గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 16, 2015

ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్...!!!

-ఏపీ పోలీసులకు త్వరలో సమన్లు?
-పలువురు టీడీపీ నేతలకు కూడా!
-అజాలేని మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డి
-వారికి షెల్టర్ ఇస్తున్న ఏపీ పోలీసులు!
-పక్కా ఆధారాలు సంపాదించిన ఏసీబీ
-నిందితుల కాల్‌డాటా ఆధారంగా చర్యలు!
ఓటుకు నోటు కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితులు మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డిలకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చినట్టు ఏసీబీ దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారని తెలుస్తున్నది. నిందితుల కాల్‌డాటాను పరిశీలించిన ఏసీబీ అధికారులు.. వాటి ఆధారంగా పలువురు ఏపీ పోలీసులకు విచారణకు రావాలంటూ సమన్లు పంపించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఏ 4గా ఉన్న మత్తయ్య నుంచి తాజాగా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి వరకూ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే.


kondalreddy

వీరిపై దృష్టిసారించిన ఏసీబీ దర్యాప్తు బృందం.. నిందితులు తరచూ ఏపీ పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారని గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలకూ సమన్లు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసు ప్రారంభమైనప్పటినుంచి రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు జిమ్మీబాబుతో టీడీపీలోని కీలక హోదాలో ఉన్న నలుగురు నేతలు మాట్లాడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి.


కేసును నీరుగార్చేందుకు టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న ఓ ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లు కూడా వీరితో ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌డాటాలో తేలిందని ఓ కీలక అధికారి స్పష్టంచేశారు. ఒక కేసులో నిందితులను రాష్ట్రం దాటించేయడంపై ఏసీబీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులకు నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైతే కోర్టుదృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందుతామని కీలక అధికారి తెలిపారు. ఏపీ పోలీస్ అధికారులకు కోర్టు ద్వారానే నోటీసులిప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. 


మొదటి నుంచీ ఏసీబీకి అనుమానం


ఓటుకు నోటు కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి టీడీపీ పెద్దలు నిందితులకు, ఆరోపణలెదుర్కుంటున్న వారికి ఆశ్రయం ఇస్తున్నారని ఏసీబీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ4 నిందితునిగా ఉన్న మత్తయ్య అరెస్టు కాకుండా తప్పించుకోవడంతోపాటు విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కేసు కూడా పెట్టారు. అయితే ఒక సంచలనాత్మక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేయడమే కాకుండా ఆ కేసును అక్కడి పోలీస్ పెద్దలు ప్రత్యేకంగా సీఐడీకి బదిలీ చేశారు.


ఒక కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తిని సంబంధిత దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న విషయాన్ని విస్మరించారు. పైగా కేసును నీరుగార్చేందుకు పోలీసులే మత్తయ్యకు విజయవాడలో షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు ఓటుకు నోటు కుట్రలో భాగస్వామ్యం వహించిన జిమ్మీబాబును కూడా ఏపీ పోలీస్ పెద్దలు తప్పించారని, అతనికి విజయవాడ, గుంటూరులో షెల్టర్ ఇచ్చినట్టు తమ వద్ద కాల్‌డాటా ఆధారాలున్నాయని ఏసీబీ చెప్తున్నది. విచారణకు హాజరుకావాలని జిమ్మీబాబుకు నోటీసులిచ్చినా అతడు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డి కూడా ఏసీబీ నోటీసులను పట్టించుకోకుండా విశాఖలో మకాం వేశాడని తెలిసింది.



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి