గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 10, 2014

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు నిధులేవీ?

kcrరైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావనే లేదు.

-రైల్వే బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ పెదవి విరుపు
-బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని వ్యాఖ్య
కేంద్ర రైల్వే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెదవి విరిచారు. తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించక పోవడంపై ఆయన అసంతప్తి వ్యక్తంచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, కాజీపేట డివిజన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్లో ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రూ.20 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.

ఎక్కువ స్టాపులపై రైల్వే మంత్రి ఆందోళన

రైళ్ల స్టాపుల సంఖ్య పెరగడంపై సదానందగౌడ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ స్టేషన్లలో ఆగడం కారణంగా రైళ్ల ప్రయాణ సమయం పెరిగిపోతున్నదన్నారు. ఈ స్టాప్‌ల సంఖ్యపై సెప్టెంబర్‌లో పునఃపరిశీలిస్తామన్నారు. వ్యాపార లాభదాయకత, నిర్వహణ సాధ్యాసాధ్యాల ఆధారంగా పునఃసమీక్షిస్తామని, అదే సమయంలో కొత్త స్థానాల్లో రైళ్లను ఆపడంపై కూడా పరిశీలిస్తామని చెప్పారు. రైళ్ల స్టాపులు ఇలాగే కొనసాగితే ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ప్యాసింజర్లుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి