గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

బెజవాడకు కార్మిక సంక్షేమ నిధి?

- రాష్ట్ర ఖాతాలో చేరని టీ వాటా
ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయి నాలుగు నెలలవుతున్నా కార్మిక సంక్షేమ బోర్డు నిధులకు మోక్షం కలుగడం లేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుతోపాటు బ్యాంక్ ఖాతా ప్రారంభించినా ఆ నిధులను మళ్లించే వారే లేరు. ఆంధ్రాప్రాంత ఉన్నతాధికారులు ఈ నిధులను తెలంగాణ ఖాతాకు మళ్లించకుండా విజయవాడలోని ఆంధ్రాబ్యాంక్‌కు తరలించే ఏర్పాట్లు కార్మిక శాఖలో కలకలం రేపాయి. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలోని ఉమ్మడి ఖాతాలో దాదాపు రూ. 1500 కోట్లు మూలుగుతున్నాయి. తెలంగాణ వాటా నిధులు ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఆంధ్రాబ్యాంక్‌లో తెరిచిన ఖాతా (1422100 11805015) లోనే మగ్గుతున్నాయి. భవనాలు, ఇతర నిర్మాణాల ద్వారా వసూలైన సెస్ మొత్తంలో అధిక వాటా తెలంగాణదే. 2007 నుంచి చూస్తే తెలంగాణ నుంచే 60 నుంచి 70శాతం వసూలవుతున్నట్లు తేలింది. ఈ నిధిని 52: 48 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తే తెలంగాణకు రూ. 600 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 900 కోట్లు కేటాయించాలని నిర్ధారించారు. 
జూన్ రెండోతేదీ నుంచి ఇప్పటి వరకు రూ.80 కోట్ల సెస్ వసూలైందని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. దీనిప్రకారం ఉమ్మడి కార్మిక సంక్షేమ నిధిలో రూ.1580 కోట్లు ఉన్నట్లు లెక్క. రాష్ట్రప్రభుత్వం మూడు నెలల తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. తదనుగుణంగా బ్యాంక్ ఖాతా ప్రారంభించినా ఒక్క రూపాయి కూడా అందులో చేరలేదు. స్థిరాస్తులు, సెస్ లెక్కలు తేలేవరకు ఒక్క పైసా కూడా తరలించొద్దని తెలంగాణ లేబర్ కమిషనర్ యూనిట్ ఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌గౌడ్ కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి