గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 25, 2014

ఉమ్మడి విద్యామండలిలో...ఆంధ్రా జులుం...!?


క్రైస్తవ సోదరులకు
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

ఉన్నత విద్యామండలిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్ర అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్‌ఈ)కి సహకరిస్తున్నారన్న సాకుతో ఉద్యోగుల జీతాలను నిలిపేస్తున్నారు. ఉమ్మడి నిధుల్లో తెలంగాణకు సంబంధించిన 48 శాతం నిధులున్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు నవంబర్ నెల జీతం ఇంకా ఇవ్వలేదు. ఉమ్మడి విద్యామండలి జీతం తీసుకొంటూ.. తెలంగాణ విద్యామండలికి పనిచేస్తున్నారని సాకులు చూపిస్తున్నారు. ఆయన పేరును ఉద్యోగుల రిజిస్టర్ నుంచి తొలగించారు. బయోమెట్రిక్ యంత్రం నుంచి తన వేలిముద్రలను కూడా తొలగించినట్లు సత్యనారాయణ వెల్లడించారు. గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆయన, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆయన 2004లో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగానూ పోటీచేశారు. 2007లో 21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత...
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటైనా... దానికి సిబ్బంది, విధులు, నిధుల విభజన జరుగలేదు. దీంతో టీఎస్సీహెచ్‌ఈకి సత్యనారాయణ...తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

అటు విభజన పూర్తికాకపోవడంతో ఉమ్మడి ఉన్నత విద్యామండలి తరఫున సమాచారహక్కు చట్టం, మానవ వనరుల అభివృద్ధి విభాగం వంటి కార్యకలాపాలు కూడా సత్యనారాయణ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 


ఇప్పుడు దాన్నే సాకుగా చూపిస్తూ ఆయన నవంబర్ జీతాన్ని నిలిపివేసి ఆయనను మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఉమ్మడి విద్యామండలిలో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది తెలంగాణ విద్యామండలి కోసం పని చేయవద్దంటూ ఏపీ అధికారులు హుకుం జారీచేశారు.

ఒకవేళ అలాచేస్తే రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించారు. రెండు, మూడు రోజుల్లో జీతాల చెల్లింపుపై సానుకూల నిర్ణయం రాకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం చర్యలు తీసుకొంటామని టీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు వెంకటాచలం, మల్లేశం హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి