గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 26, 2014

కేటీపీఎస్ ఏడోదశకు ఓకే...!

తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యుత్ లోటు భర్తీ, మిగులు విద్యుత్ సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఏడోదశ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు ప్రజల నుంచి సానుకూలంగా భారీ స్పందన లభించింది. స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కేటీపీఎస్ ఏడోదశ నిర్మాణం చేపట్టాలని సమావేశానికి హాజరైన వారంతా ముక్తకంఠంతో కోరారు.
ktpsఅన్నిపార్టీల నేతలు ఏడో దశ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భవిష్యత్‌లో 8వ దశ నిర్మాణం కూడా చేపట్టాలని కోరారు. కాలుష్యనియంత్రణ చర్యలు, కేటీపీఎస్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, నిర్వాసితులకు ఉద్యోగాలు, ఆరోగ్య పరిరక్షణ, క్యాజువల్ లేబర్ పర్మినెంట్ వంటి డిమాండ్లను నెరవేర్చాలని, ప్రజల ఆరోగ్యాలకు హాని కలగకుండా కేటీపీఎస్‌ను ఎన్నిదశలుగా విస్తరించినా అభ్యంతరం లేదని అన్నిపక్షాల నాయకులు కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ విద్యుత్ లోటు భర్తీ, విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కలెక్టర్ శ్రీనరేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపెంపు లక్ష్యంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో కేటీపీఎస్ ఏడోదశ విస్తరణను చేపట్టిందన్నారు.

టీఎస్‌జెన్‌కో ఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, స్థానికులు లేవనెత్తిన అనేక సమస్యలకు తప్పని సరిగా పరిష్కారం చూపిస్తామన్నారు.ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి