా ఉంది. ఎవరికి ఏ చిన్న నష్టం కలిగిందని భావించినా కోర్టులను ఆశ్రయించడం, స్టే తీసుకోవడం పరిపాటిగా మారింది. దాంతో అనేక ప్రాజెక్టులు ఏండ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోతున్నాయి. ఆ పరిస్థితి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ఎదురు కాకుండా భూ సేకరణ జరుపాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

దీని కోసం గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన రైట్ ఆఫ్ వే పద్ధతినే స్వీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భూసేకరణకు ప్రత్యేక చట్టం తెస్తారు. దీనికింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రజా ప్రయోజనాలు, తక్షణ అవసరాలు, అత్యవసరాల కింద ప్రకటిస్తారు. ప్రజలకు రాజ్యాంగం ప్రకారం రక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ క్రమంలో వాటర్ గ్రిడ్‌ను అదే కోణంలో పరిగణిస్తే ప్రాజెక్టుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు.

గుజరాత్‌లో ప్రత్యేక చట్టం..


వాటర్ గ్రిడ్ భూ సేకరణలో సమస్యలు తలెత్తకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. తాగునీటి పైపులైన్లు 1.5 మీటర్ల లోతున వేసుకోవడానికి వీలుగా తీసుకొచ్చిన ఆ చట్టం వల్ల ప్రాజెక్టు అమలులో ఇబ్బందులు తొలిగిపోయాయి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేశారు. భూ సేకరణలో ఆటంకాలు లేకుండా చేసుకోవడం వల్లే ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు.

గుజరాత్‌లో వాటర్ గ్రిడ్ కోసం 2684 కి.మీ. మేరకు బల్క్ పైప్‌లైన్లు, 1.20 లక్షల కి.మీ. డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు, 23693 స్టోరేజ్ హైడ్రాలిక్ నిర్మాణాలను చేపట్టారు. 181 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి రోజూ 290 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. 132 పట్టణాలకు, 11545 గ్రామాలకు నీటి సరఫరా అవుతున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు గత అక్టోబర్ 18, 19 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. అందుకే అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారానే ప్రజలకిచ్చిన హామీని నాలుగున్నరేండ్లల్లో పూర్తి చేయొచ్చునని అంచనా వేస్తున్నారు.

గుజరాత్ భూ సేకరణకు అనుసరించిన విధానం


-రైట్ ఆఫ్ వే విధానాన్ని అనుసరించారు.
-భూములకు వాస్తవ మార్కెట్ ధర లేదా భూమికి భూమి ఇచ్చారు.
-గుజరాత్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు భూ సేకరణ జరిపింది.
-బాధిత రైతులకు ఏడాది పాటు వచ్చే కూలీని ఏకమొత్తంగా చెల్లించారు.
-500 చ.మీ.లకు రూ.20 వేల వరకు చెల్లించారు.
-పంటలు కోల్పోకుండా నాలుగు నెలలు ముందు నోటీసులు ఇచ్చారు.
-నిర్మాణాలకూ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కల ప్రకారం పరిహారం చెల్లించారు.
-సింహభాగం వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ముగించారు.
-చట్టం ప్రకారం ఎవరైనా ఈ ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం తప్పనిసరి చేశారు.

ఎక్కడెక్కడినుంచి నీరు..?


కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి ఎక్కడ, ఏ పాయింట్ నుంచి ఎంత నీటిని తీసుకోవచ్చునన్న దానిపై అధ్యయనం చేశారు. ప్రధానంగా కృష్ణా నది నుంచి జూరాల రిజర్వాయర్, కల్వకుర్తి ఎల్‌ఐఎస్ పాయింట్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పాలేరు దగ్గర నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వ(పాక్షికం)ల నుంచి నీటిని తీసుకోవచ్చు. అలాగే గోదావరి నది నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఎల్లంపల్లి/ప్రాణహిత, దేవాదుల ఎల్‌ఐఎస్, దుమ్ముగూడెం ఎల్‌ఐఎస్‌ల నుంచి తీసుకోవచ్చు. మంజీరా నది నుంచి సింగూరు, నిజాంసాగర్‌ల ద్వారా మంచినీటి సరఫరాకు అవసరమైన నీటిని పొందుతారు.

జనాభాకు తగ్గట్లుగా మంచినీటిని సరఫరా చేసేందుకు మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంతాలను బట్టి గ్రావిటీ ద్వారా ఎంఎస్ పైపులైన్ల ద్వారా చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట పంపింగ్ విధానానికి రూపకల్పన చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తారు. అటు నుంచి గ్రామ స్థాయి వరకు చేర్చాల్సి ఉంటుంది. దీని కోసం పక్కా నిర్వహణ వ్యవస్థలను రూపొందించాలి.

అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, మండల్ గ్రిడ్‌లను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపు హౌజ్‌లు, విద్యుదీకరణ సదుపాయాలు అనివార్యం. మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి, పైపులైన్ల ఏర్పాటుకు కూడా స్థల సేకరణ జరుపాల్సి ఉంటుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 03, 2014

కంచె భూములు ఖ‌తం చేసిన సీమాంధ్ర అక్రమార్కులు!!!

pakala


రాజధాని శివారులో ఎక్కడ సర్కారు భూమి కనిపించినా ఆక్రమించుకున్న సీమాంధ్రులు రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలోని సర్కారు కంచె భూములతో ఆటలాడుకున్నారు. కంచె భూమిగా రికార్డుల్లో ఉన్నా దొంగ సర్వే నంబర్లతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేశారు. తమది కాని భూమిని అనేక నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా కోర్టు రద్దు చేసిన తర్వాత కూడా ఆ దందా యథేచ్ఛగా కొనసాగించారు. అంతటితో ఆగకుండా సదరు భూమినే బ్యాంకులో హామీగా పెట్టి రుణాలు తీసుకుని జెండా ఎత్తేశారు.
-పుప్పాల్‌గూడలో సీమాంధ్రుల దందా
-ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు..
-కోర్టు రద్దు చేసినా బేఖాతర్
-కుదువబెట్టి విదేశీ బ్యాంకుకు టోకరా

ఈ పకడ్బందీ వ్యవహారంలో అధికారులంతా శక్తివంచనలేకుండా సహకరించారు. సీమాంధ్ర బాబులు అడ్డదారుల్లో కోటీశ్వరులైతే.. బ్యాంకులు అంతే స్థాయిలో దివాలా తీశాయి. కోట్ల రూపాయల విలువైన భూములు లిటిగేషన్లలో పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 452లో 190 ఎకరాల ప్రభుత్వ భూమి కథ ఇది. సేత్వారు రికార్డుల్లో ఈ భూమి 452/1 కింద 178 ఎకరాల 2 గుంటలు, 452/2 కింద మరో 15 ఎకరాల 37 గుంటల భూమి సర్కారు కంచె భూమిగా నమోదైఉంది.

ఈ ప్రభుత్వ భూమిమీద కన్నేసిన సీమాంధ్రబాబులు ఇక్కడ సర్వే నంబర్‌కు బై నంబర్లు ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని రకరకాల రికార్డులు సృష్టించారు. ఈ సర్వే నంబర్‌లోని 452/2 కింద ఉన్న 15 ఎకరాల 37 గుంటల భూమిని కాజేశారు. ఈ వ్యవహారంలో లేని భూమి ఉన్నట్లుగా, ఉన్న భూమిని లేనట్లుగా కనికట్టు చేశారు. వాస్తవానికి 452 సర్వే నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది.

నాటి సేత్వారురికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది. నాటి సేత్వారు రికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు ఈ 452/2 సర్వే నంబర్‌లోని 15.37 గుంటల భూమిని 452/3 అని కొత్త సర్వే నంబర్ సృష్టించి అనేక రకాలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. 1997 నుంచి మొదలైన ఈ రిజిస్ట్రేషన్లపర్వం 2009వరకు నిరాటంకంగా కొనసాగింది. 452/3పీ అనే కొత్త నంబరు పుట్టించి ఈ భూమిని గజాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేశారు.

ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2000లో డాక్యుమెంట్ నంబర్ 7090/2000 పేరుతో సర్వే నంబర్ 452/3 పేరున 15 ఎకరాల 37 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసే వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే ఈ భూమి పాత రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో స్థానిక దళితుల స్వాధీనంలో ఉంది. దళితులు ఈ భూమికి శిస్తుకూడా చెల్లిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమి పరాధీనం అవుతుందని గమనించిన దళితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కొత్త రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. ఈ మేరకు క్యాన్సలేషన్ డీడ్ 2004 జనవరి 22వ తేదీన రిజిస్టర్ అయింది.

కొత్త కుట్రలతో..ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు


భూమి రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో కొద్ది రోజులు గప్‌చుప్‌గా ఉన్న బడాబాబులు ఆ తర్వాత మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించారు. 452/3,452/2 అంటూ మళ్లీ రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ భూమికి రిజిస్ట్రేషన్స్ రద్దు అయిన విషయం వెబ్‌సైట్లో కూడా పొందు పరిచారు. అయినా అధికారులు మళ్లీ రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగించారన్నది ఎవరికీ అర్థంకాని చిదంబర రహస్యం. 2009 వరకు ఈ భూమిపై రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక భూమిని రిజిస్టర్ చేసే ముందు సబ్‌రిజిస్ట్రార్లు లింక్ డాక్యుమెంట్లను, ఈ భూమి యాజమాన్యాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్ల ఫ్లోను పరిశీలించాలి. ఆ తరువాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ అధికారులు దీన్ని పాటించలేదు. ఇలా ఈ భూమిపై మరో ఐదు రిజిస్ట్రేషన్లు జరిగాయి.

బ్యాంకులకు బురిడీ..


ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఆనోటా ఈనోటా పొక్కుతుండడంతో ఇలా కాదనుకుని ఈసారి బ్యాంకుల మీద పడ్డారు. ఇందుకోసం లేని కంపెనీలను సృష్టించారు. కర్నూలు అడ్రసుతో రిజిస్టర్ అయిన కాకతీయ ల్యాండ్‌సేకప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2007లో తెరపైకి తీసుకు వచ్చారు. 2000 సంవత్సరంలో కోర్టు ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిందో అదే డాక్యుమెంటును హామీగా పెట్టి ఐడీబీఐ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000 తరువాత తాము అక్రమ పద్ధతుల్లో రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్లను కూడా ఈ అవగాహన ఒప్పందంలో చేర్చారు.

ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న వ్యక్తులు వేరు.. అవగాహన కుదుర్చుకున్న వారూ వేరు. అయినా ఈ డాక్యుమెంట్లతో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన సెక్యూరిటీ ట్రస్ట్ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్‌తో అప్పటి వరకు సీన్‌లో లేని పీవీ రమణారెడ్డి అనే వ్యక్తికి అవగాహన ఒప్పదం డాక్యుమెంటును రిజిస్టర్ చేశారు. ఇక ఈ అవగాహన ఒప్పందం డాక్యుమెంట్లను కుదువబెట్టి ఐడీబీఐనుంచి 13,400 వేల డాలర్ల(రూ.60 కోట్లు)కు గ్యారెంటీ తీసుకున్నారు. ఈ బ్యాంకు గ్యారెంటీని ముంబైలోని విదేశీ బ్యాంకు అయిన డ్రాయిష్ బ్యాంకు బ్రాంచ్‌లో కుదువబెట్టి అక్కడినుంచి ఆ మొత్తాన్ని వివిధ రూపాలలో కాజేశారు. ఇప్పుడు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన ఐడీబీఐ చిక్కుల్లో పడింది.

ఇలా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమితో విదేశీ బ్యాంకులకూ కన్నంవేశారు. తీసుకున్న ఈ రుణాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఏవిధంగా రుణ బకాయిని వసూలు చేసుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే 2007 సంవత్సరంలో ఇలా బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రబుద్ధులు నకిలీ పత్రాలతో ఈ భూమిమీద మరో రెండు రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇపుడు అంతా టోకున లబోదిబోమంటున్నారు.

ఇది వివాదాస్పద భూమి: రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్‌బాబు


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్452/2 వివాదాస్పద భూమిగా 2010 నుంచి రికార్డులో ఉంది. ఈ మేరకు 28-05-2010లోనే అప్పటి జాయింట్ కలెక్టర్ ఇది వివాదాస్పద భూమిగా ఆదేశాలు ఇస్తూ నమోదు చేయించారు. దీనిపై వివాదాలుంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు లేవు. వాస్తవానికి ఈ భూమి అసల్ సేత్వారి రికార్డులో కంచె సర్కారీ అని రాసి ఉంది.

1950లో దేవరకొండ సాయన్న, వెంకయ్యలపేర్ల మీద పట్టా అయినట్లుగా రికార్డులో ఉంది. అయితే దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి 1954-55 కాస్ర పహణి, 1955-56 చేపాలా పహణిలు అందుబాటులో లేవు. ఈ భూమిపై అనేక లావాదేవీలు జరిగినట్లుగా రికార్డులో ఉంది. గతంలో ఈ సర్వే నంబర్ పేరు తప్పు పడింది. దీనిని ఆ తరువాత కరెక్టు చేశారు. ప్రస్తుతం ఈ భూమి ఖాళీగా ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

"చంద్రబాబు ప‌చ్చి మోస‌కారి" -మంత్రి జగదీశ్ రెడ్డి

chandrababu


విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన 54 శాతం విద్యుత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఇవ్వడం లేదు. ఏపీలో మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. ఇంత పచ్చిగా ఒక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న బాబు తీరుపై జనంలో అలజడి మొదలైంది. మోసాలకు త్వరలో ప్రతిఫలం అనుభవించక తప్పదు అని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

-ఏపీ పాలన పక్కనపెట్టి బాబు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు
-సీమాంధ్ర మీడియాది పక్షపాత ధోరణి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఎలాంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు, అన్ని పనులు చేస్తున్న కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీచేయకుండా బాబు మోసాలకు పాల్పడుతున్నా సీమాంధ్ర మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మోసం సీమాంధ్ర మీడియాకు పట్టదా? ఇంత అన్యాయం జరుగుతున్నా అక్కడి ప్రజల గురించి పట్టించుకోరా అని బాబు పక్షపాత వైఖరిని నిల దీశారు. చంద్రబాబు ఏమీ చేయకున్నా సొంత మీడియా గుంపుతో ఏదో చేశాననే ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, తొమ్మిదేండ్ల పాలనా అనుభవంతోనే అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని చురకలంటించారు. ఆ రాష్ర్టాన్ని పరిపాలించకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఎద్దేవాచేశారు. సీమాంధ్ర మీడియా కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని హెచ్చరించారు. తెలంగాణ పది జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు ఏపీలోని ఒక్క అనంతపురంలో జరిగితే సీమాంధ్ర మీడియా ఒక్క ముక్కా రాయడం లేదని, ఇక్కడ మాత్రం పేజీలు నింపి, తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 02, 2014

60 ఏండ్లను మరిపించిన 6 నెలలు...!!!

killa

ఆరు నెలలే! కానీ.. అరవై ఏండ్ల కష్టాలను.. వివక్షను.. రాసిపెట్టుకో.. రూపాయి కూడా ఇవ్వను.. అని విషం చిమ్మిన అనుభవాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని కల్పించిన సమయం!! ఇది మన పాలన! యాచించే దశ నుంచి.. శాసించే దశకు తెలంగాణ చేరుకున్న సందర్భానికి ఆరు నెలలు నిండిన సందర్భం! పాలించేది కేసీఆరే అయినా.. ముద్ర మనదే! మన తెలంగాణదే! ఏ పథకం చేపట్టినా సమగ్ర పరిశీలన.. 

విశ్లేషణ.. పక్కా ప్రణాళిక! ఎవరెన్ని విమర్శలు చేసినా.. భావి బంగారు తెలంగాణ

నిర్మాణానికే రాళ్లెత్తుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలంటే వాయిదా వేసుకుని పోడానికే అన్న పరిస్థితిని మార్చి.. ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధమని ప్రకటించి, చర్చించిన తెగువ! ఆ తెగువకు పునాది.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే! ఆ సాహసానికి ఊపిరి.. తెలంగాణ ఇకనైనా బాగుపడాలన్న తపనే! ఆ తపనలోంచి వచ్చినవే అనేకానేక ప్రజా సంక్షేమ పథకాలు..

month


టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాల్లో ముఖ్యమైంది రైతు రుణాల మాఫీ. లక్ష రూపాయల వరకున్న పంటరుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.4250 కోట్లను విడుదల చేసింది. బోనస్‌గా ఇన్‌పుట్ సబ్సిడీ బకాయలు, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులకు రూ.11.5 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంగా రూ.480 కోట్లు విడుదల చేసింది.

pinchan

ఆసరా పింఛన్లు..


టీఆర్‌ఎస్ మరో ముఖ్య వాగ్దానం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పెంపు. కేసీఆర్ సీఎం అవ్వగానే ఇచ్చిన మాటకు కట్టుబడి వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా 25 లక్షలకు పైగా పింఛన్‌దారులను గుర్తించారు.

water

నీటి పారుదల..


పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల..
ఎడారిలా మారుతున్న తెలంగాణ భూముల్లో నదీజలాలను మళ్లించే కృషిలో భాగంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వేకు ఆదేశించింది. జూరాల వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున వరద నీటి లభ్యత బట్టి ఈ నీటిని జూరాల నుంచి వరంగల్ జిల్లా పాకాల వరకు గ్రావిటీ ద్వారా మళ్లించే పథకాన్ని కూడా చేపట్టనున్నారు.

slbc


ఎస్సెల్బీసీ ప్రాజెక్టు..


ఈ ప్రాజెక్టు చిక్కుముడిని ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించింది. ఎస్సెల్బీసీ టన్నెల్ విషయంలో ఎలాంటి అపోహలకు అవకాశమివ్వకుండా ఆ జిల్లాలకు చెందిన ప్రతిపక్షనేతలతో సీఎం సంప్రదింపులు జరిపి నిర్ణయానికి వచ్చారు.

char

హైదరాబాద్...


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఐటీఐఆర్‌లాంటి ప్రాజెక్టులు వస్తుండడంతో దాదాపు 2 కోట్ల జనాభా నివసించేందుకు వీలుగా, భవిష్యత్ అవసరాలన్నీ తీర్చేలా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నగర పోలీసుశాఖకు జీపీఎస్, ఇంటర్నెట్‌తో కూడిన ల్యాప్‌టాప్, ఇతర ఆధునిక వసతులతో రూ.350 కోట్లతో కొత్త వాహనాలు సమకూర్చింది. లక్ష కెమెరాలతో నిఘా ఉంచాలని నిర్ణయించింది. నగరంలో మహిళలపై, మహిళా ఉద్యోగులపై అఘాయిత్యాలు జరగకుండా షీ టీమ్స్‌పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేశారు. అభివృద్ధి పయనంలో భాగంగా నగరాన్ని వై ఫై సిటీగా మార్చేందుకు పూనుకుంది. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు రూ.100 కోట్లు కేటాయించింది. దాని పరిసరాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించనుంది. మెట్రోమార్గాలను పెంచడంతో పాటు నగరం నలుమూలలనుంచి ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించనున్నారు.

sport

క్రీడలు..


రాష్ట్రంలో క్రీడారంగానికి గతంలో ఏనాడూ ఎరుగనంత ప్రోత్సాహం లభిస్తున్నది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.25 లక్షలు, కాంస్యం సాధించినవారికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. క్రీడాకారుల కోచ్‌లకు కూడా క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరెస్టు అధిరోహించి రాష్ర్టానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన, దళిత బిడ్డలైన పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం అందించింది.

gunpark

ఉద్యమకారులు, అమరవీరులు..


తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత 462 మంది అమర వీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కార్ బనాయించిన అక్రమ కేసుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది.

ఉద్యోగులు..


ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకల జనుల సమ్మె లాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించింది. పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. హెల్త్‌కార్డులు మంజూరు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయనున్నారు.

గల్ఫ్ బిడ్డలకు చేయూత..


పుట్టి పెరిగిన ఊర్లో పని దొరకని దుర్భర పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోవడంకోసం గల్ఫ్‌లాంటి దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కేరళ తరహా ప్యాకేజీని అందించాలని నిర్ణయించింది.

సంచలనం.. సమగ్ర సర్వే


తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం ఆగస్టు 19న ఇంటింటి సర్వే చేపట్టారు. నాలుగు కోట్ల జనాభా సమగ్ర వివరాలను 24 గంటల్లో చేపట్టడం ద్వారా కేసీఆర్ సంచలనం సృష్టించారు. హైదరాబాద్‌లో కూర్చుని తయారు చేసే ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదనే ఉద్దేశంతో మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు. మేధావులు, నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో సలహా మండలి ఏర్పాటు చేస్తున్నారు.

auto

ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు


నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులకు జీవనాధారమైన ఆటోలపై పన్ను రద్దు చేస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేశారు.

ఆరోగ్యానికి ఆర్థిక దన్ను


గత 60ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ లేని విధంగా ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు చెరో రూ.100 కోట్లు కేటాయించింది. సుల్తాన్ బజార్, పేట్ల బురుజు మెటర్నిటీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.50 కోట్లు, నీలోఫర్ ఆస్పత్రికి రూ.30 కోట్లు, కింగ్‌కోఠీ దవాఖానకు రూ.25కోట్లు, కంటి, మానసిక, ఛాతి, ఈఎన్‌టీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.40కోట్ల నిధులు కేటాయించారు. నిమ్స్‌కు రూ.135.98 కోట్లు కేటాయించగా ఆస్పత్రి ఆధునీకరణ పూర్తయింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రులను నిమ్స్‌స్థాయిలో ఆధునీకరించేందుకు చెరో రూ.10కోట్లు కేటాయించారు.

పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు రూ.44 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, సీహెచ్‌సీల బలోపేతానికి రూ.74 కోట్లు కేటాయించారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి రూ.92కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్‌కు రూ.25కోట్ల వరకు, బోధనాసుపత్రుల్లో భవనాలు, వసతుల మెరుగుకు రూ.152 కోట్లు కేటాయించటంతో అదనపు మెడికల్ సీట్ల రెన్యువల్‌కు ఇబ్బంది లేకుండా పోయింది.

భవిష్యత్ ప్రణాళికలు..


ఉమ్మడి ప్రవేశాలతో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం అరికట్టేందుకు వరంగల్‌లో కాళోజీ పేరుతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కేటాయించింది. తెలంగాణకు ప్రత్యేక మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు జరుగనుంది. రాష్ర్టానికి మంజూరైన ఎయిమ్స్ ఏర్పాటుకు హైదరాబాద్ పరిసరాల్లో స్థల పరిశీలన జరుగుతున్నది. దీనివల్ల 100 మెడికల్ సీట్లతో పాటు 960 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి కొత్తగా ఏర్పాటుచేసే దవాఖానను సర్కారు పరిధికి ఇవ్వాలని ప్రతిపాదించింది.

welfare

సాటిలేని సంక్షేమం..


ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమ మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నారు. జూన్ 2న సీఎంగా పదవి చేపట్టాక పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలోనే సీఎం తన నిర్ణయం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీల సంక్షేమం శాఖల నిర్వహణను సవాలుగా స్వీకరించి సంక్షేమానికి కొత్త అర్థాన్నిస్తున్నారు.

దళితులకు మూడెకరాలు


ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి అందులో బోరు, మోటారు, కరెంట్ కనెక్షన్ లాంటి వసతులు కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1220 ఎకరాల భూమిని 465మందికి పంపిణీ చేశారు.

marriage

కల్యాణలక్ష్మి..


దళితులు గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకానికి రూపకల్పన చేసి నిరుపేద దళిత, గిరిజన ఆడపిల్లల పెండ్లికి రూ.51 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నది.

minority

మైనార్టీల అభివృద్ధి..


విద్య,ఉద్యోగాల్లో వెనకబడిపోయిన మైనార్టీలకు సహాయం కోసం ముస్లిం కుటుంబాల్లో పెండ్లిళ్లకు షాదీ ముబారక్ పేరిట రూ.51వేలు అందించే పథకం ప్రారంభించింది.

గిరిజన సంక్షేమం..


గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తండాలు, ఆదివాసి గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ప్రకటించింది.

బీసీల సంక్షేమం..


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెలుగులు నింపే దిశగా..


రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో విద్యుత్‌పై చిగురిస్తున్న ఆశలు... కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో విద్యుత్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే అనూహ్యమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌లోటునుంచి మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేలా ప్రణాళికలు అమలుచేస్తున్నది.

-ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం 1000 మెగావాట్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు.
-బహిరంగ మార్కెట్‌లో 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మూడు ప్రైవేటు పవర్ ప్రాజెక్టులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
-తక్షణ విద్యుత్ అవసరాలకు 500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం టెండర్లు ఆహ్వానించగా 108 మంది 1,892 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
-వచ్చే ఏడు సంవత్సరాల విద్యుత్ అవసరాల కోసం 2000 మెగావాట్లకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
-తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా వచ్చే ఐదేండ్లలో 20,000 మెగావాట్ల ఉత్పత్తికి వీలైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది.
-సోలార్ పంపుసెట్లు ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించింది.
-జెన్‌కో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపులు జరిపింది.
-కొత్తగూడెం(800మెగావాట్లు),మణుగూరు (1080 మెగావాట్లు) ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను బీహెచ్‌ఇఎల్‌కు అప్పగించింది.
-ఎన్టీపీసీ 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు ఇప్పటికే కొన్ని భూములను కేటాయించింది.
-సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న 1200 మెగావాట్ల ప్రాజెక్టు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సాధించేలా చర్యలు తీసుకున్నది.
-కేటీపీఎస్ 600 మెగావాట్ల పవర్‌ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 21, 2014

రోడ్లే లేని ఖ‌నిజాల ఖిల్లా...!

bridge


భారీ డిమాండ్ ఉన్న ఖనిజం నిక్షిప్తమైన చోట పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెంది రూపురేఖలే మారిపోతాయి. అదొక పల్లెటూరు అయినా పట్నాన్ని తలపించేలా మార్పుతథ్యం. కానీ సమైక్యరాష్ట్రంలో వలసపాలకులు కుట్రలకు 25 ఏండ్ల కిందట ఉన్న పరిస్థితులే నేటికీ ఓ గ్రామంలో దర్శనమిస్తున్నాయి.
-డోలమైట్ ఖనిజమున్నా అభివృద్ధి చెందని మాదారం
-ఖనిజం తవ్వుకుని కనీససౌకర్యాలు కల్పించని వైజాగ్‌స్టీల్స్
-రూ.900 కోట్ల ఖనిజం తరలింపు.. రూ.40 కోట్ల రాయల్టీ చెల్లింపు
-25 ఏండ్లుగా గ్రామానికి రాయల్టీ వాటా ఇవ్వని సమైక్య పాలకులు

తెలంగాణ సొమ్ము దోచిపెట్టిన సమైక్యపాలకుల కుట్రలకు బలైందీ డోలమైట్ మాదారం! ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాదారం గ్రామాన్ని జల్లెడపట్టి డోలమైట్‌ను ఏపీలోని వైజాగ్‌స్టీల్స్‌కు కట్టబెడుతూ వలసపాలకులు రెడ్‌కార్పెట్ పరిచారు. అదే సమయం లో కనీసం ఈ గ్రామంలో సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదా? లేదా? అనే విషయాన్ని గాలికొదిలేసింది. 
గాజువాకను సుందరంగా తీర్చిదిద్దిన స్టీల్‌ప్లాంట్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం చుట్టుపక్కల భారీస్థాయిలో డోలమైట్ నిక్షేపాలు ఉన్నాయి. ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు, ఇనుమును కరిగించే కొలిమిలను తయారుచేసేందుకు డోలమైట్‌ను ఉపయోగిస్తారు. ఈ కర్మాగారంలో లోహాలను కరిగించేందుకు ఉపయోగించే కొలిమి నుంచి ఉద్భవించే విపరీతమైన వేడిమిని డోలమైట్‌తో తయారుచేసే ఇటుకలే తట్టుకోగలుగుతాయి. అందుకే డోలమైట్ ఖనిజానికి భారీ డిమాండ్. మాదారంలోని డోలమైట్‌కు హైగ్రేడ్ రా మెటీరియల్‌గా పేరుంది. ఉత్తమ నాణ్యత ఉన్న డోలమైట్‌పై సమైక్యరాష్ట్రంలో వలసపాలకుల కన్ను పడింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం ఇక్కడ అనుబంధంగా 1989లో ఓ పరిశ్రమ నెలకొల్పారు.

ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.900 కోట్ల విలువైన 75 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌కు ఎగుమతైంది. 75 లక్షల టన్నుల డోలమైట్‌ను ఉత్పత్తిచేసిన ఈ కర్మాగారం ప్రభుత్వానికి రూ.40 కోట్ల రాయల్టీ చెల్లించింది. ఈ రాయల్టీ నుంచి మాదారం గ్రామ పంచాయతీకి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసిన గాజువాకను సుందరనగరంగా తీర్చిదిద్దిన విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, అనుబంధ కర్మాగారం నెలకొల్పిన తెలంగాణలోని మాదారం గ్రామాన్ని మాత్రం పట్టించుకోలేదు.

నిబంధనలకు తూట్లు.. నిర్వాసితులకు మొండిచేయి: ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీలో 25 శాతం వాటా స్థానిక సంస్థలకు చెల్లించి ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ 49లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అప్పటి సర్కా రు నిబంధనలను తుంగలోతొక్కి తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటివరకు రూ.40 కోట్ల రాయల్టీని చెల్లించినందున మాదారం పంచాయతీకి రూ.10 కోట్లు రావాల్సి ఉంది. కానీ సమైక్యరాష్ట్రంలో ఒక్కపైసా రాయల్టీలో ఇవ్వలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మాదారం డోలమైట్ మైన్స్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొండిచేయి చూపింది.

210 మంది రైతుల నుంచి 950 ఎకరాల భూమిని సేకరించి కొందరికే ఉద్యోగాలు కల్పించింది. మిగతా నిర్వాసితులు ఎన్నోసార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. డోలమైట్ మైనింగ్ వల్ల కాలుష్యంతో ఇప్పటికీ రైతులు పంటనష్టపోతూనే ఉన్నారు. గనుల్లో భారీ పేలుళ్ల కారణంగా గ్రామంలో ఇండ్లకు బీటలుబారుతున్నాయి. మాదారంలో ఏ రోడ్డుచూసినా గుంతలూ, గతుకులే. వర్షాకాలంలో పదడుగులు కూడా వేయలేని దుస్థితి గ్రామానిది. కోట్లాది రూపాయల విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతున్న వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కనీస బాధ్యతగా రోడ్లను కూడా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలసపాలకుల నిర్లక్షానికి గురైన మాదా రం స్వరాష్ట్రంలోనైనా బాగుపడుతుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 18, 2014

మన రాష్ట్రం...మన చిహ్నాలు...

PALAPITTA


-రాష్ట్ర అధికార చిహ్నాల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్ర ..
-తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యం
రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఖరారయ్యాయి. చిహ్నాల ఎంపికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా కసరత్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా...

రాష్ట్ర జంతువుగా జింక
రాష్ట్ర పక్షిగా పాలపిట్ట
రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు(శమీవృక్షం)
రాష్ట్ర పుష్పంగా తంగేడి పువ్వు 
లను ఎంపిక చేశారు. 

Tealanganastate-symbols

అంతకు ముందు అటవీశాఖ అధికారులు రాష్ట్ర జంతువుగా అడవిదున్న, పక్షిగా పాలపిట్ట, చెట్టుగా ఇప్ప లేదా పువ్వుగా మోదుగపూవును ప్రభుత్వానికి ప్రతిపాదిన పంపించారు. ఇందులో పాలపిట్టను ఖరారు చేసిన సీఎం మిగతా వాటిలో మార్పులు చేశారు. తెలంగాణ జీవనానికి, మనో భావాలకు అనుగుణంగా చిహ్నాలను నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర కోణంలో చిహ్నాల ఖరారు జరిగిందని, స్వరాష్ట్రంలో మన చరిత్ర నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం అవసరమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రకృతితో ముడిపడిన అంశాలతోపాటు ప్రజల విశ్వాసాలు, పురాణాల నేపథ్యం, శుభాశుభాలు తదితర అంశాలపై లోతైన పరిశీలన జరిపిన తర్వాతే ముఖ్యమంత్రి చిహ్నాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ చిహ్నాలను ఎందుకు ఖారారు చేయాల్సి వచ్చిందో సీఎం వివరించారు.

TANGEDU-PUVVU


జమ్మిచెట్టు ఆశీర్వాదం..



Tealanganastate-symbols

జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవనంలో అంతర్భాగం. రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే పండుగ దసరా. ఆ రోజు జమ్మి చెట్టుకు పూజ చేసి ఆకును బంగారంగా భావించి స్వీకరిస్తారు. మిత్రులు బంధువులతో అలయ్‌బలయ్ చేసినా పెద్దలకు నమస్కరించినా, పాదాభివందనం చేసినా జమ్మిఆకును సమర్పించి వందనం చేయడం తెలంగాణ విశిష్ట సంప్రదాయం. ఉన్నది అందరూ పంచుకోవడం అనే తెలంగాణ సంస్కృతికి ప్రతీక. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరిచారు. దసరా రోజునే శమీవృక్ష పూజ అనంతరం ఆయుధాలు దించి యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. జమ్మి చెట్టు శక్తి, ఆశీర్వాదం వల్లనే పాండవుల విజయం సాధ్యమైందనేది పురాణగాథ. ఇవాళ తెలంగాణ ప్రజల విజయానికి జమ్మి చెట్టు ఆశీర్వాదం అవసరముంది. జమ్మిచెట్టు అధికారిక చిహ్నంగా ఉండటం మేలు చేస్తుంది. అందుకే అది మన చెట్టయింది.

JAMMI-CHETTU


పాలపిట్ట శుభసూచకం..



పాలపిట్టకు తెలంగాణ సంస్కృతికి దగ్గరి బంధం ఉంది. దసరా పండుగ నాడు పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రజలు పుణ్యకార్యంగా భావిస్తారు. ఏ పనిలోనైనా పాలపిట్ట కనిపిస్తే శుభసూచకమని తెలంగాణలో విశ్వాసం. లంక నగరంపై దండెత్తే ముందు శ్రీరాముడు పాలపిట్టను దర్శించుకున్నాడని జనశ్రుతి. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో విజయపథాన నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను ఎంపిక చేశారు. 

DEER


తంగేడు పువ్వు.. మన అందరి పువ్వు..



పసుపుపచ్చ రంగుతో ప్రకృతికే వన్నె తెచ్చే తంగేడి పువ్వు ఇప్పుడు మన రాష్ట్ర పుష్పంగా రికార్డుకెక్కుతోంది. తెలంగాణ సంస్కృతికి తంగేడు పువ్వు నిలువుటద్దం. అదిలేని బతుకమ్మ పండుగను ఊహించలేం. తంగేడు పువ్వు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ మహిళలు ఆరాధిస్తారు. ఈ కారణంగానే తంగేడు పువ్వును అధికారిక పుష్పంగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు.

జింక ఎందుకంటే..



ఇక రాష్ట్ర జంతువు ఎంపికలో తెలంగాణ వాసుల మనస్తత్వాన్ని సీఎం పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రం దాదాపు అన్ని ప్రాంతాల చిట్టడవుల్లో సైతం జింకలు విరివిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సున్నిత మనస్కులు, అమాయకులు. జింక కూడా అత్యంత సున్నితమైనది, అమాయకమైనది. జింకకు భారతదేశ చరిత్రతో, పురాణాలతో గాఢమైన అనుబంధం ఉంది. రామాయణంలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా జింక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జంతువైంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 14, 2014

30వేల ఎకరాలు...రాజధాని కోసమా?...రియల్ దందా కోసమా?...

-30 వేల ఎకరాలు ఎవరికోసం?
-హుండీ డబ్బులతో సింగపూర్ నిర్మిస్తారా?
-పేద అరుపులు.. పెద్ద మాటలు
- మండిపడుతున్న ఏపీ మేధావులు
-ఆరు వేల ఎకరాల్లో అద్భుతంగా నయా రాయ్‌పూర్
-సింగపూర్ సినిమా ప్రచార పటాటోపమే
-ఆ నగరం వెనుక 195 ఏండ్ల చరిత్ర
-దేశంలో 30 వేల ఎకరాలు
-సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
వేల ఎకరాల్లో రాజధాని.. సింగపూర్.. మలేసియా... ఇవీ ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా? మాట్లాడితే సింగపూర్‌అంటూ జేబులో బొమ్మనేదో తీసి ఇస్తానంటున్న బాబు అసలు సింగపూర్ ఇవాల్టి అభివృద్ధి వెనక కరిగించిన కాలం, అక్కడి పాలకుల అంకితభావం ఎంతో అన్నది గమనించారా? బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా? ప్రజలు ఏమనుకుంటున్నారు? 

seemandhra

దేశంలో 29 రాష్ర్టాలున్నాయి. అందులో ఎన్ని రాజధానులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఏపీ రాజధాని లెక్కల్లో డొల్లతనం బయటపడుతుంది. అనేక రాజధాని నగరాలు కూడా వందల ఏండ్ల కాలక్రమంలో విస్తరించినవే తప్ప ఒకేసారి ఏకంగా ఇంత భూభాగంలో నిర్మించినవి కావు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కు కొత్త రాజధాని నిర్మించాలని తలపెట్టి సేకరించిన భూమి కేవలం 19 వేల ఎకరాలు. అందులో రాజధాని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆడిటోరియాలు ప్రజల నివాసాలు సహా ప్రజోపయోగ భవనాల సముదాయాలకు కేటాయించింది కేవలం 6 వేల ఎకరాలు. హైదరాబాద్ రాజధాని కేవలం 225.52 ఎకరాలే: వాస్తవానికి హైదరాబాద్ రాజధాని నిర్మాణం కేవలం 225.52 ఎకరాల భూమిలోనే జరిగింది. ఆ పరిధిలో నిజాం రాజులు నిర్మించిన భవనాలే ఇప్పటికీ రాజధాని అవసరాలు తీరుస్తున్నాయి.

వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, మంత్రుల నివాస సముదాయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలన్నీ ఈ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ కొలువుదీరే రాజ్‌భవన్ ఉన్నది కేవలం 22 ఎకరాల భూమిలోనే, ఎమ్మెల్యేలు కొలువుదీరే అసెంబ్లీ ఉన్నది ఆరు ఎకరాలు.. 294 మంది ఎమ్మెల్యేలు, 90మంది ఎమ్మెల్సీలు నివాసం ఉండడానికి నిర్మించిన ఎమ్మెల్యేల నివాస సముదాయం రెండు చోట్ల కలిపి కేవలం 18.10 ఎకరాల భూమిలోనే, సచివాలయం ఉన్నది 22.80 ఎకరాల భూమిలో, హై కోర్టు ఉన్నది 2.9 ఎకరాల భూమిలో మాత్రమే.

సింగపూర్ జేబులో వస్తువు కాదు..: రాష్ట్ర విభజనలో హైదరాబాద్ వంటి రాజధానిని కోల్పోయామని తిరిగి ఆ స్థాయి నగరం కావాలంటూ చంద్రబాబు ఎన్నికలనాటినుంచే ప్రచారం ప్రారంభించారు. హుండీలు పెట్టి ఏదో కోల్పోయామన్న భావన రగిలించారు. సెంటిమెంటును రెచ్చగొట్టి సరిగ్గా అలాంటి రాజధాని కచ్చితంగా అవసరం అన్న భ్రమ కల్పించారు. వాస్తవానికి దేశంలో అనేక రాష్ర్టాల్లో రాజధానులు విజయవాడ, విశాఖ కన్నా పెద్దవేం కావు. కొద్దిపాటి పెట్టుబడితో విశాఖ లేదా విజయవాడలనే రాజధానులుగా మార్చుకోగల అవకాశముంది. విజయవాడ రాజధాని కావాలని ఆ నగర ప్రజలు ఆరు దశాబ్దాల క్రితమే కలలు గన్నారు. అయితే హైదరాబాద్‌ను చూపి పక్కదారి పట్టించారు.

తర్వాత సింగపూర్ వంటి రాజధాని అంటూ రంగుల బొమ్మలు చూపించారు. అదేదో తన జేబులో వస్తువు.. తీసి ఇస్తానన్నట్టు ప్రచారం చేశారు. అయితే సింగపూర్ ఆ స్థాయికి చేరడానికి ఎన్నేండ్లు పట్టిందో..ఎంత నిజాయితీతో అక్కడి పాలకులు అభివృద్ధికి పాటు పడ్డారో విస్మరించారు. సింగపూర్ వెనుక 195 సంవత్సరాల కృషి ఉంది. మహాసౌధాలు రావడానికి ఆరేడు తరాలు పట్టింది. ఎంతో నిజాయితీగా చెమటోడ్చి తపించి, త్యాగాలు చేసి కృషి జరిపితే అది సమకూరింది. పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థల యజమానులు, రియల్ వ్యాపారులను మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టుకుని చంద్రబాబు సర్కారు ఏ మేరకు నిజాయితీ చూపగలదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పోనీ వీరేమైనా అద్భుత నగరాల నిర్మాతలా అంటే హైదరాబాద్‌లో అభివృద్ధి పేరిట చేసిన భూదందాలు తెలియనివి కావు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా, ఇందూ ప్రాజెక్టుల లాంటి భూ కుంభకోణాలు జగద్విదితం.

విజయవాడ, గుంటూరును ముంచి...: వాస్తవానికి రాజధాని వల్ల అదనంగా తరలివచ్చే ఉద్యోగులు ఇతరుల అవసరాలు తీర్చడానికి గుంటూరు, విజయవాడ నగరాలున్నాయి. ఆ నగరాలపై కొంత పెట్టుబడి పెడితే ఇప్పటికే ఉన్నదానికి తాజా అభివృద్ధితోడై ఆ నగరాలు అద్భుతంగా విస్తరిస్తాయి. ఆ నగరవాసుల ఆస్తులకు భారీగా విలువలు పెరుగుతాయి. మరోవైపు తక్కువ భూములు సేకరించి అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, సీఎం క్యాంపు కార్యాలయాలతోపాటు వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం, హైకోర్టు, జడ్జిల క్వార్టర్స్, రాజ్‌భవన్‌లతో పాటు ఇతర ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఖర్చు తగ్గి, త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ నగరాలనుంచి తాజా రాజధాని ప్రాంతం కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మెట్రోలాంటి సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుంది. కానీ నేలవిడిచి సాము చేస్తున్న చంద్రబాబు నాయుడు, లేని ప్రచారాన్ని కల్పించి.. రాజధానిని చుక్కల్లో చూపిస్తున్నారు.

ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సృష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని అంటున్నారు. రాజధాని భూముల్లో రేపు జాయింట్ వెంచర్ల పేరుతో వీరే, సేకరించిన ఆ భూములను ఆధీనంలోకి తెచ్చుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.

డెవలప్‌మెంట్ అథారిటీ చాలు..: రాజధానిని అభివృద్ది చేయడానికి భూసేకరణే అవసరం లేదని, ప్రణాళికాబద్ధ నిర్మాణానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుందని, పట్టణ నిర్మాణ రంగ నిపుణుల, మేధావుల వాదన. దేశంలో అనేక రాష్ర్టాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పాటించిన సూత్రం ఇదే.

ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే వరకు భూసేకరణ చేసి, వాటిల్లో నిర్మాణాలు చేపడితే సరిపోతుందని అంటున్నారు. ఆ తరువాత డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించి, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్, మెడికల్, హైరేజ్ బిల్డింగ్ ఏరియాజోన్, సైబర్‌జోన్, ఎయిర్‌పోర్టు అథారిటీ జోన్‌లంటూ ఇలా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతం ఏర్పాటు చేసి ఇందులోని ప్రాంతాన్ని జోన్లవారిగా విభజిస్తే సరిపోతుందని వారు అంటున్నారు. హైదరాబాద్‌లాంటి నగరం కూడా అభివృద్ధి జరిగింది కూడా ఈ పద్ధతిలోనే. ఆ ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఐటిఐఆర్ ప్రాజెక్టునూ ప్రభుత్వం ప్రకటించింది.

ఆయనదంతా మాయే..: చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూలు చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్‌ ఫ్లైట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు. ఆయనలో ఇద్దరు మనుషులున్నారు. ఎలా నమ్మాలి అని గుంటూరుకు చెందిన ఓ మేధావి ప్రశ్నించారు.

రాజధానికోసం 30 ఎకరాల సేకరణ ఎక్కడా జరగలేదు. చత్తీస్‌గఢ్‌లో నయారాయ్‌పూర్‌లో తొలిదశ కింద సేకరించింది ఆరువేల ఎకరాలు. 12 ఏండ్లనుంచి కడుతుంటే ఇప్పటికీ పూర్తికాలేదు. నిధులు లేక చాలా స్థలం ఖాళీగానే ఉంది. అత్యంత ఆధునిక నగరంగా చెప్పే చండీగఢ్ ఇపుడున్నది 114 చదరపు కిలోమీటర్లే. సుమారు 25 లక్షల జనాభా ఆ నగరంలో ఉన్నారు. పరిశ్రమలు, ఆఫీసులు, ప్రజల నివాసాలు అన్నీ ఆ పరిధిలోనే ఉన్నాయి. మరి ఏపీ రాజధానిలో ఎన్ని లక్షల మందిని ఎక్కడనుంచి పట్టుకువచ్చి పెడతారు? అని ఆయన ప్రశ్నించారు.

రాజధానా..రియల్ దందాలా?


ఒక రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలా? రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గహ సముదాయాలను నిర్మించడానికి ఇంత భూమి అవసరమా? ఇన్ని ఎకరాలు ఏం చేస్తారు..ఏం కడతారో ప్రజలకు చెప్పాలి.


ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?


అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పండి ముందు.


అసలు 30వేల ఎకరాలెందుకో చెప్పరేం?


చంద్రబాబు పారదర్శకత పాటించడం లేదు. పార్టీ సొంత కార్యాలయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సహకరిస్తామని కేంద్రం చెబుతుంటే సింగపూర్‌కు వెళ్లడం దేనికి సంకేతం?


ధరలు పెంచడానికే...


రాజధాని ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు చాలు. 30 వేల ఎకరాల భూమి కావాలని ప్రచారం చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు రావడం తప్ప ఒరిగేదేం లేదు.


అడ్డగోలు సేకరణ తగదు


రాజధాని ఏర్పాటుపై నిపుణులు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా భూ సేకరణ జరపాలి. అడ్డగోలుగా భూములు సేకరించడం సరికాదు.


కావాలంటే మేమే చందాలిస్తాం


రాజధాని నిర్మాణం కోసం మా భూములు ఇవ్వం. ఎవడో రాజధానిని నిర్మిస్తానంటే మా భూములెందుకివ్వాలి? బాబుకు కావాలంటే ఎకరాకు లక్ష మేమే చందాలిస్తాం.

గురువారం, నవంబర్ 13, 2014

ఆంధ్రా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న గుండ్రేవుల సర్వే గుట్టురట్టు!!!

survey


అనుమానమే నిజమైంది. ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా గుండ్రేవుల దగ్గర సాగిస్తున్న భూముల సర్వే గుట్టురట్టయింది. ఈ సర్వే పనులను గద్వాల ఆర్డీవో అబ్దుల్ హమీద్ బుధవారం నిలిపివేయించారు. వడ్డేపల్లి మండలం చిన్నధన్వాడ, పెద్దధన్వాడ మధ్య పంట పొలాలను, నదీపరివాహక ప్రాంతాలను గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్న విషయాన్ని ఈ నెల 10న నమస్తే తెలంగాణ.. చంద్రబాబు నీటి కుట్ర శీర్షికన ప్రచురించింది. 

-నిజమైన నమస్తే తెలంగాణ కథనం
-పనులను నిలిపివేయించిన గద్వాల ఆర్డీవో

కొందరు ఆంధ్ర అధికారులు సర్వే చేస్తూ వెళ్లగా.. మరికొందరు భూముల్లో డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనాలను వెలికితీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నది ఒడ్డున గుడారాలు వేసుకొని మరీ ఈ పనులు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో హమీద్.. వెంటనే పనులు నిలిపేసి అక్కడినుంచి వెళ్లాల్సిందిగా వారిని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్ర సమయంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేయడానికి వీల్లేదంటూ కర్నూలు జిల్లా అధికారులకు ఫోన్లో స్పష్టంచేశారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించారు.

కొంతకాలంగా ఈ పనులు జరుగుతున్న వడ్డేపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పసిగట్టలేకపోవడం గమనార్హం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో 100ను విడుదల చేస్తూ కర్నూలు జిల్లా సీ బెళగల్ గ్రామ సమీపంలో గుండ్రేవుల జలాశయాన్ని ప్రతిపాదించారు. ఈ పనులను చేపట్టిన ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ రూ.50 లక్షల ఖర్చుతో సర్వే డిజైన్‌ను రూపొందించి 20 రోజుల కిందట కర్నూలు జలమండలి అధికారులకు నివేదించినట్లు తెలిసింది. తుంగభద్ర వరదల సమయంలో కర్నూలు ముంపునకు గురికాకుండా ఉండటానికి 20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ రిజర్వాయర్ ఆనకట్ట 40 మీటర్లు కాగా.. 18 అడుగుల మట్టికట్టను నిర్మించి నీటిని నిల్వ చేయనున్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 4 గ్రామాలు, కర్నూలు జిల్లాలో 8 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆ కన్సల్టెన్సీ నివేదించినట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 11, 2014

లీజులపై సీమాంధ్ర సర్కార్ అడ్డగోలు జీవోలు...!!!

lease


సీమాంధ్ర పాలన తెలంగాణను కొల్లగొట్టింది. హైదరాబాద్ జిల్లాలో నిజాం, బ్రిటిష్ కాలం నాటి లీజు భూములను కూడా అబ్బసొత్తులాగా అమ్మేసుకున్నారు. పాత జీవోలు పాతరేశారు. కొత్త జీవోలు పుట్టించారు. ఉన్న జీవోలు తుంగలో తొక్కారు. ఎప్పుడో 1930లోనే నిజాం ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమున్నత ఆశయంతో పౌరుల నివాసాలు.. వ్యాపారం నిమిత్తం అతి తక్కువ ధరకు భూములను లీజుకు ఇచ్చారు. ఇటు నగరం అభివృద్ధి జరగడంతో పాటు అటు భూములు కూడా సర్కారు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
-నిజాంనాటి లీజు భూములను..అబ్బసొత్తులా అమ్ముకుంటున్నారు !
-అక్రమార్కులకు హక్కులిచ్చి అడ్డంగా దోచిపెట్టిన సమైక్య సర్కార్
-ఇప్పటికే 3 వేల పైచిలుకు లీజులు క్రమబద్ధీకరణ
-రూ.లక్ష కోట్ల విలువైన భూములు పరాధీనం
-తాజాగా ఎంఓయూతో విక్రయాలు
మిగిలిన 510 లీజు భూములు విలువ రూ.600 కోట్లకు పైమాటే
-స్వాధీనపరుచుకోవాలంటున్న తెలంగాణవాదులు

అయితే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర సర్కార్, అధికారులు నియమ నిబంధనలకు పాతరేసి భూములు అన్యాక్రాంతం చేశారు. లీజు ఉల్లంఘించిన వారినుంచి భూములు స్వాధీన పరుచుకునే హక్కులు ఉన్నా బేరాలు పెట్టుకుని వారికే అర్పించుకున్నారు. ఇంతదాకా ఇలాంటి మూడువేల పైగా లీజు భూములు సర్కారు చేయి దాటి పోయాయి. లక్ష కోట్లకు పైగా విలువైన భూమి పరాధీనమై పోయింది. 
ఈ అక్రమాలకు సీమాంధ్ర అధికారులు కూడా సహకరించారు. లీజు భూములను రక్షించవలిసిన ఎస్టేట్ అధికారే కబ్జాదారులకు అనుకూలంగా సర్కారుకు నివేదిక పంపడంతో కొత్త జీవోలు వచ్చి ఉల్లంఘనులు ఎంఓయూతో తమ భూములు అమ్ముకుంటున్నారు. ఇంకా రూ.600 కోట్ల విలువైన భూములు లీజు ఉల్లంఘనుల చేతిలో ఉన్నాయి. కనీసం వాటినైనా దక్కించుకోవాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.

లీజు భూములు అంటే.. : 1930 ప్రాంతంలో నిజాం సర్కార్ రెట్రో సీడెడ్ ప్రాంతంగా పేరొందిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని పౌర నివాస సముదాయాలు, వ్యాపార కూడళ్ల (బ్రిటీష్ ఇండియా గవర్నమెంటు పటాలాల) నిమిత్తం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలోని మిలటరీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా సాధారణ ప్రజలకు 90 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది.

లీజు కొనసాగించేందుకు ప్రతి 30 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేసుకోవడం వంటి అనేక నిబంధనలు విధించింది. 1945 నాటికి ఈ భూములతో పాటు కంటోన్మెంటు భూములను సైతం బ్రిటీష్ ప్రభుత్వం తిరిగి నిజాం సర్కారుకు ఇచ్చేసింది. ఆ సమయంలో బ్రిటీష్ రెసిడెంట్లకు నిజాం ఇచ్చిన హామీ మేరకు లీజుదారుల నుంచి ఆ భూములను నిజాం స్వాధీనం చేసుకోలేదు. ఆ తరువాత నిజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయాయి. 1978లో జీవో నెం.169 (రెవిన్యూ) తేదీ 21.5.1978 ద్వారా ఆంధ్రప్రదేశ్ (సికింద్రాబాద్ ప్రాంతం) భూ పరిపాలన రూల్స్ 1976ను జారీ చేసి ఆ లీజు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు.

అపుడు కూడా లీజు కాలపరిమితి పూర్తి కాలేదు కాబట్టి వారిని కొనసాగించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లీజు భూముల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. 1930- 1970 మధ్య కాలంలో హైదరాబాద్ జిల్లాలో 6,500 లీజు భూములున్నట్లు రికార్డులుండగా,1991నాటికి అవి 2,249 కి తగ్గిపోయింది. తర్వాత కాలంలో లీజు భూములు యజమానుల వారసుల మధ్య విభజనలు కూడా జరగడంతో వాటి సంఖ్య 2,304కి చేరింది.

దోచిపెట్టిన సీమాంధ్ర సర్కార్..


ఇదిలా ఉంటే బంగారు బాతులాంటి ఈ విలువైన భూముల అజమాయిషీ చేజిక్కడంతో సీమాంధ్ర పాలకులు వాటిని సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. కుంటి సాకులు, గుడ్డి సాకులతో దొడ్డిదారి జీవో తెచ్చి వాటిని లీజు దారులకే శాశ్వతంగా కట్టబెట్టడం మొదలుపెట్టారు. సక్రమంగా లీజు రెన్యూవల్స్‌ను పాటిస్తున్నారు.. అనే కారణాలు కూడా చూపి లక్షల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ధారాదత్తం చేశారు. ఈ క్రమంలో 1994వ సంవత్సరంలో 816 జీఓ ఇచ్చారు. దీనిప్రకారం ప్రభుత్వానికి క్రమం తప్పకుండా ఫీజు చెల్లిస్తూ, 30 సంవత్సరాల కొకసారి రెన్యూవల్ చేసుకున్న వారికి ఫ్రీహోల్డ్ (లీజు భూములపై శాశ్వత హక్కుదారుగా) చేసుకునేందుకు అనుమతినిచ్చేశారు.

అంటే ఈ సాకుతో ఈ భూములను పందేరం చేశారన్నమాట. ఈ దెబ్బకు 3 వేలమందికి ఖరీదైన భూములు దఖలు పడ్డాయి. అక్కడికీ ఇంకా సగం మంది మిగిలిపోవడంతో 2005 డిసెంబర్ 31న మళ్ళీ 816జీఓ ఒకటి తెచ్చి తిరిగి క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చేశారు. ఈసారి 1,737 మంది భూములు సొంతం చేసుకున్నారు. 57 మంది లీజుదారుల దరఖాస్తులు మాత్రం ఇతర కారణాలతో రద్దయ్యాయి. మొత్తంగా 567 లీజుదారులు లీజు రెన్యువల్ విధానం కింద ఇంకా కొనసాగుతున్నారు. తర్వాత 2006లో 1976 లీజు రూల్స్‌లోని సెక్షన్ 17ను ప్రభుత్వం 177జీఓ జారీ చేసి సవరణ చేసింది.

ఈ సవరణ ప్రకారం లీజుదారులు లీజు కాలం ముగిసే తేదీకి రెండు నెలల ముందుగా లీజు రెన్యూవల్‌కు దరఖాస్తు చేయాలి. లేదా లీజు రెన్యూవల్ కాలం ముగిసిన తేదీకి ఒక నెలలోపు దరఖాస్తు చేసినట్లయితే తగు జరిమానాతో లీజులను రెన్యూవల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే మిగిలిన ఈ భూములను సమర్పించుకోవడానికి రంగం సిద్ధం చేశారన్నమాట.

జీరా ప్రాంత లీజులు..: సికింద్రాబాద్‌లోని ఈ మొత్తం లీజు ప్రాంతాలకు ఇక్కడే ఉన్న జీరా లీజు ప్రాంతానికి కొంత వ్యత్యాసం ఉన్నది. మిగతా సికింద్రాబాద్ లీజు స్థలాలు అప్పటి నిజాం ప్రభుత్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి బదిలీ చేసినవి. కాని జీరా ప్రాంతం అప్పటి హైదరాబాద్ భగత్ జిల్లా తాలుకాదార్ ద్వారా భూసేకరణ జరిపి టౌన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ ద్వారా మిలటరీ ఎస్టేట్ అధికారికి అప్పగించారు. ఈ లీజు భూమి (జీరా ప్రాంతం) భూసేకరణపై అప్పటి పర్ పెచ్యువల్ లీజుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు దాఖలు చేశారు.

2002లో సుప్రీంకోర్టు తుది తీర్పు జారీ చేసి సదరు భూమి భూసేకరణపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు జారీ అయిన తర్వాత జీరా ప్రాంత లీజుదారులు తమకు కూడా యాజమాన్య హక్కుల మార్పిడి అవకాశాన్ని ఇవ్వాలని దరఖాస్తు చేశారు. అయితే జీరా ప్రాంత లీజుదారులు ప్రభుత్వానికి అద్దె చెల్లించకపోగా, రెన్యూవల్‌ను కూడా సక్రమంగా చేయలేదు. దీంతో ఈ దరఖాస్తులను సీసీఎల్‌ఏ పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ మొత్తం126 లీజులు ఉన్నాయి.

ఉల్లంఘలకు జేసీ వత్తాసు..


సీమాంధ్ర పాలకులే కాదు.. అధికారులు కూడా తక్కువ తినలేదు. సీమాంధ్ర పాలనలో ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహించిన జేసీ శ్రీధర్ ఉల్లంఘనులతో చేతులు కలిపి పదవికి ఉన్న సర్వహక్కులను పాతరేశారు. లీజు నియమాలను అతిక్రమించిన లీజుదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం 1989లో జీఓ ఎంఎస్‌నెంబర్ 109ను, 2002లో జీఓ ఉంఎస్ నెంబర్ 832ను, 2006లో జీఓ ఎంస్ నెంబర్ 177లను విడుదల చేసింది. అయితే చేతివాటంకు అలవాటుపడిన సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర అధికారులు ఒక్క ఉల్లంఘనుడికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒక్క లీజు భూమి వెనక్కి తీసుకోలేదు. లీజులు రెన్యువల్ చేసుకున్నా లేకున్నా కండ్లు మూసుకున్నారు. పైగా జేసీ శ్రీధర్ తానే లీజుదారుల తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు వ్యవహరించారు.

భూములు స్వాధీనం చేసుకుంటే లీజుదారులకు నష్టం వాటిల్లుతుందంటూ సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. ముందే కూడబలుక్కున్నట్టు అప్పటి సీమాంధ్ర పాలకులు దాన్ని అంగీకరించారు. ఈ వెసులుబాటుతో లీజు ఉల్లంఘనులు ఎంఓయూతో అగ్గువకు విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు విక్రయించుకుంటున్నారు. లీజు నిబంధనల ప్రకారం లీజు భూములను కొనడం అమ్మడం నేరం. అయినా అధికారులు స్పందించలేదు.

లోకాయుక్త మొట్టికాయలు..


లీజు భూముల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచార హక్కు కార్యకర్త నాగిళ్ల శ్రీనివాస్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరైన ఎస్టేట్ అధికారులు లోకాయుక్తకు పొంతన లేని సమాధానాలిచ్చి గడువుకావాలని కోరారు. లోకాయుక్త అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి జీఓ నెం. 177 పరిధిలోకి వస్తున్న లీజులలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి ఆ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లీజు రెన్యూవల్ విధానంలో కొనసాగుతున్న మొత్తం 567 లీజు కేసులలో 510 లీజులు జీఓ 177 పరిధిలోనికి వచ్చాయి. అంటే 510 మంది లీజుదారులు లీజు రూల్స్‌ను అతిక్రమించారు. నిర్ణీత సమయంలో రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

ఈ కేసులలో ఇప్పటి వరకు 347మంది లీజుదారులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం జరిగింది. మరో 163 మంది లీజుదారులకు షోకాజ్ నోటీసుల జారీ ప్రకియ కొనసాగుతోంది. నోటీసు అందిన నెల రోజులలోపు వారి లీజు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ తీసుకొని వారి లీజులను రద్దుచేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కనీసం ఈ భూముల విషయంలోనైనా దృఢంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, నవంబర్ 10, 2014

ఆంధ్ర బాబు తెలంగాణలో చేయబోతున్న మరో నీటి కుట్ర!

-తుంగభద్ర నీటికి ఎసరు
-సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్‌కి సన్నాహాలు
-నడిగడ్డలో ఆంధ్రా అధికారుల దొంగచాటు సర్వేలు
కుట్రల బాబు మరో కుట్రకు తెరతీశారు. తుంగభద్ర మీద గుట్టుచప్పుడు కాకుండా బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్- మద్రాస్ రాష్ట్రం ఉమ్మడి సొత్తు అయిన తుంగభద్ర నీటిని ఏకపక్షంగా రాయలసీమకు మళ్లించేందుకుగాను అధికారులను సర్వేకు ఆదేశించారు. ఆంధ్రా అధికారులు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ ప్రాంతంలో దొంగచాటుగా చొరబడి గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు జరుపుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటికి రావడంతో ఈ ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. 

tungabadrariver

కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లా సీ బెళగల్, మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలాల మధ్య ప్రవహించే తుంగభద్ర నది నుంచి నీటిని మళ్లించేందుకు జీవో నంబర్100ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విషయంలో అప్పుడు పెద్ద వివాదమే చెలరేగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పతనంతో ఆ విషయం కూడా కనుమరుగైంది. 

అయితే శతవిధాలా తెలంగాణ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన చంద్రబాబు సీమాంధ్రలో అధికారం చేపట్టిననాటినుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రత్నాల గర్భగా ఉన్న తెలంగాణ ప్రాంతం దూరంకావడం జీర్ణించుకోలేక అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణకు కరెంటు ఆపి నానా యాతనలు పెట్టిన బాబు ఈసారి నీటివనరుల మీద దృష్టిసారించారు. అందులో భాగంగానే నడిగడ్డలో ఆంధ్రా అధికారులు సర్వే జరుపుతున్నారని తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తెలంగాణకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు భారీ నష్టం వాటిల్లుతుంది.

అనుమతులు లేకుండానే..


నిజాం, మద్రాస్ రెసిడెన్సీ ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలను, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పును ఆంధ్రా పాలకులు ఏనాడూ గౌరవించిన పాపాన పోలేదు. ఏ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కట్టి ఇప్పటికే తెలంగాణకు కృష్ణలో నీళ్లు దొరక్కుండా చేశారు. తాజాగా సీ బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్ నిర్మాణానికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య సర్వే పనులు దొంగచాటుగా మొదలయ్యాయి. ఆ రిజర్వాయర్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగునీటిని తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.

తుంగభద్ర నదికి అడ్డంగా మినీ ఆనకట్టను నిర్మించి అక్కడి నుంచి నీటిని సీ బెళగల్ వరకు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి నిల్వ చేస్తారు. ఇరు జిల్లాల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో సర్వే పనులు మొదలుపెట్టారు. వడ్డేపల్లి మండలం పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామాల మధ్య ఆనకట్ట వల్ల ఏమేరకు భూములు ముంపునకు గురవుతాయనే విషయాన్ని తెలుసుకునేందుకే ఈ దొంగచాటు సర్వేకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సమాచారం తెలుసుకుంటా..: తహసీల్దార్


మూడు రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు వర్క్ టు రూల్ పాటిస్తున్నారు. ఇది అవకాశంగా తీసుకున్న ఆంధ్రా ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా సర్వే పనులు చేస్తున్నట్టు ఆ గ్రామాల ప్రజలు టీ మీడియాకు సమాచారమిచ్చారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులు అధికారికంగా ఇతర రాష్ర్టాల్లోకి ప్రవేశించే ముందు ఆయా ప్రభుత్వాల నుంచి విధిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయినా అంతర్ రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా అధికారులు ప్రవేశించడం చట్ట ఉల్లంఘనకు దారి తీస్తున్నది.
వడ్డేపల్లి తహసీల్దార్ శాంతకుమారిని వివరణ కోరగా తమ సిబ్బంది వర్క్ టు రూల్ పాటిస్తున్నందున కర్నూలు జిల్లా అధికారుల సర్వే విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. సోమవారం వీఆర్వో ద్వారా విషయాన్ని తెలుసుకుంటానని తెలిపారు. ఇదే విషయాన్ని రాజోళి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విచారణ చేపడుతామని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, నవంబర్ 09, 2014

అల్మాస్‌గూడలో అక్రమార్కుల అబ్రకదబ్ర!

almasguda-lands


-30 ఎకరాల గైరాన్ సర్కారీ భూమి మాయం
-విలువ రూ.100 కోట్లకు పైనే.. రెవెన్యూ మాయాజాలం ..
-రికార్డుల్లో భూమి.. క్షేత్రంలో అదశ్యం
-అబ్బసొత్తులా అమ్మేసుకున్న స్థానిక నాయకులు..
- ఆశీర్వదించిన రాష్ట్రస్థాయి నాయకగణం
-ఈ భూమికే పట్టాలిచ్చిన సమైక్య సర్కారు..
- 772 కుటుంబాల పరిస్థితి అయోమయం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పాలన అనే పేరుతో నడిపిన అరాచకం అంతా ఇంతా కాదు. రాజధాని నగరంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో జీహెచ్‌ఎంసీకే తెలియదు. రాజధాని చుట్టుపక్కల ఏ ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదో రెవెన్యూ యంత్రాంగానికే తెలియదు. ఒక చట్టం, ఒక నిబంధన, ఒక జీవో, ఓ పద్ధతి.. ఓ క్రమశిక్షణ.. ఏవీ లేకుండా రెవెన్యూ విభాగంలో సాగిన పాలన చూస్తే ముక్కున వేలేసుకోవాలి. ఇంతోటి పాలనకు హైదరాబాద్‌కు మేమే ఊడబొడిచామంటే.. కాదు.. మేమే ఊడబొడిచామంటూ బిల్డప్‌లు. వాస్తవమేమంటే సీమాంధ్రుల పాలనలో అడ్డదారిలో రాత్రికి రాత్రి కోట్లు గడించాలనుకున్న ప్రతివాడూ సర్కారు, రెవెన్యూ అధికారుల అండదండలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సర్కారుభూములు కొల్లగొట్టాడు.

almasguda-lands

దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సహా అంతా సరసమైన ధరలకు తమ సేవలను సమర్పించుకున్నారు. వెరసి వేల కోట్ల విలువైన భూములన్నీ హారతి కర్పూరమై పోయాయి. ఇవాళ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమి క్షేత్రస్థాయిలో ఉండదు. క్షేత్ర స్థాయి పొజిషన్‌లో ఉన్న వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉండవు. రికార్డుల్లో ఉన్న నక్షాకు క్షేత్రస్థాయి భూమి సరిహద్దులకు సంబంధమే ఉండదు. దీనికి తాజా ఉదాహరణ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం అల్మాస్‌గూడలో సర్వే నం.138 భూమి వ్యవహారం. ఇక్కడ గైరాన్ సర్కారీ కింద 65.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఏకంగా 30 ఎకరాలు మాయమైంది. దాని విలువ ఎంత తక్కువ వేసుకున్నా... వంద కోట్లు!

ఇలా బయటపడింది...


ప్రభుత్వ రికార్డుల ప్రకారం అల్మాస్‌గూడ సర్వే నెం.138లో 65.03 ఎకరాలు గైరాన్ సర్కారీ కింద ప్రభుత్వ భూమిగా ఉంది. గతంలోనే ఇందులో రాజీవ్‌గహ కల్ప ఇండ్లకు 16.17 ఎకరాలు, శ్మశానవాటికకు 5 ఎకరాలు, రహదారులకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల కింద 9.05 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పోతే ఇంకా 30కి పైగా ఎకరాల భూమి ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం జీఓ నెం.493 కింద పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించి అర్హులను గుర్తించింది. మొదటి దఫా 697 మందికి ప్లాట్ల కోసం 9 ఎకరాలను కేటాయించింది.

వాస్తవంగా రాజధాని, దాని చుట్టు పక్కలా ఇండ్ల పట్టాలు ఇవ్వవద్దని ఓ ప్రభుత్వ జీవో ఉంది. అయినా మంత్రుల స్థాయిలో పైరవీలు చేసి స్థానిక నాయకులు ఈ పట్టాల కార్యక్రమం మంజూరు చేయించారు. ఈ పట్టాల లేఅవుట్ రెవెన్యూ సిబ్బంది చేయాలి. అయితే ఇక్కడ నాయకులు తమ పైరవీలు, పలుకుబడితో తామే ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే ప్రభుత్వ భూమి బోలెడంత ఖాళీ ఉంది కాబట్టి 9 ఎకరాలకు బదులు 12 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. 697 ప్లాట్లకు అదనంగా తామే సొంతంగా మరో 259 ప్లాట్లు వేసి ఒకరి ప్లాటు మరొకరికిగా అమ్మేసుకున్నారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. రెవెన్యూ అధికారులు కూడా వారికి సంపూర్ణంగా సహకరించారు.

ఇక స్థానిక నాయకులు అక్కడ ఆరేళ్లుగా ప్లాట్లు వేస్తూ విక్రయాలు యధేచ్ఛగా సాగిస్తూ ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా.. ఇచ్చేసి కోటీశ్వరులయ్యారు. చాలా మంది బడానాయకగణానికి ఇందులో వాటాలు ఉన్నాయి. ఆ సొమ్మునే కొందరు ఎన్నికల ఖర్చుకు వినియోగించారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పక్కనే ఉన్న స్థలం కావడంతో హాట్ కేక్‌ల్లాగా అమ్ముడుపోయింది. నగరంలో ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేక అనేక మంది మధ్య తరగతికి చెందిన వారు రూ.లక్షలు వెచ్చించారు. ఐతే ఏదో పట్టా కాగితాలు ఇచ్చేసి నాయకగణం చేతులు దులిపేసుకుంది. కలర్ జిరాక్స్‌తోనే ఈ తతంగం నడిపారు.

ప్రభుత్వ పట్టాలకూ అదనపు నంబర్లు తగిలించి...


ఇది బాగానే జరిగింది. ప్రభుత్వం ఇక్కడ రెండోదఫా 13.12 ఎకరాలు పంపిణీ చేయాలని సంకల్పించింది. 772 ప్లాట్లకు లబ్ధిదారులను గుర్తించి రెవెన్యూ వారు పట్టాలు మంజూరు చేశారు. అయితే అప్పటికే ఇక్కడ భూముల్లో ప్లాట్లు లేఅవుట్ చేసి నాయకులు లక్షల రూపాయల చొప్పున వెలగట్టి అమ్ముకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న నక్షా ముందు పెట్టి దాంట్లోనే గీతలు గీసి ఇది నీకు ఇది నాకు అంటూ దుకాణం పెట్టి డబ్బులు చేసుకున్నారు. కొన్నవారికి అవే కలర్‌జిరాక్స్‌లు ఇచ్చారు. ఈలోగా లబ్దిదారుల ఎంపిక, పట్టాల మంజూరు జరిగింది. తీరా లేఅవుట్ చేయడానికి క్షేత్రస్థాయికి వెళితే అక్కడ సరిపడా భూమి లేదని అధికారులకు వెల్లడైంది. అంటే ప్రభుత్వ భూమి అప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కబ్జాదారుల పాలైందన్న మాట.

మిగిలిన కొద్దిపాటి స్థలంలో ప్లాట్లు వేసినా పట్టాలు మంజూరైన లబ్దిదారులకు సరిపోయే స్థితిలేదు. అప్పటికే రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాల స్థలంలోని ప్లాట్లకు బై వన్ బైటూ అంటూ రాసి అమ్మేసుకున్న నాయకులు ఈ కొత్త మంజూరు ముందుకు రావడంతో తెల్లముఖం వేశారు. ఎట్లాగూ ప్లాట్లు చేశామన్న భరోసాతో మధ్య తరగతి వర్గాలకు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల దాకా వసూలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాలను కలర్ జిరాక్స్‌లు తీసి కొనుగోలు చేసిన వారికి అంటగట్టారు. నిజమైన అర్హులు తెర మీదికి రావడంతో కొనుగోలు చేసిన వారికి ప్లాట్లు చూపించలేకపోయారు. ప్లాట్లు విక్రయించిన కొందరు నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఎన్నికలు అయిపోగానే పొజిషన్ ఇప్పిస్తామంటూ హామీలు గుప్పించారు.

2008 నుంచి సాగుతోన్న ఈ దందాలో పట్టాలు(నకిలీ, అసలు) పొందిన 700కు పైగా మందికి ఇప్పటిదాకా పొజిషన్ ఇవ్వలేదు. ప్లాట్లు చూపించాలంటూ నాయకుల వెంట పడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్లాట్లు చేసేందుకు స్థలమే లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమైక్య రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్వోలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచింది. మరో అక్రమానికి తెర తీస్తే గానీ అక్రమార్కులు బయట పడే మార్గం లేదు. ఐతే తెలంగాణ రాష్ట్రంలో వారి పప్పులు ఉడకడం లేదు.

అసలెవరో.. నకిలీలెవరో


ఇక ఈ మొత్తం సర్వేలో పొజిషన్ తీరు దారుణంగా ఉంది. ప్రభుత్వం మొదటి దఫా 697 మంది అర్హులను, ఆ తర్వాత 772 మందిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి జాబితాలోని వారికి ప్లాట్లు చూపించారు. రెండో దఫా వారికి ఉత్త పట్టా కాగితాలే మిగిలాయి. ఇక్కడ నాయకులు లేఅవుట్ చేసి ప్రభుత్వం జారీ చేసిన పట్టాలకు కూడా బై వన్ బైటూ అంటూ వేసి అమ్ముకున్నారు. కొనుగోలుదారులు ఇందులోనే నాయకులు ఇచ్చిన కలర్ జిరాక్స్‌లతో రూపొందించిన పట్టాల ఆధారంగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఇపుడు మొత్తం క్షేత్రస్థాయిలో చూస్తే ప్రభుత్వం జారీ చేసిన అసలు లబ్ధిదారులకు బదులు స్థానిక నాయకులు జిరాక్స్ కాపీలతో అమ్మగా కొన్న అనర్హులే ఎక్కువ మంది పొజిషన్‌లో ఉన్నారని తేలిసింది. అంతేకాదు రెవెన్యూ అధికారుల జాబితాలో పేర్కొన్న పేర్లు, రేషన్‌కార్డుల నెంబర్లకు కూడా పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు ప్లాట్ నెం.818ని జాబితాలో జే రాజ్యలక్ష్మి(రామకష్ణారావు)కు కేటాయించారు.

కానీ పట్టా మాత్రం ఎన్ బ్రహ్మచారి పేరిట జారీ చేశారు. ఇలా వందల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయని సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కొనుగోలు బాగోతం బయట పడుతుంది. ఇంకా ఈ స్థలంలో చాలా కాలంగా వ్యవసాయం చేసిన దళిత రైతులకు స్థానిక నాయకులే ఎకరాకు రూ.16 లక్షల వరకు ఇచ్చేసి వారిని వెళ్లగొట్టారని తెలిసింది. ఇంకా కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. స్థలం సర్కారుదే అయినా అనాదిగా తాము ఈ భూములను నమ్ముకొని ఉన్నామంటున్నారు.

రికార్డుల్లోనూ అయోమయం..:
సరూర్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు సర్వే నెం.138పై గందరగోళం నెలకొని ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ లేఖ నెం.ఇ4/1407/2013, తేదీ.3-3-2014 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సరూర్‌నగర్‌కు ఉత్తర్వును జారీ చేశారు. దానిలో సర్వే నెం.లో రాజీవ్‌గహ కల్పకు 16.17 ఎకరాలు, గ్రేవ్‌యార్డుకు 5 ఎకరాలు, రోడ్లకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు 9.05 ఎకరాలు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని 65.05 ఎకరాలుగా పేర్కొన్నారు.

అదశ్యమైన 30 ఎకరాల స్థలం ఏమైందో అందులో ప్రస్తావించలేదు. ఇదే సర్వే నెంబరులో భూమి మాయమైందని తమ దర్యాప్తులో తేలిందని సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ తేదీ.24.05.2013న జిల్లా కలెక్టర్‌కు లేఖ నెం.బీ/1113/2013 ద్వారా వివరించారు. పలు అంశాలకు కేటాయించినది పోగా మిగిలిన స్థలం అన్యాక్రాంతమైనట్లు పలువురు సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారం ప్రకారం స్పష్టమైంది. రూ.వంద కోట్లకు పైగా విలువజేసే 30 ఎకరాల స్థలం ఏమైందో క్షేత్ర స్థాయి దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కొందరు ఇపుడు ఈ అంశం మీద నోరు విప్పడం లేదు.

అవును.. ఫిర్యాదులున్నాయి...! -అధికారుల ఉవాచ


అవును.. నిజమే. అల్మాస్‌గూడ సర్వే నెం.138పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. రికార్డుల్లోనూ వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే. కేటాయింపులను సరిగ్గా రికార్డుల్లో పొందుపర్చలేదు. కేటాయింపులు పోగా చాలా వరకు అన్యాక్రాంతమైందని తెలుస్తోంది. 772 మందికి పట్టాలు గతంలో ఇచ్చారని చెబుతున్నారు. ఐతే ఎవరు అసలు, ఎవరు నకిలీలో గుర్తించాల్సిన అవసరం ఉంది.

స్థానిక నాయకులు కేటాయించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే అవుట్ చేసినట్లు సమాచారం ఉంది. ఐతే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించేందుకు అనుమతి కోసం ఆర్డీఓకు లేఖ రాశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ప్రతి పట్టాను పరిశీలిస్తాం. నకిలీలను గుర్తిస్తాం. అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. దర్యాప్తుకు ఏకంగా టీములను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. త్వరలోనే విచారణ చేస్తాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!