గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 17, 2015

ఆంధ్రా అక్రమార్కుల కుట్రలను ఛేదిద్దాం..

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చెన్నై నగరాన్ని 24 గంటల్లో ఖాళీ చేయాలని తమిళనాడు రాజాజీ ఆదేశించిన వాళ్లను తెలంగాణలో కలుపుకుని అరవై ఏళ్లు శిక్ష అనుభవించాం. ఇప్పుడు అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణను అస్థిరపర్చే కుట్రలను భగ్నం చేసుకుంటూ స్వయం పాలనలో బంగారు తెలంగాణ దిశగా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్న తెలంగాణ సర్కారుకు అండగా నిలవాలి.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు మనకు ఒక్కటే ఎజెండా. ఇప్పుడు అది రెండు రకాలు మారింది. ఒక్కటి అరవై ఏళ్ల ఉద్యమ విజయం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అస్తిరపర్చే కుట్రల నుంచి కాపాడుకోవడం, రెండోది తెలంగాణ అభివృద్ధి పునాదిని పటిష్టంగా నిర్మించుకోవడం. ఇన్నాళ్లు సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని సీమాంధ్ర కుట్ర జీవులు ఇప్పుడు స్వయం పాలనలో తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలతో తెలంగాణ ప్రజల మనస్స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రత్యక్ష, పరోక్ష దాడులకు దిగుతున్నారు.

అరవై ఏళ్లు తెలంగాణలో ఆవాసం ఏర్పరచుకుని ఇక్కడి వనరులను కొల్లగొడుతూ బతుకుతున్న సీమాంధ్ర రాజకీయశక్తులు, మీడియా ఇప్పుడు తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించడానికి నిస్సిగ్గుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. అరవై ఏళ్ల సీమాంధ్రుల పాలనకు, స్వయం పాలనకు చాలా తేడా ఉందని ప్రజలు సంతోషంగా గుర్తిస్తున్నప్పటికీ, బానిస మనస్తత్వానికి అలవాటుపడిన కొందరు తెలంగాణ నాయకులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.

వాళ్ల చేష్టలకు సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం కూడా తోడైంది. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ వచ్చింది కదా ఇంకా అన్ని సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదంటూ కొందరు సృష్టిస్తున్న గందరగోళాన్ని గుడ్డిగా నమ్మితే రాష్ట్రం ఆగమైపోతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను ఎలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. 

  • తెలంగాణ కరెంటు కష్టాల్లో ఉంటే మన వాటా మనకు రావాల్సిన కృష్ణపట్నం కరెంటు మనకు ఇవ్వలేదు.
  • పోలవరం ముంపు మండలాలను కలుపుకుని అందులో ఉన్న సీలేరు విద్యుత్తు మనకు ఇవ్వలేదు.
  • హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగుల మీద ఈగ వాలకపోయినా తమకు భద్రత లేదంటూ కేంద్రానికి స్వయంగా ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేత పలుమార్లు ఫిర్యాదు చేయించి హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారు.
  • సాగర్ జలాల విషయంలో ముందుగా పోలీసులను డ్యాం మీదికి పంపించి గొడవపెట్టి మళ్లీ వాళ్లే గవర్నర్ వద్ద పరిష్కారానికి ప్రయత్నించామని చాటింపు చేసుకున్నారు.

సీమాంధ్ర బానిస నేతలు ముఖ్యమంత్రి మీద దూషణలకు దిగుతున్నా వాళ్లకు అభివృద్ధితోనే సమాధానం ఇవ్వాలనే తరహాలో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారు. హైకోర్ట్ విభజన విషయంలో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో అర్ధమవుతూనే ఉంది. ఇప్పుడున్న హైకోర్టును ఆంధ్రాకు కేటాయించినా అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయినా విభజనకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. చివరికి తెలంగాణ కేసులను మహారాష్ట్ర లేదా కర్నాటక హై కోర్టులకు బదిలీ చేయాలని ఇక్కడి పార్లమెంట్ సభ్యులు కేంద్ర న్యాయశాఖా మంత్రిని కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


ఇలాంటి కుట్రలన్నీ ప్రత్యక్షంగా కనిపించేవి. చాపకింద నీరులా తెలంగాణ ప్రజల ధైర్యాన్ని చెదరగొట్టే పనులు కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గంటల తరబడి విరామం లేకుండా అభివృద్ధి సమీక్షలు, ప్రజల్లో పర్యటనలు చేస్తుంటే ఆయన ఆరోగ్యం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని తండ్రిలా భావించే ఒక మంత్రి ఇంకో పార్టీలో చేరుతున్నాడని వారి ఆస్థాన మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఉన్న వివిధరకాల అసంతృప్తి వాదులతో వేదికలను ఏర్పాటు చేయించే పనులను మొదలు పెట్టారు. పాత పాచికలు పారకపోవడంతో కొత్తవాటి కోసం దేవులాడుతున్నారు. మొత్తానికి తెలంగాణ మీద కుట్రలను సజీవంగా నిలిపే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ముందు ముందు కొత్తరూపాల్లో మనల్ని చెదరగొట్టడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చెన్నై నగరాన్ని 24 గంటల్లో ఖాళీ చేయాలని తమిళనాడు రాజాజీ ఆదేశించిన వాళ్లను తెలంగాణలో కలుపుకుని అరవై ఏళ్లు శిక్ష అనుభవించాం. ఇప్పుడు అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణను అస్థిరపర్చే కుట్రలను భగ్నం చేసుకుంటూ స్వయం పాలనలో బంగారు తెలంగాణ దిశగా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్న తెలంగాణ సర్కారుకు అండగా నిలవాలి.

రైతుల రుణమాఫీ, ఆసరా పింఛన్లు, ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్, అంగన్వాడీ ఉద్యోగులు, హోంగార్డుల జీతాల పెంపు, రేషన్ బియ్యం పరిమితి పెంపు, హాస్టళ్లకు సన్న బియ్యం, హైదరాబాద్ సహా తెలంగాణ శాంతిభద్రతల మెరుగుదలకు నిధుల కేటాయింపు.. ఇలా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కరెంటు సమస్యను మన సీఎం పరిష్కరించారు. విద్యుత్తు, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వీటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు సంపాదించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయి సరిపడా కరెంటు చేతికొచ్చేలోపు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలనేది ముఖ్యమంత్రి ప్రణాళిక. విభజన సమయంలో ఇన్ని పనులు చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలంగాణను అస్థిరపరచే బయటి, ఇంటి శత్రువుల కుట్రలను ఎదుర్కొనే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద సీఎం కేసీఆర్ ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది .

- మిట్ట సైదిరెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి