గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, డిసెంబర్ 24, 2014

ఏపీఎండీసీ నిధుల పంపకానికి...ఆంధ్రా సర్కారు...నో...

-నిధుల సర్దుబాటుకు ససేమిరా
-రుణమిస్తూ గట్టెక్కించే యత్నం
-అడ్డదారిలో ఏపీఎండీసీకి 15 కోట్లు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)లో పుష్కలంగా ఉన్న నిధులను జనాభా ప్రాతిపదికన పంచడానికి మనసొప్పని ఆంధ్రా ఆధిపత్యం వైపరీత్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని నిబంధనలను తుంగలో తొక్కి, తెలంగాణకు రావాల్సిన వాటాను పంచకుండా ఏవో సాకుల్ని ఏపీ ప్రభుత్వం చూపుతున్నది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నిధుల పంపకాల్లో విభిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఏపీఎండీసీలో రూ.700 కోట్లకు పైగా నిధులు బ్యాంకు ఉమ్మడి ఖాతాల్లో నిల్వ ఉన్నాయి. 
వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని చట్టం చెబుతున్నది. అయినా డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించకుండా, నిపుణుల కమిటీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆరు నెలలు పూర్తయినా నిధులను మాత్రం ఇవ్వకుండా తప్పించుకునేందుకు కుట్రలు సాగిస్తున్నారు.
జీరో బ్యాలెన్స్‌తోనే తెలంగాణ ఉద్యోగుల విభజన చేపట్టడంతో, ఆర్థిక ఇబ్బందుల మధ్య తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్ర ఖాతాల్లోని నిధులను దొడ్డిదారిన డ్రా చేస్తున్న ఉదంతాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతో ఆంధ్రా సర్కారు రూట్ మార్చింది. 

అడ్డదారుల్లో నిధులను వినియోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో జీఓ నం.400, తేదీ.17-12-2014 ద్వారా తాజాగా ఏపీఎండీసీకి ఆంధ్రా సర్కారు రూ.16 కోట్లు రుణంగా ఇచ్చింది.
ఓ సంస్థకు ప్రభుత్వమే రుణమిచ్చిన వైనం ఎక్కడా జరగలేదని, ఇదే తొలిసారిగా అధికారులు చెప్పుకుంటున్నారు.
తమ ప్రాంతం నుంచే ఆదాయం అత్యధికంగా వస్తున్నదనే ఏకైక కారణాన్ని తెర మీదికి తీసుకొస్తూ, ఉమ్మడి ఖాతాల్లోని నిధులను జనాభా ప్రాతిపదికన పంచుకోవడానికి మాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం.

19 ప్రభుత్వ రంగ సంస్థల్లో
ఒకటీ, రెండు సంస్థలకు మాత్రమే ఆంధ్రా ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తున్నదని,
మిగిలిన అన్ని సంస్థలకూ తెలంగాణ పది జిల్లాల నుంచే 70 శాతానికి పైగా నిధులు సమకూరుతున్నాయని
అధికారులు పేర్కొన్నారు.

అన్ని సంస్థల నుంచి జనాభా ప్రాతిపదికన 5 శాతం వాటా ఆంధ్రాకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నష్టపోతున్నది.
కానీ ఏపీఎండీసీలో మాత్రం జనాభా ప్రాతిపదికన కాకుండా లొకేషన్ పద్ధతిన పంచాలని కోరుకోవడం అనైతిక చర్య అని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇకనైనా చట్ట ప్రకారం రూపొందిన ఏపీఎండీసీ డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించేందుకు ప్రయత్నించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్యోగులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి