గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 27, 2014

ఉల్లంఘనలు వారికి అలవాటే!

-పెద్దమనుషుల ఒప్పందం నుంచి పీపీఏల దాకా అదే వైఖరి
-ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
-తెలంగాణకు విద్యుత్ దక్కకుండా కుట్రలకు శ్రీకారం
ఒప్పందాల ఉల్లంఘనల్లో సీమాంధ్రులు ఆదినుంచి ఘనులే..! నాడు పెద్దమనుషుల ఒప్పందంనుంచి నేటి పీపీఏల (విద్యుత్ ఒప్పందాల) దాకా అదే వైఖరి అవలంబిస్తున్నారు..! ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు..! తెలంగాణపై తనకున్న అక్కసును వెల్లగక్కడానికే పీపీఏ కుట్రకు చంద్రబాబు తెరతీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఈఆర్సీ ఆమోదించలేదన్న సాకుతో తెలంగాణ రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన వాటా (53.89 శాతం)కు కత్తెర పెట్టిన ఏపీ సర్కారు కుట్రలను మూడు నెలలుగా నమస్తే తెలంగాణ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ వస్తున్నది.

babu-cartoon

ఆంధ్రాలోని పవర్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం లేదనే కారణం, ప్రస్తుతం ఆంధ్రాల్లో నిర్మాణాలు పూర్తిచేసుకున్న కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టులకు అసలు పీపీఏలే లేవనే సాకుతో తెలంగాణకు విద్యుత్ వాటా దక్కకుండా చేసే ప్రయత్నాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని న్యాయ, విద్యుత్ రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. తన పాలనలో తానే స్వయంగా ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాలను నేడు చంద్రబాబు బేఖాతరు చేయడం.. చట్టధిక్కారమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌వాటాలకు సబంధించిన జీవో నం.53కి చట్టబద్ధత లేదనడం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను ఉల్లంఘించడమేనని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. కాగా, పీపీఏలకు ఏపీఈఆర్సీసీ ఆమోదం ఉన్నట్లే భావించాలని కూడా ఈఆర్సీ స్పష్టం చేసినా.. ఏపీ ప్రభుత్వం పట్టువీడటం లేదు. విశాఖపట్నం సమీపంలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్) తెలంగాణ యాజమాన్యహక్కులు లేవనడం ఎంతమాత్రం సరైందికాదని నిపుణులు పేర్కొంటున్నారు. హిందుజాలో విద్యుత్ విభజన తెలంగాణకు 53.89శాతం వాటా, ఆంధ్రప్రదేశ్‌కు 46.22 శాతం వాటాలను విభజన చట్టం స్పష్టంగా పేర్కొందని.. దీని ప్రకారం 1040 మెగావాట్ల సామర్ధ్యం గల హిందుజా ప్రాజెక్టునుంచి రాష్ర్టానికి 600మెగావాట్లకు పైగా విద్యుత్‌వాటా దక్కాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు.

కృష్ణపట్నంపై కిరికిరి


సమైక్యరాష్ట్రం (ఆంధ్రప్రదేశ్)లోని నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉమ్మడి వాటాతో ఏర్పాటైన నెల్లూరు జిల్లాలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్) విద్యుత్ ఉత్పత్తిలోనూ తెలంగాణకు వాటా లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొనడం అనైతికమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ (కృష్ణపట్నం) 2013 ఆగస్టులో బాయిలర్ లైటప్ చేసి ఏపీజెన్‌కో సరికొత్త చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి ఏపీజెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ) కింద ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ(ఏపీపీడీసీఎల్) ఏర్పాటుచేశాయి. ఏపీపీడీసీఎల్ ఆధ్వర్యంలో 2X800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మాణం జరపాలనేది వాటి లక్ష్యం. అందులో ఏపీజెన్‌కో 51 శాతం వాటా, నాలుగు డిస్కమ్‌లు 49 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. నాలుగు డిస్కమ్‌ల్లో సీమాంధ్రలోని రెండు డిస్కమ్‌లు(ఈస్ట్రన్, సదరన్), తెలంగాణలోని రెండు డిస్కమ్‌లు(సెంట్రల్, నార్తరన్) ఉన్నాయి. డిస్కమ్‌లకు సంబంధించిన వాటాలను కూడా గతంలోనే నిర్దేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం ఇప్పటికే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి(కమిషన్ ఆఫ్ డేట్-సీఓడీ) చేయాల్సి ఉంది. ఇదే సమయంలో మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే ఏపీ మంత్రులు కృష్ణపట్నంపై కిరికిరి చేయడంలో అర్థంలేదని న్యాయ, విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి