-రాష్ట్ర అధికార చిహ్నాల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్ర ..
-తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యం
రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఖరారయ్యాయి. చిహ్నాల ఎంపికపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా కసరత్తు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా...-తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యం
రాష్ట్ర జంతువుగా జింక
రాష్ట్ర పక్షిగా పాలపిట్ట
రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు(శమీవృక్షం)
రాష్ట్ర పుష్పంగా తంగేడి పువ్వు
లను ఎంపిక చేశారు.
జమ్మిచెట్టు ఆశీర్వాదం..
పాలపిట్ట శుభసూచకం..
పాలపిట్టకు తెలంగాణ సంస్కృతికి దగ్గరి బంధం ఉంది. దసరా పండుగ నాడు పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రజలు పుణ్యకార్యంగా భావిస్తారు. ఏ పనిలోనైనా పాలపిట్ట కనిపిస్తే శుభసూచకమని తెలంగాణలో విశ్వాసం. లంక నగరంపై దండెత్తే ముందు శ్రీరాముడు పాలపిట్టను దర్శించుకున్నాడని జనశ్రుతి. తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో విజయపథాన నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను ఎంపిక చేశారు.
తంగేడు పువ్వు.. మన అందరి పువ్వు..
పసుపుపచ్చ రంగుతో ప్రకృతికే వన్నె తెచ్చే తంగేడి పువ్వు ఇప్పుడు మన రాష్ట్ర పుష్పంగా రికార్డుకెక్కుతోంది. తెలంగాణ సంస్కృతికి తంగేడు పువ్వు నిలువుటద్దం. అదిలేని బతుకమ్మ పండుగను ఊహించలేం. తంగేడు పువ్వు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ మహిళలు ఆరాధిస్తారు. ఈ కారణంగానే తంగేడు పువ్వును అధికారిక పుష్పంగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు.
జింక ఎందుకంటే..
ఇక రాష్ట్ర జంతువు ఎంపికలో తెలంగాణ వాసుల మనస్తత్వాన్ని సీఎం పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రం దాదాపు అన్ని ప్రాంతాల చిట్టడవుల్లో సైతం జింకలు విరివిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సున్నిత మనస్కులు, అమాయకులు. జింక కూడా అత్యంత సున్నితమైనది, అమాయకమైనది. జింకకు భారతదేశ చరిత్రతో, పురాణాలతో గాఢమైన అనుబంధం ఉంది. రామాయణంలో జింకకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా జింక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జంతువైంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి