గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 02, 2014

నెలబాలుడి జనపాలన...!

స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తదేక దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల పాలన దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేబాటలో సాగుతున్నది. పాలనలో ప్రతిరంగంలోనూ ప్రతి అంగుళమూ తెలంగాణ ముద్రవేస్తున్న ఆయన తీరు ప్రజలను ముగ్ధులను చేస్తున్నది. ఒక్కో రంగం మీద ఆయన ఆవిష్కరిస్తున్న విజన్ రేపటి బంగారు తెలంగాణను కళ్లకు కడుతున్నది. అరవైఏళ్ల ఆకాంక్షలకు రూపమిచ్చే సుదీర్ఘ ప్రయాణంలో నెలరోజులు అతి స్వల్పకాలమే. ఈ ముఫ్పై రోజుల పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అమూల్యమైన కానుక భవిష్యత్తు మీద భరోసా. ఒకవేళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాక మరొకరుంటే మన పరిస్థితి ఏమై ఉండేదో.. సామాన్యుడినుంచి విద్యావంతుల దాకా అంటున్న మాట ఇదే. చట్టసభల్లో పట్టనన్ని సీట్లు గెలిచిన మహానాయకులు చేయలేకపోయింది.. తెలంగాణ సీఎం సాధించింది అదే!
-కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని పొడిగిస్తూ జీవో జారీ
-టాటా కంపెనీతో విమాన విడిభాగాల తయారీకి ఒప్పందం. ఆదిభట్లలో శంకుస్ధాపన
-గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి మండలి ఏర్పాటు
-ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు అందజేయాలని నిర్ణయం
-తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట.. రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, బోనాలు
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం
-గురుకుల్ ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు. కట్టడాల కూల్చివేత.
-చెరువులు కుంటలు ఆక్రమణపై కొరడా వక్ఫ్ భూములు సహా ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాకోరులపై తీవ్ర చర్యలు
-రైతులకు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల ముందస్తు పంపిణీ
-ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఏర్పాట్లు. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన
-తండాలను పంచాయితీలుగా చేసేందుకు సర్వే
-పాలన మీద ప్రతి అంగుళమూ తెలంగాణ ముద్ర
-మానవీయ విలువలు, మేధావుల భాగస్వామ్యం
-హైదరాబాద్‌లో ఇటు ఆధునీకరణ, అటు వారసత్వ పరిరక్షణ
-తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కేసీఆర్ నెల రోజుల పాలన


kcr
మన రాష్ట్రంలో మన ప్రభుత్వం నేటికి నెల రోజుల పాలనను పూర్తి చేసుకున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ముఫ్పై రోజుల్లో ప్రభుత్వ సారథిగా కనబరిచిన పరిణతి బంగారు తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించింది. ఉద్యమకాలంలోనే తెలంగాణ మీద తాను రూపొందించుకున్న విజన్‌ను ఆవిష్కరించే క్రమంలో పగ్గాలు చేపట్టిన తొలిరోజునుంచే ఆయన ప్రభుత్వ రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. ప్రభుత్వాధికారులకే పాఠాలు చెబుతున్నారు. పాలనలో నూతన విధానాలకు మానవీయ విలువలకు పట్టం కడుతున్నారు. ఈ నెల రోజుల్లో వివిధ రంగాల మీద సీఎం కేసీఆర్ చేసిన పాలనా సమీక్షలు, అందులో తీసుకున్న నిర్ణయాలు దశాబ్దాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రులకే పాఠాలు నేర్పుతున్నాయి. kcr1
సమీక్షలతోనే ముద్ర...

కునికిపాట్లు..నిద్రలు..ఇవి సాధారణంగా ప్రభుత్వ సమీక్షా సమావేశాల్లో గత 60 ఏళ్లుగా ప్రజలు మీడియా ద్వారా టీవీల ద్వారా చూసిన సమీక్షా దృశ్యాలు. కానీ ఇవాళ సమీక్ష అంటే ఓ కొత్త నిర్ణయం. ఓ కొత్త విధానం.ఓ కొత్త సిలబస్. చూపుడు వేలెత్తి ఏ అధికారి మీదో విరుచుకుపడే వీరావేశాల ప్రదర్శన కాదు.. సావధానంగా వినడం.. సంయమనంతో చెప్పడం.. ఇది అధికారులకే కొత్త అనుభవం. జీహెచ్‌ఎంసీ అధికారులకే జనాభా లెక్కలు వివరించినా.. పోలీసుల కష్టాలు పోలీసు అధికారులకే వివరించినా ముఖ్యమంత్రి పాలనా పటిమ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రోగం సరిగా నిర్ధారణ చేయగలిగితే సగం చికిత్స ముగిసినట్టే అనే సామెతను తన సమీక్షల ద్వారా నిజం చేశారు కేసీఆర్. మానవీయ కోణంలో పాలన ఉండాలె అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని కార్యాచరణలో పెట్టారు.

భవిష్యత్తుకు మార్గ దర్శకాలుగా సమీక్షలు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేసీఆర్ చేసిన ప్రసంగమే చారిత్రాత్మకం. వివిధ పథకాల విధి విధానాలనే కాకుండా అమలుకు సంబంధించిన కార్యాచరణను సూక్ష్మస్థాయిలో విశదీకరించడం ద్వారా తన పాలన ప్రత్యేకంగా ఉండబోతోంది అని చాటి చెప్పారు. ఆ మరుసటి రోజునుంచే ప్రారంభమైన కార్యాచరణ కొనసాగుతూనే ఉన్నది. సచివాలయంలోని సమతా బ్లాక్‌లోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మొట్ట మొదటి సమీక్ష జీహెచ్‌ఎంసీ పైన. వర్షాకాలం ముంగిట్లో అధికారుల సంసిద్ధత మీద. అదే సమావేశంలో విశ్వనగరంగా రాజధానిని తీర్చి దిద్దాలన్న తన ఆకాంక్షను అధికారుల ముందుంచి ప్రణాళికల రూపకల్పనకు ఆదేశించారు. మురికివాడలు లేని నగరంగా రూపొందించే క్రమంలో రెండు పడక గదుల ఇల్లు పథకానికి తక్షణ సర్వేకు ఆదేశించారు. పచ్చదనం పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చారు.మూసీవంటి జీవనదులను పునరుజ్జీవింపచేసుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. రెండో రోజు రెండో సమీక్ష రైతుల రుణమాఫీ మీద. రుణాల వివరాలు స్వయంగా కనుక్కుని తగు ప్రణాళిక రూపొందించుకునే యత్నం.

సంస్కరణలకు పోలీసుల సెల్యూట్..

ముఖ్యమంత్రి సమీక్షల్లో కీలకమైంది పోలీసు శాఖ సమీక్ష. పోలీస్ స్టేషన్లలో స్టేషనరీనుంచి వరల్డ్‌క్లాస్ విధానాల దాకా ఆయన సృశించని అంశం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు వేతనాల పెంపు వంటి శుభవార్త చెప్పింది.. రాష్ట్ర పోలీసుకుటుంబాలన్నీ ఆనందంతో తబ్బిబ్బయిన వారాంతపు సెలవులు మంజూరు చేసిందీ ఈ సందర్భంగానే. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా అత్యంత సురక్షిత నగరంగా రూపొందించేందుకు ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన నిధులు పోలీసు అధికారులు తమ జీవితకాలంలో ఏనాడూ ఎదురు చూడని పండగ. సమీక్షలో పోలీసుల ఉద్యోగ, ఆరోగ్య భద్రత వారి కుటుంబాల గురించి మానవీయ కోణంలో సాగిన సమీక్ష పరిశీలించిన ఓ పోలీసు ఉన్నతాధికారి సమావేశానంతరం టీ మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ..ఇంతగా ఉద్యోగుల గురించి.. మరీ ముఖ్యంగా పోలీసుల గురించి మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రిని దేశంలో నేను ఎక్కడా చూడలేదు అని ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

పౌర సమాజం సలహాలు

సామాజిక అంశాలకు చెందిన రంగాల సమీక్షల్లో మేధావులను భాగస్వాములను చేయడం వారి ఆలోచనలకు పాలనా రూపమివ్వడం ఇదే మొదటిసారి. ప్రభుత్వంలో పలువురు అనుభజ్ఞులను సలహా దారులుగా నియమించారు. వారి విశేష అనుభవాన్ని ప్రజా ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి..

ఉద్యమనాయకుడిగా ఉన్న కాలంనుంచే చెబుతూ వస్తున్న దళితులకు భూమి పథకం అమలుకు ముఖ్యమంత్రి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 500 మండలాల్లో ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించి దళితులకు అసలైన స్వాతంత్య్రాన్ని అందించబోతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. టాటా కంపెనీ విడిభాగాల ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిపారు. బతుకమ్మ బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లకు తొలిసారి భారీ మొత్తాన్ని మంజూరు చేశారు. ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు ఊహించని స్థాయి మొత్తాన్ని నజరానాగా ప్రకటించారు. గురుకుల్ భూముల చెర మీద ఆయన ప్రకటించిన యుద్ధం చారిత్రాత్మకం. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణకు భూగర్భమే శరణ్యమని ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేశారు. బియాస్ దుర్ఘటనపై స్పందించి తక్షణం హోంమంత్రిని పంపించి అక్కడే మకాం వేయించడం ఇంతకు ముందెన్నడూ జరగనిది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన మరణాంతరం బహుశా తొలిసారి ఘన నివాళి జరిపించారు.
నెల రోజులు ఇలా...
kcr2
జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం- ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం-సీఎంతో పాటు పదిమంది మంత్రులు ప్రమాణం-సచివాలయంలో సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం- అదే రోజు సమత బ్లాక్‌లో తొలి క్యాబినెట్ భేటీ
జూన్ 3: జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష-వర్షాకాలపు ముందస్తు చర్యలపై ఆదేశాలు-హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం-విజన్ 2050 కి రూపకల్పన.
జూన్ 4: బ్యాంకర్లతో సమీక్ష-రైతు రుణాలపై బ్యాంకుల వారీగా వివరాల సేకరణ-లక్షలోపు రుణాల మాఫీ-30 లక్షల మంది లబ్దిదారులకు రుణాల మాఫీ చేయాలనే నిర్ణయం
జూన్ 5: విద్యుత్తుపై సమీక్ష- మూడేండ్లలోపు మిగులు విద్యుత్తు సాధించాలని అధికారులకు దిశా నిర్దేశం-సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం-చత్తీస్ గఢ్‌నుంచి ట్రాన్సిమిషన్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం-విద్యుత్తు ఉత్పత్తికి ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించేది లేదని నిర్ణయం
జూన్ 6: మద్యం పాలసీపై సమీక్ష-జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులకు నిర్ణయం-లాటరీ విధానంలోనే దుకాణాల కేటాయింపు-సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియామకం-సీఎం ఢిల్లీ పర్యటన
జూన్ 7: రాష్ట్రపతితో సమావేశం ప్రధానితో భేటీపత్యేక రాయితీ కోసం డిమాండు-పోలవరం ఆర్డినెన్స్‌ను వెనకకు తీసుకోవాలని డిమాండు-14 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ప్రధానికి అందజేత.
జూన్ 8: ఢిల్లీలో రెండో రోజు సీఎం-రాష్ట్ర అభివృద్ధి కోసం పలువురితో భేటీ-రైతు రుణాలపై వెనక్కి తగ్గమని స్పష్టం-పోలవరంపై పోరాటం ఆగదని ప్రకటన-ఢిల్లీ పర్యటన ముగింపు.
జూన్ 9: నవ తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ సమావేశాలు-ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం-శాసన సభ రిజిష్టర్‌లో సంతకం-స్పీకర్‌గా మధుసూదనాచారి నామినేషన్.
జూన్ 10: రెండోరోజు శాసన సభ-సీఎం ప్రసంగం-స్పీకర్‌గా మధుసూదనాచారి బాధ్యతలు-తెలంగాణ శాసన సభ్యునిగా అని ప్రమాణం చేస్తుంటే కండ్లు చెమర్చాయని ప్రకటన-సచివాలయంలో బియాస్ నది దుర్ఘటన పై సమీక్ష.
జూన్ 11: మూడోరోజు అసెంబ్లీ-గవర్నర్ ప్రసంగం-బీఏసీ సమావేశం.
జూన్ 12: నాలుగో రోజు అసెంబ్లీ-పోలవరం ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తూ తీర్మానం. రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్ష-టీజీ బదులు టీఎస్ గా కోడ్ నిర్ణయం.
జూన్ 13: ఐదో రోజు అసెంబ్లీ-సోనియా సహా తెలంగాణ కు సహకరించిన బీజెపీ తదితరులకు సీఎం కృతజ్ఞతలు-సీఎం ప్రసంగం-కలసి నడుద్దాం బంగారు తెలంగాణ నిర్మిద్దామని ప్రతిపక్షాలకు పిలుపు.
జూన్ 14: ఆరోరోజు అసెంబ్లీ-అమరులకు జోహార్లు అర్పించిన సభ-పోలవరాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం.
టీవీ-9, ఏబీఎన్ ఛానళ్ల తీరుపై సభ కన్నెర్ర-చర్యల పై తుది నిర్ణయం స్పీకర్‌దే.
జూన్ 15: డీజీపీతో సచివాలయంలో సీఎం సమావేశం-శాంతిభద్రతలపై సమీక్ష
జూన్ 16: ఫీజు రియంబర్స్‌మెంట్ పై అఖిల పక్షం-తెలంగాణ విద్యార్ధులకే ఫీజు ఇవ్వాలనే నిర్ణయం-బోనాలు, బతుకమ్మ పండులను రాష్ట్ర పండుగలుగా ప్రకటిస్తూ నిర్ణయం-సిమెంట్ కంపెనీ యాజమాన్యాలతో సీఎస్ భేటీ-ధరలు తగ్గించేందుకు చర్చలు-సమాచార ప్రసారాల శాఖ కమిషనర్ గా చంద్రవదన్‌కు బాధ్యతలు
జూన్ 17: పీపీఏలను రద్దు చేయాలని సీమాంధ్ర ప్రభుత్వం నిర్ణయం-కరెంటు కయ్యానికి కాలుదువ్విన చంద్రబాబు-బియాస్ నది ప్రమాదం వివరాలను సీఎం కు తెలిపిన హోం మంత్రి.
జూన్ 18: నీటి పారుదల రంగం పై సమీక్ష-వచ్చే జూన్ నాటికి ఆరు లక్షల ఎకరాల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం-పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి, డిండి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్-పాల్గొన్న హరీష్ రావు తదితర అధికారులు
జూన్ 19: పోలీస్ వ్యవస్థ అధునీకరణ పై సీఎం సమీక్ష-హైదరాబాద్‌ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు ఆదేశం-గల్లీ గల్లీకి గస్తీతో శాంతి భద్రతల పటిష్టానికి ఆదేశం.
జూన్ 20: విద్యుత్, రుణమాఫీ, పరిశ్రమలపై సీఎం సమీక్ష-ఇతర రాష్ర్టాలనుంచి మిగులు విద్యుత్తు కొనుగోలుకు సూచనలు-పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధికి సింగిల్ విండో పద్దతి-రుణ మాఫీ విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయం
జూన్ 21: పోలీస్ అధికారులతో సమీక్ష-పోలీసు వ్యవస్థ అధునీకరణకు రూ.350 కోట్లు మంజూరుకి నిర్ణయం-పోలీసులకు వారాంతపు సెలవులకు నిర్ణయం. ప్రొ.జయశంకర్ 3 వ వర్థంతికి సీఎం హాజరు.
జూన్ 22: బేగంపేటలోని అధికారిక నివాసానికి సీఎం కుటుంబం- సచివాలయంలో సామాన్యుల సమస్యలు తెలుసుకున్న సీఎం.
జూన్ 23: భూ ఆక్రమణలపై సీఎం సమీక్ష-గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు-పేకాట క్లబ్లులను మూసివేయాలని నిర్ణయం. ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కంపెనీకి శంకుస్ధాపన-మేడిన్ తెలంగాణ లక్ష్యంగా అడుగులు.
జూన్ 24: దళితుల అభివృద్ధి కొరకు సీఎం మేథోమధనం-పాల్గొన్న అధికారులు దళిత మేథావులు-గవర్నర్‌తో సమావేశం-సాగర్ నీటి విడుదల పై చర్చ.
జూన్ 25: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ, టీచర్ ఎమ్మెల్సీలు, బీఎస్పీ ఎమ్మెల్యేలు.
జూన్ 26: వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు సరఫరా పై సమీక్ష-మూడేండ్లలో 30 ప్రాజెక్టులు, 40 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం.
జూన్ 27: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ అధికారులతో సమీక్ష-తెలంగాణ హరిత హారం కావాలని పిలుపు.
జూన్ 28: పౌర సరఫరాల శాఖ పనితీరు పై సీఎం సమీక్ష- బోగస్ కార్డుల ఏరివేతకు ఆదేశాలు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీపీఎస్సీ) ఏర్పాటు దిశగా గవర్నర్‌తో సమావేశం- ఘనంగా పీవీ 93 వ జయంతి వేడుకలు.
జూన్ 29: అధికారిక నివాసంలో మంత్రులతో సీఎం భేటీ-సీమాంధ్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు పిలుపు-పాలనలో పారదర్శకతపై చర్చ-జెడ్పీచైర్మన్ ఎన్నికల పై చర్చ.
జూన్ 30: సచివాలయంలో పలువురితో విడి విడి సమావేశాలు-మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎంపికకు చర్యలు
జులై 01: మెట్రోరైల్ ఎండీతో సీఎం భేటీ-పనితీరు పై సమీక్ష-చారిత్రక కట్టడాలను ప్రదేశాల విధ్వసం కాకుండా చర్యలపై చర్చ.

ఆశించిన దానికంటే బాగున్నది

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పాలనకు నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజుల పాలనపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం పూర్తిగా లేకపోయినా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ చేస్తున్న కృషిపై వివిధ వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారు. కేసీఆర్ పాలనపై మేధావుల అభిప్రాయాలు..

ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేక తెలంగాణ పునర్నిర్మాణ లక్ష్యానికి అనుకూలంగా మార్చడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు పార్రిశ్రామికవేత్తల్లో విశ్వాసం కలిగిస్తున్నాయి. టాటా ఏరోస్పేస్ వంటి ప్రముఖ పరిశ్రమలు మన రాష్ట్రంలోకి రావడం తెలంగాణ అభివృద్ధికి సూచికలు. మూడెకరాల భూమి కేటాయింపు దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా ఉంది. ఇదే స్ఫూర్తితో పాలన కొనసాగితేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.


ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నెలరోజుల్లోనే రోజుకు 18 గంటలు పనిచేసి పాలనా యంత్రాంగంపై పట్టు సాధించారు. ఇదే కేసీఆర్ తొలి విజయం. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో తనదైన పాలన కొనసాగించారు.


ఆశించిన దానికంటే బాగుంది. ఉన్నత స్థాయి లో దార్శినికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటే రాష్ట్రంలో ఎటువంటిపాలన ఉంటుందో నెలరోజుల కేసీఆర్ పాలన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
- నరేందర్ రావు,తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు
కేసీఆర్ నెల రోజుల పాలన అత్యంత పారదర్శకంగా ఉన్నది. తెలంగాణ సమాజానికి దిశా నిర్దేశం చేసిన ఉద్యమ నేత కేసీఆర్. రాష్ట్ర అభివృద్ధికీ అదే స్పూర్తితో ముందుకు వెళ్తాడని ఆశిస్తున్నాము.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నెల రోజుల పాలన ఆశాజనకంగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం, దళితులకు భూమిని పంచడం, కేజీ టు పీజీ విద్యనందిచాలనుకోవడం, చిన్న నీటి వనరులను అభివృద్ధ్ది పరచాలనుకోవడం, ఇవన్నీ ప్రజానుకూల కార్యక్రమాలే. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే చాలా మెరుగైన పాలన.


దళితులకు భూములివ్వాలనుకోవడం అద్భుతం. అది సుదీర్ఘకాల స్వప్నం. పోలీసు స్టేషన్లలో ప్రశాంతత నెలకొన్నది. ప్రజలు భయంలేకుండా పోలీసుస్టేషన్లకు వెళ్తున్నారు. ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగిన ఆశ కనిసిస్తున్నది. సెక్రటేరియట్‌లో ఆంధ్ర పాలకులు తిప్పిన చక్రాన్ని ఆపి సామాన్యులను సచివాలయంలోకి ప్రవేశం దొరికింది. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.


తెలంగాణ కొత్త రాష్ట్రం. పాత రాష్ట్రంలోనయినా కొత్త ప్రభుత్వం వచ్చినపుడు అన్నీ సర్దుకోవాలంటే శ్రమ పడాల్సిందే. కేసీఆర్ వీటిని అధిగమిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. కేసీఆర్ పాలనలో కమిట్‌మెంట్ నిజాయితీ కనిపిస్తున్నవి. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో ఉన్నారో అవన్ని క్రమంగా నెరవేరుతాయని భావిస్తున్నా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి