గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 18, 2014

మెట్రో అలైన్‌మెంట్ మార్పు ఖాయం!

- పబ్బులు, క్లబ్బుల పని పడతాం
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం కేసీఆర్

UPPAL-DEPTO
హైదరాబాద్ నగరంలో చేపట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రస్తుత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కోఠి వద్ద మెట్రోరైల్ మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా, ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి చేపట్టాలని సూచించామన్నారు. ఇక అసెంబ్లీ ముందునుంచి కాకుండా వెనుకవైపు నుంచి రైల్‌లైన్ నిర్మించాలని మెట్రోరైల్ అధికారులను ఆదేశించినట్లు కేసిఆర్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో పేకాట క్లబ్బులు, పబ్బులను క్రమంగా నిరోధిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను రెండుగా విభజించాలనే అంశంపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ, ముంబై తరహాలో కార్పొరేషన్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించామని సీఎం చెప్పారు. రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనలో కూడా పెద్దగా వివాదాలు రావన్నారు. కేవలం వందల సంఖ్యలో ఉద్యోగులు తెలంగాణవారు ఆంధ్రాకు, ఆంధ్రావారు తెలంగాణకు కేటాయిస్తే రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు సూపర్ న్యూమరీ పోస్టులు కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం తెలిపారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్నారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొనగలరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పైగా భూముల్లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన అక్రమాలున్నాయని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు వైపులా బస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలాలి, వట్టి నాగులపల్లి వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలకు మెరుగైన రవాణ వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి