గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 12, 2014

కోర్టుకు పోతం,,,!

-పోలవరం ఆర్డినెన్స్‌కు ఆమోదం అప్రజాస్వామికం..
-సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన 
kcr2
పోలవరం ప్రాజెక్టు ముంపు ముసుగులో తెలంగాణలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను ఉల్లంఘించి ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నామని కేసీఆర్ వెల్లడించారు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడాన్ని టీఆర్‌ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కలిసి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కోరానని గుర్తుచేశారు. అయినా కేంద్రం అప్రజాస్వామికంగా, మొండిగా వ్యవహరించిందన్నారు.

టీడీపీ,బీజేపీ విప్ జారీచేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణ తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఈ విషయంలో పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో గొంతునొక్కేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ప్రభుత్వాల, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఆ రాష్ర్టాల హక్కులను కూడా కాలరాసిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటికీ భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకొనేందుకు ఎలాంటి కార్యాచరణను రూపొందించుకోవాలనే విషయంపై తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని అన్నారు. న్యాయనిపుణులు, రాజ్యాంగనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. పోలవరం డిజైన్ మార్చితే ముంపు సమస్యే ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి