గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 13, 2015

బాబుకు నోట్ల దడ...!!!

-ఓటుకు నోటు కేసు తప్పించుకునేందుకు కొత్త కుట్ర!
-లోకేశ్ డ్రైవర్‌కు తెలంగాణ ఏసీబీ తాఖీదులతోప్రతీకార చర్యలకు దిగిన ఏపీ యంత్రాంగం!
-మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసుల జారీకి యత్నం
-సీఎం క్యాంప్ ఆఫీస్, ఇంటి వద్ద ఏపీ అధికారుల హైడ్రామా
-టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చి భంగపడిన తీరులో మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టిన ఏపీ సీఐడీ

ఓటుకు నోటుకు కేసులో ఏసీబీ చర్యలతో ఏపీ సీఎం చంద్రబాబుకు గుండె దడ పట్టుకున్నట్టుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో నేరుగా మాట్లాడి ప్రలోభపెట్టిన చంద్రబాబు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు మతిలేని చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి తెచ్చిన యాభై లక్షల రూపాయలు చంద్రబాబు కుమారుడు లోకేశ్ వద్ద డ్రైవర్‌గా పని చేసే కానిస్టేబుల్ కొండయ్య ద్వారా వచ్చినట్లు ధ్రువీకరించుకున్న ఏసీబీ దర్యాప్తు అధికారులు ఆయనకు బుధవారం నోటీసులు ఇచ్చారు.


babu


కొండల్‌రెడ్డిని విచారిస్తే లోకేశ్ పాత్రపై ఆధారాలు బయటికి వచ్చే అవకాశం ఉండటంతో కంగారెత్తిన ఏపీ సీఎం.. తమ రాష్ట్ర సీఐడీని తెలంగాణపైకి ఎగదోశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీ రామారావు డ్రైవర్, గన్‌మెన్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించేందుకు అర్ధరాత్రి పూట హైదరాబాద్‌లో అలజడి చేసిందని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఆడియో టేపులను ప్రసారం చేసిన టీ న్యూస్ చానల్‌కు అత్యుత్సాహంతో నోటీసులు ఇచ్చి భంగపాటుకు గురైన చంద్రబాబు యంత్రాంగం.. ఇదే పద్ధతిలో ఇప్పుడు కేటీఆర్ డ్రైవర్, గన్‌మెన్‌లకు నోటీసులు ఇచ్చే దుస్సాహసానికిపాల్పడిందని అంటున్నారు. 


అర్ధరాత్రి ఏపీ అధికారుల హల్‌చల్


చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్‌వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కొండల్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌కు డబ్బు రవాణాలో లింక్ ఉన్నదని అనుమానించిన తెలంగాణ ఏసీబీ అధికారులు.. అతడికి నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతీకారంగానే.. మత్తయ్య ఫిర్యాదు మేరకు అని చెప్తూ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గన్‌మెన్ జానకీ రాం, డ్రైవర్ సత్యనారాయణకు బుధవారం రాత్రి సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ సీఐడీ బృందం, విశాఖ సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చాయి. 


babu1


సీఎం క్యాంప్ కార్యాయలంలో కేటీఆర్ గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు ఇచ్చేందుకు బుధవారం రాత్రి చేరుకున్నారు. అయితే సీఎం క్యాంప్ కార్యాయలంలోకి అనుమతి లేదని, జానకీరాం, సత్యనారాయణ అనే పేర్లతో ఇక్కడ ఎవరూ పనిచేయడం లేదని బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అక్కడినుంచి వెనుదిరిగిన సీఐడీ బృందాలు నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్ పాత ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా ఆ పేర్లతో ఎవరూ పనిచేయడం లేదని సమాధానం రావడంతో విజయవాడ సీఐడీ బృందం వెనుతిరిగింది. మరోవైపు విశాఖనుంచి వచ్చిన సీఐడీ బృందం పీఎస్ ప్రకాశ్ పేరుతో ఇక్కడ ఎవరైనా పనిచేస్తున్నారా? అంటూ బందోబస్తులో ఉన్న అధికారులను అడిగింది. 


అలాంటి వారు ఎవరూ లేరని చెప్పడంలో ఆ బృందం కూడా తిరిగి వెళ్లిపోయింది. విజయవాడ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ షావలీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాము కేటీఆర్ గన్‌మెన్‌తో పాటు డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. విశాఖ సీఐడీ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ తాము కేటీఆర్ పీఎస్ ప్రకాశ్ అనే వ్యక్తితో పాటు మరో గన్‌మెన్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చామని తెలిపారు. దీనితో రెండు బృందాలుగా వచ్చిన అధికారులు.. మొత్తం నలుగురికి నోటీసులిచ్చేందుకు వచ్చినట్టు స్పష్టమైంది. 


అయితే.. ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయానికి వెళ్లిన ఏపీ బృందాలు.. అక్కడి విభాగపు ఉన్నతాధికారులతో మాట్లాడి, వెనుదిరిగాయి. ఓటుకు నోటు కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేంను బెదిరించారన్న ఆరోపణలపై తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆ నోటీసులలో పేర్కొన్నట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటలోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం.


లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులతోనే!


ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన డబ్బులెక్కడివి? ఎవరి నుంచి వచ్చాయి? ఎవరి ఖాతాల నుంచి డ్రా చేశారు? అనే కీలక అంశాలు తేల్చేపనిలో ఉన్న ఏసీబీ.. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత తనయుడు లోకేశ్‌బాబు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ కొండల్‌రెడ్డిపై నజర్ వేసింది. 


రేవంత్‌రెడ్డికి 50 లక్షల నగదు కొండల్‌రెడ్డి అందించినట్లు గుర్తించామని, అందుకే ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యామని ఏసీబీలోని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పదిన్నరకల్లా తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ యూసఫ్‌గూడలోని కొండల్‌రెడ్డి ఇంటికి ఏసీబీ దర్యాప్తు అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అతికించారు. కొండల్‌రెడ్డిని విచారిస్తే చినబాబు పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.


లోకేశ్‌పై ఏసీబీ నజర్?


చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఓటుకు నోటు కేసులో పాత్రధారుడేనన్న అనుమానాలు ఏసీబీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి గన్‌మెన్లతో కొండల్‌రెడ్డి ఎందుకు మాట్లాడాడు? లోకేశ్‌ను రేవంత్ ఎప్పుడెప్పుడు కలిశాడు? కలిసిన సమయంలో మాట్లాడిన అంశాలేంటి? లోకేశ్ ఎప్పుడైనా కుట్ర సమయంలో రేవంత్‌తో మాట్లాడాడా? మాట్లాడితే కుట్రలో లోకేశ్ పాత్ర ఏంటి? అన్న అంశాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్నట్టు ఆ విభాగపు అధికారులద్వారా తెలిసింది. అయితే ఈ కేసులో అరెస్టయిన వారి విచారణను కూడా ఏసీబీ ఇదే రీతిలో టైట్ చేసింది. సండ్ర గన్‌మెన్లు, రేవంత్ డ్రైవర్, గన్‌మెన్లు ఇలా ఏ చిన్న ఆధారాన్నీ ఏసీబీ అధికారులు వదిలిపెట్టకుండా సేకరించారు. ఈ క్రమంలో ఇప్పుడు లోకేశ్‌పై ఏసీబీ దృష్టిసారించినట్లు అర్థమవుతున్నదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 


చంద్రబాబు డోర్ కొట్టిన ఏసీబీ


-కొండల్‌రెడ్డి అక్కడ లేకపోవడంతో ఎన్టీఆర్ భవన్‌కు
-అటు నుంచి యూసఫ్‌గూడలోని కొండల్‌రావు ఇంటికి
ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు చంద్రబాబు ఇంటి డోర్ కొట్టారు. చంద్రబాబు ఇంటికి వెళ్లాలంటే పోలీసు పెద్దలూ ముందూ వెనుకా ఆలోచించే నేపథ్యంలో నేరుగా ఆయన ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లటం విశేషం. అయితే.. వారు వెళ్లింది చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కాదు! 


చంద్రబాబు తనయుడు లోకేశ్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కొండల్‌రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు! అక్కడ కొండల్‌రెడ్డి లేకపోవడంతో ఆ వెంటనే టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు ఏసీబీ అధికారులు వెళ్లారు. అక్కడా ఆయన జాడ లేకపోవడంతో యూసఫ్‌గూడలో ఆయన నివసించే ఇంటికి వెళ్లి.. గోడకు నోటీసులు అతికించి వచ్చారు. తగిన ఆధారాలు దొరికితే ఈసారి చంద్రబాబు ఇంటికి వెళ్లి, ఆయనకు, ఆయన కుమారుడికి నోటీసులు అందజేయడానికీ వెనుకాడబోమని అధికారులు నిరూపించారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి