గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 05, 2014

స్థానికతను తేల్చడానికి...1956 నిబంధనే పక్కా...!

-విద్యార్థుల స్థానికతకు అదే కొలబద్ద
-వెనక్కి తగ్గరాదని సర్కార్ నిర్ణయం
-మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు
-తల్లిదండ్రుల్లో ఒకరు తెలంగాణలో పుట్టి ఉండాల్సిందే
అసలైన తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం దఢ నిశ్చయంతో ఉంది. ఇందుకోసం న్యాయ వివాదాలకు తావివ్వని రీతిలో పకడ్బందీ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ఫీజు చెల్లింపునకు 1956కు పూర్వమే ఇక్కడ నివసించి ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గరాదని నిర్ణయించింది. తెలంగాణ విద్యార్థుల ఫీజులు మాత్రమే భరిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల స్థానికతను గుర్తించే నిబంధనల విషయంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖ సలహాలు, సూచనలను సేకరిస్తున్నది.

table3ఈ బాధ్యతను సాధారణ పరిపాలనా శాఖ, ఉన్నత విద్యాశాఖపై ఉంచింది. ప్రధానంగా ముల్కీ నిబంధనలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనల్లో 1956కు ముందు విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒకరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఉండాలనే నియమం చేర్చాలని అధికారులు నిర్ణయించారు. దానికితోడు విద్యార్థి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా చదువుకుని ఉంటే వారి విద్యాపత్రాలు అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కనీసంగా విద్యార్థి తల్లిదండ్రులు తెలంగాణ ప్రాంతంలో ఇంటి స్థలమైనా కలిగి ఉండాలని నిబంధన చేర్చనున్నట్టు తెలిసింది. అప్పటినుంచి తెలంగాణ ప్రాంతంలోనే స్థిర నివాసం కొనసాగుతూ ఉండాలనేది కీలక అంశంగా చేర్చనున్నారు. రిజర్వేషన్ విధానాన్ని జనాభా ఆధారంగా ఎస్టీలకు 15 శాతం, ఎస్సీలకు 18శాతం, బీసీలకు 51 శాతం, మైనార్టీలకు 9 శాతం, ఇబీసీలకు 7 శాతం, వికలాంగులకు 0.04శాతం కేటాయింపులు చేయాలని అధికారులు తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు.

అర్హతలు..

బీసీ, ఇబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ఆయా విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. లక్ష మించకుండా ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఆదాయ పరిమితి రూ. 2 లక్షలుగా గత విధానాన్నే కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2013-14 సంవత్సరంలో రూ. 1889.61 కోట్లను రీయింబర్స్‌మెంట్‌కు, రూ. 525.91 కోట్లను మెయింటెనెన్స్ ఫీజులను తెలంగాణలోని 14 లక్షల 30వేల 445 మందికి చెల్లించారు.

table33
ఎంతమందిని లెక్కతేల్చారు...

తెలంగాణ రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఎంత భారమైనా ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇదివరకు ఉన్న నిబంధనల మేరకు ఫీజుల కేటాయింపు ఉంటుందని కూడా చెప్పింది. ఈ దిశలో ఇప్పటికే ఎంతమంది విద్యార్థులు అర్హులు అనే విషయంలో లోతైన అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి విద్యావిధానం కొనసాగనున్న నేపథ్యంలో మనవారెవరు? ఇతర రాష్ర్టాల వారెవరు? అనేది నిర్ణయించుకునేందుకు స్పష్టమైన లక్ష్మణరేఖ కోసమే నిబంధనలు రూపొందించాల్సి వస్తోంది. అది కొనసాగిస్తూనే విద్యాసంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అర్హులైన విద్యార్థుల లెక్కలు తీస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి