గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 06, 2014

కరెంటు కష్టాలకు కారకులెవరు?

వర్షం పడింది. విపక్షాల విమర్శల కు చెక్ పెట్టింది. ప్రకృతి ఆగ్రహాన్ని అధికార పక్షానికి అంటగడదామనుకున్నారు. కానీ కుదరలేదు.జల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.వ్యవసాయానికి కోత లు చాలా మేరకు తగ్గాయి. పరిశ్రమల కు కోత ఎత్తేశారు. ఇపుడు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి నుంచి మొదలుకుంటే జగ్గారెడ్డి దాకా వానదేవుణ్ణి ఏమంటున్నారో? అయినా.. 58 ఏళ్ల పాప ఫలితాలను 90 రోజుల్లో తుడిచేసే మంత్ర దండం కేసీఆర్ దగ్గర సైతం ఉండదని ప్రజలకు తెలుసు. కానీ తెలియనిదల్లా ప్రతిపక్షాలకేనా? కళ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, ప్రతిపక్షాలు తమ పాప ఫలితాలపైనే కేసీఆర్‌ను ప్రశ్నించడం ఆశ్చర్యకరం.తెలంగాణ లో విద్యుత్ డిమాండ్ 7260 మెగావాట్లు. 
మొన్నటిదాకా విద్యుత్ లభ్యత 4500 మెగావాట్లు.అంటే 2760 మెగావాట్ల కొరత ఉండిందన్నమాట.ఇపుడు వర్షాలు కురిసి నాగార్జునసాగర్, శ్రీశైలం,ఇతర ప్రా జెక్టులు నిండుకొని జలవిద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఫలితంగా విద్యుత్ కొరతను చాలా మేరకు అధిగమించాం. ఒకవేళ మనకు జల విద్యుత్ సభ్యత లేనపుడు మాత్రమే విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటున్నదని మనం గమనించాలి. అయితే జలవిద్యుత్ లభ్యత లేనపుడు డిమాండ్‌కు తగ్గ ఇతర (బొగ్గు, గ్యాస్ వంటి) విద్యుత్ ఉత్పత్తులను తెలంగాణ ఎం దుకు కలిగిలేదు. దానికి కారకులెవరు?

థర్మల్, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తెలంగాణలో తక్కువ. అలాగే ప్రైవేటు విద్యుదుత్పత్తి ప్లాంట్లు సీమాంధ్రలోనే ఉన్నాయి. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నా, ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇప్పటివరకు ఏ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేస్తున్నదో ఆప్రాంతానికి యథాతథంగా కొనసాగించాలని విభజన బిల్లు చెపుతున్నది.అయినా సీమాంధ్ర లో ఉన్న ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను అడ్డుకునేందుకు పీపీఏలను రద్దు చేయించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు మనకు తెలిసినవే. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి జరుగుతు న్న విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగాలని బిల్లులో చెప్పబడ్డది.ఉమ్మడి రాష్ర్టాన్నేలిన టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో ఉన్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కేంద్రాల స్థాపన తెలంగాణలో ఎందుకు జరపలేదు? ఆ పాపం ఎవరిది?

బోరుబావులపై ఆధారపడిన తెలంగాణలో విద్యు త్ డిమాండ్ సీమాంధ్రలో కంటే ఎక్కువ. కానీ సీమాంధ్రలో 9500 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుం టే, తెలంగాణలో 7000 మెగావాట్ల ఉత్పత్తి చేయగల కేంద్రాలు మాత్రమే ఉండడం గమనార్హం. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి కేంద్రాలను స్థాపించని గత ప్రభుత్వాల పాప ఫలితాలను ఇవాళ తెలంగాణ అనుభవిస్తున్నది.ఈ పాపాలకు కారకులైన పార్టీ లే ఇపుడు విద్యుత్ కొరతపై మాట్లాడటం చూస్తుం టే... రాజకీయాలు ఎంత సిగ్గుమాలిన తనానికి దిగజారాయో ఎవరికైనా అర్థమవుతున్న విషయం. మన ప్రాంతం,మన తెలంగాణ అనే సోయి ఈ పార్టీలకు మొదటి నుంచి ఉంటే.. ఇవాళ తెలంగాణ కరెం టు కొరతను ఎదుర్కొనేదే కాదు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలకు 50కి తగ్గకుండా శాసనసభ్యులను తెలంగాణ ప్రాంతం గెలిపిస్తూ వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఇరుపార్టీల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు సొంత సోయి తప్ప, సొంత ప్రాంతం సోయి ఏనాడూ లేదు.బొగ్గు, నీరు, భూమి లాంటి వనరులన్నీ తెలంగాణలో ఉండగా, థర్మల్‌పవర్ ప్రాజెక్టులను సీమాంధ్రలో ఎందుకు నిర్మించారో ఆరెండు పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదందామా? సింగరేణి బొగ్గు కడప జిల్లాలో ని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఏటా సుమారు 4 మిలియన్ టన్నుల సరఫరా కొనసాగుతున్నది. బొగ్గు తెలంగాణది. ప్రాజెక్టు సీమాంధ్రది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, గత ప్రభుత్వాలు తెలంగాణలో కావాలని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించలేదని చెప్పడానికి! బొగ్గు ఎక్కడ ఉందో థర్మల్ పవర్ ప్రాజెక్టుల స్థాపన కూడా అక్కడే జరగాలి. దానితో బొగ్గు రవాణా ఖర్చు కూడా ఆదా అవుతుంది. విద్యుత్ ధర కూడా ఆమేరకు తగ్గుతుం ది. కానీ అలా జరగలేదు.

విభజన బిల్లు సందర్భంగా తెలంగాణ విద్యుత్ కొరతను తీర్చడానికి కేంద్రం కూడా సహకరిస్తుందని ఈ దేశ ప్రధాని హామీ ఇచ్చారు. ప్రధానిగా అపు డు మన్మోహన్ ఉన్నారు. ఇపుడు మోడీ ఉన్నారు. విచిత్రమేమిటంటే.. కేసీఆర్ అడుగలేదు, విద్యుత్ ఇవ్వలేదు అని మొన్ననే కేంద్ర విద్యుత్‌మంత్రి పియూష్ వ్యాఖ్యానించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు రోజులకే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలన్నింటిని విన్నవించా రు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు సహకా రం అందించాలని ప్రత్యేకంగా కోరారు.

అలాగే ఎన్‌టీపీసీ కొత్త థర్మల్‌విద్యుత్ ప్లాంట్లను స్థాపించి, సుమారు 4000 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన సందర్భంగా తెలంగాణకు హామి ఇచ్చింది. ఇచ్చిన హామీని వేగంగా అమలు చేయాలని కూడా కేసీఆర్ ప్రధానిని కోరారు.అంతేకాదు, గత 90రోజుల్లో టీఆర్‌ఎస్ ఎంపీల బృందాలు, తెలంగాణ విద్యుత్ కొరత తీర్చాలంటూ విద్యుత్‌శాఖ మంత్రితోపాటు అనేక మంది మంత్రులుకు వివరించి, విజప్తులు సమర్పించుకున్న వార్తలు మనం బోలెడు చూశాం.

స్వయాన బీజేపీ ఎంపీ దత్రాత్రేయ సైతం తెలంగాణ విద్యుత్ సమస్యను తీర్చాలంటూ ఇదే కేంద్ర విద్యుత్ మంత్రిని కలిసి విన్నవించి, విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు ఆ మధ్య నమస్తే తెలంగాణ పత్రికలోనే ఓ వార్తను చూశాం. బీజేపీ తెలంగాణలో రైతులను రెచ్చగొడుతూ విద్యుత్ సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేసి న సంఘటనలున్నాయి.ఇపుడు అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రే తెలంగాణ విద్యుత్ కొరత సమస్యను ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడం చూస్తే ఆ మంత్రి రాజకీయ మర్మంతో మాట్లాడుతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. మెదక్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని, టీఆర్‌ఎస్ ను అపవాదు చేసేందుకన్నట్లు ఒక కేంద్రమంత్రి అబద్ధాలు చెప్పే స్థాయికి దిగజారడాన్ని.. స్వయాన బీజేపీ సానుభూతిపరుడు సైతం సమర్థించలేడని ఆ మంత్రి తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.

ఒక్క హైదరాబాద్ నగరానికే 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో కేంద్ర పరిశ్రమలు, రక్షణ పరిశ్రమలున్నాయి.అలాగే హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కూడా. తెలంగాణతో ప్రత్యక్ష సంబంధంలేని ఈ విద్యుత్ వినయోగం సమారు వెయ్యి మెగావాట్ల వరకు ఉంటది. కనీసం ఉమ్మడి రాజధాని, కేంద్ర పరిశ్రమలు, రక్షణ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ విషయంలోనైనా కేంద్ర మంత్రికి తెలియదనుకుందామా? సహకరించే బాధ్యత లేదందామా? ఇవాళ విద్యుత్ సమస్యకు కారకులే విమర్శకులై ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకోవడమే నిజంగా హాస్యాస్పదం.

చంద్రబాబు పాలనలో మొదలైన విద్యుత్ సమ స్య నేటికీ తీరలేదు. ఉచిత విద్యుత్ ముసుగులో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపనకు వైయస్ (కాంగ్రెస్)ఎగనామం పెట్టారు.ఇపుడు తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య ఉందని తమకు తెలియనే తెలియదని ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏ పార్టీ కారణం కాదందామా? ఇవాళ ఆపార్టీలే ఒంటి కాలిపై లేచి కరెంటు సమస్యను ఎన్నికల సమస్యగా మార్చాలనుకోవడం ఎంత విచిత్రం?

ఏదిఏమైనా, తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఒక విజన్‌తో ఎన్నుకున్నారనడంలో అనుమానం లేదు.ప్రజలు ఆశించిన విజన్‌తో పని చేస్తున్నంత కాలం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. విద్యుత్ సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న మాట నిజం. ప్రతిఏటా విద్యుత్ కొరతను అధిగమిస్తూ మూడేళ్ల వరకు పూర్తిగా అధిగమించి మిగులు విద్యు త్ రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ చెపుతూనే వస్తున్నది. అంతేకాదు, ఆ దిశగానే పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్ నుంచి కొత్త కారిడార్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అది పూర్తయితే సుమారు 2000 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

అలాగే తెలంగాణ సింగరేణి అపార బొగ్గు నిల్వల ఆధారంగా స్వయంగా తెలంగాణ ప్రభుత్వం విద్యు త్ ప్లాంట్లను స్థాపించి కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళిక ఉంది. వర్తమాన కాలంలో సోలార్ విద్యుదుత్పత్తి కూడా అనేక రంగాలలోకి విస్తరించనుంది. ప్రజలు ఒక విజనరీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విషయాన్ని మర్చిపోతారని అనుకోలేము. అలాగే ప్రజల విజన్ నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ తప్పటడుగు వేసినా ప్రజలే నిలదీస్తా రు. కానీ ప్రాంతానికి అన్యాయం చేసిన రాజకీయ శక్తులు నిలదీసే నైతకతను ఏమేరకు కలిగి ఉన్నాయనేదే ఎవరినైనా ఆలోచింపచేసే ప్రశ్న.

తెలంగాణ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సంప న్న ప్రాంతమే. సంపన్న ప్రాంతంలో సమస్యలు సృష్టించబడ్డాయి. విద్యుత్ సమస్య కూడా అలాంటిదే. సమస్యను సృష్టించిన రాజకీయ శక్తులే ఇపుడు విమర్శలకు దిగుతున్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసిపెట్టిన రాజకీయ శక్తులపై పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు కారకులను గుర్తించనంతటి అమాయకులు మాత్రం కారని వారు తెలుసు లేకపోవడమే కొసమెరుపు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి