గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 24, 2014

మానండయ్యా...మీ చౌకబారు రాజకీయాల్ని...!!!

సీమాంధ్ర పాలనలో తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో- కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా చేయగలిగినంత చేస్తున్నది. కానీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినందు వల్ల లోటు ఏర్పడుతున్నది. గత ఏడాది దాదాపుగా ఇదే సమయానికి రోజువారీ డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా ఆనాటి ప్రభుత్వం 122. 35ఎంయూలు సరఫరా చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక కుట్రలు, అడ్డంకుల మధ్య గతం కన్నా ఎక్కువగా 143 ఎంయూలు సరఫరా చేసింది.
తెలంగాణ రైతులు నీళ్ళులేక, కరెంటు లేక గోస పడుతున్నారంటే ఇందుకు కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు చేసిన ద్రోహమేనని చిన్న పిల్లలు కూడా చెప్పగలరు. అయినా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ తక్షణమే కరెంటు ఇవ్వాలని రాద్ధాంతం చేయడం విచిత్రంగా ఉన్నది. విద్యుత్ సమస్యలు తీర్చాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు గురువారం సచివాలయానికి వచ్చి ధర్నాకు దిగారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం, రైతులపై ప్రేమ ఒలకబోయడం ఇది మొదటిసారి కాదు. కొద్ది రోజుల కిందటనే ఈ టీడీపీ పెద్దలు బస్సుయాత్ర చేపట్టారు. మేమున్నామంటూ కాంగ్రెస్ వాళ్లు రైతు భరోసా యాత్ర అంటూ ఒకటి చేపట్టారు.

కలెక్టరేట్ల ముందు ధర్నాలు సాగించారు. రోజుకో పెద్దమనిషి కరెంటు సమస్య మీద ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇది చాలదన్నట్టు బీజేపీ నాయకులు కూడా నిరసనలకు దిగారు.

వైఎస్‍ఆర్‍సీ పార్టీకి చెందిన ఒక నాయకుడైతే చంద్రబాబు ముందు చూపు వల్లనే ఆంధ్ర ప్రదేశ్ కరెంటు కొరతను ఎదుర్కోవడం లేదని ప్రశంసిస్తున్నాడు.

ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా ముందు చూపుతో వ్యవహరించి సీమాంధ్ర ప్రాంతానికి కరెంటు కష్టాలు లేకుండా చూసుకున్నారు.

కానీ తెలంగాణకు చెందిన ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ముందుచూపుతో ఏమి చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలె!

వీళ్ళే...ప్రజలకు రెండు అంశాలపై సంజాయిషీ ఇచ్చుకోవాలె. 

మొదటిది- రైతుల కోసం ఇంత గొడవ చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన ద్రోహం గురించి ఆనాడు ఎందుకు మాట్లాడ లేదు?

రెండవది- ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఎందుకు నిలదీయడం లేదు?

ఇంతకాలం తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు నిర్లక్ష్యం చేయడం వల్లనే రైతులు బోరుబావులు తవ్వుకుని కరెంటుపై ఆధారపడే గతి పట్టింది.

తెలంగాణలో కరెంటు అవసరం ఉన్నది.

ఇక్కడే బొగ్గు, నీటి వనరులు ఉన్నాయి. అయినా సీమాంధ్రలో విద్యుత్ కేంద్రాలు నెలకొల్పి, ఇక్కడి వాటిని నిర్మాణం జరగకుండా తొక్కిపెట్టింది సీమాంధ్ర పాలకులే కాదా?
-రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఇవ్వాలని స్పష్టంగా ఉన్నది.
-అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
-చంద్రబాబు తెలంగాణకు కరెంటు ఇవ్వాల్సి వస్తుందని విద్యుత్కేంద్రాల ఉత్పత్తిని నిలిపివేయడం ఎంత అన్యాయం! ---పీపీఏల రద్దుకు యత్నించాడు.
-విద్యుత్కేంద్రాలు ఉత్పత్తి చేయకపోవడం వల్ల సీమాంధ్ర ప్రజలకు వచ్చే లాభమేమీ లేదు. కానీ ఇక్కడి రైతుల కడుపు మీద దెబ్బ కొట్టడానికి విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా పడావు పెట్టడం ఎంత క్రూరమైన చర్య!
-ముంపు గ్రామాల బదిలీకి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పినప్పుడు- అది విభజన చట్టంలో ఉందంటూ దీర్ఘాలు తీసిన బీజేపీ నాయకులు ఇప్పుడు అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటా విద్యుత్ ఇవ్వాలని అడగందుకు?

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అంతిమ బాధ్యత కేంద్రానిదే అని విభజన చట్టంలో ఉంది కదా. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా చంద్రబాబును, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలె. ఇక్కడ ఆందోళనలు జరిపి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం తగదు.

సీమాంధ్ర పాలనలో తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో- కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా చేయగలిగినంత చేస్తున్నది. కానీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినందు వల్ల లోటు ఏర్పడుతున్నది. గత ఏడాది దాదాపుగా ఇదే సమయానికి రోజువారీ డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా ఆనాటి ప్రభుత్వం 122. 35ఎంయూలు సరఫరా చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక కుట్రలు, అడ్డంకుల మధ్య గతం కన్నా ఎక్కువగా 143 ఎంయూలు సరఫరా చేసింది. అయితే డిమాండ్ 165 ఎంయూలకు పెరగడం వల్ల కొరత ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఈ కొరత సమస్య తీర్చాలని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. మన రాష్ట్రం ఏర్పడింది కనుక మన రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పనులు సాగుతాయి. చెరువుల పూడిక తీయించడానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు దీర్ఘకాలిక వ్యూహాలు అమలు అవుతున్నాయి.

దీని వల్ల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఈ వాస్తవాలు తెలిసి కూడా ప్రతిపక్షాలు సీమాంధ్ర పాలకవర్గాలు ఆడించినట్టల్లా ఆడడం సమర్థనీయం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని గడువుకు ముందే కూలుస్తానని ఇటీవలే చంద్రబాబు నిర్లజ్జగా వ్యాఖ్యానించాడు. మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అదే ఎజెండాను అమలు చేస్తున్నాయనే అనుమానం కలుగుతున్నది.

ఏ రాష్ట్రంలో అయినా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు, నాయకులు ఒక్కటిగా నిలబడతారు. ఉదాహరణకు- కర్ణాటకకు, తమిళనాడుకు కావేరీ జలాల కోసం వివాదం తలెత్తినప్పుడు- రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఎక్కడివారు అక్కడ తమ రాష్ట్రం ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించాలె. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత ఎంతో గొప్పది. అవి నిర్మాణాత్మకంగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి