గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 29, 2015

జానపద పట్టుకుచ్చులు-మంద హెచ్చులు (మందెచ్చులు)

 (ఈ వ్యాస ప్రచురణకు అనుమతించిన వ్యాసకర్త శ్రీ మల్లెగోడ గంగాప్రసాద్‍ గారికి కృతజ్ఞతలతో...)
మందహెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతానం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు. 

జాన పదాల నదీనదాలకు చెదరని చెలిమె తెలంగాణ. ఆ చెలిమెలోంచి పుట్టుకొచ్చిన తేటైన నీటి ఊటే మందహెచ్చులు. దేశీ సాహిత్యం, జాను తెనుగు పదాల పోహళింపు, దేశీ సంగీత పదగతులు, చక్కని దరువులు, తీరైన తాళాల మోతలు, గజ్జెల సవ్వడులు, రాగాల ఝరుల సంగతులు కలిసిన కళా శరీరం మంద హెచ్చులు. వీరు కాటమరాజు వంశీకుల కథలను అప్పటికప్పుడు ఆశువుగా చెబుతారు. ఈ ఇతివృత్తాలు తెలంగాణ దేశీయతను పొదువుకుని విరాజిల్లుతున్నాయి. వీరు భిక్షుక గాయకులు. 


మందపిచ్చోళ్ళు, మందెచ్చోళ్ళు, పోగడపోళ్ళు, పొడపొత్రపోళ్ళు అంటూ రకరకాల పేర్లతో వీరిని పిలుస్తారు. వీరు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైద్రాబాద్, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నారు. మంద-హెచ్చు రెండు దేశీపదాల కలయిక. మంద-దేశీ నామవాచకం, హెచ్చు- దేశీ క్రియారూపం. మంద అంటే పశు సమూహం. హెచ్చు అంటే పెరగటం. ఈ కళారూపం గొల్లల ఆశ్రిత కులం వారైన జంగం లేదా బుడగ జంగం కులస్థులు ప్రదర్శిస్తుంటారు. వీరిని షెడ్యుల్డ్ కులాల జాబితాలో గుర్తించారు. గొల్లలు నివసిస్తున్న పల్లెలకు వెళ్లి వారి కులపెద్ద దగ్గర అనుమతి పొంది, త్యాగం కుదుర్చుకుంటారు. త్యాగం అంటే ఆట ఆడినందుకు ప్రతిఫలం. వీరు ఒప్పందం చేసుకున్న గ్రామాలను మిరాశీ గ్రామాలంటారు. వీరు సంచార జీవులు.


మంద హెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతానం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు. 


గొల్ల కులస్థుల ప్రస్తావన, వారి వీరోచిత పోరాటాలు, వారి దేవతల ప్రాశస్త్యం ఉన్న కథలనే చెబుతారు. ముఖ్యంగా యాదవ భారతంగా పేరు పొందిన కాటమ రాజు కథను ఎక్కువగా చెబుతారు. వీరి బృందంలో స్త్రీలు కూడా ఉంటారు. వీరు కాటమ రాజు కథల్లో గంగురాజు కథ, వలురాజు కథ, కరియావు రాజు కథ, పోలురాజు కథ, బత్తిరన్న కథ, బొల్లావు యుద్ధం కథ, కాటమరాజు యుద్ధం కథ ప్రధానంగా చెబుతారు. ఇంకా సారంగదర కథ, మండోదరి కథ, భూనాంచారి కథలను కూడా చెబుతూ ఉంటారు.


యాదవుల కుల దేవతగా భావించబడే గంగాదేవి ప్రార్థనతో కథను ప్రారంభిస్తారు. వీరి కథా ప్రదర్శనలో గంగు రాజు కథను తప్పకుండా చెబుతారు. గంగురాజు కాటమ రాజుకు తాత. గంగు రాజే గొల్లలకు మూలాధార మని వీరి నమ్మకం.


ఒగ్గుకథలో ఉపయోగించే వాయిద్యాలే వీరు ఉపయోగిస్తారు. అందులో డోలు చాలా ముఖ్యమైనది. దీనిని రఢవీర అని కూడా అంటారు. ఇది గంభీర నాదాన్ని చేస్తుంది అందుకే దానిని ఆ పేరుతో పిలుస్తుంటారు. వీరి మరో వాయిద్యం ఢమరుకం. దీనిని ఈ కళాకారులు జగ్గుఅని అంటారు. వీరు ఉపయోగించే వాయిద్యంలో ముఖ్యమైనవి తాళాలు. మంద హెచ్చుల ప్రధాన కళాకారుని చేతిలో ఉండే వాయిద్యం అనుసుల కర్ర. ఇంకా ప్రధాన కథకుని కాళ్లకు గజ్జెలుంటాయి.


గొల్లల ఇండ్లలో కథాప్రదర్శనకు ముందురోజు బొమ్మల కొలువులాగా అన్ని బొమ్మలను వరుసగా ఉంచి గంగా దేవి ప్రార్థన చేస్తారు. ఆయా కుటుంబాలకు ఆశీర్వచనాలు ఇస్తారు. ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఆత్మ శాంతికోసం పార్థన చేస్తారు. ప్రదర్శన చేసే రోజు వీరు నిష్ఠగా ఉంటారు. ఉదయాన్నే చాపలు, గొంగళ్ళు పరిచి చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎదురుగా పెట్టి ప్రదర్శన చేస్తారు. పూలు, కుంకుమ, పసుపు పెట్టుకుని సాంబ్రాణి పొగ వేసి ఒక్కొక్క బొమ్మను బయటకు తీసి కథా ఘట్టాన్ని వర్ణిస్తారు.


వర్ణన పాట రూపంలో లేదా వచన రూపంలో ఉంటుంది. ప్రార్థనయ్యాక గంగాదేవి బొమ్మను తీసేటప్పుడు గొల్ల ఇల్లాలు బియ్యం , పసుపు కలిపి వండిన బోనాన్ని అలంకరణతో తీసుకువచ్చి కథకుని ముందు ఉంచుతుంది. ఆ బోనం మీద ఒక గిన్నెను ఉంచి అందులో నూనె పోసి వత్తి వెలిగిస్తారు. మోదుగాకులో పసుపు కలిపిన బియ్యం అక్షింతలుగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయ, పెరుగు గంగముందు ఉంచుతారు. అందరికి బండారును పెడతారు. 


ఒప్పందం చేసుకున్నట్లు వడ్లు, జొన్నలు, చనిపోయిన వ్యక్తి దుస్తులు లేదా, ఒక గొర్రెపిల్ల, ఇంకా బోలుకడియం, కాలుబేడి, వెండికంటె... ఒక్కోరీతిలో త్యాగంగా తీసుకుంటారు. బొమ్మలన్నీ ఆయా కథలలోని పాత్రలే. గంగురాజు, వలురాజు, పెద్దిరాజు, సింహాద్రిరాజు, ఎరనూకరాజు, నలనూకరాజు ఇలా దాదాపు అరవై బొమ్మల్ని ప్రదర్శన లో ఉంచుతారు. ఈ బొమ్మలను తెలంగాణ ప్రాంతంలో ఉన్న నకాషి కులం వారు చేస్తారు. వీరు నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జనగాం, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తెల్లని పునికి కర్రతో బొమ్మను చేసి చింతంబలి, రంపంపొట్టు కలిపిన మిశ్రమాన్ని పూసి ఆ బొమ్మకు పరిపూర్ణత్వాన్ని తీసుకొస్తారు. 

వీరు చేసే మరో ప్రత్యేకమైన ప్రదర్శన గావుపట్టి బలి చల్లటం. గొర్ల మందకు దిష్టి తగలకుండా రోగాలు రాకుండా, చీడపీడల నివారణకు, పిశాచాల బారి నుంచి మందను రక్షించేందుకు, పంటలు సమృద్ధిగా ఉండేందుకు ఎంపిక చేసిన ఒక గొర్రెనుగాని మేకనుగానీ గావుపట్టి బలిస్తారు.


ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. బలి ప్రదేశంలో తొలుత బొమ్మల ప్రదర్శన చేస్తారు. తరువాత గావు పట్టేవ్యక్తి దిగంబరంగా మారి మొలకు వేపకొమ్మలు కట్టుకుంటాడు. గొర్రెను భుజంమీద పెట్టకుని కాసేపు విన్యాసం చేసి దాని మెడను నోటితో కొరుకుతూ మందచుట్టూ తిరిగి దాని రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి, అందులో మొక్కజొన్న, పసుపు, నల్లవాయిలి, నిమ్మ, గుమ్మడికాయ ముక్కలు, కల్లు ఇతరేతరాలను కలిపి మందచుట్టూ చల్లుతారు. దీన్నే బలి అంటారు. బలి అయ్యాక అందరూ మద్యం, మాంసాలతో విందు జరుపుకొంటారు. మందహెచ్చుల వారు ఎక్కువగా గొల్లల వేషధారణను అనుకరిస్తారు.


వీరు ఎక్కువగా తెల్లని దోతి, అంగి, భుజంపై తువ్వాల, కాళ్లకు కాకరకాయ బేడి కడియాన్ని ధరించి తోలు చెప్పులు వేసుకుంటారు. చేతులకు వెండి కడియాలు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. ప్రధాన కథకులు, సహాయకులు కూడా కొందరు జుట్టుని పెంచుకుంటారు. స్త్రీ వేషం వేయడానికి ఈ జుత్తు ఉపకరిస్తుంది. స్త్రీ పాత్రదారులు ఆభరణాలు ధరించడానికి ముక్కు చెవులు కూడా కుట్టించుకుంటారు. స్త్రీలు చెవులకు గంటీలు, పల్లేరు పువ్వు అనే సొమ్ములను ధరిస్తారు. చేతులకు మణికట్టు కడియాలు, దండ కడియాలు, కాళ్లకు వెండి కడియాలు వేసుకుంటారు. మెడలో నల్ల పూసలు, గంటె పూసలు, కాళ్లకు మట్టెలు, ముక్కుకు పుల్లలు, ముక్కు పోగులు, చేతులకు గాజులు నిత్యం ఉండాల్సిందే.


ముక్కు పుడక ఎర్రగొల్లలు ధరించరు. మందహెచ్చులు పాకనాటి గొల్లలు అందుకే వారి వేషధారణను ఎక్కువగా అనుసరిస్తారు. వీరి కులదైవం గంగ. వీరు పోశమ్మ(ప్రోచు అమ్మ), ఎల్లమ్మ(ఎల్ల అమ్మ) లను కూడా భక్తితో ఆరాధిస్తారు. ఎవరన్నా తప్పు చేసినచో, వారి దగ్గర సాక్ష్యం రాబట్టడానికి ఇమానం అంటే ప్రమాణాలని ఎక్కువగా నమ్ముతారు. తెలంగాణలో పురుడుపోసుకున్న జానపద కళలో ఇది ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. 
- మల్లెగోడ గంగాప్రసాద్


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, జూన్ 28, 2015

స్ఫూర్తి ప్రదాత!!!


(నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి)

నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి. ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం నేటి అవసరం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించడం, పాఠ్యాంశాలలో ఆయన జీవిత చరిత్రను చేర్చడం అభినందనీయం. ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను మలుపు తిప్పిన పీవీ భారత చరిత్రలో ఒక మైలురాయి. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి రాష్ర్ట మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా చేసిన కృషి చరిత్రాత్మకమైనది. బహుభాషా కోవిదుడైన పీవీ సాహిత్యాన్ని ఎక్కువగా చదివేవారు. 


1946-50 మధ్య కాకతీయ పత్రిక నిర్వహణలో తలమునకలై తన సృజనాత్మకతకు, జర్నలిజానికి మెరుగులుదిద్దుకున్నారు. అనేక కథలు, వ్యాసాలు కలం పేర్లతో రాశారు. విశ్వనాథ సత్యనారాయ ణ వేయిపడగలు నవలను సహస్ర ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. తన జీవితాన్ని రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ఇన్‌సైడర్ (లోపలి మని షి) పేరుతో ప్రచురించి సంచలనం సృష్టించారు.


కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 1921 జూన్28న జన్మించారు. పీవీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు యూనివర్సిటీ నుంచి వెళ్ల గొట్టారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చేర్చుకొమ్మని కోరితే నిరాకరించిన ఘన త సీమాంధ్రులది. దాంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పీవీ మం త్రిగా, ముఖ్యమంత్రిగా విద్యా, ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.


శ్రీకాకుళ నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన భూ పంపిణీ గురించి లోతుగా ఆలోచించి భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చారు. సీలింగ్ వల్ల భూములు కోల్పోతున్న సీమాంధ్ర పెత్తందార్లు, భూ స్వాములు కలిసి జై ఆంధ్ర ఉద్యమం 1972లో ప్రారంభించి ముఖ్యమంత్రి పదవి నుంచి పీవీ దిగేదాకా విశ్రమించలేదు. ఆ తరువాత గవర్న ర్ పరిపాలన ప్రకటించబడింది. తరువాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. పీవీ ఇందిరాగాంధీ నాయకత్వంలో అనేక పదవులు చేపట్టి తనను తాను నిరూపించుకున్నారు. అనేక సభల్లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రసంగాలకు అనువాదకులుగా వ్యవహరించారు.


పీవీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నప్పుడు పేద, గ్రామీణ విద్యార్థుల కోసం.. పట్టణ, నగర, ప్రైవేట్ విద్యారంగం కన్న ఉన్నతంగా విద్యావకాశం కల్పించాలని జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. త్రి భాషా సూత్రాన్ని అనుసరించి ఉత్తర భారత దేశంలోని అనేక నవోదయ పాఠశాలలో తెలుగును పాఠ్యాంశంగా నేటికీ చదువుతున్నారంటే, తెలుగు పండిట్‌లు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పనిచేస్తున్నారంటే అదంతా పీవీ ముందుచూపు వల్లనే సాధ్యపడింది. రాజీవ్ గాంధీ అకాల మరణం తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోయింది.


మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీవీ బయటి నుంచి ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకానికి, అలా ఎన్డీఏ, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశారు. ఆర్థిక సంస్కరణల పితామహుడుగా నిలిచిపోయారు. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు కేంద్ర సర్వీసులలో 27 శాతం రిజర్వేషన్లను అమలు జరిపి చరితార్థులయ్యారు.


పీవీ 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా 10వ ప్రధాన మంత్రిగా పనిచేశారు. పీవీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయింది. ఇతర దేశాల్లో బంగారం కుదువ పెట్టుకొని వెళ్లదీసి న కాలమది. అలాంటి దశలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ దృక్పథంతో ముందుకు సాగారు పీవీ. ఆ సందర్భంగా వామపక్షాలు, ఇతర విపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోశాయి. దేశాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని విమర్శించారు.


కానీ రాజీవ్ గాంధీతో ప్రారంభమైన ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, టెలిఫోన్, టీవీ, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసింది. ఆ క్రమాన్ని మరొక మలుపులోకి పీవీ తీసుకువెళ్లారు. ఆర్థిక సంస్కరణల కోసం అప్పటికే అర్థికశాస్త్రవేత్తగా సుప్రసిద్ధులైన మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖ మం త్రిగా నియమించి సంస్కరణలను వేగవంతం చేశారు. పీవీ దూరదృష్టి ఎంత గొప్పదో నేడు అందరికీ తెలిసి వస్తున్నది. దక్షిణాది నుంచి తొలిసారిగా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన పీవీ భారత చరిత్రలో మహోన్నతమైన అధ్యాయాన్ని సృష్టించారు. అరుదైన నేతగా పేరుగాంచారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం గా నిలిచారు. తెలంగాణ మట్టినుంచి ఎదిగిన మహా నేతగా ఆయన చూపిన మార్గం మనందరికి ఆదర్శం. 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శనివారం, జూన్ 27, 2015

సెక్షన్ 8 పై కొత్తగా చెప్పేదేమీలేదు!!! -గవర్నర్‍తో మంత్రి రాజ్‍నాథ్

rajnathsingh


హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతల కుట్రలు పారే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8పై ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పుడు ఈ విషయంలో వేలు పెడితే రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తటమే కాకుండా.. కందిరీగల తుట్టెను కదిపినట్టు అవుతుందని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీనిపై కొత్తగా చేసేదేమీ లేదని, చెప్పేది కూడా ఏమీలేదని హోంశాఖ నుంచి గవర్నర్‌కు స్పష్టత వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఇప్పుడప్పుడే మార్చే అవకాశం కూడా లేదని విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. 


- యథాతథ స్థితి కొనసాగుతుంది
- ఓటుకు నోటు కేసు ఏసీబీ చూసుకుంటుంది
- కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు
- సెక్షన్ 8కు, ఏసీబీ కేసుకు సంబంధం లేదు
-గవర్నర్‌తో హోం మంత్రి రాజ్‌నాథ్? 

గవర్నర్ మార్పు లేదు!- తప్పుకొంటానన్న నరసింహన్
- కుదరదన్న రాజ్‌నాథ్‌సింగ్
-పెద్దన్న పాత్ర పోషించాలని సూచన!

కనీసం ఏపీకైనా కొత్త గవర్నర్‌ను నియమించాలని నరసింహన్ చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన హోం మంత్రి.. రెండు రాష్ర్టాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారని తెలిసింది. గవర్నర్‌తో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమైన రాజ్‌నాథ్.. అనంతరం సెక్షన్ 8కు సంబంధించిన అంశాలపై చర్చ సందర్భంగా కార్యదర్శి ఎల్సీ గోయల్, కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్‌లను కూడా భాగస్వాములను చేసి రాజ్యాంగపరంగా వచ్చే చిక్కులపై చర్చించారని సమాచారం. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదిక, ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ వివరాలను రాజ్‌నాథ్‌కు గవర్నర్ వివరించారని తెలిసింది.


మొదట హోంశాఖ ముఖ్య కార్యదర్శితో భేటీ


హోంశాఖ ముఖ్య కార్యదర్శితో తొలుత సుమారు అరగంటపాటు సమావేశమైన గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులతోపాటు సెక్షన్ 8పైన రెండు రాష్ర్టాల అభిప్రాయాలను, రాజకీయ పార్టీల అభిప్రాయాలను వివరించారు. ఒక నివేదికను కూడా సమర్పించారని సమాచారం. ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేస్తున్న దర్యాప్తు, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదిక, కోర్టు విచారణ, రోజువారీ పరిణామాలు తదితరాలన్నింటినీ తెలియజేశారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. కొద్దిసేపటి తర్వాత కార్యదర్శి దగ్గరకు వచ్చి.. పలు అంశాలపై చర్చించి, మళ్లీ హోం మంత్రి దగ్గరకు వెళ్ళారు. ఆ విధంగా మూడుసార్లు హోం మంత్రి, హోం కార్యదర్శి చాంబర్లకు గవర్నర్ రాకపోకలు సాగించారు. ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.


సంతృప్తికరంగా హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్


హోం మంత్రి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి సమక్షంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, సెక్షన్ 8పై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల వాదనలను వివరించిన గవర్నర్.. ఈ సెక్షన్ ఇప్పటికే అమలులో ఉందని చెప్పారని తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారని సమాచారం. సెక్షన్ 8పై ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడంగానీ, కేంద్రంనుంచి మార్గదర్శకాలు లేదా ప్రత్యేకంగా నోటిఫికేషన్‌లాంటిదిగానీ ఇవ్వడం వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనమేమీ లేకపోగా ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతల పరిస్థితి కొంత వికటించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని గవర్నర్ వెలిబుచ్చినట్లు తెలిసింది. సెక్షన్ 8పై ఇప్పుడు ఏం చేసినా పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఉంటుందని, న్యాయపరంగా కూడా కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడమే అవుతుందని వారికి గవర్నర్ స్పష్టంచేశారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలకు భిన్నంగా వెళ్ళినట్లయితే రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కూడా వివరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 


ఇదే అంశంపై కార్యదర్శి గోయల్, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను చూసే సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ కూడా న్యాయపరంగా వచ్చే చిక్కులను రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం మిగిలిన అన్ని రాష్ర్టాలలాంటిదేనని, సెక్షన్ 8 ఆధారంగా మార్గదర్శకాలు, నోట్ లేదా నోటిఫికేషన్‌ను అధికారికంగా ఇవ్వడమంటే రాజ్యాంగంలో రాష్ర్టాలకు ప్రసాదించిన సార్వభౌమాధికారాన్ని హరించినట్లవుతుందని చెప్పారని సమాచారం. తద్వారా పరోక్షంగా కేంద్రపాలిత ప్రాం తంగా పరిగణించినట్లవుతుందని, అందువల్ల ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడం మినహా కొత్తగా ఏ మార్పులు చేయడానికి వీలుపడదని వివరించినట్లు తెలిసింది. ఇందుకోసం రాజ్యాంగంలోనూ, పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ పేర్కొన్న అంశాలను కూలంకషంగా చర్చించారు. ప్రత్యేకంగా కుమార్ అలోక్ ఈ రెండు పుస్తకాలను తన వెంట తీసుకెళ్ళారు. సెక్షన్ 8పై తెలంగాణ ప్రభుత్వం విధానాన్ని, హైదరాబాద్‌లోని ఎంఐఎం, బీజేపీ తదితర పార్టీల అభిప్రాయాలను కూడా గవర్నర్ వివరించారు. ఈ పార్టీలన్నీ కూడా సెక్షన్ 8పై ఇటీవల చేసిన వ్యాఖ్యలను, మార్పులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన తీరును రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తెచ్చారని సమాచారం. ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితికి భిన్నంగా ఏ మార్పు చేసినా ప్రజలు, పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు వివిధ ప్రజా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వచ్చే వ్యతిరేకత, ఆందోళన తదితరాలన్నింటిపైనా గవర్నర్ వివరించినట్లు తెలుస్తున్నది.


సెక్షన్ 8తో కొత్తగా వచ్చేదేమీ లేదు


తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం అందుతుండడం మాత్రమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలను తన దృష్టికి తీసుకొస్తున్నారని గవర్నర్ వివరించారని తెలిసింది. శాంతిభద్రతల అంశంపై కూడా సమాచారం అందుతూ ఉన్నదని, సెక్షన్ 8లో మార్పులు చేయడం ద్వారా ఇంతకన్నా అదనంగా వచ్చేదేమీ చెప్పారని సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి పట్టుబడిన తర్వాతే ఏపీ నుంచి సెక్షన్ 8 విషయంలో తీవ్ర స్వరంతో డిమాండ్లు రావడానికి కారణాలను కూడా గవర్నర్ వివరించారని తెలియవచ్చింది. తాజాగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వివాదంతోపాటు జేఎన్టీయూ ప్రొఫెసర్‌పై దాడి చేసినట్లు వచ్చిన వార్తలను, వాటి వెనక ఉన్న నేపథ్యాన్ని కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదని గవర్నర్‌తోపాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిసైతం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న అభిప్రాయం కలగడంకోసం ఇప్పుడు వ్యవహరిస్తున్నదానికంటే మరికొంత యాక్టివ్‌గా వ్యవహరించాలని గవర్నర్‌కు రాజ్‌నాథ్ సూచించినట్లు తెలిసింది. రెండు రాష్ర్టాలమధ్య ఈ అంశం లో ప్రస్తుతం ఉన్న వాతావరణం కొంత సద్దుమణిగేలా చూడాలని సలహా ఇచ్చారని సమాచారం. ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు గవర్నర్‌పై విమర్శలు చేయడం సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు రాజ్‌నాథ్ కాస్త తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించడంతో పాటు అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించినట్లు సమాచారం.


ఓటుకు నోటు కేసులో కేంద్ర జోక్యం ఎందుకు?


ఓటుకు నోటు వ్యవహారంలో గవర్నర్ తెలియజేసిన వివరాలన్నింటినీ కూలంకషంగా విన్న కేంద్ర హోం మంత్రి.. చట్టం ప్రకారం దర్యాప్తు సాగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేంద్రం ఈ వ్యవహారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదని, చట్టం తన పని తాను చేసుకునే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశారని సమాచారం. ఇప్పటికే ఆడియో, వీడియోలద్వారా ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోయినందున ఇందులో వేలు పెట్టడానికి కేంద్రానికి ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపున గవర్నర్, రాజ్‌నాథ్ ఏకాంత భేటీలో ఏసీబీ కేసుపై రాజకీయ కోణంనుంచి చర్చ జరిగి ఉండవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. బీజేపీ-టీడీపీ మధ్య ఎన్నికలకు ముందునుంచి పొత్తు ఉన్నప్పటికీ.. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలు వాస్తవమైనవేనని తేలిన నేపథ్యంలో చంద్రబాబును వెనకేసుకు రావాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పినట్లు తెలిసింది. ఇదే కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం తథ్యమని సంకేతాలు వస్తున్న రీత్యా ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో తలెత్తనున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అదుపు చేయగలుతుంది? తదితరాలను చర్చించినప్పుడు ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తూ అవసరాన్ని బట్టి ప్రభుత్వంతో చర్చించి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు గవర్నర్ సుముఖత వ్యక్తంచేయలేదు. రోటీన్‌గా జరిగే మీటింగేనని ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. రాజ్‌నాథ్‌తో భేటీకోసమే ఢిల్లీకి వచ్చినందున సమావేశం అనంతరం సాయంత్రమే హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్ళిపోయారు.


గవర్నర్ మార్పు లేదు


రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహన్‌ను ఆ పదవి నుంచి మార్చే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన గవర్నర్.. ఏపీ ప్రభుత్వం ఎలాగూ తనను విశ్వసించడం లేదని, కనుక తనకు సెలవివ్వాలని విజ్ఞప్తి చేయగా.. దానిని కేంద్ర మంత్రి సున్నితంగా తిరస్కరించారని, రెండు రాష్ర్టాల మధ్య పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారని హోంశాఖలోని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. మీ పనితీరు పట్ల కేంద్రానికి సంతృప్తి ఉన్నది. గవర్నర్ మార్పు అవసరమైనప్పుడు ఎలాగూ నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకూ కొనసాగాలి అని నచ్చచెప్పినట్లు తెలిసింది.
ఏపీ ప్రభుత్వానికి నాపై విశ్వాసం లేదు: తొలుత తనను తప్పించడంపై ప్రస్తావించిన నరసింహన్.. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించనప్పుడు కొనసాగడం సమంజసంగా ఉండదని, ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగలేనని రాజ్‌నాథ్‌కు చెప్పారని తెలిసింది. పైగా తాను ఎప్పుడో తప్పుకోవాలని అనుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో ప్రస్తావించినప్పుడు జూన్, జూలై మాసాల్లో చూద్దామన్నారని, ఇప్పుడు జూన్ ముగిసిపోతూ ఉన్నందున ఇప్పటికైనా సెలవు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ మార్పు సాధ్యం కాదని, ఆ ఆలోచన లేదని రాజ్‌నాథ్ సర్దిచెప్పినట్లు తెలిసింది. ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాల గురించి చర్చించడంకంటే భవిష్యత్తులో రెండురాష్ర్టాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుండా పెద్దన్న పాత్ర పోషించి, సీఎంలతో మాట్లాడి పరిస్థితిని దారిలోకి తేవాలని వివరించినట్లు తెలిసింది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

  


శుక్రవారం, జూన్ 26, 2015

దినదినమూ చంద్రబాబుకు బిగుస్తున్న ఉచ్చు...!!!

-ఇటు ఏసీబీ.. అటు ఈసీ.. ఫోరెన్సిక్ రిపోర్ట్ రెడీ..
-లీకులు.. లేఖలపై కేంద్ర హోంశాఖ గుస్సా
- ఓటుకు నోటు కేసులో మూసుకుపోతున్న దారులు
-చంద్రబాబుపై కేసునమోదుకు ఆదేశించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
-కేసులో రంగప్రవేశం చేసిన ఎన్నికల కమిషన్
-ఆడియో, వీడియో టేపులు కావాలంటూ కోర్టులో మెమో
- ఏసీబీ కోర్టును ఫోరెన్సిక్ నివేదిక కోరిన ఏసీబీ
-ఐదు రోజుల్లో కీలక పరిణామాలని సంకేతాలు
- సండ్ర , వేం అరెస్టుకు అవకాశాలు
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉచ్చు బిగుస్తున్నది. ఇప్పటికే ఏసీబీ చుక్కలు చూపిస్తుండగా గురువారం ఎన్నికల కమిషన్ కూడా రంగప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు తమకు కూడా కావాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. 


chandrababunaidu

ఎన్నికల చట్టాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతున్నది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. నోటీసులు, అరెస్టుల పర్వానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఐదురోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దెబ్బమీద దెబ్బగా సెక్షన్ 8 మీద లీకులు, లేఖల మీద కేంద్రం భగ్గుమంటున్నదన్న సమాచారం ఢిల్లీనుంచి అందింది. ఇవి చాలవన్నట్టు రాష్ట్ర గవర్నర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు పలువురిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్‌బీ నగర్ పోలీసులను ఆదేశించింది. అష్టదిగ్బంధంలో చిక్కుకుని త ప్పించుకునే మార్గం దొరకక బాబు గ్యాంగ్ విలవిలలాడుతున్నది.


దూకుడు పెంచిన ఏసీబీ..


ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. కేసులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరడంతో తదుపరి చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం గురువారం కోర్టులో మెమో దాఖలు చేసింది. నివేదిక ఆధారంగా నోటీసుల జారీ, అరెస్టులతో దూకుడు పెంచనున్నట్టు తెలిసింది. రానున్న ఐదు రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఓ అధికారి చెప్పారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మీద ప్రస్తుతం ఏసీబీ దృష్టి పెట్టింది. అనారోగ్యం సాకుతో ఆయన అడిగిన గడువు పూర్తి కావస్తున్నది. ఆ వెంటనే ఏసీబీ ముందుకు రాని పక్షంలో అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలిసింది. అలాగే కేసులో ప్రధాన లబ్ధిదారు వేం నరేందర్‌రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. 


ఏసీబీ కోర్టులో ఈసీ మెమో..


ఈ కేసులో వీడియో, ఆడియో, తదితర ఎక్విప్‌మెంట్లు, వాటి రికార్డ్ కాపీలు తమకు కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ గురువారం ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఉప ప్రధాన ఎన్నికల అధికారి శ్రీదేవసేన అల్లంరాజు మెమో దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గతనెల 31వ తేదీన ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఈ నెల మొదటి వారంలోనే ఏసీబీ అధికారులను కోరింది. అప్పటికే ఏసీబీ అధికారులు ఆధారాలు, సాక్షాలు, వీడియో, ఆడియో టేపులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీంతో వారు ఏసీబీ కోర్టుకు వచ్చారు. 


babu-revanth

ఎన్నికల అధికారి దాఖలు చేసిన మెమోను కోర్టు స్వీకరించింది. తమ వద్ద టేపులు రికార్డు చేసేందుకు ఎలాంటి పరికరాలు ఉండవని, పేపరు రూపంలో ఉన్న డాక్యుమెంట్ పత్రాల జిరాక్స్ కాపీలను ఇస్తామని కోర్టు చెప్పింది. ఈ కాపీలను కోర్టు శుక్రవారం ఇచ్చే అవకాశం ఉంది.


సీల్డ్ కవర్లలో ఏముందో పరీశీలిస్తాం: న్యాయమూర్తి లక్ష్మీపతి


మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అందజేసిన నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కూడా గురువారం కోర్టుకు వచ్చారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు సీల్డ్ కవర్‌లో వివరాలు ఇచ్చారు.. వాటిలో ఏముందే పరిశీలించాలి... శుక్రవారం మధ్యా హ్నం తర్వాత పరిశీలిస్తామని న్యాయమూర్తి లక్ష్మీపతి పేర్కొన్నారు. ఈ కేసులో ఏసీబీ పంపిన ఆడియో, వీడియో టేపులు, హార్డ్‌డిస్క్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలించింది. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ట్రాన్సిప్షన్ సదుపాయం లేదు. అందువల్ల ట్రాన్సిప్షన్ చేయించే అవకాశం ఇవ్వాలని, అందుకు పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సమర్పించిన మూడు టేపులు, హార్డ్ డెస్క్ నకలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు గత వారం కోర్టులో మెమో దాఖలు చేశారు.


కోర్టు ఈ మేరకు టేపులు, హార్డ్ డిస్క్ నకలు (కాపీ చేసి)ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు టేపులు, హార్డ్ డిస్క్ ఇచ్చారు. కాపీ చేసిన తర్వాత వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు బుధవారం కోర్టుకు సమర్పించారు. ఒక హార్డ్‌డిస్క్, మూడు టేపుల నకళ్లకు సంబంధించిన సీల్డ్ కవర్లతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు మరో సీల్డ్ కవర్‌ను కూడా కోర్టుకు అందజేశారు. గురువారం ఉదయం పదిన్నరకు ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి కోర్టుకు వచ్చి మెమో దాఖలు చేశారు. ఆ సమయంలోనే సీల్డ్ కవర్లను పరిశీలించాలని న్యాయమూర్తి లక్ష్మీపతి భావించారు.


ఆ సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం ఇతర కేసుల వాదనలు ఉండటంతో కుదరక సాయంత్రం నాలుగున్నరకు వాయిదా వేశారు. సాయంత్రం నాలుగున్నర తర్వాత మరోసారి ఏసీబీ అధికారులు కోర్టు హాల్‌లోకి వెళ్లారు. అయితే కేసులు ఉండటంతో ఈరోజు కుదరడంలేదని... సీల్డ్ కవర్‌లో ఏమున్నాయో ముందుకు పరిశీలించాల్సి ఉందని అంటూ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రావాలని న్యాయమూర్తి వారికి చెప్పారు. అంతకు ముందు నిందితుల తరుఫు న్యాయవాది పార్థసారథి తన వాదనలు వినిపిస్తూ హైకోర్టులో శుక్రవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటీషన్‌పై తీర్పు ఉన్నందున ఈ సమయంలో ఆడియో, వీడియో టేపులు ఇస్తే ఏదో సృష్టించి అడ్డుకునేందుకు ఏసీబీ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 


వారిద్దరి అరెస్ట్ తప్పేలా లేదు: ఏసీబీ


ఓటుకు నోటు కేసులో ఐదు రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి. కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహను ఇప్పటికే రిమాండ్‌కు పంపింది. కేసులో మరింత కీలకమని భావిస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా విచారించేందుకు యత్నించింది. కానీ ఆరోగ్య సమస్య కారణంగా పది రోజులపాటు విచారణకు హాజరుకాలేనని చెబుతూ సండ్ర ఏకంగా రాష్ట్రం వదలివెళ్లిపోయారు.


దర్యాప్తు కీలక సమయంలో సండ్ర తప్పించుకోవడంతో ఏసీబీకి మరిన్ని సందేహాలు తలెత్తాయి. సండ్ర పది రోజుల గడువు కావాలని కోరి వారం దాటిపోయింది. ఈ నెల 16న సండ్రకు నోటీసులిచ్చిన ఏసీబీ, 19లోపు హాజరుకావాలని కోరింది. కానీ ఆయన పది రోజులు గడువు కోరడంతో 29 వరకు ఆగాలని భావించింది. మరో మూడు రోజుల్లో సండ్రకు ఇచ్చిన సమయం ముగియనుంది. అనంతరం సండ్ర విచారణకు హాజరవుతారా? లేకా తప్పించుకునేందుకు మళ్లీ ఎత్తులు వేస్తారా? అని ఏసీబీ అనుమానిస్తోంది. దీనితో కోర్టు నుంచి నేరుగా సండ్రకు నోటీసులు లేదా సమన్లు ఇప్పించి విచారించాలని భావిస్తోంది. ఇలా కాకుండా సండ్రను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టే యోచనలో కూడా ఉన్నట్టు ఏసీబీ వర్గాలు ద్వారా తెలిసింది. సండ్ర కీలక కావడం, తాజా పరిస్థితులు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వీటంన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్టు ఆ వర్గాలు తెలిపాయి. 


వేం నరేందర్‌రెడ్డిని సైతం..


ఇక ఈకేసులో లబ్దిదారుడిగా ఆరోపణలెదుర్కుంటున్న వేం నరేందర్‌రెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని, ఆ విభాగపు న్యాయనిపుణులు స్పష్టంచేశారు. కుట్రలో ఆయనే లబ్ధిదారుడు కావడం, పైగా రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఏసీబీ వేం నరేంద్‌రెడ్డిని విచారించింది. అయితే ఆరోగ్య సమస్యలుండటం వల్ల కేవలం విచారించి వదిలేసింది. ఎమ్మెల్యే సండ్రను విచారించిన తర్వాత వెలుగులోకి వచ్చే అంశాలనుబట్టి వేం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని భావించింది. అయితే సండ్ర హ్యాండ్ ఇవ్వడంతో ఓపిక పట్టింది. సండ్రకు ఇచ్చిన గడువు పూర్తవుతున్న నేపథ్యంలో తదుపరి యాక్షన్ ప్లాన్‌కు సిద్దమవుతున్నట్టు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. 


వారిద్దరూ వస్తారు..


ప్రస్తుతం సండ్ర ఎక్కడున్నాడన్నది ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో సండ్రను ఎలా అదుపులోకి తీసుకొని ఏసీబీ విచారిస్తుందనేది ఆసక్తి రేపుతున్నది. అయితే పది రోజుల గడువు ముగిసే లోగా సండ్రనే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరవుతారని ఏసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. సండ్రను హాజరుపరిచేలా తాము చేస్తున్న ప్రయత్నాలు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయని వారు చెప్పారు. వేం నరేందర్‌రెడ్డి, సండ్ర ఇద్దరూ ఒకే రోజు తమ ఎదుట విచారణకు వస్తారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, జూన్ 25, 2015

అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్!

దృష్టి మళ్లించి.. దొంగతనం!! రోడ్డు మీద ఓ పది రూపాయల నోటు పడేయడం.. డబ్బులు పడిపోయాయని పిలిచి మరీ చెప్పి.. వారు ఆ నోటు తీసుకునేలోపు లక్షల రూపాయలతో ఉడాయించేయడం!! ఇదీ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ పని! ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇటువంటి గ్యాంగులు బయల్దేరాయి! 


-సెక్షన్ 8 పేరుతో బాబును కేసునుంచి తప్పించే యత్నం
-ఏపీ సర్కారు యత్నాలకు ఆంధ్రజ్యోతి వత్తాసు..
-ఢిల్లీలో దిశానిర్దేశం చేస్తున్న న్యాయకోవిదుడు
-తెలంగాణ పాలనలో పుల్లలు పెడుతున్న బాబు
-హెచ్‌ఆర్‌డీపై పెత్తనానికి ఏకపక్ష నిర్ణయం
-అంతర్గత సిబ్బందిలో తెలంగాణవారికి ఉద్వాసన
-తెలంగాణలో కల్లోలమే ఏపీ సర్కార్ లక్ష్యం!
-మండిపడుతున్న తెలంగాణవాదులు
ఓటుకు నోటు కేసులో పీకలలోతు కూరుకుపోయిన చంద్రబాబునాయుడుని బయటపడేసేందుకు.. ఈ కేసును పక్కదారి పట్టించి.. జనం దృష్టి మరో సమస్యవైపు మళ్లించేందుకు ఈ గ్యాంగులు విరామం లేకుండా శ్రమిస్తున్నాయి! ఏపీ అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడే మీడియా.. ఢిల్లీలోని న్యాయవ్యవస్థలో కొందరు ఈ గ్యాంగులో సభ్యులుగా తేలుతున్నది. సెక్షన్ 8.. గవర్నర్ గిరీ పేరుతో చెలరేగి చిమ్ముతున్న విష అక్షరాల వెనుక ఉన్నది ఇదే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్!


governer1


తెలంగాణలో ఏదో కల్లోలం జరిగిపోవాలి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగంగా తేలాలనే దుర్బుద్ధి ఏపీ ప్రభుత్వంలో మొదటి నుంచీ కనిపిస్తూనే ఉంది. తాజాగా ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో టేపులు బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కేసు నుంచి బయపడేందుకు వెతకనిమార్గం లేదు. 


ఈ క్రమంలోనే తన మీడియాను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నది. తెలంగాణపై విషం చిమ్మేందుకు సందుకోసం ఎదురుచూసే ఆంధ్రజ్యోతివంటి పత్రికలకు ఈ పరిణామంతో కోతికి కొబ్బరికాయ దొరికినట్లయిందని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆయన ప్రయోజనాలకు కొమ్ముకాసే మీడియా, ఢిల్లీలోని న్యాయ వ్యవస్థలో కొంద రు వ్యక్తులు కలిసి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌గా ఏర్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో మీడియాను మేనేజ్ చేయడంతోపాటు.. తెలంగాణ సర్కారును ఇరుకు న పడేసే దిశగా వార్తలు రావాలని నిర్దేశాలు జరిగినట్లు తెలుస్తున్నది. 


నాలుగు రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రిక సెక్షన్ 8 అంశాన్ని తీసుకుని రాద్ధాంతం చేయడం, ఇప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గవర్నర్‌కు రాసినట్లు చెప్తున్న ఒక సాధారణ లేఖను పట్టుకుని నానా యాగీ చేయ డం.. ఏదో అయిపోతున్నదని, ఇక నగరంపై గవర్నర్ గిరీయేనని చంకలు గుద్దుకుంటూ కథనాలు ప్రచురించి, తమ మీడియాలో ప్రసారం చేయడం ఈ గ్యాంగ్ స్కెచ్‌లో భాగమేననే అనుమానాలను తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. 


చంద్రబాబును ఓటుకు నోటు కేసులో బోనెక్కించే ప్రయత్నాలు మానుకోకుంటే హైదరాబాద్‌పై సెక్షన్ 8 వస్తుందని బెదిరించే ధోరణి కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా చంద్రబాబు హెచ్‌ఆర్‌డీ నిర్వహణ విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణలో సాఫీగా సాగుతున్న పరిపాలనకు పుల్లపెట్టడమేననే వాదన వినిపిస్తున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం పదో షెడ్యూల్లో ఉందంటూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీగా ముఖేష్ గుప్తాను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నియమించడం కొత్త వివాదానికి తెర లేపింది. ఈ కేంద్రం తమదేనని తెలంగాణ సర్కారు వాదిస్తున్న సమయంలో ఉన్నపళంగా సీజీజీకి కొత్త అధికారిని నియమించడం మరో వివాదం రేపేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇదిలా ఉంటే ఇప్పటికే తన ఇంటిలో పని చేస్తున్న 20 మంది తెలంగాణవారిని చంద్రబాబు తొలగించారని వార్తలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు అంతర్గత భద్రత విభాగం నుంచి దాదాపు 40 మందిని ఏపీ అధికారులు రిలీవ్ చేశారు. తెలంగాణ వాసన కూడా తనకు రావద్దన్న చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. దశాబ్దాల పోరాటాలు, వందల ఆత్మబలిదానాలు, వేల కేసులు, లాఠీదెబ్బలు ఎదుర్కొని, త్యాగాల పునాదులపై ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం పురోగామి మార్గంలో దూసుకుపోవడం జీర్ణించుకోలేని అల్పబుద్ధి ఏపీ ప్రభుత్వ చర్యల్లో, దానికి అంటకాగే పత్రికల అక్షరాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. 


కేసునుంచి చంద్రబాబు బయటపడేందుకు అత్యంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రజ్యోతి.. గత కొద్ది రోజుల క్రితం అసలు ఈ కేసు మొత్తం నీరుగారిపోయినట్లేనని, ఉభయ రాష్ర్టాల సీఎంలు ఒక అవగాహనకు వచ్చి.. వెనక్కు తగ్గారని ఒక అభిప్రాయాన్ని రుద్దింది. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఈ కేసుకు సంబంధించిన వార్తలు రాకపోవడం దీనికి నిదర్శనమని ఒక దిక్కుమాలిన సూత్రీకరణ కూడా చేసిపారేసింది. ఇప్పుడు హైదరాబాద్‌పై గవర్నర్ పూర్తి జోక్యానికి మార్గం సుగమం అయిపోయిందంటూ కొత్త భాష్యం చెప్తున్నది. నిజానికి సెక్షన్ 8 కొత్తగా అమలయ్యేదేమీ ఉండబోదని హోంశాఖ వర్గాలే తేల్చి చెప్తున్నాయి. 


నగరంలో శాంతి భద్రతల పరిస్థితికి భంగం వాటిల్లినప్పుడు.. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతున్నదని భావించినప్పుడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పరిధి అంతవరకు పరిమితం. అంతేకానీ ఏదైనా గొడవ జరిగితే వెళ్లి పరిష్కరించాలని కానిస్టేబుల్‌ను గవర్నర్ పంపించే పరిస్థితి ఉండదు. కానీ.. ఈ వాస్తవాలను పక్కనపెట్టేసి.. ఒక అనధికారిక లేఖ పట్టుకుని ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 


నిజానికి శాంతి భద్రతలనేవి రాష్ర్టాల పరిధిలోని అంశం. ఒక సాధారణ చట్టం ద్వారా శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు ఎలా కట్టబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి తెలియదనుకోలేమని, కానీ.. ఉన్న సమయంలో సాధ్యమైనంత గందరగోళం సృష్టించి, ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఆ పత్రిక ఇలాంటి రాతలు రాస్తున్నదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, జూన్ 24, 2015

టవర్లు పీకేస్తాం.. దాడులు చేయిస్తాం.. -ఏపీ సిట్ అధికారుల బెదిరింపు!!

-రాష్ట్రంలో నెట్‌వర్క్, బిజినెస్‌ను దెబ్బతీస్తాం
-సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ సిట్ బెదిరింపులు!
-ఏపీ ఫోన్‌లు ట్యాప్ అయ్యాయని చెప్పాలని ఒత్తిళ్లు?
-ట్యాపింగ్ జరుగలేదని తేల్చిన కంపెనీ ప్రతినిధులు
-విచారణ తీరు మారకుంటే డీవోటీకి ఫిర్యాదు?
టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పెట్టిన కేసులో ఏపీ సిట్ అధికారుల విచారణ బెదిరింపులపర్వంగా సాగుతున్నదని తెలుస్తున్నది. విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు రెండోరోజు పలువురు సెల్‌ఫోన్ కంపెనీల ప్రతినిధులను విచారించారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి అధికారుల ఫోన్‌లు ట్యాప్ చేసిందంటూ సృష్టించి చెప్పాలని సర్వీస్ ప్రొవైడర్లపై రెండో రోజూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాపింగ్ జరిగినట్లు చెప్పకపోతే ఆయా కంపెనీల సెల్ టవర్లను, వ్యాపారాన్ని దెబ్బతీస్తామని బెదిరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో ఇరుక్కుపోయిన కేసును పక్కదారి పట్టించే విధంగా సిట్ విచారణ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


providers

అయితే సదరు కంపెనీల ప్రతినిధులు మాత్రం ట్యాపింగ్ జరుగలేదని విస్పష్టంగా తేల్చి చెప్పారని సమాచారం. కొందరు ప్రతినిధులైతే అధికారుల విపరీత ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారని తెలిసింది. విచారణకు వచ్చిన తమకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధిస్తూ, లేనిది ఉన్నట్టు సృష్టించి చెప్పాలని బలవంతం చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. తాము చెప్పిన వాటికి తలూపాలని, లేకుంటే ఏపీలో ఆయా కంపెనీల సెల్‌టవర్లు పీకేయిస్తామని, అల్లరిమూకలు, రౌడీలతో పడగొట్టిస్తామని, ఆయా కంపెనీలకు చెందిన జోనల్, సబ్ జోనల్ కార్యాలయాలు, ఔట్‌లెట్లు, డిస్ట్రిబ్యూటర్లపై దాడులుచేయిస్తామని, తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపుతామని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని విచారణకు హాజరైన ప్రొవైడర్లు వాపోతున్నారు. ఏపీ ప్రజలకు సమాచార వ్యవస్థను దూరం చేసేలా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచక్షణ కోల్పోయి విచారణ...


ఓటుకు నోటు కేసులో ట్యాపింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై 12 సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిన సిట్.. విచారణకు హాజరైన ప్రతినిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నిస్తున్నదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ నిబంధనలను బేఖాతరు చేస్తూ సర్వీస్ ప్రొవైడర్లను పిలిచి, పోలీస్‌స్టేషన్‌లో రాత్రింబవళ్లు ప్రశ్నించడంపై నెట్‌వర్క్ కంపెనీల యాజమాన్యాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. సిట్ విచారణ తీరు, బెదిరించడంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ)కు ఫిర్యాదు చేసేందుకు అవి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ విచారణ తీరుతెన్నులు మారకపోతే ఏపీలో తమ బిజినెస్ ఆపేస్తామని, మొత్తంగానే కంపెనీల సేవలు నిలిపివేస్తామని తమ ఫిర్యాదులో స్పష్టం చేయనున్నారని తెలిసింది.

ప్రజలకు సమాచార వ్యవస్థ దూరం చేసే చేష్టలు


సిట్ చేష్టలు ఏపీ ప్రజలకు సమాచార వ్యవస్థను దూరం చేసేవిగా ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో శంకుస్థాపన తప్ప మరే పనులూ మొదలు కాలేదు. ఇటువంటి సమయంలో సెల్‌టవర్లు, నెట్‌వర్క్ స్తంభించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ విడిపోవడంతో అవశేష రాష్ట్రంగా మిగిలిన ఏపీకి ఇంతవరకూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పేరున్న కంపెనీ ఏదీ కూడా ముందుకు రాలేదు. ఈ సమయంలో ఒక కేసులో ఏ మాత్రం సంబంధం లేని సర్వీస్ ప్రొవైడర్లను ఇలా వేధిస్తే ఇంక పెట్టుబడులు ఎలా పెడతామని పారిశ్రామికవేత్తలు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆ గొంతు బాబుదే! - తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు!!!

-తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు!
-రేపు చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు?
-ఓటుకు నోటు కేసులో ఇక కీలక ఘట్టం
-ట్యాపింగ్ కాదు.. ఫోన్‌లో రికార్డు చేసినదే..
-నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక!
-నేటి మధ్యాహ్నం ఏసీబీ చేతికి..
-అందిన వెంటనే కీలక చర్యలు!
ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకోబోతున్నది. ఈ కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ధ్రువీకరించినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఆడియో టేపు ట్యాప్ చేసినది కాదని, ఫోన్‌లో రికార్డయినదేనని ఫోరెన్సిక్ విశ్లేషణలో తేటతెల్లమైనట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కట్ అండ్ పేస్ట్ వ్యవహారంకూడా కాదని ఎఫ్‌ఎస్‌ఎల్ తన నివేదికలో స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ మేరకు తమ విశ్లేషణలతో కూడిన సమగ్ర నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి అందించబోతున్నట్లు తెలిసింది. ఆ నివేదిక అందిన తర్వాత ఇతర లాంఛనాలు పూర్తిచేసుకుని గురువారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇక బాబుకు చుక్కలే..:

టీవీల్లో ప్రసారమైన ఆడియో టేపులలో గొంతు తనదికాదని ఒకసారి, కట్ అండ్ పేస్ట్ చేశారని మరోసారి, ట్యాప్ చేశారని ఇంకోసారి చెప్తూ వచ్చిన చంద్రబాబుకు దిమ్మతిరిగే వాస్తవాలు ఈ నివేదికలో ఉన్నాయని తెలుస్తున్నది. తమకు అందిన ఆడియో టేపులు స్టీఫెన్‌సన్ ఫోన్‌లో రికార్డయినవేనని, ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నట్లుగా ట్యాప్ చేసి రికార్డుచేసినవి కావని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది. సదరు ఆడియోలో ఉన్న గొంతు చంద్రబాబుదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 


babu

ఏ రోజు.. ఎన్ని గంటలకు.. ఎంత సేపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారనే విషయాన్ని కూడా నివేదికలో పొందుపర్చినట్లు తెలియవచ్చింది. స్టీఫెన్‌సన్ వ్యక్తిగత మొబైల్‌ఫోన్‌ను పరీక్షించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు ఈ మేరకు నిర్ధారణలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్.. తమకు కొత్త హార్డ్‌డిస్క్, కొన్ని ఖాళీ డీవీడీలు కావాలని కోరింది. ఎఫ్‌ఎస్‌ఎల్ కోరినట్టు అన్నీ తాము ఇప్పటికే అందించామని ఏసీబీ వర్గాలు చెప్పాయి. కేసుకు సంబంధించి తమకు అందిన ఆడియో, వీడియో టేపులను ముందు జాగ్రత్త చర్యగా స్టోర్ చేసుకునేందుకే ల్యాబ్ అధికారులు ఇవి కోరి ఉంటారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. దాదాపుగా ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పరీక్షలు ముగిసి, నిర్ధారణలు పూర్తయ్యాయని, బుధవారం మధ్యాహ్నానికి నివేదికను ఏసీబీకి అప్పగిస్తామని ఎఫ్‌ఎస్‌ఎల్ వర్గాలు తెలిపాయి.


రేపే బాబుకు నోటీసులు?:

స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించిన నేపథ్యంలో ఏసీబీ తన దర్యాప్తు వేగాన్ని పెంచనుందని తెలుస్తున్నది. నివేదిక అందిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఏసీబీవర్గాలు చెప్పాయి. ఓటుకు నోటు కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చే నివేదిక తమకు అత్యంత కీలక ఆధారమని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


ఆ నివేదికకోసం ఎదురుచూస్తున్నామని, అది చేతికి రాగానే కేసులో తుది ఘట్టాన్ని మొదలు పెడతామని తెలిపారు. తదుపరి కీలక పరిణామాలు తప్పవని వారు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక తమకు బుధవారం మధ్యాహ్నం లేదా గురువారానికి అందిన వెంటనే చంద్రబాబుతోపాటు ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న పలు ప్రైవేట్ కంపెనీల సీఈవోలు, పలువురు రాజ్యసభ ఎంపీలకు తాఖీదులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ వర్గాలు తేల్చిచెప్పాయి. ఒకవేళ నోటీసులు స్వీకరించాల్సిన పలువురు వ్యక్తులు అందుబాటులో లేకపోయినా, వారి కుటుంబీకులకు అందజేస్తామని, లేదంటే నోటీసులు వారి ఇండ్లకు అతికించి విచారణకు హాజరుకావాల్సిందిగా కోరుతామని ఏసీబీ ఉన్నతాధికారి చెప్పారు. నివేదికను, వీడియో ఫుటేజ్ సహా కోర్టుకు సమర్పిస్తామని పేర్కొన్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జూన్ 22, 2015

వినాశ కాలే...విపరీత బుద్ధిః..!!!



ఇవాళ చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీథుల్లోకి ప్రజలను రప్పించాలని చూస్తున్నాడు. ఆయన వందిమాగదులు మీడియా సమావేశాలు పెట్టి బస్తీమే సవాల్ అంటున్నారు. ఇష్టారాజ్యంగా పేలుతున్నారు. ఒకనాడు సీఎం కుర్చీ కోసం హైదరాబాద్‌లో నరమేధం సృష్టించిన చరిత్ర సీమాంధ్రులది. కాళ్లు కడిగిన మామను పొట్టనబెట్టుకుని కుర్చీలు ఎక్కిన చరిత్ర వారిది. మళ్లీ అదే జరగాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడే తెలంగాణ ప్రజలు విజ్ఞత చూపించాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి. ఏడాది కాలంగా నగరంలోని ఆంధ్రులతో కలిసిమెలిసి జీవించి సాధించిన ప్రశాంతతను భగ్నం కాకుండా చూసుకోవాలి. 

1975 నాటి మాట. ఒక ఎన్నికల కేసులో అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధాని ఇందిర ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆమె తప్పుకోవాలంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చాయి. తన పదవికి ఎసరు వచ్చే సరికి ఆమె ఎమర్జెన్సీ విధించారు. పత్రికలపై సెన్సార్‌షిప్ పెట్టారు. ప్రతిపక్షనేతలందరినీ అరెస్టు చేయించారు. ఆ సందర్భంగా సంపూర్ణ విప్లవ సారథి లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ అన్న మాట. "వినాశకాలే...విపరీత బుద్ధిః" ... అని! ఆ మాట అక్షర సత్యమైంది. 

పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులే పుడతాయి. చంద్రబాబు ఇందుకు మినహాయింపు కాదు. శ్రీ కృష్ణ జన్మస్థానానికి అడుగు దూరంలో ఉన్న చంద్రబాబులో తనను తాను రక్షించుకోవడం కోసం ఎంతకైనా వెళ్లాలన్న తెగింపు కనిపిస్తున్నది. చట్టాలన్నింటికీ తాను అతీతుడినని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్రాపోలీసులు టీ-న్యూస్‌కు అక్రమ పద్ధతుల్లో నోటీసులు ఇవ్వడాన్ని ఇదే కోణంలో చూడాలి. ఓం ప్రథమంగా ఓటుకు నోటు కేసులో తన ఆడియో బయటపడగానే విజయవాడ సభలో ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు తార్కాణం. తన ఫోన్ ఎట్లా ట్యాపింగ్ చేస్తారని పెడబొబ్బలు పెట్టారు. 

తాను ఐదుకోట్ల ఆంధ్రులకు ముఖ్యమంత్రినని హుంకరించారు. తన సమస్యను మొత్తం సీమాంధ్ర సమస్యగా మార్చాలని యత్నించారు. మీ ముఖ్యమంత్రిని అవమానించడం మీరు సహిస్తారా? అంటూ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి వీధుల్లోకి తేవాలని యత్నించారు. దబాయించి భయపెట్టి బయటపడాలని చూశారు. కానీ అది ఫలించలేదు. చంద్రబాబు పిలుపులకు ఎక్కడా ప్రతిస్పందన లేకపోగా పట్టపగలు బహిరంగంగా దొరికిపోయిన దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో టీడీపీ శ్రేణులకు ప్రజల ముందుకు వెళ్లాలంటేనే ముఖం చెల్లని స్థితి ఏర్పడింది. పైపెచ్చు అక్కడి ప్రతిపక్షాలు వీధుల్లోకి రావడంతో మింగలేని కక్కలేని స్థితి ఏర్పడింది. 

తన బాగోతం వెల్లడించే వీడియాలు ప్రసారం చేస్తున్నారన్న ఆగ్రహంతో సీమాంధ్రలో ఓ టీవీ చానెల్ ప్రసారాలు కూడా నిలిపివేశారు. మరో టీవీ ప్రసారాలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. తర్వాత ఢిల్లీనుంచి నరుక్కురావాలని హస్తిన యాత్ర జరిపారు. హోంమంత్రినుంచి ప్రధాని దాకా పొర్లు దండాలు పెట్టారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో కష్టాలు అన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని కోరారు. ఆయన ఎన్ని దండాలు పెట్టినా అప్పటికే అన్ని విషయాలు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న కేంద్రం ఈ బురద తాము పూసుకోలేమంటూ చేతులెత్తేయడంతో కథ అడ్డం తిరిగింది. తమ అవసరానికి చట్టాలను ముందు పెట్టడం, తమకు వ్యతిరేకమైతే వాటి ఉనికిని ప్రశ్నించడం ఫాసిస్టులకు ఆనవాయితీ. 

చంద్రబాబు రాజకీయ జీవితమంతా పాటించింది ఈ పద్ధతే. ఈ సారీ అదే ముందుకు తెచ్చారు. స్టింగ్ ఆపరేషన్లు చెల్లవనే సుప్రీంకోర్టు పాత తీర్పును బయటకు తీశారు. 150 మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అంటూ తమ మీడియాను ఉసిగొలిపి గగ్గోలు పెట్టారు. అసలు ఎన్నికల వేళ ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని ఈసీ మాత్రమే విచారణ జరపాలని వాదించారు. ఈసీని కాదని ఏసీబీ దర్యాప్తు ఎలా చేస్తుందని లా పాయింట్ లాగారు. తాను వేరే రాష్ర్టానికి ముఖ్యమంత్రిని అయినపుడు తనకు నోటీసు ఎలా ఇస్తారని దబాయించారు. తనకు డీజీపీ ఉన్నాడు.. ఏసీబీ ఉందంటూ తమ తప్పును నిబంధనల మాటున కప్పిపుచ్చాలని యథాశక్తీ యత్నించారు.

ఏసీబీ వెనక్కి తగ్గకపోవడంతో ఉమ్మడి రాజధానిలో వాటా ఉందనే వింత వాదన తెచ్చారు. ఏడాది క్రితం పక్కన పడేసిన సెక్షన్ 8 మళ్లీ ముందుకు తెచ్చారు. గవర్నర్‌ను కలిసి కేంద్రానికి సిఫారసు చేయాలని రాయబారాలు నడిపారు. అయితే గవర్నర్ నిబంధనల ప్రకారం తన పని తాను చేసుకుపోవడంతో తన మంత్రులను ఉసిగొలిపి నరసింహన్‌పై అడ్డగోలు విమర్శలతో యుద్ధానికి దిగారు. 


చివరకు కథ అడ్డం తిరిగినా.. కేంద్రం గవర్నర్‌పై వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమైనా పద్ధతి మార్చుకోవడం లేదు. అంటే ఒక్క చంద్రబాబును కాపాడడం కోసం హైదరాబాద్‌లో సెక్షన్-8 పెట్టాలి. ఒక్క బాబు కోసం స్టింగ్ ఆపరేషన్ల పేరిట రేవంత్ వీడియోను చెల్లదని ప్రకటించాలి. ఒక్క ఏపీ సీఎం కోసం ఫోన్ల ట్యాపింగ్ చట్ట విరుద్ధమంటూ బాబు ఆడియో పక్కన పడేయాలి...అంటే తన ఒక్కడి కోసం దేశంలో చట్టాలు మారిపోవాలి. నిబంధనలు మారిపోవాలి.. ఏం చేసైనా కేసులోంచి బయటపడాలి.. అదొక్కటే ఆయన లక్ష్యం. 

ఈ దిశగానే ఏపీ పోలీసులను హైదరాబాద్‌లో దింపారు. పోలీసు స్టేషన్లు కూడా తెరుస్తామన్నారు. ఇక్కడ ఆంధ్రులకు రక్షణ లేదన్నారు. ఇండ్లు కూల్చి వేస్తున్నారని కన్నీరు కార్చారు. గవర్నర్‌ను గంగిరెద్దు అన్నారు. రెండు కండ్లు.. ఇద్దరు కొడుకులు సిద్ధాంతాన్ని విసిరేసి సీమాంధ్ర రక్షకుడి రూపం దాల్చారు. కానీ విధి బలవత్తరమైంది. గవర్నర్‌పై విమర్శలు ఎదురుతన్నాయి. పోలీసుల అంశం వివాదాస్పదమైంది. దీనితో ఈసారి గవర్నర్‌ను వదిలి నేరుగా తెలంగాణపైనే యుద్ధం పెట్టుకున్నారు. తెలంగాణ టీవీకి నోటీసు పంపించారు. ఇంకా అనేక పత్రికలకు నోటీసులిస్తానని బెదిరింపులకు దిగారు. 

తెలంగాణ గడ్డమీద తెలంగాణ టీవీకి నోటీసు ఇవ్వడం ద్వారా.. అందుకు సీమాంధ్ర పోలీసులను పంపించడం ద్వారా చంద్రబాబు తెలంగాణ మీద యుద్ధ ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించాలనే ఎత్తుగడ ఇందులో కనిపిస్తున్నది. ప్రజలు వీధుల్లో ఘర్షణలకు దిగాలని పరిస్థితి అదుపు తప్పాలని బాబు లాబీ కోరుకుంటున్నది. తర్వాత కేంద్రం జోక్యం ద్వారా రాజీ కుదురుతుందనే ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తున్నది. ఇదే క్రమంలో ఆయన తప్పు మీద తప్పు చేస్తున్నారు. మత్తయ్యను విజయవాడ తరలించడం, కేసు నమోదు చేయడం, హైదరాబాద్‌లో పోలీసులను దింపడం, గవర్నర్‌ను దూషించి దొరికిపోవడం, తన పరిధిలో లేని రాష్ట్రంలో నోటీసులు ఇవ్వడం ఇలా వరుస తప్పిదాలు చేసుకుంటూ పోతున్నాడు. 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. అది అవసరం కూడా. చంద్రబాబు లాంటి వారిని శిక్షించడం చాలామంది భావిస్తున్నట్టు అంత తేలికేం కాదు. చంద్రబాబు అంటే వ్యక్తి కాదు.. ఒక లాబీ. ఒక బలమైన మూక. అనేక వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న మాఫియా. వారి కనుసన్నల్లో అధికార యంత్రాంగం, పెట్టుబడిదారీ వర్గం, మీడియా, ముసుగు ప్రజాసంఘాలు పని చేస్తున్నాయి. రైతుల పేరుతో మొదలు కొని సమాజంలోని సమస్త వర్గాల పేరిట వారి కనుసన్నల్లో పనిచేసే సంఘాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. చివరికి తెలంగాణ ముసుగులో కూడా వారి ప్రయోజనాలు రక్షించే సంఘాల దుకాణాలు అనేకం ఉన్నాయి. 

చూడడానికి అవి సీమాంధ్రులను విమర్శించినట్టే కనిపిస్తాయి. కానీ వారికి ఇబ్బందులు రానీయవు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను ప్రణాళికాబద్ధంగా దిగజార్చుతూ ఉంటాయి. ఇవాళ చూడండి. తెలంగాణ శాసనసభ్యులను దారుణంగా అవమానపరిచిన కొన్ని మీడియా సంస్థలను ఎంఎస్‌ఓలు బహిష్కరిస్తే మిన్నూ మన్ను ఏకం చేసి మహిళలను ముందు పెట్టి ఉద్యమాలు నడిపిన మీడియా సంస్థలు ఇవాళ సీమాంధ్రలో ఓ టీవీని నిషేధిస్తే కిమ్మనవు. రెండు పత్రికలను చంద్రబాబు ఏడాది కాలంగా బహిష్కరించినా పట్టనట్టు ఉంటాయి. అంతేకాదు..ఎక్కడో ఢిల్లీలో బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయల తీసుకుని పట్టుబడితే టేపులు అరిగేదాకా ప్రసారాలు చేస్తాయి. 

గుజరాత్‌లో నరమేధం మీద, యూపీఏ కుంభకోణాల మీద చర్చల మీద చర్చలు పెడతాయి. ఇవాళ రేవంత్ చంద్రబాబు వీడియాలు ఆడియోలను మాత్రం ప్రసారం చేయబోవు. వాటిని అసలు చర్చించవు. పైపెచ్చు తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్, హైదరాబాద్‌లో సెక్షన్-8 అంటూ రోజుకో కథనంతో తెలంగాణ ప్రజల్లో కలవరం పుట్టిస్తాయి. సీమాంధ్ర నేతలను కూర్చోబెట్టి తీర్పులు ఇప్పిస్తాయి. రాజకీయపార్టీల పద్ధతి అంతే.. చిన్నచిన్న సమస్యలపై తెలంగాణ ప్రజలను వీధుల్లోకి తెచ్చిన పార్టీలు ఇవాళ బాబు దొంగతనం మీద ఒక్క ధర్నా కూడా చేయవు. ఒక్క కార్యక్రమం చేపట్టవు. కేసీఆర్ పాలనపై మీటింగుల మీద మీటింగులు పెట్టి జడ్జిమెంట్లు ఇచ్చిన ప్రజాసంఘాలు బాబు దొంగతనం మీద పల్లెత్తి మాట్లాడవు. 

చాలామందికి కనీసం ఖండించే ధైర్యం కూడా ఉండదు. కొన్నేళ్ల క్రితం ఓ సినీ నటుడు తన ఇంట్లో నిర్మాతపై పట్టపగలు తన సొంత రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నానా గొడవా అయింది. నెత్తుటి మడుగులో ఉన్న సదరు నిర్మాతకు హాస్పిటల్‌లో చేర్పించి అపరేషన్ చేసి బుల్లెట్లు బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రివాల్వర్‌తో పాటు కాల్పులు జరిగిన ప్రదేశంలో నటుడి భార్య రక్తపు మరకలు తుడిచి పారవేయించిన గుడ్డలు కూడా స్వాధీనపరుచుకున్నారు. బుల్లెట్లు ఉన్నాయి. రివాల్వర్ ఉంది. నెత్తుట్లో తడిసిన గుడ్డలు ఉన్నాయి. కాల్పులు జరిగినట్టు ఇన్ని ఆధారాలున్నాయి. 

అయినా సరే చిత్రంగా ఆ నటుడు కనీసం జైలు ముఖం కూడా చూడకుండా బయటపడ్డాడు. నాలుగు రోజులు హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుని దర్జాగా ఇంటికి వెళ్లిపోయాడు. అందుకు కావల్సిన పత్రాలను బాబు లాబీ కనుసన్నల్లోని వ్యవస్థలు అందించాయి. కీలక పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు అందించాయి. అన్ని వ్యవస్థలు కట్టగట్టుకుని పోటీపడి సహకరించాయి. న్యాయస్థానంలో కూడా చాలా వేగంగా కేసును కొట్టేశారు. ఇపుడతడు ప్రజాప్రతినిధి. సరిగ్గా అదే లాబీ ఇపుడు చంద్రబాబును రక్షించేందుకు రంగంలోకి దిగింది. మత్తయ్య లాంటి పరారీలో ఉన్న నేరస్తుడికి గంటల వ్యవధిలో స్టే దొరకడం దానికి తార్కాణం.


కేసును సీబీఐకి మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సదరు లాబీలు సమాజంలోని అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాయి. అందుకే బాబును ఎక్కడన్నా ఓడించవచ్చు..కానీ ఫలానా చోట మాత్రం ఓడించడం అసాధ్యం అని ఉమ్మడి రాష్ట్రంలో ఒక నానుడి ఉండేది. అందుకే ఎన్ని జాతీయ చానెళ్లు ఆయన అవినీతిని గురించి కోడై కూసినా ఏం చేయలేకపోయాయి. 

ఇవాళ కూడా ఏసీబీ కోర్టు దాటే వరకే కేసీఆర్ ఏదైనా చేయగలిగేది... అని ఓ టీటీడీపీ నాయకుడు జనాంతికంగా చెబుతున్నాడంటే..ఇంత జరిగినా ఇన్ని ఆధారాలున్నా బాబు బ్యాచ్ ధీమాగా తిరగగలుగుతున్నదంటే సదరు లాబీ ఏయే వ్యవస్థల్లో ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బాబు లాబీ లక్ష్యం ఒకటే కేసును సీబీఐకి బదలాయించడం. తద్వారా కేంద్రంలో పలుకుబడి వినియోగించి బయటపడడం. బీజేపీలో ఓ వృద్ధనాయకుడి వద్ద విశేష పలుకుబడి ఉన్న ఈ వర్గం ఆయనను దువ్వుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అందుకే ఏసీబీ జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తున్నది. ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరిస్తున్నది. నిందితుల వివరణలు తీసుకుంటున్నది. వీడియో, ఆడియో టేపుల పరిశీలనలో వాస్తవాలు తారుమారు చేయాలని వేసిన బాబు ఎత్తుగడను చిత్తు చేస్తూ మూడు రాష్ర్టాల ఫోరెన్సిక్ విభాగాలకు వాటిని పంపించింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా బాబు కవ్వింపులకు ఏ మాత్రం చలించకుండా తన పని చేసుకుపోతున్నది. ఏపీ పోలీసులు తెలంగాణలో ప్రవేశించినా అరెస్టు చేయకుండా వదిలేసింది. కేంద్రానికి నివేదించడం ద్వారా బాబు సర్కారును ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. అందుకే ఇవాళ చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీథుల్లోకి ప్రజలను రప్పించాలని చూస్తున్నాడు. 

ఆయన వందిమాగదులు మీడియా సమావేశాలు పెట్టి బస్తీమే సవాల్ అంటున్నారు. ఇష్టారాజ్యంగా పేలుతున్నారు. ఒకనాడు సీఎం కుర్చీ కోసం హైదరాబాద్‌లో నరమేధం సృష్టించిన చరిత్ర సీమాంధ్రులది. కాళ్లు కడిగిన మామను పొట్టనబెట్టుకుని కుర్చీలు ఎక్కిన చరిత్ర వారిది. మళ్లీ అదే జరగాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఇక్కడే తెలంగాణ ప్రజలు విజ్ఞత చూపించాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి. ఏడాది కాలంగా నగరంలోని ఆంధ్రులతో కలిసిమెలిసి జీవించి సాధించిన ప్రశాంతతను భగ్నం కాకుండా చూసుకోవాలి. అడ్డంగా దొరికిపోయిన దొంగలు జైలు ఊచలు లెక్కించేదాకా ఆవేశాన్ని అణచుకొని సంయమనం పాటించడం ఇపుడు మనందరి కర్తవ్యం. 

ధర్మం జయించుగాక! అధర్మం నశించుగాక!! 


- సవాల్‌రెడ్డి



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




ఆదివారం, జూన్ 21, 2015

బాస్.. చంద్రబాబే...!!!

-నన్ను మొదట కలిసింది మత్తయ్య..
- ఆయనను పంపించింది రేవంత్‌రెడ్డి
- రేవంత్‌ను పంపింది చంద్రబాబు
- టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే ఐదు కోట్లు ఇస్తామన్నారు
- బాబు మాట్లాడి డీల్ కన్ఫర్మ్ చేస్తారని రేవంత్ చెప్పాడు
- మావాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ.. ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనను కొనుగోలు చేసేందుకు జరిగిన ప్రయత్నంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన సూత్రధారి అని, డీల్‌ను ఆయనే కన్ఫర్మ్ చేశారని, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ కుండబద్దలు కొట్టారు. ఈ డీల్‌లో బాస్ చంద్రబాబేనని ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. రేవంత్‌రెడ్డి పంపితే వచ్చానని మత్తయ్య జెరూసలెం అనే వ్యక్తి.. చంద్రబాబు పంపితే వచ్చినట్లు సెబాస్టియన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటే రెండు కోట్లు ఇస్తామని చెప్పారని, అదే టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని ఏసీబీకి వివరించారు. ఈ విషయాలను తాను వెంటనే ఏసీబీ డీఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, వారు తన ఇంట్లో ఆడియో, వీడియో రికార్డర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. 


stephen

తనతో చంద్రబాబు కూడా మాట్లాడారని, డీల్ గురించి తమ పార్టీ వాళ్లు చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారని, తాను ప్రతిపాదించిన మొత్తానికి అంగీకారం తెలిపారని స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఇచ్చా రు. ఈ మొత్తం వ్యవహారాలు ఆడియో, వీడియో రికార్డర్లలో రికార్డయ్యాయని చెప్పారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ ఈ మేరకు బుధవారం (17-6-2015) ఇచ్చిన వాంగ్మూలం కాపీని నమస్తే తెలంగాణ సంపాదించింది. తాను స్వచ్ఛందంగా, పూర్తి సమ్మతితో ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నానని స్టీఫెన్‌సన్ పేర్కొన్నారు. తనపై ఎవరి ఒత్తిడులూ లేవని స్పష్టంచేశారు. స్టేట్‌మెంట్‌లో స్టీఫెన్‌సన్ ఏమన్నారంటే..


నేను ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా 2014, నవంబర్ 4 నుంచి ఉన్నాను. 28-5-2015న ఉదయం 9గంటల సమయంలో మత్తయ్య జెరూసలేం అనే వ్యక్తి నా ఫోన్‌ (9849014838) కు కాల్ చేశారు. బషీర్‌బాగ్‌లో 30-5-2015న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్రిస్టియన్ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. నేను నా వ్యక్తిగత కార్యక్రమాల్లో బిజీగాఉన్నానని, ఉదయం 11 గంటల తర్వాత ఏ విషయం చెప్తానని ఆయనకు తెలిపాను. 28-5-2015న ఉదయం 10గంటల సమయంలో మత్తయ్య జెరూసలెం సికింద్రాబాద్ బోయగూడలోని నా ఇంటికి వచ్చాడు. మిమ్మల్ని కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనను పంపించాడని తెలిపాడు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటే రూ.2కోట్లు ఇస్తానని మత్తయ్య జెరూసలెం ఆఫర్ చేశాడు. 


దేశం వదిలి వెళ్లేందుకు నాకు టికెట్ కూడా ఏర్పాటుచేస్తానని చెప్పాడు. నేను మౌనంగా ఉన్నాను. ఆ తర్వాత ఆయన నా ఇంటినుంచి వెళ్లిపోయాడు. గంటన్నర తర్వాత ఆంటోనీ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని, అందుకే ఆయనను వెంట తీసుకొచ్చానని చెప్పాడు. ఆంటోనీ ఆయన స్నేహితుడిని హారీ సెబాస్టియన్‌గా నాకు పరిచయంచేశాడు. సెబాస్టియన్‌ను మా ఇంట్లో వదిలి ఆంటోనీ వెళ్లిపోయాడు. సెబాస్టియన్ నాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, తాను ఎర్రగడ్డలోని ఒక చర్చిలో మత ప్రబోధకుడినని తెలిపాడు. ఎమ్మెల్సీఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని, లేదా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని కోరేందుకు తనను చంద్రబాబు పంపించారని చెప్పాడు. ఓటింగ్‌కు దూరంగాఉంటే రూ.2కోట్లతోపాటు తీర్థయాత్ర నిమిత్తం జెరూసలెం వెళ్లేందుకు ఫ్యామిలీ టికెట్ ఇస్తామని చెప్పాడు.


టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేసినట్టయితే రూ.5 కోట్లు ఇస్తానని చెప్పాడు. దాంతో ఏ విషయం తర్వాత చెప్తానని ఆయనకు తెలిపాను. ఎన్నికల్లో ముడుపులు స్వీకరించకూడదని అనుకున్న నేను, డబ్బులు తీసుకొని ఓటు వేయడం చట్ట వ్యతిరేకం, అనైతికం అని భావించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ, ఏసీబీకి 28.5.2015ననే లేఖ రాశాను. 28.5.2015 సాయంత్రం 3గంటల సమయంలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌వద్ద ఉన్న ఏసీబీ కార్యాలయంలోని డీఎస్పీకి లేఖ అందజేశాను. తన ఫిర్యాదుపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవాలని డీఎస్పీగా ఉన్న అశోక్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశాను. హైదరాబాద్‌లోని కృష్ణా ఒబెరాయ్ హోటల్లో కలుసుకునేందుకు అనువైన సమయం చెప్పాలంటూ అదే రోజు సాయంత్రం 6గంటల సమయంలో మత్తయ్య జెరూసలెం నా మొబైల్(9849014838)కు ఒక ఎస్‌ఎంఎస్ పంపించాడు.


29.5.2015న నాకు అదే ఫోన్ నంబర్‌కు మరో ఎస్‌ఎంఎస్ పంపించాడు. తాము చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని కోరాడు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ఏర్పాటుచేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానిస్తూ 30.5.2015న నాకు మరో మెసేజ్ పంపించాడు. 


29.5.2015న నా మొబైల్ (9949054323)కు వాట్సాప్ ద్వారా Praise Jesus, Brother Elvis, Bishop Harry Sebastian, Christian Minority Cell, Telugu Desam Party.. అంటూ వచ్చిన మెసేజ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం విషయమై ఇంతకు ముందుచేసిన విజ్ఞప్తిపై నా నిర్ణయం గురించి అడిగారు. నేను ఎస్‌ఎంఎస్ ద్వారా ఆయనకు సమాధానం ఇచ్చాను. ఆ రోజు సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు టీఆర్‌ఎస్ భవన్‌లో తనకు పార్టీ సమావేశం ఉందని, ఆయనతో టచ్‌లో ఉంటానని, నా ఇంటి వద్ద కలుసుకుంటానని ఎస్‌ఎంఎస్‌లో తెలిపాను. అదే రోజు రాత్రి 9గంటల సమయంలో సెబాస్టియన్‌కు ఫోన్‌చేశాను. బాధ్యులైన పార్టీ నేతలతోనే మాట్లాడుతానని చెప్పాను. దానితో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ డీల్ చూస్తారని చెప్పాడు. ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు అదే రోజు సమాచారం ఇస్తూ, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి తదుపరి రోజు ఉదయం రానున్నారని తెలిపాను. 30.5.2015 ఉదయం 10గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేసి, తాను, రేవంత్‌రెడ్డి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు డీఎస్పీ తన సిబ్బందితో ఉదయం మా ఇంటికి వచ్చారు. వీడియో, ఆడియో రికార్డింగ్ సదుపాయం ఉన్న ఒక ఐఫోన్‌ను తీసుకువచ్చి, మా ఇంట్లో సిటింగ్ హాల్‌లో ఉన్న టీవీ పక్కన అమర్చారు. 


అదే రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి వచ్చారు. సిటింగ్ హాల్లో ఉన్న సోఫాపై పక్కపక్కన కూర్చున్నారు. వారికి ఎదురుగా ఉన్న మరొక సోఫాలో నేను కూర్చున్నాను. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరేందుకు చంద్రబాబు తనను పంపించారని రేవంత్‌రెడ్డి చెప్పాడు. రూ.2.5 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఒకవేళ ఈ డీల్ బయటపడితే మిమ్మల్ని ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా చంద్రబాబు నామినేట్ చేస్తారని, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా క్రిస్టియన్ మైనారిటీ పోస్టు ఇప్పిస్తారని రేవంత్ చెప్పాడు. నన్ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని, ఆ సమావేశం అత్యంత రహస్యంగా ఉంటుందని కూడా రేవంత్‌రెడ్డి చెప్పాడు. నేను చంద్రబాబునాయుడును కలుసుకునేందుకు నిరాకరించాను. రేవంత్‌రెడ్డితోనే మాట్లాడుతానన్నాను. కూల్‌డ్రింక్‌లేదా టీ తాగుతారా అని అడుగగా, మంచినీళ్లు తీసుకుంటానని రేవంత్‌రెడ్డి చెప్పాడు. ఆయనకు నా కుమార్తె జెస్సికా స్టీఫెన్‌సన్ మంచినీళ్లు ఇచ్చింది.


రూ.2.5కోట్లపై సంతృప్తి చెందకపోతే ఎంత కోరుకుంటున్నారో చెప్పాలని, దానిని తాను చంద్రబాబుకి తెలియజేస్తానని, ఆయనే వ్యక్తిగతంగా డబ్బు విషయం నిర్ణయిస్తారని రేవంత్‌రెడ్డి నాతో చెప్పాడు. నిర్దిష్టంగా ఎమౌంట్ ఎంతో చెప్పాలని నన్ను మళ్లీ అడిగాడు. ఆయన విజ్ఞప్తిపై నేను ఓ 5కోట్లు అని చెప్పాను. ఆ తర్వాత వారు వెళ్లిపోయేందుకు లేచి, ఈ రోజే చంద్రబాబు మీతో మాట్లాడుతారని, డీల్ కన్‌ఫర్మ్ చేస్తారని చెప్పారు.


అదే రోజు సాయంత్రం సెబాస్టియన్ నాతో 3,4సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. చంద్రబాబు సమావేశాల్లో బిజీగా ఉన్నారని,తీరిక దొరకగానే కాల్ చేస్తారని చెప్పాడు. సాయంత్రం 4గంటల సమయంలో సెబాస్టియన్ నా ఫోన్(9949054323)కి కాల్ చేసి చంద్రబాబునాయుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి ఫోన్‌ను చంద్రబాబుకు ఇచ్చారు. మా వాళ్లు బ్రీఫ్డ్ మీ ఎబౌట్ ది డీల్.. అంటూ నాతో మాట్లాడటం మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆందోళన చెందవద్దని, తాను మీతో ఉంటానని చెప్పారు. నేను వాళ్ల మనుషులకు ఏదైతే ప్రతిపాదించానో దానిని ఆమోదిస్తున్నట్టు చెప్పారు. ఆందోళన చెందవద్దని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని, ఇది తన కమిట్‌మెంట్ అని, మనం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఆ విధంగా నాకు రూ.5కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. తనను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. 30.5.2015 ఉదయం 9గంటల సమయంలోనే తన కొత్త మొబైల్ నంబర్‌ను నాకు తెలియజేస్తూ సెబాస్టియన్ మెసేజ్ పంపించాడు. 


31.5.2015న ఉదయం 8.50 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు కాల్ చేశాడు. రూ.50లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆయన, రేవంత్‌రెడ్డి మా ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. మధ్యాహ్నం 3.20కి సెబాస్టియన్ మళ్లా ఫోన్ చేశాడు. సమావేశం ప్రదేశం మార్చాలని కోరాడు. దానితో నేను సికింద్రాబాద్ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న వీధిలో నివసించే నా స్నేహితుడు మాల్కం టేలర్ ఇంటికి రావాల్సిందిగా సూచించాను. టేలర్ నాకు 25ఏళ్లుగా స్నేహితుడు. వెంటనే నేను టేలర్‌కు ఫోన్‌చేసి కొందరు ముఖ్యమైన వ్యక్తులను మీ ఇంట్లో కలుసుకుంటానని తెలిపాను. అప్పుడు ఆయన తన తల్లి గారి ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరని, అక్కడ కలుసుకోవచ్చని సూచించాడు. 


ఈ విషయాలను నేను వెంటనే ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు తెలియజేసి మాల్కం టేలర్ తల్లిగారింటికి బయల్దేరాను. నేనూ, నా స్నేహితుడు మాల్కం టేలర్ హాల్ రూమ్‌లో కూర్చున్నాం. ఏసీబీ అధికారులు అక్కడికి ఆడియో, వీడియో రికార్డింగ్ సాధనాలతో వచ్చి వాటిని అక్కడ అమర్చారు. నా చేతిలో ఉంచుకునేందుకు ఒక ఐ ఫోన్ వీడియో రికార్డర్‌ను ఇచ్చారు. 4గంటల సమయంలో సెబాస్టియన్‌నుంచి నాకు ఫోన్ వచ్చింది. తాను ఉప్పల్ నుంచి వస్తున్నానని, మీటింగ్ ప్లేస్‌కు చేరుకోవడానికి మార్గంచెప్పాలని అడిగారు. దానితో నేను అడ్రస్ చెప్పేందుకు ఫోన్‌ను నా స్నేహితుడు మాల్కం టేలర్‌కు ఇచ్చాను.


4.20సమయంలో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి వచ్చారు. హాల్ రూమ్‌లో కూర్చున్నారు. కొంత సమయం తర్వాత తెల్లషర్టు, జీన్స్ వేసుకున్న ఒక బలిష్టమైన వ్యక్తి నల్లబ్యాగ్‌తో వచ్చాడు. ఆ బ్యాగ్‌ను రేవంత్‌రెడ్డి పక్కన పెట్టాడు. 


బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని డబ్బును టీపాయి మీద పెట్టాలని సదరు బలిష్టమైన వ్యక్తిని రేవంత్ కోరాడు. దానితో అతడు రూ.500 నోట్లతో ఒక్కొక్కటి రూ.2.50 లక్షలున్న బండిల్స్‌ను బ్యాగ్ నుంచి బయటకుతీశాడు. తర్వాత రేవంత్‌రెడ్డి, డబ్బు బ్యాగ్ తెచ్చిన వ్యక్తి లేచి, పనులున్నాయని చెప్పి వెళ్లిపోయారు. సెబాస్టియన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు. ఈలోగా ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డి, బ్యాగ్ తెచ్చిన వ్యక్తిని ఫ్లాట్‌లోకి తీసుకొచ్చారు. తర్వాత నేను నా స్నేహితుడి తల్లిగారి ప్లాట్‌నుంచి వెళ్లిపోయాను. కానీ సమీపంలోనే ఉన్నాను. మూడు గంటల తర్వాత ఏసీబీ డీఎస్పీ నాకు ఫోన్ చేసి పిలిపించారు. రేవంత్‌ఎదుట కూర్చోబెట్టి డబ్బు గురించి, రేవంత్, సెబాస్టియన్, డబ్బు తెచ్చిన వ్యక్తి అక్కడ ఉండటం గురించి నన్ను అక్కడే విచారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు నాకు లంచంగా ఇచ్చేందుకు ఆ రూ.50 లక్షలను తెచ్చారని నేను ఏసీబీకి డీఎస్పీకి వివరించాను. డీఎస్పీకి ఇచ్చిన పై స్టేట్‌మెంట్‌ను డీఎస్పీ నమోదు చేసుకున్నారు.


తర్వాత ఏసీబీ అధికారులు నన్ను, నా స్నేహితుడు మాల్కం టేలర్‌తోపాటు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, డబ్బు తెచ్చిన వ్యక్తిని బంజారాహిల్స్‌లోని వారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఏసీబీ అధికారులు నన్ను కూలంకషంగా విచారించారు. నా స్టేట్‌మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు ఏసీబీ అధికారులు అమర్చిన ఆడియో, వీడియో రికార్డర్లలో రికార్డయ్యాయి...అని స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో తెలిపారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, జూన్ 20, 2015

బరితెగించిన ఆంధ్ర బాబు...!!!

-అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి ఆంధ్రా పోలీసుల చొరబాటు
-చంద్రబాబు టేపులు ప్రసారం చేసినందుకు నోటీసులు
-ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనన్న తెలంగాణ జర్నలిస్టులు
-తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పోలీసుల జోక్యం ఏమిటని నిలదీత


ramana

చంద్రబాబు బరితెగించాడు! తెలంగాణపై అడ్డదారిలో యుద్ధం ప్రకటించాడు! ఇన్నాళ్లూ ముసుగు చాటున దాచిన ఆంధ్రా ఖల్‌నాయక్‌ను బయటకు తీశాడు! ఓటుకు నోటుకేసునుంచి బయటపడేందుకు వేసిన ఒక్కొక్క ఎత్తుగడ విఫలం కావడంతో ఇపుడు రెండు రాష్ర్టాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించే ఎత్తుగడ వేశాడు. ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని తేలిపోవడం, ఆడియో టేపులు అతికించినవన్న వాదనలు వీగిపోవడం, సెక్షన్ 8 సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడం, గవర్నర్‌పై చేసిన విమర్శలు ఉరితాడై మెడకు చుట్టుకోవడంతో తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చుకు కొత్త ఎత్తుగడ వేశాడు. తెలంగాణ ప్రజల గొంతుకగా పని చేస్తున్న టీ న్యూస్‌కు నోటీసులు పంపడం ద్వారా దానికి బీజం వేశాడు. తమ అధికార పరిధిలో కూడా లేని హైదరాబాద్‌లో ఆంధ్రా పోలీసులను పంపడం ద్వారా తాను అన్నింటికీ తెగించానని ప్రకటించుకున్నాడు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో అక్రమ అరెస్టు సందర్భంలో జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన .వినాశకాలే విపరీత బుద్ధి అనే మాటను ఇపుడు చంద్రబాబు చర్య గుర్తు చేస్తున్నది. 

babu

ఆంధ్రబాబు మారడు. మారడు గాక మారడు. ఓటుకు నోటు కేసులో ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల మధ్య యుద్ధం సృష్టించే ఎత్తుగడ వేశాడు. నిన్నటి దాకా వివిధ సాకులు అడ్డం పెట్టి తప్పించుకోవాలనుకున్న ఎత్తుగడలు అన్నీ విఫలం కాగా చివరగా కేంద్రం హెచ్చరికతో గవర్నర్‌పై దాడులు ఆపేసి నేరుగా తెలంగాణపైనే దాడికి దిగాడు. తెలంగాణ గొంతుకగా పేరు పొందిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేశాడు. ఒకనాడు సీఎం పదవికోసం సీమాంధ్రనాయకులు హైదరాబాద్ నగరంలో మారణ హోమం సృష్టించారు. ఇపుడు చంద్రబాబు తనను రక్షించుకోవడానికి మరో దారుణానికి తెగించాడు. ఆరిపోయే దీపానికి మంట ఎక్కువ అన్న సామెతను సార్థకం చేసుకుంటున్నాడు.
అర్ధరాత్రి నోటీసులు..:
ఓటుకు నోటు కేసులో కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలంటూ ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఎక్కడా నిబంధనలు పాటించకపోవడం వారి అహంకారపూరిత వైఖరిని నిరూపిస్తున్నది. ఏ రాష్ట్ర పోలీసులైనా మరో రాష్ట్రంలో ఎవరికైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే..తొలుత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, వారి సహకారంతోనే ముందుకుపోవాల్సి ఉంటుంది. 


కానీ, ఏపీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఆగమేఘాల మీద అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి తోసుకువచ్చి.. నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో కనీసం ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..? దీనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..? అన్న వివరాలేవీ లేవు. కేవలం చంద్రబాబు, స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన సంభాషణ వల్ల ఏపీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని, అందువల్లనే కేబుల్ యాక్ట్ చట్టం కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం.


ఇది రాజ్యాంగ విరుద్ధమని, పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరించడమేనని తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో సీఆర్‌పీసీ నంబర్ కూడా పేర్కొనలేదు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్కడ నోటీసులు జారీ చేస్తారో..? ఈ లోగానే ఏదో ఒకటి చేయాలనే ఆదుర్దాతోనే నోటీసులు ఇచ్చారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని.. అతడి అక్రమాలను బయటపెట్టడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటామని టీ న్యూస్ స్పష్టం చేస్తున్నది. పోలీసుల వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. చంద్రబాబు టేపులు, వీడియో ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకోవడానికి టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని.. తెలంగాణ రాష్ట్ర ఏసీబీని కోరినా ఇస్తుందని జర్నలిస్టులు, న్యాయవాదులు పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఏపీ దౌర్జన్యం:
తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రా సర్కారు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ గ్యాంగ్ చివరకు నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిన టీ న్యూస్‌పై దాడికి సిద్ధమయ్యారు. చంద్రబాబు తన రాష్ర్టానికి చెందిన పోలీస్ బలగాలను పంపించి టీ న్యూస్‌కు నోటీస్‌లు ఇచ్చారు. అర్థరాత్రి సమయంలో టీ న్యూస్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి అక్కడ రాత్రి విధుల్లో ఉన్న జర్నలిస్టులకు నోటీస్‌లు ఇచ్చే ప్రయత్నం చేశారు.


విధులో ఉన్న జర్నలిస్టులు తాము నోటీస్‌లు తీసుకోమని సీఈవో నారాయణ రెడ్డికి సమాచారమందించారు. దీంతో టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి వచ్చి నోటీస్‌లు స్వీకరించారు. అర్ధరాత్రి పూట నోటీస్‌లు ఇవ్వడంపై టీ న్యూస్ సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తామని టీ న్యూస్ ప్రకటించింది. అలాగే ప్రెస్ కౌన్సిల్‌కు, సమాచార, ప్రసారభారతిశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది. 


నోటీస్ సారాంశం: జూన్ 7వ తేదీన టీ న్యూస్‌లో 8.30 గంటలకు చంద్రబాబు నాయుడు తెలంగాణ నామినేటెడ్ సభ్యులు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియో రికార్డులను పదే పదే ప్రసారం చేయడం వల్ల రెండు తెలుగు రాష్ర్టాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో సెక్షన్19 ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ యాక్ట్1995 ప్రకారం మీకు నోటీస్‌లు జారీ చేస్తున్నాం. మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నోటీస్‌లను విశాఖపట్టణం ఏసీపీ రమణ టీ న్యూస్‌కు అందజేశారు. 


మీడియా జోలికి వస్తే ఖబడ్దార్: అల్లం నారాయణ


తెలంగాణ భూభాగంలోకి పోలీసులు చొచ్చుకు రావడం చట్ట విరుద్ధమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అర్ధరాత్రి నోటీసులివ్వడం దురాక్రమణమే అవుతుందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే నగ్నంగా దొరికిపోయాక కూడా తెలంగాణ మీడియాపై పరాయి రాష్ట్రం పోలీసులు నోటీసులివ్వడం ఆక్షేపనీయమని విమర్శించారు. దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ తెలంగాణ మీడియాపై దాడి చేస్తే సహించేది లేదని.. మీడియా జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబు అని హెచ్చరించారు. 


వచ్చిన తెలంగాణను అస్థిరపర్చడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికే బాబు నోటీసుల డ్రామా ఆడుతున్నాడని.. హైదరాబాద్, తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామని అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలను తిప్పికొడతామని.. ఇక్కడి జర్నలిస్టులు చైతన్యవంతులని అన్నారు.యావత్ తెలంగాణ మీడియా టీ న్యూస్ వెన్నంటి ఉంటుందని.. ఆంధ్రా బాబు కుట్రను బయటపెట్టిన టీ న్యూస్‌కు కృతజ్ఞతలని తెలిపారు. 


చంద్రబాబు అహంకారానికి పరాకాష్ఠ: కట్టా శేఖర్‌రెడ్డి


చంద్రబాబు దురంహంకారానికి ఇది పరాకాష్ఠ అని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మన రాష్ట్రంలో ప్రవేశించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంకా హైదరాబాద్‌పై తమకేదో పెత్తనం ఉందని బాబు విర్రవీగుతుండటం సరికాదన్నారు. బాబు రెండు రాష్ర్టాల మధ్య చిచ్చు పెట్టుందుకు కుట్ర పన్నుతున్నాడని.. చివరికి గెట్ లాస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ చంద్రబాబు అని అనిపించుకుంటున్నాడని అన్నారు.


నాడు రాజాజీ అన్న మాట సీఎం కేసీఆర్ అంటే బాబు హైదరాబాద్‌లో ఉండలేడని.. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హైదరాబాద్‌లో వారి పోలీసులకు ఎలాంటి పాత్ర లేదు.. విభజన చట్టం ప్రకారం, ఇక్కడికి వస్తే స్థానిక పోలీసుల అనుమతి తీసుకురావాలని స్పష్టం చేశారు. టీ న్యూస్‌కు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఆంధ్రా పోలీసులను శిక్షించే వరకు వెనుకాడేది లేదని.. బాబు ఇక్కడ నుంచి బిచానా ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాన్నారు. గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, హైదరాబాద్‌ను మరో రావణకాష్టంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నాడని ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని చెప్పారు.


అక్రమాలను బయటపెడితే నోటీసులా?: కే కృష్ణమూర్తి


ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర ప్రభుత్వ అక్రమాలను బట్టబయలు చేసినందుకు టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని నమస్తే తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ కే కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జర్నలిస్టులందరూ ఖండించి తీరుతారని అన్నారు. తెలంగాణ విషయంలో మొత్తం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులందరూ ఒకేతాటిపై ఉంటారని అన్నారు. ఏపీ పోలీసుల దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండించారు. ఇదే తీరు కొనసాగితే టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


ఎక్కడా నిబంధనలు పాటించలేదు: కిరణ్


ఏపీ సీఐడీ అధికారులుగా పేర్కొంటూ టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు ఎక్కడా నిబంధనలు పాటించలేదని న్యాయవాది కిరణ్ అన్నారు. ఏ రాష్ట్ర పోలీసులైనా మరో రాష్ట్రంలో నోటీసులు ఇవ్వాల్సి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసుల్లో కనీసం సీఆర్‌పీసీ నంబర్ కూడా పేర్కొనలేదు. పైగా ఫిర్యాదు ఎవరు చేశారు..? ఏ పోలీస్‌స్టేషన్‌లో చేశారు..? అన్న ప్రాథమిక వివరాలు కూడా నోటీసులో లేవు. ఇది ఏపీ పోలీసుల అతి చర్య. దీనిపై టీ న్యూస్ న్యాయపోరాటం చేయవచ్చు.


స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి: డీసీపీ వెంకటేశ్వరరావు


ఏదైనా నోటీసులు జారీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఏసీసీ అర్ధరాత్రి సమయంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకోకుండా నోటీసులు జారీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. 


ఆంధ్రా పోలీసులు సిగ్గు సిగ్గు: తెలంగాణ జర్నలిస్టులు


ఆంధ్రా పోలీసులు టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మీడియా భగ్గుమంది. చంద్రబాబు తప్పుమీద తప్పు చేస్తున్నాడని జర్నలిస్టులు మండిపడ్డారు. వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయడమా.. సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!