గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 29, 2014

గోదావరిపై ఏపీ సర్కార్ రాద్ధాంతం...!

-బేసిన్‌పై పెత్తనానికి కుట్ర
-సక్రమ ప్రాజెక్ట్‌లపై కూడా అనవసర పేచీలు
-తెలంగాణ వాటాకు గండికొట్టే యత్నం
-6న రివర్‌బోర్డు సమావేశం
ఉమ్మడి రా్రష్ట్రంలో కృష్ణా నీటికి గండి కొట్టిన ఆంధ్రప్రదేశ్ పాలకులు విభజన తర్వాత తెలంగాణలోని గోదావరి నీటిపై పెత్తనం కోసం అనవసర పేచీలు పెడుతూ కొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నారు. ఎలాంటి వివాదం లేకుండా పూర్తిగా తెలంగాణ పరిధిలోనే ఉన్న సక్రమ ప్రాజెక్ట్‌లకు కూడా మళ్లీ ఆమోదముద్ర కావాలంటూ లొల్లి చేస్తున్నారు.
గోదావరి బేసిన్‌లో ఎలాంటి వివాదాలు, పంపకాలు లేకపోయినా వాటిని కేంద్ర జలసంఘం పరిధిలోకి తీసుకొచ్చి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలనా అనుమతులు పొంది, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు వేసి ఏనాడో పనులు మొదలైన ప్రాజెక్ట్‌లపై కూడా ఆంధ్రసర్కార్ కిరికిరి చేస్తున్నది. ప్రాణహిత- చేవెళ్ల, కాంతనపల్లి, రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం, రుద్రమకోట ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపంల్లి బ్యారేజీ, కాళేశ్వరం, కొమురంభీమ్ ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఆధీనంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి చేయాలని ఆంధ్ర సర్కార్ వాదిస్తున్నది.
కేంద్ర జలసంఘం నుంచి ఇంకా పూర్తిస్థాయి అనుమతి రాలేదు కాబట్టి వీటిని పునః సమీక్షించి నీటి వాటా లెక్కలు చూడాలని వితండ వాదన చేస్తున్నది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లన్నింటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, కేంద్ర జలసంఘంలో దశలవారీ క్లియరెన్స్‌లు అభించాయి. అయితే, వీటికి నీటి లభ్యత ఎలా ఉంటుందోననే వివరణ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసర అభ్యంతరాన్ని లేవదీస్తున్నది. గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1480 టీఎంసీల కేటాయింపు ఉండగా ఇందులో తెలంగాణకు 912.2485 టీఎంసీల వాటా దక్కింది. తెలంగాణ వాటాకు గండికొట్టి తమ వాటాను పెంచుకోవాలన్న కుటిలబుద్ధితో కుట్రలు పన్నుతున్నది. గోదావరి జలాలపై ఏపీ సర్కారు అనవసర రాద్ధాంతం చేయటం దురదృష్టకరమని రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం విడిపోయినా ఆంధ్రపాలకులు తమ వలసవాద దురహంకారాన్ని వదలడం లేదని మండిపడ్డారు. కాగా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వచ్చే నెల 6వ తేదీన హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు ఎజెండా సిద్ధం చేసుకోవాలని గోదావరి రివర్‌బోర్డు చైర్మన్ మహాదేవన్ సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి