గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

ఉద్యోగుల విభజనపై కేంద్రం, ఏపీ సాచివేత...!!

ఉద్యోగుల విభజన పట్ల కేంద్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా దీపావళి పండుగ తర్వాత ఆందోళన బాట పట్టాల్సిందేనని వారు భావిస్తున్నారు.
ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వారి సొంత ప్రాంతానికి బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు, కమల్‌నాథన్ కమిటీ నచ్చచెబుతూ రావడంతో ఇప్పటివరకు ఉద్యోగులు ఓపిగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఏపీకి బదిలీ అయిన తెలంగాణ ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధించడంతోపాటు ప్రాధాన్యంలేని సెక్షన్లలో నియమించారు. దీనికితోడు అధికారులు చీటికిమాటికి విసుక్కోవడంతో ఉద్యోగులు దాన్ని దిగమింగుకోలేక ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు నెలలుగా కమల్‌నాథన్ కమిటీ కేవలం శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల విభజనపైనే ఎటూ తేల్చుకోలేకపోతున్నదని టీ ఉద్యోగులు చెప్తున్నారు.

ఇక జిల్లా, జోనల్, మల్టీజోన్‌లలో ఉద్యోగుల విభజనను ఎప్పుడు చేపడ్తారని ప్రశ్నిస్తున్నారు. మండలస్థాయి నుంచి శాఖాధిపతి కార్యాలయం వరకు శాస్త్రీయంగా క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్దారించకుండా, శాఖాధిపతుల కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, దసరాసెలవులు పెంచడం, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, బోనాలు, దసరా పండుగలకు అడ్వాన్సులు ఇవ్వడం, దసరా సందర్భంగా ఈనెల 26నే వేతనాల చెల్లింపు తదితర ప్రోత్సాహకాలతో తొలి రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల స్నేహశీల ప్రభుత్వమన్న విషయాన్ని రుజువు చేసుకుంటున్నది.

ఇటువంటి ప్రోత్సాహకాలేమీ ఆంధ్రప్రదేశ్‌లో లేకపోగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని టీ ఉద్యోగులు చెప్తున్నారు. ఇలాగైతే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయలేమని వారు బాహాటంగానే అంటున్నారు. కమలనాథన్ కమిటీ న్యాయమైన రీతిలో వ్యవహరించి స్థానికత ఆధారంగా తెలంగాణ ఉద్యోగులందరినీ సొంత రాష్ర్టానికి బట్వాడా చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన నిర్వహించి, తమ డిమాండ్లు సాధించుకుంటామని ఏపీకి బదిలీ అయిన టీ ఉద్యోగులు చెప్తున్నారు. తమపై దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని అంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి