గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 01, 2014

ఏపీఈఆర్సీలో సీమాంధ్ర కుయుక్తి...!

-అడ్డదారుల్లో పదోన్నతుల ఖరారుకు యత్నం
-తెలంగాణ ఉద్యోగులకు మొండిచెయ్యి
అనేక విధాలుగా తెలంగాణ నష్టపోయే చర్యలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరోసారి రాష్ట్ర ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత పీపీఏల వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులను పక్కనబెట్టి, ఆంధ్ర ఉద్యోగులకు అక్రమంగా పదోన్నతులు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా, మరొకరికి పర్సనల్ ఆఫీసర్‌గా పదోన్నతి ఖరారు చేసినట్లు సమాచారం. ఈఆర్సీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా, తెలంగాణ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే, సీమాంధ్ర ఉద్యోగులకు పదోన్నతులు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఆగస్టులోనూ నాటి ఈఆర్సీ ఇన్‌చార్జి చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి (చిత్తూరు) నిబంధనలకు నీళ్లు వదిలి తన అనుయాయులకు (సీమాంధ్ర ఉద్యోగులు) పదోన్నతులు కల్పించారు. మరికొన్ని గంటల్లో బాధ్యతల నుంచి వైదొలిగే ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 
ఈఆర్సీలో పదేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై క్యాషియర్‌గా వచ్చి చేరిన ఉద్యోగికి ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ (పే అండ్ అకౌంట్స్) పోస్టును నాటి ఇన్‌చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి కట్టబెట్టారు. ఈఆర్సీలో 50మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో అటెండర్లు, డ్రైవర్ల వంటి కిందిస్థాయి ఉద్యోగులకు 14 ఏండ్లుగా ఒక్క పదోన్నతి కూడా దక్కలేదు. కానీ, క్యాషియర్‌గా డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగిని ఈఆర్సీలో విలీనం చేసుకోవడమే కాకుండా అకౌంటెంట్‌గా, అకౌంట్స్ ఆఫీసర్‌గా పదోన్నతులు కల్పించిన తీరుపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈఆర్సీలో పనిచేస్తున్న ఒక్కరిద్దరు ఎస్సీ ఉద్యోగులు పదోన్నతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేసిన నాటి ఇన్‌చార్జి చైర్మన్, ఈఆర్సీ మెంబర్లు ప్రస్తుతం సీమాంధ్ర అకౌంట్స్ ఆఫీసర్‌కు మాత్రం నిబంధనలు పక్కనబెట్టి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. త్వరలో సీమాంధ్రలో ఏర్పాటుకానున్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అత్యున్నత స్థానంలో కూర్చునేందుకే సదరు ఉద్యోగికి పదోన్నతి కల్పిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి