గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 05, 2014

ఉధృతమవుతున్న ముంపు ఉద్యమం...!

- ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం విజయవంతం
- కొనసాగుతున్న టీ జేఏసీ రిలే నిరాహార దీక్షలు
- 5,6,7 తేదీల్లో ఆంధ్రా బస్సుల నిలిపివేతకు నిర్ణయం
పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం విడుదల చేసిన ఆర్డినెన్స్ రద్దుకోరుతూ అఖిలపక్షం, టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో నిత్యం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు.

ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగులను ఆంధ్రాలో కలపడంతో ఆప్షన్‌లు కల్పించాలని కోరుతూ ఉద్యోగులు సైతం ఉద్యమిస్తున్నారు. ఆర్డినెన్స్ రద్దు కోరుతూ పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాటకమిటీ, టీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ముంపు మండలాల 48 గంటల బంద్ తొలిరోజు గురువారం విజయవంతంమైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంక్‌లు, ఐటీడీఏ, ఆర్డీవో, ఇంజినీరింగ్, కరెంట్, ఇరిగేషన్, వ్యవసాయ, అటవీశాఖ, ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయాలు బంద్ పాటించాయి.

ఈ సందర్భంగా ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వర్‌రావు, న్యూడెమోక్రసీ నేత కెచ్చల రంగారెడ్డి, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణదొరలు మాట్లాడారు. ఆర్డినెన్స్ రద్దు కోరుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం నిరాహార దీక్షలను తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెలంగాణ పంచాయతీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్నలు సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు.

మూడులక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకోవడం అన్యాయమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీలు చేపట్టిన ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 7న ముంపు ప్రాం తాల బాధితులతో భద్రాచలంలో నిర్వహించే ప్రదర్శన, సభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ముంపు ఆర్డినెన్స్ రద్దుచేయాలని కోరుతూ 5,6,7 తేదీల్లో 72 గంటలపాటు ఆంధ్రా బస్సులను నిలిపివేతకు పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ, అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి