గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 09, 2014

తెలంగాణ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర


ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తొందరగా విడుదల కాకుండా అడ్డుకొని ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులపాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయస్థాయిలో తనకున్న లాబీయింగ్ బలంతో మార్గదర్శకాలను తొక్కిపెడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. మార్గదర్శకాలపై ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోవటంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మార్గదర్శకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఏపీ పెద్దలు సందిగ్ధంలో పడ్డారు. ఉద్యోగుల విభజన పూర్తయితే తెలంగాణ సర్కార్ పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందని పసిగట్టిన చంద్రబాబు, ఉద్ధేశపూర్వకంగానే అడ్డుపడుతున్నట్లు తెలుస్తున్నది. పదేండ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున సీమాంధ్ర ఉద్యోగులు ఏ రాష్ట్రంలోనైనా పనిచేసేందుకు సిద్ధపడటం కూడా సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడటం లేదు. మరోవైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్లకు విభజన కమిటీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాలను కుట్రలతోనే తొక్కిపెడుతున్నట్లు ఉద్యోగసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. విద్యుత్తు సమస్య, నాగార్జునసాగర్ నీటివిడుదల, పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్‌లో గవర్నర్‌గిరీ వంటి వివాదాలకు తోడు...ఉద్యోగుల విభజనను కూడా వివాదంగా మార్చేందుకు సీమాంధ్ర సర్కార్ కుట్ర చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి