గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 08, 2014

పరిశ్రమల శాఖలో సీమాంధ్రుల ఆధిపత్యం...!

తెలంగాణ ఏర్పాటై నెల దాటుతున్నా కొన్ని శాఖల్లో ఇంకా సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ర్టాలకూ ఏయే కార్యాలయాలు ఎక్కడుండాలన్న దానిపై భవనాల కేటాయింపులు పూర్తయ్యాయి.

కానీ పరిశ్రమల శాఖలో సీమాంధ్ర అధికారులు మాత్రం సీట్లు వదలబోమంటున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు కారిడార్లలో కూర్చొని విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు కేటాయించిన చాంబర్‌ను సీమాంధ్ర అధికారులు ఖాళీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ రజత్‌కుమార్ గతంలో కూర్చున్న చోటును వదలేందుకు ససేమీరా అంటున్నారు. తెలంగాణకు ఇన్‌చార్జీ కమిషనర్‌గా నియమితులైన ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ తన కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కానీ జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు కూర్చునేందుకు స్థానాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కారిడార్‌లో, ఇతరుల చాంబర్లల్లో కూర్చొని ఫైళ్లు చూస్తున్నామని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. పైగా రెండు రాష్ర్టాల పరిశ్రమల శాఖలు ఒకే భవనంలో ఉండడం వల్ల గోప్యత కరువవుతోందని ఆందోళన చెందుతున్నారు.

తాత్కాలికమే శాశ్వతమా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో చేపట్టిన తాత్కాలిక ఉద్యోగుల కేటాయింపు, బాధ్యతల అప్పగింతలను పరిశ్రమల శాఖలో శాశ్వతం చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖలో నలుగురు జాయింట్ డైరెక్టర్లు ఉండగా ఒక్కరికే అన్ని బాధ్యతలను అప్పగించారు. మిగిలిన ముగ్గురికి నామమాత్రపు పనులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఇన్సెంటివ్స్‌వంటి కీలక బాధ్యతలను ఒక్కరే చూస్తుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కమిషనర్ జోక్యం చేసుకొని సరైన రీతిలో పని విభజన చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి