గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 26, 2014

వీరి హయాంలోనూ విశృంఖలంగా చెలరేగిన కబ్జాలు!

-పెద్దాయన, తమ్మయ్య, యువరాజా, బామ్మర్ది..
-ఆ గణం.. ఈ గణం.. అందరూ దోచుకు.. పంచుకుతిన్నారు
-నియమాలు బేఖాతర్.. నేనున్నానంటూ హుకుంలు
-గురుకుల్ భూముల గ్రహణంలో అందరూ అందరే
గురుకుల్ ట్రస్ట్ భూములు మింగేయడంలో పార్టీలు వేరైనా సీమాంధ్ర పాలకులు తమ నైజం ఒకటేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌కు చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ వర్తనను ఆచరించి చూపారు. 627 ఎకరాల ట్రస్ట్ భూమిలో 300 ఎకరాలు చంద్రబాబు హయాంలో సంతర్పణ కాగా, అనంతరం 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరింతగా చెలరేగిపోయారు. మిగిలిందంతా మింగేశారు. తనతోపాటు తనవారికి పెద్ద మనసుతో పంచి ఇచ్చారు. పెద్దాయన, తమ్ముడు, యువరాజా, బామ్మర్ది, కడప గూండాలు, అనుచర గణం.. మనకెదురేమిటంటూ అందనివి కూడా దోచుకున్నారు. పంచుకు తిన్నారు.

YSR
అందరూ అందరేనని స్పష్టం చేశారు. చట్టాలను, నియమాలను కాలదన్నారు. నేనున్నాను కదా అని రాజఠీవితో సెలవిచ్చి, ఆజ్ఞాపించి రాజావారు అధికారులతో కానిపనులు చేయించారు. బాధ్యత మరిచి, విజ్ఞత లేకుండా ప్రవర్తించారు. ప్రభుత్వపరంగా అక్రమాలకు పాల్పడి కోర్టుల్లోనూ వక్రీకరణలకు పాల్పడ్డారు. అప్పుడు మూటగట్టుకున్న పాపం ఇప్పుడు వెన్నాడనుంది. సేవాసంస్థ భూములు కండ్ల ముందరే దోపిడీదారుల వశమవుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయినవారు.. ఇప్పుడు ఆ దోపిడికోటలు కూలుతుంటే సంబురపడుతున్నారు. తెలంగాణలో సీమాంధ్ర పాతకాలకు పాతర వేసే రోజులను చూసి మురిసిపోతున్నారు.

అధికారారంభంలోనే..

అక్కడివన్నీ అక్రమ నిర్మాణాలే.. దాదాపు 300 ఎకరాల భూమిలో వేల కోట్ల రూపాయల నల్ల డబ్బుతో వెలిసిన భవంతులు.. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని, అధికారులను కీలు బొమ్మలుగా చేసుకున్న బడా బాబులు రాజధాని నడిబొడ్డున హైటెక్‌సిటీ సమీపంలో కళ్లు జిగేల్ మనేలా విలాస భవనాలు నిర్మించుకున్నారు. ఆక్రమించిన ప్రాంతమంతా భారీ సెంటర్లు, అపార్ట్‌మెంట్లు, భవనాలతో హైటెక్ కల్చర్‌ను సంతరించుకుంది. ఇదంతా ఆ పెద్దాయన.. వైఎస్ మాహాత్మ్యమే. చంద్రబాబు పాలన పతనానంతరం వైఎస్ అధికారంలోకి రాగానే అప్పటిదాకా అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న శక్తులు చెలరేగిపోయాయి. భూముల కబ్జాలను తమ సహజ హక్కుగా భావించాయి. అప్పటికే సంతర్పణ అవుతున్న గురుకుల్ ట్రస్ట్‌భూములపై వైఎస్ అనుచరగణాలు అమాంతం రాబందుల్లా వాలాయి. కడప గూండాలు గడపగడపకు దిగారు. రాయలసీమ ముఠాలు భారీ ఎత్తున భవంతులు నిర్మించుకున్నాయి. దీనికి ఏకంగా వైఎస్‌ఆర్ హిల్స్ పేరు పెట్టారు. కబ్జా భూములకు వైఎస్ పేరు చెపితే అంతా మాఫీ అన్నట్లుగా వ్యవహరించారు. వైఎస్ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు, నేతలు భూములు మింగేశారు. వైఎస్ తమ్ముడు వివేకా దాదాపు ఎకరం స్థలంలో ఇంటిని నిర్మించుకున్నారు. అక్కినేని నాగార్జున ఫాం హౌస్ పేరుతో ఆరు ఎకరాలు కొనుగోలు చేసి, దీనికి మరో మూడు ఎకరాలు కబ్జా చేసి 9 ఎకరాల భూమిలో ఎన్ సెంటర్ నెలకొల్పారు.

వైఎస్ కొడుకు జగన్మోహన్‌రెడ్డి చేతిలో దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే గురుకుల్‌ట్రస్ట్ భూములు బందీ అయ్యాయి. ఆయన వివిధ బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వైఎస్‌ఆర్ హిల్స్ కాలనీకి వెళ్లే 100 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా దాదాపు జగన్‌కు చెందిన ఆస్తులే ఉన్నాయి. ఇక్కడ అనేక భవనాలకు ఎలాంటి పక్కా డాక్యుమెంట్లు లేవు. బినామీలైన నాగం తిరుపతిరెడ్డి కిశోర్‌రెడ్డి, ఎం రమణారెడ్డి తదితరుల పేర్ల మీద ఈ ఆస్తులున్నాయి. రమణారెడ్డి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈయన దాదాపు మూడువేల గజాల భూమిని ఆక్రమించారు. ఎలాంటి కాగితాలు లేకుండా ఆర్‌ఆర్ రెసిడెన్సీ పేరుతో అక్రమంగా ఫ్లాట్లు నిర్మించి విక్రయించారని, భూమి యజమానులు వస్తే బెదిరించి ఎంతో కొంత చెల్లించి వెళ్ళగొట్టారని సమాచారం. ఏపీపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన రిపుంజన్‌రెడ్డి, మరికొందరు జగన్‌కు బినామీలు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు చెందిన అనేక మంది ఈ భూముల కబ్జాలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులే. ఒక సమయంలో వేయి మందికిపైగా సాయుధగూండాలు పహారా కాసేవారు.

ఈ గణం.. ఆ గణం..

ఆక్రమిత భూముల్లో వైఎస్ చిన్న తమ్ముడు సుధీకర్‌రెడ్డి (సినీనటుడు మోహన్‌బాబు వియ్యంకుడు), వైఎస్ బామ్మర్ది రవీంద్రనాథరెడ్డికి 11/30 సర్వే నంబర్‌లో చెరో రెండువేల గజాల భూమి ఉంది. వైఎస్ తోడల్లుడు మల్లికార్జున్‌రెడ్డికి సైతం ఇక్కడ అనేక భూములున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి తన అన్న వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రే ఎకరం భూమిని కబ్జా చేసి అధికార దర్పంతో ఏకంగా కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి, భారీ ఇల్లు కట్టుకున్నారు. హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మెయిన్‌రోడ్డు మీద దాదాపు ఎకరం స్థలాన్ని ఆక్రమించాడు. వివేకా ఎకరం భూమిని కబ్జా చేస్తే ఆయన అనుచరులు ఏకంగా ఐదెకరాల ట్రస్ట్ భూమిని మాయం చేశారు. సర్కారులో తమ పలుకుబడిని ఉపయోగించి మాయచేసి అధికారికంగా పర్మిషన్లు తీసుకొని భవనాలు నిర్మించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పుల్లారెడ్డికి సర్వే నంబర్ 11/33లో నాలుగువేల గజాల భూమి ఉంది. దీనికి ఎలాంటి డాక్యుమెంట్ లేదు.


ట్రస్ట్ భూములను ప్రజాహితం కోసమే వినియోగించాలి

బన్సీలాల్ వ్యాస్ తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలను వృద్ధిలోకి తీసుకురావడానికి చదువనే మార్గాన్ని ఎంచుకొని ఏర్పాటు చేసినదే గురుకుల్ ట్రస్ట్. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ట్రస్ట్‌ను వృద్ధి చేయడానికి ఆయన మామ బద్రీనాథ్ తన భూమిని దానం చేశారు. అటువంటి ట్రస్ట్ భూమిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయన అనుచరులు, బంధువులు దురాలోచన చేసి మొత్తం కబ్జా చేయడం దారుణం. ఇది తెలంగాణ ప్రజల జీవితాలను ధ్వంసం చేయడంతప్ప మరేమీ కాదు. ఈ ట్రస్ట్ భూమి విలువ ద్వారానే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించవచ్చు. వేల కోట్ల రూపాయల భూములను వైఎస్ నాయకత్వంలో కబ్జా చేయడం వలసవాద ఆధిపత్యానికి నిదర్శనం. ట్రస్ట్ భూములతోపాటు, తెలంగాణకు చెందిన సంపదను రక్షించుకోవడానికి స్వీయ రాజకీయ అస్తిత్వం చాలా ముఖ్యం. ఇది తెలంగాణ రాష్ట్రం ద్వారానే సాధ్యం. ట్రస్ట్ ఆస్తులతో పాటు, సంస్థలను ట్రస్ట్‌కు అప్పగించాలి. తెలంగాణ ప్రజల హితం కోసం ఆస్తులను ఉపయోగించి, దీనిద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపడతాం.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బ్లాగ్ వేదిక మరిన్ని వినూత్నమైన ఫీచర్స్ తో తయారుకానుంది.త్వరలో సొంత డొమైన్ కూడాపొంది వెబ్సైట్ గా రానుంది.మీరు కూడా బ్లాగ్ వేదిక మెంబర్ అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాము.బ్లాగ్ వేదిక యొక్క సభ్యులను బ్లాగర్ ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో వారి పరిచయాలను బ్లాగ్ వేదిక ద్వారా అందించాలని సంకల్పించాము.దయచేసి మీరు మీ పరచయాన్ని,మీ బ్లాగ్ యొక్క ఉద్దేశ్యాన్ని,మీ బ్లాగ్ అనుభవాలను,మీ ఫొటొలను [మీకిష్టమైతేనే],ఇంకా ఏముంటే అవి,క్రింది మెయిల్ ఐడికి పంపించగలరు.
md.ahmedchowdary@gmail.com

www.blogvedika.blogspot.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి