గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 01, 2014

ఆంధ్రోళ్ళ జీవోతో భగ్గుమన్న భద్రాచలం!

-ముంపు విలీన జీవోపై వెల్లువెత్తిన ఆగ్రహం..
- ఏజెన్సీలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఏజెన్సీ విద్యార్థిలోకం గర్జించింది. జీవోను రద్దు చేయాలని విద్యార్థులు, ఉద్యోగులు నిరసన గళం విప్పారు. పోలవరం డిజైన్ మార్చి ముంపును తప్పించాలని డిమాండ్ చేశారు. ముంపును ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని నినదించారు. ప్రజలకు ఆకాంక్షకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. ముంపును తెలంగాణలోనే ఉంచాలని భద్రాచలంలో మూడు రోజులుగా విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

polavaramభద్రాచలంలో విద్యాసంస్థలను మూసివేసి మానవహారం నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలని కుక్కునూరులో విద్యార్థి, ఆదివాసీ సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. వీఆర్‌పురం, వాజేడు, కూనవరం, దుమ్ముగూడెంలో మండలాల్లో విద్యాసంస్థల బంద్, భారీ ర్యాలీలు కొనసాగాయి. కూనవరం నుంచి వరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయపార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి మంగళవారం నుంచి 5వ తేదీ వరకు ముంపు గ్రామాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతాలు, 7న భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

పోలవరానికి వ్యతిరేకంగా పాదయాత్ర

పోలవరంపై సమర శంఖారావం మోగింది. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు పోలవరంపై ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడం, ముంపును తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీచేయడంతో ఆదివాసీలు అగ్ర హిస్తున్నారు.

ఈ ఉద్యమానికి ఛత్తీస్‌గఢ్, ఒడిషా ఆదివాసీలు సైతం జత కలుస్తున్నారు. మంగళవారం ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా పొడియా నుంచి భద్రాచలం గిరిజనులు పాదయాత్ర చేయనున్నారు. 15న భద్రాచలంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పీపుల్స్ ఎగనెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ సోమవారం భద్రాచలంలో తెలిపారు. పాదయాత్రలో ఆదివాసీ గిరిజన సంఘాలు, ఓయూ జేఏసీ నేతుల, నాయక్‌పోడు, కొండరెడ్లు తెగల నాయకులు పాల్గొననున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి