గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 26, 2014

ఏపీఎండీసీపై ఆంధ్రాబాబు మరో కుట్ర...!!!

-డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కార్
-నిధుల పంపిణీపై పేచీకోసమే!
-న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రా సర్కార్ మరోసారి ఉల్లంఘించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ప్రకటించి మరో వివాదానికి కాలు దువ్వింది. ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా, రెవెన్యూ, ఆర్థిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ అండ్ జియాలజీ సంచాలకులను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో గందరగోళం నెలకొంది. విభజన ప్రక్రియ పూర్తి కాకముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను నియమించడం సమర్థనీయం కాదని ఉద్యోగులు అంటున్నారు. చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా దోచుకోవడానికే ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి డీమెర్జర్ ప్లాన్‌పై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆంధ్రా సర్కార్ మాత్రం తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
న్యాయం కోసం.. ఏపీ ఎండీసీలో ఆంధ్రా చట్ట విరుద్ధ చర్యలను తెలంగాణ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రా బాబు దుశ్చర్యలను సీరియస్‌గా తీసుకున్న సీఎం న్యాయస్థానంలో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ ఉద్యోగుల వేతనాలు ఆపడంనుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం దాకా ఏపీ ఉల్లంఘనల చిట్టాలన్నింటి మీదా ప్రభుత్వం దృష్టి సారించింది. సంస్థ ఆదాయ పంపిణీని విభజన చట్టం ప్రకారమే జరపాలని మన ప్రభుత్వం చెబుతుంటే ఏపీ సర్కారు మాత్రం మొత్తానికి మొత్తం మళ్లించుకోవాలని చూస్తున్నది.

మధ్యేమార్గంగా డీమెర్జర్ ప్లాన్‌ను నిపుణులకమిటీ ఆమోదించి సంస్థ విభజన జరిగేదాకా నిధులను ఏ రాష్ట్రమూ వినియోగించుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. ఏపీ సర్కారు దుశ్చర్యలను ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తెలంగాణ ఆదాయవనరులను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారన్నారు. కడపనుంచి ఆదాయం ఎక్కువగా వస్తున్నదంటూ నిధులన్నీ ఆంధ్రకు తరలించాలని చూస్తున్నాడని, అదే ఇతర సంస్థల విషయానికి వచ్చినపుడు మాత్రం జనాభా ప్రాతిపదిక అంటూ వాదిస్తున్నాడని మండిపడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి