గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 23, 2014

మెత్తని వాళ్ళను చూస్తే, మొత్తబుద్ధి అయ్యిందట ఆంధ్రావాళ్ళకు!



మెత్తనివానిని చూసిన
మొత్తబుద్ధి యగుననియెడి
సామెతనే నిజముచేసి
నారయ్యా సీమాంధ్రులు!

పాలమూరు జిల్లాలో
కృష్ణానది, తుంగభద్ర
పారుతు ఉన్నను ప్రజలకు
త్రాగు, సాగునీరు లేదు!

సీమాంధ్రా వలస పాల
కుల జల దోపిడి తోడను,
స్థానిక నాయకుల స్వార్థ,
కక్కుర్తులతో బలయిరి!

శ్రీశైలం ప్రాజెక్టున
తెలుగుగంగ పేర, పోతి
రెడ్డిపాడు హెడ్డు రెగ్యు
లేటర్ గా మార్చి దోచ్రి!

విద్యుత్తుకు ఏర్పరచిన
శ్రీశైలం ప్రాజెక్టును
సీమాంధ్రా నాయకులిటు
అక్రమముగ దోచిరయ్య!

తెలంగాణ నేతలు తమ
నోరునెత్తకుండుటకై
ఎంగిలి మెతుకులు విసరిన
రీతి, కొన్ని పదవులిడిరి!

పాలమూరునుండి తుంగ
భద్ర పోవుచున్నకూడ,
పెత్తనమంతా కర్నూల్,
కడప జిల్లలదే ఆయెను!

సీమాంధ్రా నేతలచట
దౌర్జన్యంతో గేట్లను
డైనమైట్లతోడ పేల్చి,
నీళ్ళను రాకుండ చేస్రి!

సీమాంధ్రా ప్రభుత్వమ్ము
అచ్చటచట రిపేరులను
చేయు అవసరము ఉన్నను,
నిర్లక్ష్యము చేసెనయ్య!

పాలమూరు ప్రజలందరు
సాగునీరులేక, కూలి
నాలి చేసికొనుటకొరకు
తలోదిక్కు పోయిరయ్య!

పొట్టకూటికోసమిట్లు
వలసపోయినట్టి జనుల
కాంట్రాక్టర్ సీమాంధ్రులు
నిస్సిగ్గుగ దోచుచుండ్రి!

ఎంతదోచుకున్న నోరు
మెదపనట్టి పాలమూరు
మెత్తనివారల చూసిన
మొత్తబుద్ధి అయ్యె వార్కి!

***     ***     ***     ***

తెలంగాణ రాష్ట్రమేర్ప
డెను! ఇప్పుడు ఎన్నికలలొ
సమర్థ నాయకు నెన్నిన
వెతలు తొలగు తప్పకుండ!!

సీమాంధ్రుల అరాచకాల్
ఎదుర్కొనెడి నాయకులను,
కక్కుర్తులు ఏవి లేని
నాయకులను ఎన్నవలెను!

ప్రజల కొరకు ఉన్నయట్టి
ప్రజల మేలు కోరునట్టి
బంగరు తెలగాణ తెచ్చు
నాయకులను ఎన్నవలెను!

***     ***     ***     ***

ఈ విషయంపై మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి