గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, నవంబర్ 06, 2014

గిదీ మన లెక్క!

త్లెల్ఱంగాణ ప్రజలకు, బ్లాగు వీక్షకులకు
కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు!!!


badget-2014


budget-table


తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? యాచించే స్థితి నుంచి శాసించే దశకు చేరుకోవడం వల్ల ఏమిటీ లాభం? మన రాష్ర్టాన్ని మనమే పరిపాలించుకుంటే మనకు ఒరిగేదేంటి? ఈ ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమాధానాలు చెప్పింది. మన నిధులు మనకేనన్న నినాదాన్ని నిజం చేసి చూపించింది. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ లక్ష కోట్లకు చేరుకోవడానికి దాదాపు 46 ఏండ్లు పట్టింది. 2004-05 ఆర్థిక సంవత్సరానికి అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌ను లక్ష కోట్లమార్క్ దాటించింది.
-తొలి బడ్జెట్‌లోనే లక్ష కోట్ల మార్కు
-46 ఏండ్లకుగానీ లక్ష కోట్లకు చేరని ఉమ్మడి బడ్జెట్
-తొలి ఏడాదే తడాఖా చూపిన టీఆర్‌ఎస్ సర్కార్
-కేటాయింపుల్లో దామాషా లెక్కన ఘనమైన పెరుగుదల
దామాషా నిష్పత్తిపరంగా చూస్తే తెలంగాణకు అందులో ఇంచుమించు సగం ఉండాలి. కానీ.. సీమాంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ దగాపడుతూ వచ్చింది. ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే లక్ష కోట్ల మార్క్ చేరుకుని రికార్డ్ సృష్టించింది. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపులను తెలంగాణ వాటాతో పోల్చితే ఏకంగా రెట్టింపు చేసింది. గడిచిన బడ్జెట్‌తో సరి చూసుకుంటే.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకు కలిపి 1.61 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. కేవలం పది నెలల కాలానికి.. పది జిల్లాలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష కోట్లు! లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సత్తా చాటడమే కాకుండా.. గతేడాది 23 జిల్లాలకూ కలిపి కేటాయించిన మొత్తాలకు మించిన స్థాయిలో పది జిల్లాలకు కేటాయింపులు జరుపడం తెలంగాణ ప్రభుత్వ విజయమేననడంలో సందేహం లేదు.

ఉదాహరణకు వ్యవసాయ రంగానికి గత బడ్జెట్‌లో 23 జిల్లాలకు కలిపి 6,128 కోట్లు కేటాయిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 8511.17 కోట్లు కేటాయించి, ఉమ్మడి రాష్ట్ర రికార్డును తిరగరాసింది. శాంతి భద్రతలకు ఉమ్మడి రాష్ట్రంలో 5386 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో 3307 కోట్లు కేటాయించారు. లెక్కకు మిక్కిలి రంగాల్లో దామాషా నిష్పత్తితో పోల్చితే అదనంగానే కేటాయింపులను గమనించవచ్చు. తెలంగాణ అన్యాయాలు ఎదుర్కొన్న ప్రతి రంగంలోనూ ఇటువంటి కేటాయింపులే కనిపిస్తాయి. ఇవే కాకుండా.. గత పాలకులు పట్టించుకోని కొన్ని కొత్త రంగాలకు ఇతోధికంగా నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. రెండు జీవనదులు పారుతున్నా తెలంగాణకు మంచినీటి గోస తప్పలేదు. దాన్ని రూపుమాపేందుకు సంకల్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వాటర్ గ్రిడ్‌కోసం తొలిదశలో 2వేల కోట్ల రూపాయలను కేటాయించింది.

రోడ్ల అభివృద్ధికి మరో రెండువేల కోట్లు, పెన్షన్లకు1689.99 కోట్లు, దళితులకు భూమి కొనుగోళ్లకు వెయ్యి కోట్లు కేటాయించింది. దళిత, గిరిజన, మైనార్టీ యువతుల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 330 కోట్లు పొందుపర్చింది. అన్నింటికి మించి.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు వంద కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఇలాంటి అనేక ప్రాధాన్యాలను తెలంగాణ ప్రభుత్వం ఎంచుకోవడం గమనించవచ్చు.

మనది చెరువుల దేశం


తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చెరువు. ప్రాచీనచరిత్రలో తెలంగాణను చెరువుల దేశంగా పేర్కొన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు 45 వేల చెరువులను వచ్చే ఐదేండ్లలో బాగు చేస్తం. కృష్ణా, గోదావరి బేసిన్‌లో 265 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం ఒకప్పుడు మన చెరువులకు ఉండేది. తిరిగి ఆ సామర్థ్యాన్ని పొందాలి. ఈ యేడాది 9 వేల చెరువులను పునరుద్ధరించడానికి రూ.2 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి