గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, డిసెంబర్ 08, 2014

ఆప్కోలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసినా.. ఆంధ్రా ఉద్యోగులపై చర్యలు శూన్యం!!!

-తెలంగాణ అధికారిపై చేయిచేసుకున్న వ్యక్తికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన ఆంధ్రా అధికారులు

ఆప్కో లో తెలంగాణ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులపై దాడులు జరిగినా ఆప్కోలోని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా దాడుల జరిపిన ఆంధ్రా సిబ్బందికే వత్తాసు పలుకుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కైరంకొండ యాదగిరి అనంతపురంలో డిస్ట్రిక్ట్ట్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. బదిలీపై రిలీవ్ కావడానికి గత సెప్టెంబర్ 10న అనంతపురం వెళ్లిన ఆయనపై ఆప్కో సేల్స్ మేనేజర్ ప్రకాశ్, మరో ఉద్యోగి దాడికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యాదగిరికి గుండెపోటు వచ్చింది. వెంటనే దవాఖానలో చేర్చడంవల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆయనకు సికింద్రాబాద్ డీఎంవోగా పోస్టింగ్ ఇచ్చారు. 
దాడికి పాల్పడిన ప్రకాశ్‌ను సస్పెండ్‌చేసి ఆ తర్వాత నామమాత్రపు దర్యాప్తు జరిపారు. చివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆంధ్రా ఉన్నతాధికారులు పోస్టింగ్ ఇచ్చారు. ఆప్కో అనంతపురం డైరెక్టర్ శ్రీనివాసులు ప్రోద్బలంతోనే అతనికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆప్కోను వెంటనే విభజించి, సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి