గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 16, 2015

ఒంటరినై పోయాను...ఇక ఇంటికి (ప్రజల్లోకి) ఏమని పోను?

ఏకాకి బాబు!

chandra


ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకాకిగా మారిపోతున్నారు. కేంద్రంలో పెద్దలను కలిసినా ఫలితం లేకపోవడం, గవర్నర్ వద్దే తేల్చుకోవాలని సలహా ఇవ్వడంతో ఇక ఈ కేసు నుంచి తనను బయటపడేసే బాధ్యతను ఏపీ పోలీసుల నెత్తిపైనే పెట్టినట్లు తెలుస్తున్నది. ఎంత ఆగ్రహంతో ఊగిపోతూ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ.. వారు సైతం కేసు బలంగా ఉన్న నేపథ్యంలో చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు చంద్రబాబు రాజీనామాకు విపక్షాలు మూకుమ్మడి గొంతుతో డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు స్వపక్షంలో అసమ్మతిరాగం పెరుగుతున్నది.
-నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్
-బాబు ఫోన్ ట్యాపింగ్‌కు ఆస్కారమే లేదు
-నగరంలో శాంతి భద్రతల సమస్య లేదు
-సెక్షన్ 8 ప్రసక్తే ఉత్పన్నం కాదని వివరణ
-ఓటుకు నోటు కేసులో మూసుకుపోయిన దారులు
-జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విముఖత
-బయటపడేయాలని సొంత పోలీసులపై బాబు ఒత్తిడి
-చేతులెత్తేస్తున్న ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు
-గవర్నర్ సలహాదారులను పిలిపించడంపై రగడ
-బాబు రాజీనామాకు కాంగ్రెస్, లెఫ్ట్ డిమాండ్

ఇవి సరిపోవన్నట్లు.. గవర్నర్ సలహాదారులను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని వారికే సలహాలు ఇవ్వడం కొత్త వివాదానికి దారితీస్తున్నది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిసి దాదాపు గంటన్నరపాటు చర్చలు జరుపడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. పలు ఇతర అంశాల ప్రస్తావనతోపాటు ఓటుకు నోటు కేసు, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ఉభయుల మధ్య చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

వివాదం రేపుతున్న సలహాదారులతో భేటీ


ఓటుకు నోటు కేసులో తన పేరు చార్జిషీటులోకి ఎక్కడం ఖాయమని తేలిపోవడంతో కేంద్రాన్ని సంప్రదించిన బాబుకు.. అక్కడి నుంచి వచ్చిన సలహా ఆయన పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేసినట్లయింది. ఈ విషయంలో మాట్లాడేందుకు రావాలని గవర్నర్ ఆహ్వానించినప్పటికీ.. తానెందుకు వెళ్లాలన్న అక్కసుతో వెళ్లకుండా.. ఆయన సలహాదారులను ఇంటికి పిలిపించుకున్నారు. ఒక గవర్నర్‌కు సలహాదారులుగా ఉన్నవారిని ఒక ముఖ్యమంత్రి పిలిపించుకోవడం ఏంటనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నది. పైగా వారిని తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నించారన్న ఆరోపణలు భారీస్థాయిలో వినిపిస్తున్నాయి.

పాలనపరంగా, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు గవర్నర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించింది. ఆ బాధ్యతల్లో ప్రస్తు తం మాజీ ఐపీఎస్ మహంతి, మాజీ ఐఏఎస్ శర్మ ఉన్నారు. అయితే వీరు కేవలం గవర్నర్‌కు మాత్రమే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వాధికారులకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు.. ఆ ఇద్దరు సలహాదారులను తన ఇంటికి పిలిపించుకోవడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా సెక్షన్ 8 అమలుకు గవర్నర్‌పై ఒత్తిడి తేవాలని, ఆ మేరకు ఆయనకు సూచనలివ్వాలని చెప్పడమేకాకుండా.. తాను చెప్పే అంశాలను గవర్నర్‌కు చెప్పి అమలు చేయించాలని పదే పదే సలహాదారులపై బాబు ఒత్తిడిచేశారని గవర్నర్ కార్యాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నేరుగా గవర్నర్ పిలిస్తే వచ్చి ఆయనే ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా! మాకేంటి ఈ గోల? అని గవర్నర్ కార్యాలయం అధికారులు
వాపోతున్నారు. అసలు గవర్నర్ సలహాదారులపై చంద్రబాబు పెత్తనమేంటన్న ప్రశ్నలను కూడా విపక్షాలు లేవనెత్తుతున్నాయి.

ఏపీ పోలీసులపై తీవ్ర ఒత్తిడి!


కేంద్రం పట్టించుకోకపోవడంతో సొంత పోలీసులపైనే ఆధారపడుతున్న చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో తనను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే కేసు బలంగా ఉన్న నేపథ్యంలో ఏపీ అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రోజుకు నాలుగైదుసార్లు ఏపీ డీజీపీ, ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సమావేశమవుతున్న చంద్రబాబు.. తనను బయటపడేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని తెలిసింది. నోటీసులిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? నోటీసులు తీసుకోకుంటే ఏమవుతుంది? నోటీసులు లేదా సమన్లు ఇస్తే స్టే తెచ్చుకోవాలా? అన్న పలు అంశాలపై మార్గాలు వెతకండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలో నోటీసులు ఇప్పించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ నుంచి నాకు నోటీసులు వస్తే ప్రతిగా మనం కూడా నోటీసులు ఇవ్వాలి అని స్పష్టంచేసినట్లు తెలిసింది. చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఏపీ పోలీసులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. తాను తప్పుచేసి కూరుకుపోయి.. తమను కూడా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు.

ముప్పేట విమర్శల దాడి


ఓటుకు నోటు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామాకు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ కేసులో బాస్ చంద్రబాబేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. ఏ-1 రేవంత్‌రెడ్డి కాదని, చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి, విచారణ ఎదుర్కొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలకు చెందాల్సిన సొమ్ము దోపిడీ చేస్తూ తెలంగాణలో టీడీపీనీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అందులోభాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి తెరతీశారని విమర్శించారు. తాను అవినీతిలో కూరుకుపోయి గవర్నర్‌పై విమర్శలు చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. సీపీఐ సీనియర్ నేత కే నారాయణ కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో టేపులు కూడా దొరికిపోయిన తర్వాత ఏపీ సీఎం ఎంత దబాయించినా ప్రయోజనం లేదని నారాయణ అన్నారు. చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. వీడియో, ఆడియో టేపులు బయటపడడంతో చంద్రబాబు దిక్కుతోచక ఇతర అంశాలు ముందు పెట్టి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎత్తుకున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనప్పటికీ అభ్యర్థిని నిలబెట్టడమే టీడీపీ చేసిన తప్పిదమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామనే ధీమా ఉండటం వల్లే అభ్యర్థిని నిలిపిందని అర్థమవుతున్నదని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు బుకాయింపు ధోరణి విడనాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత చూసుకోవాలని, ముందు తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయవిచారణకు సిద్ధం కావాలని హితవు పలికారు. ఆరోపణలు రుజువుచేసుకోకుండా దీనిని రెండు రాష్ర్టాల సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చురేపడం సరికాదన్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. టీవీ చానళ్లలో ప్రసారమైన టేపుల వాయిస్‌ను వింటే క్లియర్‌గా అర్థమవుతుందన్నారు.

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఢిల్లీ పెద్దలను గవర్నర్ కలిసివచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ర్టాల సీఎంలతో గవర్నర్ మాట్లాడే అవకాశం ఉందని రెండు రోజుల ముందే వార్తలు వచ్చాయి. అయితే.. గవర్నర్ పిలిచినా చంద్రబాబు ఆయనతో సమావేశం జరిపేందుకు వెళ్లలేదు. ఈ తరుణంలోనే గవర్నర్‌ను కలిసిన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఓటుకు నోటు వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు రుజువు చేసే ఆడియో టేపులు బయటపడిన విషయం, రాజధానిలో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

చంద్రబాబు సంభాషణల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని గవర్నర్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌లకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారని, చట్ట ప్రకారం స్వతంత్రంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారని సమాచారం. కావాలనే తమ ప్రభుత్వంపై, తనపై ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు, ఇతర మంత్రులు విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు కేసీఆర్ తెలిపారని సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తమ వద్ద ఉన్న సమాచారాన్ని గవర్నర్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, ఇతర నేతలు ఈ డిమాండ్ చేస్తున్నది కేవలం తమ ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్ర, అక్కసుతోనేనని కేసీఆర్ స్పష్టంచేసినట్లు సమాచారం. గడిచిన ఏడాదికాలంలో నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్న విషయాన్ని గవర్నర్‌కు గుర్తు చేసిన కేసీఆర్.. సెక్షన్ 8 ఆలోచనకే ఆస్కారం లేదని అన్నట్లు తెలిసింది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ పరంగా తాము కంకణబద్ధులై ఏర్నామని స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది. ఇదే సందర్భంలో ఇద్దరు గవర్నర్ సలహాదారులు ఏపీ సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలవడాన్ని నరసింహన్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్ళినట్టు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జూన్ 15, 2015

నడిస్తే రాజభోగం...నడవకపోతే అరాచకం...



ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట. అభద్రత ఉందట. ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఇంత స్వేచ్ఛగా అబద్ధాలను చెలామణి చేసే నాయకుడు మరొకరు కనిపించరు. నడిస్తే రాజభోగం, నడవకపోతే గందరగోళం. సాగితే తన గొప్పతనం, సాగకపోతే ఎదుటివాడి అరాచకం. చంద్రబాబు మారడు. మారలేడు. ఆయన జీవితంలో తప్పులు ఒప్పుకున్న సందర్భంగానీ, తప్పులు గుర్తించిన సందర్భంగానీ, పశ్చాత్తాపపడిన సందర్భంగానీ ఇంతవరకు చూడలేదు. నిన్న కొందరు బాధితులు వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. రేవంత్‌రెడ్డి గోపనపల్లిలోని తమకు చెందిన 4000 గజాల భూమిని ఎలా కబ్జా చేశాడో వివరించారు. విషాదం ఏమంటే ఆ బాధితులు గుంటూరు జిల్లా వారు. కబ్జాలు యథేచ్ఛగా జరిగింది సమైక్య పాలనలోనే. కబ్జాకోరులంతా ఉంది టీడీపీ, కాంగ్రెస్‌లలోనే. 

హైదరాబాద్‌లో నిజమే అరాచకం ఉండేది:
హైదరాబాద్‌ను అరాచకాల రాజధానిగా మార్చిన చరిత్ర టీడీపీదే. ఇక్కడ ఫ్యాక్షనిస్టు హత్యలు జరిగింది టీడీపీ హయాంలోనే. ఉన్నట్టుండి మనుషులు మాయమైంది టీడీపీ పాలనలోనే. రాయలసీమకు బయలుదేరినవారు మహబూబ్‌నగర్ హైవే వెంట శవాలుగా తేలింది చంద్రబాబు రాజ్యంలోనే. విచిత్రంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలోనే ఎమ్మార్వో కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. భూమి రికార్డులు దగ్ధం చేయడం, కొత్త రికార్డులు సృష్టించడం, ప్రభుత్వ స్థలాలకు పత్రాలు తయారు చేయడం, వందల ఎకరాల భూములు కబ్జా చేయడం ఇదంతా బాబు పాలనలోనే మొదలయింది. రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబు స్టైలు పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఇద్దరిదీ క్విడ్ ప్రో క్వోనే. ఇద్దరిదీ ఇచ్చి పుచ్చుకునే పద్ధతే. చంద్రబాబు స్మార్టుగా చేశాడు. రాజశేఖర్‌రెడ్డి నేకెడ్‌గా చేశాడు. చంద్రబాబు దొరకలేదు. రాజశేఖర్‌రెడ్డి దొరికేట్టు చేశాడు. భవనాలు, లేఅవుట్లు, భూముల క్రమబద్ధీకరణ పేరిట చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన జీవోలు, కొల్లగొట్టిన భూములపై విచారణ వేయడానికి ఒక్క కమిషను చాలదు. చంద్రబాబు అన్యాక్రాంతం చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులపై విచారణ చేస్తే ఆయన హైదరాబాద్‌కు చేసిన ద్రోహం బట్టబయలవుతుంది. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి పాలనలో నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతాయి. హంతకులెవరో దేశానికి తెలుస్తుంది. పత్రికల్లో వస్తుంది. కానీ విచారణలో నిర్దోషులుగా బయటపడతారు. అరాచకం అంటే ఇదీ.

కానీ చంద్రబాబుది ఇప్పుడు దొరికిపోయిన దొంగ మానసిక స్థితి. తన మీదికి వస్తున్న ప్రమాదపు రైలును ఎటో మళ్లిద్దామని ఢిల్లీదాకా వెళ్లి లడ్డూలిచ్చి లాబీయింగ్ చేసి వచ్చాడు. వారేమీ కరుగలేదు. చలించలేదు. ఈయన కథలు బాగా అర్థం చేసుకున్నవారు కదా. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని తెలుసు. ఈయన ఎంత గాలివాటం మనిషో కూడా వారికి తెలుసు. ఈయన ఎప్పుడెప్పుడు ఏం నాటకాలు ఆడారో రికార్డులతో సహా నరేంద్ర మోదీకి తెలుసు. అందుకే వారు విన్నారు కానీ కనికరించలేదు. బీజేపీకి చంద్రబాబు వ్యవహారం అర్థం అయింది. అందుకే రాష్ట్రంలో కూడా ప్రతిచిన్న విషయానికీ గళమెత్తే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇతరులు కొద్ది రోజులుగా మీడియా ముఖం చూడడం మానేశారు. చంద్రబాబును సమర్థించడానికి వారి వద్ద మాటలు లేవు. కనీసం వారు రేవంత్‌రెడ్డి కూతురు నిశ్చితార్థంలో కనిపిస్తారేమోనని అందరూ చూశారు. అంటే వారికి ఇది బురద అని అర్థమయింది. బురదకు దూరంగా ఉండాలనీ అర్థమయింది. ఢిల్లీ పెద్దలకూ అదే నివేదించారని తెలుస్తున్నది. మోడీ ఎటువంటి హామీలు ఇవ్వలేదు కాబట్టే చంద్రబాబు ఇక్కడికి రాగానే లేఖాస్త్రం సంధించాడు. చంద్రబాబు తన దుఃఖాన్ని ఆంధ్ర ప్రజలందరి దుఃఖంగా, తన నేరాన్ని అందరి నేరంగా మల్చాలని చూస్తున్నారు. గవర్న ర్ నిన్ననే ఢిల్లీలో ఒక మాట చెప్పి వచ్చారు. 

అంతా ప్రశాంతంగా ఉంది. విభజన విద్వేషాలు లేవని చెప్పారు. గవర్నర్ అక్కడ ఈ మాట చెప్పి వచ్చిన మరుసటిరోజు చంద్రబాబు ఇక్కడ అరాచకం కొనసాగుతున్నదంటూ లేఖ రాశాడు. ఈ రెండు అభిప్రాయాల మధ్య దూరమెంతో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఢిల్లీ పెద్దలు. హైదరాబాద్‌లో అరాచకం ఉందంటూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాస్తున్న సమయానికి హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. వందలాది మంది పారిశ్రామిక వేత్తలు, వివిధ కం పెనీల సీఈఓలు అందులో పాల్గొన్నారు. వారు కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెబుతున్నారు. హైదరాబాద్ తమ పెట్టుబడులకు అనువైన కేంద్రమని ప్రకటించారు. ఐటీసీ దేవేశ్వర్ వంటి వారు అక్కడికక్కడే 8000 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. రుయా గ్రూపు రైల్వే బోగీల కోచ్ ఫ్యాక్టరీని ఆంధ్రలో కాకుండా తెలంగాణలో పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు లేఖారాతలకు, వాస్తవికతకు మధ్య ఎంత అంతరం ఉందో దీన్నిబట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబునాయుడు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేవంత్‌రెడ్డితో తనకు సంబంధంలేదని, ఆయనంతట ఆయన ఈ ఆపరేషను చేశారని, తనకు తెలియకుండా తన పేరు వాడుకున్నారని చెప్పడానికి ఒకింత అవకాశం ఉండె. కానీ మరుసటిరోజే బాబుగారు మాట్లాడిన ఫోను సంభాషణ బయటికి వచ్చింది. అందుకే ఇప్పుడు మింగలేని కక్కలేని బాధ. ఇప్పుడయినా రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి వెలివేసి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీలో కొందరు పెద్దలు సలహాలిస్తున్నారు. అది ఇంకా ప్రమాదకరమని చంద్రబాబుకు తెలుసు. రేవంత్‌రెడ్డిని పార్టీకి దూరం చేస్తే, ఆయన ఊరుకుంటాడా? రేవంత్‌రెడ్డి అప్రూవరుగా మారి బాబే ఈ పని చేయించడానికి న్యాయస్థానం ముందు చెబితే, చంద్రబాబు కటకటాలు చూడాల్సి వస్తుంది. అందుకే దొరికిపోయి, కేసుల పాలు చేశాడని రేవంత్‌రెడ్డిపై ఎంత కోపం ఉన్నా, దానిని అదిమి పట్టుకుని ఆయన బిడ్డ నిశ్చితార్థానికి మంత్రివర్గాన్నంతా తరలించారు. పెదబాబు, చినబాబు ఏకచ్ఛత్రాధిపత్యంపై ఇంతకాలంగా గుర్రుగా ఉన్న టీడీపీ సీనియర్లు, సీనియర్ మంత్రులు చంద్రబాబుకు వచ్చిన కష్టం పట్ల కాస్త సంతోషంగా ఉన్నారు. భలే ఇరుక్కున్నాడు. తగిన శాస్తి జరిగింది. ఈయనకు కేసీఆరే మొగుడు వంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులున్నారు. చంద్రబాబు ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడని జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఊహించలేదు. ఇరుక్కున్నదే తడవుగా ఆయన ఆంధ్రలో విజృంభిస్తున్నారు. 

ఇంతకాలం తనొక్కడే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అటువంటి కూపంలోనే చిక్కుకున్నారు. చంద్రబాబు ఎందులో గొప్ప అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దొంగతనం గురించి ప్రచారం చేస్తూ ఊరూవాడా కలియదిరుగుతున్నాడు. జనం నమ్ముతారా లేదా అన్నది తర్వాత. కానీ ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు.

ఇదే అదనుగా జగన్‌కు, కేసీఆర్‌కు పొత్తు పెట్టి ఆంధ్రలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు, ఆయన చెంచా మీడియా ప్రచారం చేస్తున్నది. చంద్రబాబు పాపాలకు అండగా అక్కడ జనాన్ని సమీకరించాలని వారంతా తాపత్రయపడుతున్నారు. జగన్ కు తెలంగాణకు సంబంధం లేదు. జగన్ పార్టీ తెలంగాణలో ఇర్రిలవెంట్ అయిపోయింది. జగన్ ఇక్కడ ఏమీ పుల్లలు పెట్టడడం లేదు. ఆయన సోదరి యాత్రలు చేసి నా, ఆయన యాత్రలు చేసినా ఇక్కడ జనం పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. జగన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం తెలంగాణకు గానీ, టీఆరెస్‌కు గానీ రాలేదు. జగన్ పొత్తు పెట్టుకోవలసిన అవసరం కానీ, పంచాయితీ పడవలసిన అవసరం కానీ తెలంగాణకు లేదు. 

తెలంగాణకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్నది, గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నది చంద్రబాబు ఒక్కరే. కొందరు రోగ్ నేతలను పోషించి నిత్యం అడ్డగోలు కూతలతో తెలంగాణ ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నది చంద్రబాబే. తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఉండనీయనిది చంద్రబాబే. చంద్రబాబు తెలంగాణ ఏర్పడడాన్ని, సమస్యలు లేకుండా ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కరెంటు లేక అల్లకల్లోలం అవుతుందని ఊహించారు. అది జరుగలేదు. తమ చెంచా మీడియాను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వంపై కృత్రిమ ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. తెలంగాణ విఫలమవుతుందని, కేసీఆర్ నిభాయించుకోలేరని, 2019లో మళ్లీ మనమే గెలుస్తామని ఒక ఎండమావిని ప్రచారంలో పెట్టి హైదరాబాద్‌లో నిత్యం కుంపటిని రాజేయాలని చూశారు. చంద్రబాబు స్వయంగా చెంచా మీడియాకు చెబుతున్నారో లేక చెంచా మీడియానే చంద్రబాబుకు చెబుతున్నదో, అదీగాక ఇద్దరూ ఒకే అజ్ఞానపు వేవ్‌లెన్త్‌తో ఆలోచించి మాట్లాడుతున్నారో తెలియదు. అవేవీ జరుగలేదు. జరిగే అవకాశం లేదు. చంద్రబాబును సమర్థించే పత్రికల్లో ఒక పత్రికాధిపతి మరో పత్రికాధిపతి గురించి చెప్పినట్టుగా ఒక మాట వాడుకలోకి వచ్చింది. ఆయన సలహాలు విన్నోడెవడూ బాగుపడలేదు అని పెద్ద పత్రికాధిపతి అన్నట్టు చెబుతున్నారు. అది నిజమో కాదో తెలియదు. కానీ విద్వేషోన్మాదం ఎప్పుడూ ఎవరికీ మేలు చేయలేదు. చేయదు. వాళ్లు ఎవరికయినా భష్మాసురులవుతారు. చంద్రబాబు వదిలించుకోవాల్సింది ఇంట్లో పనిచేసే తెలంగాణ పనిమనుషులను, సిబ్బందిని, పోలీసులను కాదు, ఎప్పుడూ వంకర ఆలోచనలు చేసే సలహాదారులను. చంద్రబాబుకు సంకటం వచ్చింది బయటివాళ్లవల్ల కాదు, తన మనుషులు అనుకున్న తమ్ముళ్ల నుంచి.

మరొక్క అంశం... ఇప్పుడు చంద్రబాబు ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రో, మంత్రులో ఇరుక్కుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి చానెళ్లు ఎలా వ్యవహరించేవి? భూమ్యాకాశాలు ఏకం చేసి టీఆరెస్ ప్రభుత్వం దిగిపోవాలని కత్తికట్టి నాట్యం చేసేవి. ఉన్నవీ లేనివీ పోగేసి అన్ని గుదిగుచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతగా నవ్వులపాలు చేయాలో అంతగా నవ్వులపాలు చేసేవి. ’చూశారా, తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం రాదు. తెలంగాణ విఫలమవుతోంది చూడండ” అని ప్రచారం చేసేవి. నిన్న మొన్న కూడా కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న విషయాలకే రోజంతా పేరిణి శివతాండవం చూపించిన ఈ పత్రికలు, చానెళ్లు ఇంత పెద్ద నేరం జరిగితే ఎందుకు తేలుకుట్టిన దొంగల్లా, కుడితిలో పడిన బల్లుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు పక్షాన రోజూ డిఫెన్సు ఆడుతున్నాయి. చంద్రబాబును సమర్థించడానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. టాపింగ్ ఎలా తప్పో వాదిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు చేసిన ఆపరేషనులో తొర్రలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. దొంగతనం చేసిన వారిని వదిలేసి, దొంగను పట్టుకున్నవారి గురించి వేలెత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ఆంధ్ర అనుకూల స్వభావాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తున్నాయి. ఈ పత్రికలు ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి తమ వార్తలను వండుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శం ఏముంటుంది? నిజానికి ఎవరేం చేసినా తెలంగాణ ఏర్పాటు ఎన్నటికీ విఫల ప్రయోగం కాజాలదు. స్వరాష్ట్ర ఫలితాలను ఇప్పటికే చవిచూస్తున్నది. భవిష్యత్తంతా తెలంగాణదే.



వ్యాసకర్త: కట్టాశేఖర్ రెడ్డి
kattashekar@gmail.com

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



ఆదివారం, జూన్ 14, 2015

రేవంత్ తప్పు చేస్తే నన్నెందుకు లాగుతారు?



-ఇండియాటుడే టీవీ ఇంటర్వ్యూలోచంద్రబాబు
-రాజ్‌దీప్ సూటి ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
-ఇంటరాగేట్ చేయడానికి ఏసీబీ ఎవరని కస్సుబుస్సు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తప్పు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. మాటలో మాటగా ఈ వాస్తవాన్ని ఒప్పేసుకున్నారు. తమ ఎమ్మెల్యే తప్పుచేస్తే తననెందుకు లాగుతున్నారని అమాయకంగా ప్రశ్నించారు. సంభాషణల్లో బయటపడిన గొంతే మీదేనా? వాయిస్ టెస్ట్‌కు, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమేనా? అని రాజ్‌దీప్ ఎంత సూటిగా ప్రశ్నించినా.. డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకున్నారు. ఇది కట్ అండ్ పేస్ట్, మానిప్యులేషన్ అన్నచంద్రబాబు.. అదే విషయంలో మళ్లీ ప్రశ్నించగా.. ఏమో తనకు తెలియదని బదులిచ్చారు. గొంతు మీదేనా? అని మరోసారి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలపై వివరణ ఇచ్చారుకానీ.. అసలు సంగతి చెప్పనేలేదు. ఒక కార్యకర్త తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ తననెందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీరు టీడీపీ అధ్యక్షులుకనుక.. టెలిఫోన్ సంభాషణల్లో మీ గొంతు ఉన్నదికనుక.. అని రాజ్‌దీప్ పేర్కొనగా.. తనకూ ఏసీబీ ఉందని, తనకూ పోలీసులు ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే తప్పనిసరిగా ప్రతిస్పందించారు. అంతేకానీ.. తన గొంతును నిర్ధారించేందుకు మాత్రం చంద్రబాబు ముందుకు రాకపోవడం విశేషం.


రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది...




రాజ్‌దీప్: ఓటుకు నోటు కుంభకోణంలో బయటికి వచ్చిన ఆడియో సంభాషణల్లో గొంతు మీదేనని తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. అది మీ గొంతు కాదంటూ మీరు ఖండిస్తున్నారు!

చంద్రబాబు: అది నా గొంతేనని మొదట వాళ్లు ఎలా చెప్పగలరు? ఇది పూర్తిగా అవాస్తవం.


ఇది మీ గొంతా? కాదా? అది వేరేవాళ్ల గొంతా?



ఇది కల్పించినది. దీనిని మొదట కేసీఆర్‌కు చెందిన టీ న్యూస్ చానల్ లీక్ చేసింది. ఆయనకు ఎక్కడినుంచి సమాచారం వచ్చింది? ఇది మొదట ఆయన సమాధానం చెప్పాలి. మీరే (కేసీఆర్) సృష్టించి.. మీరే నాపై బురదజల్లుతున్నారు.

అది మీ గొంతు కాదని చెప్తున్నారా? ఎందుకంటే.. ఈ సంభాషణను ఎవరు విన్నా.. అది చంద్రబాబునాయుడు గొంతేనని చెప్తున్నారు.



ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో అనేక మార్గాలు ఉన్నాయి. కట్ అండ్ పేస్ట్, వక్రీకరించడం..

అది కట్ అండ్ పేస్ట్, వక్రీకరణ అని మీరు చెప్తున్నారా?



ఏమో నాకు తెలియదు. మేం ఈ విషయాలన్నీ కనిపెట్టాలి.

ఏసీబీ విచారణకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?



ఏసీబీ ఏమిటి? నన్ను ఇంటరాగేట్ చేయడానికి మీరెవరు? ఇదొక రాష్ట్రం. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు వేరొక రాష్ట్రం ఏసీబీ. ఇది ఉమ్మడి రాజధాని ఈ రోజు. ఉమ్మడి రాజధానిలో మీకు నాపై అధికారాలు ఎక్కడివి?

ఏసీబీ విచారణలో భాగంగా మీకు సమన్లు ఇవ్వాలని వారు అనుకుంటున్నారు.



మీరెవరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు నా ఫోన్లు ట్యాప్ చేయలేరు. హైదరాబాద్‌లో నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

తాము ఏపీ సీఎం ఫోన్లు ట్యాప్ చేయలేదని పేర్కొంటూ ఏసీబీ నాకు ఈ రోజు ఒక ఎస్‌ఎంఎస్ పంపింది.



నేనేకాదు.. నా ప్రజల సంగతేంటి? మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

మీరు దానిని నిరూపించగలరా?



మేం నిరూపిస్తాం. మీరే చూస్తారు. విచారణకు డిమాండ్ చేస్తున్నాం.

పోన్ ట్యాపింగ్ సంగతిని పక్కన పెడితే.. మీ గొంతు విషయంలో స్పష్టతకు వద్దాం. విడుదలైన టేపులో గొంతు మీదేనని తేలిపోతున్నది. మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. మీరు ఆ ఆడియో విషయంలో వాయిస్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారా?




ఈ విషయంలో మరికొన్ని అంశాలు చూడాలి. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్ స్ట్రెంత్ ఎంత? ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు? వారికి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టారు. వారికి 85 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ ఓట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? దానికి మొదట సమాధానం చెప్పాలి.

సో.. మీ ఎమ్మెల్యేలను వల్లోవేసుకున్నారని అంటారా?



వలలో వేసుకోవడమే కాదు.. మా ఎమ్మెల్యేలతో వారు రాజకీయ బేరసారాలకు పాల్పడ్డారు. మోసం చేశారు. బెదిరించారు.

కానీ.. మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాలకు చిక్కారు.



మీరు పూర్తిగా పొరబడుతున్నారు. టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు బీజేపీ సభ్యులున్నారు. మొత్తం 20. మాకు ఎమ్మెల్సీ గెలవడానికి 17మంది చాలు. ఇది ఎన్నికల కమిషన్ ప్రచురించిన ఎలక్టోరల్ రోల్‌లో ఉంది. రెండోది.. కాంగ్రెస్‌కు 21 మందితోపాటు అదనంగా ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉంది. వైసీపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీఎస్పీకి ఇద్దరు ఉన్నారు. వాళ్లు (టీఆర్‌ఎస్) టీడీపీకి చెందిన ఐదుగురిని, కాంగ్రెస్‌కు చెందిన నలుగురిని, ఇద్దరు వైసీపీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.

మీరు చెప్పేది ఒప్పుకుంటాను.. కానీ.. నేను అడిగేదేమంటే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారు. అరెస్టయ్యారు. అదే స్టీఫెన్‌సన్‌తో మీరు మాట్లాడినట్లు వచ్చిన ఆడియోలో హామీలన్నీ నెరవేరుస్తామని మీరు చెప్పారు.



వారు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ప్రతి ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది?

మీ ఎమ్మెల్యే ఎందుకు 50 లక్షలు తీసుకునివెళ్లారు?



అది వేరే విషయం..

అదే విషయం..



కాదు.. కాదు.. దానిపై విచారణ జరపొచ్చు. కానీ నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు?

మీకు సమన్లు ఇస్తామంటున్నారు. నన్ను అరెస్టు చేయండని మీరు సవాలు చేయగలరా?



వారికి ఏసీబీ ఉంది. నాకు ఏసీబీ ఉంది. వారికి పోలీసులున్నారు. నాకు పోలీసులున్నారు. ఉమ్మడి రాజధానిలో మీరు ఇవన్నీ ఎలా చేయగలరు? ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఎలా బెదిరిస్తారు?

మీరేమో మీ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. వాళ్లేమో ఓటుకు నోట్లు ఇస్తున్నారని అంటున్నారు.



కామన్ క్యాపిటలంటే అర్థం ఏమిటి? సెక్షన్ 8 ఉంది. సెక్షన్ 8లో ఇవన్నీ ఎవరు చేస్తారు? గవర్నర్ చేయాలి. ఇది సార్వభౌమ ప్రభుత్వం.

అప్పుడు మీరు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లకూడదు? టెలిఫోన్ల ట్యాపింగ్‌పై ఆధారాలన్నీ సమర్పించవచ్చుకదా.



నేను చాలాసార్లు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాను. కేసీఆర్‌కు కూడా చాలాసార్లు అప్పీలు చేశాను. విభజన తర్వాత మనం కూర్చుని, అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలుగు ప్రజలు ఒక్కటే. ప్రభుత్వాలు, పార్టీలు వేర్వేరు. రాజకీయంగా మనం పోరాడుకోవచ్చు. కానీ ప్రభుత్వాలుగా మనం సహకరించుకోవాలి. ఆయన వీటిని ఎప్పుడూ పట్టించుకోలేదు.

రాష్ట్రపతికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు సమర్పించవచ్చు కదా.. టెలిఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని మీరు కోరనున్నారా? మీ సొంత ఏసీబీని ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశిస్తారా?



తప్పకుండా

మీరు టెలిఫోన్ ట్యాపింగ్‌పై మీరు కేసీఆర్ ప్రభుత్వంపై విచారణకు ఆదేశిస్తారు.. వారేమో ఆలోపే మీపై ఓటుకు నోటు కేసులో విచారణకు ఆదేశిస్తారు.. మనం ఎలాంటి పరిస్థితికి వెళుతున్నాం?



దీనికి ఎవరిది బాధ్యత?

కేసీఆర్‌దా బాధ్యత? మీకు సమన్లు ఇవ్వాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని సవాలు చేస్తున్నారా?



మేం ఏమీ చేయం. వాళ్లను సమన్లు ఇవ్వమనండి. అప్పుడే మేం ఏం చేయాలో అది చేస్తాం.

ఆయన గవర్నర్‌ను కలిసి మీకు నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరుతారేమో.. అవసరమైతే ప్రాసిక్యూట్ చేస్తారేమో!



వాళ్లు నోటీసులు ఇచ్చిన తర్వాత మాకు ఉన్న ఆధారాలేంటి? అధికారాలేంటి? పరిశీలిస్తాం. ప్రజాస్వామ్యంలో నన్ను ఎలా బెదిరిస్తారు? నన్ను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఆయనే అంతా చేశారు. నా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఎలక్టోరల్ రోల్‌లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది తప్పు కాదా? ఇది ముడుపుల వ్యవహారం కాదా?

ఇలా ఎమ్మెల్యలను ఉభయ పక్షాలు ప్రలోభపెడుతూ పోతే..



నేనేమీ ప్రలోభపెట్టడం లేదు.

మీ ఎమ్మెల్యే 50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.



ఏదైనా పార్టీలో ఒక కార్యకర్త తప్పు చేస్తే చట్టం ప్రకారం వెళ్లవచ్చు. అది వేరే విషయం. కానీ నన్ను ఎందుకు లాగుతున్నారు?
(Suppose any party.. one functionary has committed a mistake. Its OK. According to law it has to be acted. That is different issue. Why you are dragging me?


ఎందుకంటే మీరు టీడీపీ అధ్యక్షులు.. ఇది మీకు ఇబ్బందికర అంశం. మీ గొంతు ఆడియో టేప్‌లలో ఉంది. అందుకే వారు మిమ్మల్ని లాగుతున్నారు. (Because you are the president of the TDP and it has embarrassed you and your voice is in the audio tape. Thats why they are dragging you into this.)


అదే నేను చెప్తున్నాను. ఉమ్మడి రాజధానిలో మీరు ఇలాంటివన్నీ స్టింగ్ ఆపరేషన్‌ల ద్వారా లేదా కల్పితాలు సృష్టించి.. మీ ఇష్టం వచ్చినట్లు చేయలేరు. మీకు ఉన్న హక్కు ఏంటి?

రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడి సరిగ్గా సంవత్సరం అవుతున్నది. ఇప్పుడు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రులు ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

దీనికి ఎవరిది బాధ్యత? కేసీఆర్‌దా బాధ్యత?



అవును.. ఆయనదే. ఈ పరిస్థితి ఆయనే సృష్టిస్తున్నారు.

ఒకవేళ ఆయన మిమ్మల్ని ముట్టుకుంటే మీ పోలీసులు, మీ ఏసీబీ స్పందిస్తాయా?



తప్పకుండా స్పందిస్తాం. నాకు సార్వభౌమ అధికారాలు ఉన్నాయి.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




బాబూ.. ఇక్కడ మేం క్షేమం...

chakra

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గారికి నమస్కారములతో రాయునది..

అయ్యా.. 

ఇక్కడ మేం క్షేమం. ఇక్కడ అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ.. మిగిలిన తెలంగాణ జిల్లాల్లోనూ పలు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఆంధ్రా నుంచి వచ్చిన వారమంతా బాగున్నాం. ఇక్కడ ఉంటున్న వారిలో కొందరి ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిందని, ఇక్కడి ఆంధ్రులు కలవరపడుతున్నారని మీరు ఆందోళన చెందుతున్నట్లుగా పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలిసింది. మీరు మా గురించి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, మీకు మా గురించి ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని భావిస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఉంటున్న ఆంధ్రులను కలవరపెట్టవద్దని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం.

శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్న రచయిత బమ్మిడి జగదీశ్వరరావు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాని, తెలంగాణ ప్రజల నుంచి కాని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీవిస్తున్నారని చెప్పడానికి మిక్కిలి సంతోషంగా ఉన్నది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చిన మా మేనల్లుడు కూడా కూకట్‌పల్లిలో పరమానందభరితంగా బతుకుతున్నాడని, అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాడని ఈ మధ్యనే విని ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. పశ్చిమ గోదావరిజిల్లా పాలకొల్లు నుంచి వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్న బోళ్ల తాతాజీకి దిల్‌సుఖ్‌నగర్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ సోదరులు చేతనైన సాయం చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను.

భర్త అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో అద్దెకుంటున్న ఇంటి ముందే కర్రీ పాయింట్ పెట్టుకున్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సీతమ్మ చేసిన కూరలు, పచ్చళ్లంటే తెలంగాణ ఆడపడుచుల నోళ్లలో నీళ్లూరుతున్నాయని విని ఆ సీతమ్మకు బతుకు ధైర్యాన్ని ఇచ్చిన హైదరాబాద్‌కు, ఇక్కడి మనుషులకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఇలా వేలు, లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్‌లోనూ, తెలంగాణ జిల్లాల్లో నూ గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారని, ఈ మాట వింటే మీరు కూడా సంతోషిస్తార ని భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను.

అంతెందుకు.. హైదరాబాద్ శివారులో ఇల్లు కట్టుకున్న మీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇంటి పై ఈగ కూడా వాలలేదనే విషయాన్ని నిరంతరం మీ పక్కనే ఉండే ఆయనే చెప్పలేదంటే కొంచెం బాధేస్తోంది. ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి కాగానే పరకాల ప్రభాకర్ ఇల్లు ఉన్న గ్రామస్థులు మా ఊరమ్మాయి కేంద్రమంత్రి అయ్యిందంటూ పొంగిపోవడం పత్రికలు చూసిన వారందరికి తెలిసిందే. ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అమరావ తి అభివృద్ధి పట్టించుకోకుండా ఇక్కడి ఆంధ్రుల జీవితాలపై ఆందోళన చెందవద్దని చెప్పేందుకే. 

మీ రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఇల్లు ఇంకా ఆయన పేరు మీదే ఉందని, ఆయన ఇం ట్లో పని చేస్తున్న పనిమనిషి పేరు మీద మారలేదని, ఎప్పటికి మారదని గ్యారంటీ ఇస్తున్నా. తెలంగాణ వస్తే ఆయన ఇంటిని పని మనిషి లాక్కుంటుందేమోననే భయాన్ని ఏడాదిన్నర క్రితం ఓ ఛానె ల్ చర్చాగోష్టిలో పాల్గొన్న బుచ్చయ్య చౌదరి గారు వ్యక్తం చేశారు. ఆయనకు, ఆయన ఇంటికి ఏం కాదని మీరు ధైర్యం చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీ పార్టీ ఎంపీగారే చెప్పినట్లు ఏడాది పాలనలో కేసీఆర్ అనేకసార్లు పర్యటించింది నగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలోనే. అక్కడే ఆయన నిరుపేదలకు రెండు బెడ్‌రూంల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీకు తెలియక కాదు కానీ, మల్కాజిగిరిలో ఉంటున్నవారిలో సగానికి పైగా ఉన్నవారందరూ ఆంధ్రులే. వాళ్లకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ అన్నారంటే మల్కాజిగిరి వాసుల గురించి తెలియక అనుకుంటామా..?

ఇక చివరిగా చెప్పొచ్చేదేమిటంటే మీ రాజకీయాలు, మీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓట్లు, నోట్లు, ప్రజాప్రతినిధుల అంకెల గారడీలు మీకే పరిమితం చేసుకోండని కోరుతున్నాను.

ఓట్ల పండుగ అయిపోయి ఏడాదైంది. మరో నాలుగేళ్ల వరకూ మా జోలికి రావద్దు మహాప్రభో అని ప్రార్థిస్తున్నాం. మార్నింగ్ వాక్‌లో ఎదురుపడినప్పుడు పరస్పర పలకరింపులు, అక్కడి వారి ఫంక్షన్లు, ఇక్కడి వారి ధావత్‌లు కలిసి చేసుకుంటున్న సమయంలో వాటి మధ్యలోకి ప్రాంతంపగ రావద్దని మనవి చేసుకుంటున్నా. రోజులు మారుతున్నప్పుడు మనుషులు మారతారని, కక్షలు, కార్పణ్యాలు కలకా లం ఉండవని, ఉండకూడదని ఆ దిశగా ఏలికలు పాలన సాగించాలని, వినకపోయినా చెప్పడం ఓ బాధ్యతగా భావించి ఈ నాలుగు ముక్కలు చెబుతున్న. కాపలా కాసే మనుషులను మార్చడం కంటే మీ చుట్టుపక్కల ఉన్నవారి మనసులు మారిస్తే బాగుంటుందని భావిస్తున్నా..
ఇట్లు
ముక్కామల చక్రధర్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, జూన్ 12, 2015

బాబు ఈ పని చేయగలరా...???



అసలు కేసు గురించి మాట్లాడరెందుకని ఎవరెన్ని ప్రశ్నలు వేసినా ఉష్ట్రపక్షి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు చివరకు ఫోన్‌ట్యాపింగ్, విభజన చట్టంలోని 8వ నిబంధన అనే రెండు అంశాలను తరణోపాయంగా చూస్తున్నారు. కానీ ఇవి ఆయనను గట్టెక్కించగలవి కావని ఆ రెండింటిని పరిశీలించిన వారికి బోధపడుతుంది. అదే విషయం ఇప్పటికే నిపుణులు కూడా ఎత్తి చూపుతున్నారు. అది చంద్రబాబుకు కూడా అర్థమైనట్లున్నది. అందుకే ఆయనలో అసహనం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మన రాజకీయ నాయకులకు తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడినా ఏమీ కాదనే ధీమా ఒకటుంది. రేవంత్‌రెడ్డి కేసు సందర్భంలో చంద్రబాబు కూడా అంటువంటి ధీమానే ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత భంగపడితే దేశానికి అంత మంచిది. చట్టవిరుద్ధమైన పనులు యథేచ్ఛగా చేయడం, పట్టుపడకపోవడం, పట్టుబడినా తప్పించుకోవడం వీరికి ఒకప్పుడు మంచినీళ్ల ప్రాయంగా ఉండేది. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతున్నది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తల వంటివారు జైళ్లకు పోతుంటే, ప్రధానమంత్రులు సైతం బోనెక్కవలసి వస్తున్నది. ఇదంతా చంద్రబాబుకు తెలుసు.
ప్రస్తుతపు ఓటుకు నోటు కేసులో తనకు ఏమీ జరగదనే ధీమా నిజానికి ఆయనకు ఉన్నట్టు లేదు. కానీ దబాయింపు వాదనలు, అహంకారం చాలా ప్రదర్శిస్తున్నారు. ఆ వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించగలదని, జాతీయస్థాయి వారిని తప్పుదారి పట్టించగలదని ఆయన ఆశపడుతున్నట్టున్నారు. ఈ ధీమాలు, ఆశలు భంగపడటం చాలా అవసరం. 
రేవంత్ కేసులో చంద్రబాబు సూత్రధారిత్వం గురించి ఢిల్లీతో సహా దేశమంతటికీ స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇందులో అర్థం కానీ మిస్టరీ ఇక ఏమీ లేదు. కాకపోతే కొన్ని వివరాలు తెలియరావాలి. జరిగిన దానితో ఆయన రాజకీయ ప్రతిష్ఠ ఇప్పటికే మట్టిపాలైంది. తను ఎంత హుంకరించినా, దృష్టిని మళ్లించే వాదనలు చేసినా ప్రతిష్ఠ్ ఇక తిరిగి వచ్చేది కాదు. గత పదిరోజుల ఘటనలు దేశానికంతా కనిపిస్తున్నవే. సులభసూత్రాల వలె చెప్పాలంటే, స్టీఫెన్‌సన్ ఓటును ఖరీదు చేసేందుకు రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పట్టుబడినారు. స్టీఫెన్‌సన్‌తో ఫోనులో మాట్లాడి చంద్రబాబు పట్టబడినారు. వీడియో టేపుల్లో ప్రపంచానికంతా కనిపిస్తున్న రేవంత్ ఘనకార్యం గురించి చంద్రబాబు ఈ పదిరోజుల్లో నోరు మెదపలేదు. రేవంత్‌ను ఇరికించారంటారు గానీ ఏ విధంగానో చెప్పరు. 

స్టీఫెన్‌సన్‌తో తన సంభాషణ రికార్డు ఫేక్ అని ఒకసారి, ట్యాపింగ్ జరిగిందని మరొకసారి అంటారు. ఇందులో వైరుధ్యం అందరూ ఎత్తి చూపుతున్నదే. గత కొద్దిరోజులుగా ట్యాపింగ్ అనే వాదన కు కట్టుబడినట్లున్నారు. ట్యాపింగ్ జరిగి ఉంటే అది తప్పనుకున్నా, నేర పరిశోధన కోసం సైతం ట్యాపింగ్ చేయరాదని కోర్టులేమీ అనలేదు. ఒకవేళ అన్నాయని వాదనకోసం అంగీకరించినా, ఆ సంభాషణలోని తన నేర పథకం అన్నది అసలు విషయమైనప్పుడు చంద్రబాబు ఆ ప్రశ్నకు మసిపూయడం ఎందుకు? ట్యాపింగ్ అనే నేరం జరిగింది గనుక, తన ఫోన్ సంభాషణలోని నేర పథకం నేరం కాకుండా పోతుందని ఆయన చెప్పదలచుకున్నారా?

వాస్తవానికి ఈ అంశంపై ఎన్నెన్నిపదునైన, తర్కమైన ప్రశ్నలు వినవస్తున్నాయంటే, ఇంకా మిగిలిన కోణాలేవీ కన్పించడం లేదు. పైన రాసినవి కూడా అట్లా వినవస్తున్న వాటిలోంచి తీసుకున్నవే తప్ప కొత్తవికాదు. ఇవన్నీ ఎంత తార్కికంగా, పదునుగా ఉన్నాయో మరొకవైపు చంద్రబాబు శిబిరం నుంచి వినవస్తున్నవి అంత బలహీనంగా ఉన్నాయి. సాక్షాత్తూ అధినేత సహా వారందరికీ దబాయింపులు, చట్టాల గురించి ఆధారం లేని ఊహాగానాలు, కనీస పరిజ్ఞానం లేకపోవడం మినహా మరొకటి లేదని స్పష్టంగా కనిపిస్తున్నది.

కనుకనే చంద్రబాబు, ఆయన పార్టీ ఈ పదిరోజులు గడిచేసరికి ఇక్కడ, దేశస్థాయిలో కూడా పూర్తి ఒంటరిగా మిగిలారు. చివరకు ఆయన రాజకీయ భాగస్వామి బీజేపీ సైతం తనను బలపరచడం లేదు. ఇటువంటి తీవ్రమైన కేసులలో, రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నచోట, త్వరపడి ఒక వైఖరి తీసుకోకుండా కోర్టు తీర్పుల కోసం వేచి ఉండే పార్టీలు, ప్రముఖులు సైతం చంద్రబాబు రాజీనామాను, అరెస్టును కోరుతుండటాన్ని చూడగా, ఆయనకు ఇక మిగిలిన విశ్వసనీయత ఏమిటి? సాంకేతికంగా ఆలోచించినప్పుడు, కోర్టు తీర్పు చెప్పేవరకు ఎవరూ దోషికాదన్నది నిజమే. కానీ ప్రజా జీవితంగా అన్న విషయాలు సాంకేతికతలపై ఆధారపడి ఉండవు. తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‍కు సానుభూతిపరులు కానివారు, బద్ధ వ్యతిరేకులు సైతం చంద్రబాబు రాజీనామాను, అరెస్టును డిమాండ్ చేస్తున్నారంటే, ఒక కేసులో నిర్వివాదమైన రీతిలో ఆధారాలు కళ్ల ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కనీస విచక్షణా దృష్టి గలవారు సాంకేతికమైన తీర్పుల కోసం ఎదురుచూడరన్న మాట.

అయినప్పటికీ నిర్ణయాత్మకమైన రీతిలో, చంద్రబాబు వంటి రాజకీయ తరగతి ధీమాకు, అహంకారానికి భంగపాటు జరగడం చాలా అవసరం. ఒక్క ఈ కేసు కోసమే కాదు. మొదట అనుకున్నట్లు తమను ఎవరేమీ చేయలేరనే ఈ అవినీతి రాజకీయ జాతి ధీమా ఇటీవలి సంవత్సరాలలో భంగపడుతున్నది. అది న్యాయానికి, నీతికి, ప్రజాస్వామ్యానికి నెమ్మదిగా మేలు చేస్తున్నది. వీరిపట్ల సామాన్య ప్రజలకు, దర్యాప్తు సంస్థలకు, కోర్టులకు జంకు తగ్గుతున్నది. ఇది దేశంలో ఆహ్వానించదగ్గ మార్పు. ఈ మార్పు ఇంకా బలపడాలి. అవినీతికి పాల్పడే నాయకులకు, ధనవంతులకు, బలవంతులకు మనసులో ఫికర్ ఏర్పడాలి. అహంకారపు హుంకరింపులు, వక్రపు వాదనలు చెల్లబోవని అర్థం కావాలి. ఆ దిశలో చం ద్రబాబు కేసు మరొక మైలురాయి కావాలి.

ఆయనను మొదటి నుంచి గమనిస్తున్నవారు మొన్నటి గుంటూరు సభలో తన ప్రసంగపు తీరు చూసి, తర్వాత బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చేసిన హెచ్చరికలను గమనించి నమ్మలేకపోయారు. ఆయన అంతగా సంయమనం కోల్పోయి రెచ్చిపోవడానికి కారణం రేవంత్ కేసు ఒక్కటే అయినట్లు తోచడం లేదు. ఎమ్మెల్సీగా తమ అభ్యర్థిని గెలిపించుకుని, టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించి తన ఘటనాఘటన సమర్థతను నిరూపించాలన్న పథకం విఫలం కావడంతో తీవ్రమైన నిరాశ కలగడం సరే. ఆ స్థితి ఆగ్రహాన్ని కలిగించడం సహజం. ఆ కేసు తన గుమ్మం వరకు రావటమన్నది కొత్త పరిస్థితి. ఊహించనిది. ప్రమాదకరమైనది. అయినా చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు, వ్యూహకర్తగా పేరుపడిన నాయకుడు దాన్నుంచి బయటపడే మార్గాల కోసం నింపాదిగా ఆలోచించాలి. కానీ ఈ విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటే తను బయటపడటం కష్టమని, మేనేజ్ చేయలేనని ఆయనకు అర్థమై ఉండాలి. ఇదంతా చాలదన్నట్టు ఇది ఎటువంటి స్థితిలో బట్టబయలైంది? తమ కొత్త రాష్ర్టాన్ని తాను దశల వారీగా దేశంలోనే మూడవదిగా, మొదటిదిగా, ఆ తర్వాత యావత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణిదిగా మార్చగలనని ప్రతిజ్ఞలు చేస్తున్న వేళ జరిగింది!


తన గత రికార్డును, సమర్థతను దేశ విదేశాల వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులకు వివరించి ఆహ్వానిస్తూ ఆకాశయానం చేస్తున్న సమయంలో మొత్తం దేశంలోనే అత్యుత్తమమైన రాజధానీ నగరానికి భూమి పూజ చేసిన వేళ.


అటువంటి మేధో-మానసికస్థితిలో ఉండిన చంద్రబాబుకు ఈ ఉదంతం ఒక తీవ్రమైన ఎదురుదెబ్బ కావడం నిజం. ఆయన ఆగ్రహ పారవశ్యానికి ఇదొక ముఖ్యకారణం అయి ఉండాలి. ఆ మేరకు తనను అర్థం చేసుకోవచ్చు. కానీ అంతటి ఘనమైన లక్ష్యాలను ముందుంచుకున్న ఆయన అందుకు అంకితమై దానిపై దృష్టి కేంద్రీకరించి పనిచేసినట్లయితే తనను అభినందించి ఉండేవాళ్లం. అది తనకు, తన పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ర్టానికి మేలు చేసేది. కానీ ఆయన ఒక పొరుగు రాష్ట్రంలో చవకబారు రాజకీయాలకు దిగారు. రాజకీయాలు చేయడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ అవినీతి రాజకీయాలకు పాల్పడి తనను తాను పతనం చేసుకున్నాడాయన. మొదట ఎన్టీఆర్‌కు ద్రోహం, తర్వాత విచక్షణలేని ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రజలకు ద్రోహం చేసిన ఆయన, ఇప్పుడింత పచ్చి అవినీతి రాజకీయానికి పాల్పడి మొత్తం దేశం దృష్టిలోనే విలువ కోల్పోయారు. అది కూడా ఇటీవలి వారాలలో నీతి గురించి పదే పదే వల్లిస్తూ. ఇటువంటి వారికి తిమ్మిని బమ్మి చేసి బయటపడగలమనే ధీమా ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దానిని అవశేషాలు మిగలకుండా భంగపరచడం అవసరం. అది తనను దారిన పెట్టగలిగితే మున్ముందు అయినా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌కు కొంత మేలు కలుగుతుంది. తన వంటి వారికి దేశమంతటా గుణపాఠం అవుతుంది.

అసలు కేసు గురించి మాట్లాడరెందుకని? ఎవరెన్ని ప్రశ్నలు వేసినా ఉష్ట్రపక్షి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు చివరకు ఫోన్‌ట్యాపింగ్, విభజన చట్టంలోని 8వ నిబంధన అనే రెండు అంశాలను తరణోపాయంగా చూస్తున్నారు. కానీ ఇవి ఆయనను గట్టెక్కించగలవి కావని ఆ రెండింటిని పరిశీలించిన వారికి బోధపడుతుంది. అదే విషయం ఇప్పటికే నిపుణులు కూడా ఎత్తి చూపుతున్నారు. అది చంద్రబాబుకు కూడా అర్థమైనట్లున్నది. అందుకే ఆయనలో అసహనం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్థితి నుంచి బయటపడేందుకు ఒకే ఒక మార్గం కనిపిస్తున్నది. 

ఆయన తన తప్పునంతా ఉన్నది ఉన్నట్లుగా పూసగుచ్చినట్లు ప్రజలకు, కోర్టుకు వివరించి చెప్పాలి. బహిరంగంగా రెండు రాష్ర్టాల ప్రజలకు బేషరతు క్షమాపణలు ప్రకటించాలి. తన జీవితకాలంలో ముందెప్పుడూ అవినీతి రాజకీయాలకు పాల్పడబోనని హామీ ఇవ్వాలి. తనను తాను నిప్పులాంటి మనిషినని, సచ్చరిత్రుడనని పదేపదే ప్రకటించుకునే చంద్రబాబు ఈ పని చేయగలరా? రెండు రాష్ర్టాల ప్రజల మధ్య సంబంధాలను తన ప్రయోజనం కోసం బలిపెట్టే నీచానికి పాల్పడకుండా ఉండగలరా?

discription






(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




గురువారం, జూన్ 11, 2015

నీ జేజమ్మ తరంకాదు...!!! (విలేఖరులతో...కేసీఆర్)

kcr


చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తనను అరెస్టు చేసిన రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆఖరి రోజని చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబును దొరికిన దొంగ అని అభివర్ణించిన ముఖ్యమంత్రి.. ఆయన చర్యను ప్రధాని నరేంద్రమోదీ కూడా సమర్థించబోరని భావిస్తున్నానని చెప్పారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇది వెయ్యిశాతం వాస్తవమని అన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. దానినుంచి తప్పించుకోడానికి గాయి గాయి చేస్తున్నారని మండిపడ్డారు.

-చంద్రబాబూ.. జస్ట్ నువ్వొక గెస్ట్‌వి..
-దొరికిన దొంగవు.. అహంకారం.. అరాచకం నీదే..
-తెలంగాణలో నీ ఆటలు సాగవు..
-ఫోన్ల ట్యాపింగ్ చేయలేదు.. చెయ్యం
-మెజార్టీ లేకుండా పోటీకి దిగడం వెనుక బాబు ప్లానేంది?
-దొంగకు కేంద్రం సహాయం చేస్తుందని అనుకోను
-చంద్రబాబు ఆయనను ఆయనే మసిజేసుకున్నడు
-చంద్రబాబు బాగోతం చెప్తే పరేషాన్ అయితరు
-ఇప్పుడు చెప్ప.. టైమొచ్చినప్పుడు చెప్త
-రాజీ జరగడానికి మాకేం పంచాయతీ ఉంది?
-కేంద్ర నుంచి ఎవరూ నాకు ఫోన్ చేయలేదు
-మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలు

హైదరాబాద్‌పై పదేండ్లు తనకు హక్కు ఉందని చంద్రబాబు చెప్పడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది పదేండ్లు ఫెసిలిటేటింగ్ క్యాపిటల్ మాత్రమేనని గుర్తు చేశారు. కావాలంటే విభజన చట్టాన్ని చదువుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అహంకారం, అరాచకంతో మాట్లాడున్న చంద్రబాబు ఆటలు సాగబోవని హెచ్చరించారు. 

ఇక్కడ ఆయన కేవలం ఒక గెస్ట్ సీఎం మాత్రమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. బుధవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయాలు ప్రకటించిన అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రధానంగా ప్రశ్నోత్తరాలు సాగాయి.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మీడియా: చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు..


కేసీఆర్: బాబుకు కామన్సెస్ ఉందా. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ కేసులో విచారణ జరుపుతున్న డీజీపీ మంగళవారం నన్ను కలిశారు. తాము ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని విస్పష్టంగా తెలిపారు. నేనూ అదే చెప్తున్నాను. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం 120 మంది వివిధ ఏపీ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఫోన్లను ట్యాప్ చేసిందే అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 31 వరకూ ఏం చేస్తున్నది? మే 31 నుంచి జూన్ 10 వరకే 120 ఫోన్లను ట్యాప్ చేస్తిమా? మరి ముందే ఎందుకు కంప్లయింట్ ఇవ్వలేదు? జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ కాలమంతా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం పొగరుగా వ్యవహరిస్తున్నదంటే చంద్రబాబు నాయుడుకానీ, ఆయన అధికారులుగానీ ఏం చేస్తున్నారు?

మీడియా: చంద్రబాబు టేపులు బయటకు వచ్చిన తర్వాత తాము అప్రమత్తమయ్యామనేది ఏపీ వాదన!


కేసీఆర్: టేపులు టీవీల్లో రావడం అనేది మీడియా స్వేచ్ఛ. మీడియాకు ఉన్న సోర్స్. ఎవరూ దాన్ని కాదనలేరు. వెయ్యి విషయాలు ఊహించుకోవచ్చు. నేనేమీ చేయలేను. మీరు వెళ్లి మీడియాను అడగండి! బంగారు లక్ష్మణ్ కేసులో ఏమైంది? కేవలం లక్ష రూపాయలు ముడుపులు తీసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు దొరికినందుకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు ఇప్పుడు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారు. కేవలం 63 మంది ఎమ్మెల్యేలతోనే 5 ఎమ్మెల్సీలు పోటీ చేశారని అంటున్నాడు. పెద్దమనిషి చంద్రబాబును నేను అడుగుతున్నా.. పార్టీ ఫిరాయింపుల నేరం నీకు వర్తించదా?

నీకు లేదా నీతి? నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో గెలిచిండు? ఇయ్యాల ఏ పార్టీల ఉన్నడు? కొత్తపల్లి గీత! ఈ ఇద్దరు ఎంపీలు ఏ పార్టీనుంచి గెలిచారో? ఏ పార్టీలో ఉన్నారో ప్రపంచం మొత్తానికీ తెలుసు. మీకు నైతికతే ఉంటే వారిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు మిస్టర్ నాయుడు? వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నావు? నీ సమాధానం ఏమిటి? ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలను, ఒక జెడ్పీ చైర్‌పర్సన్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నువ్వు చేర్చుకుంటేనేమో నీతి! ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక కొత్త వాతావరణం వచ్చి తెలుగుదేశాన్ని ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితేనేమో అవినీతి! దీనికి చంద్రబాబు సమాధానం ఏమిటి? మీరే రేపు ఆయనను అడగండి.

మీడియా: సర్ మీరు నాలుగింటికే పోటీ చేస్తే ఈ సమస్య ఉండేది కాదని టీడీపీ వాళ్ళు అంటున్నారు?


కేసీఆర్: ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషనులు వేసే సమయానికి మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది. చంద్రబాబునాయుడికి మెజార్టీ లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచే మీరు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవచ్చు. మాకు సపోర్ట్ చేయాలని మేం మూడు పార్టీలను ఆశ్రయించినాం. నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగిన. ఎంఐఎం మా మిత్రపక్షమే! కలిసి పని చేస్తున్నాం. వారు మాకు మద్దతు పలికారు. సూత్రప్రాయంగా సపోర్ట్ చేస్తాం కానీ.. పార్టీ అనుమతి తీసుకుంటాం అని వైసీపీవారు చెప్పారు.

అయితే హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల తర్వాత వారు అధికారికంగా డిసైడ్ చేసి చెప్పారు. మొదట సీపీఎం తాను ఓటింగ్‌లో పాల్గొనడం లేదని చెప్పింది. దాని తర్వాత సీపీఐ కూడా మేం సపోర్ట్ చేయబోమని చెప్పింది. అప్పుడు మాకు ఉన్న సంఖ్య ప్రకారం 17 చొప్పున ఓట్లు వేసుకుంటే మాకు 68లో నలుగురు ఎమ్మెల్సీలు గెలుస్తారు. వైసీపీ మాకు హామీ ఇచ్చింది. ఒక్క ఓటు మాకు కలుస్తది. పదహారు అయితయి. చంద్రబాబుకు ఆరోజుకు ఉన్న సంఖ్య పదహారు.

ఆయనకు ఇంకో ఓటు వచ్చే ఆస్కారం లేదు.. ఆయన సత్య హరిశ్చంద్రుడైతే. ఆయన 16తోనే ఆయన గెలవాలనుకుంటే ఆయనకు ఇంకో ఓటే రాదు. కనుక ఆయన గెలవడం అనే పరిస్థితే ఉత్పన్నంకాదు. మాకు 69 మంది మద్దతు ఉన్నంక రెండో ప్రాధాన్య ఓట్లు మా అభ్యర్థికి వేసుకుంటే మాకు .44 జమ అయితా ఉంది. దాంతో ఆటోమేటిగ్గా టీఆర్‌ఎస్ ఓట్లు 16.54కి చేరుకుంటాయి. టీడీపీ 16 దగ్గరే ఆగిపోతుంది. ఇది చంద్రబాబుకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఆయన ఎందుకు పోటీ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు రాజీకీయాలను నాశనం చేసింది? ఎవరు రాజకీయ బేరసారాలకు పాల్పడ్డారు? ఎవరు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారు?

అంతిమంగా పోలింగ్ రిజల్టేమిటి? ఎవరికి ఉన్న ఓట్లు వారికే పడ్డాయి కదా! రిజల్ట్ ఏమిటి? సోకాల్డ్ ట్యాపింగ్.. టేపింగ్..! అదంతాగూడా మే 31 తర్వాతే యాదికి వచ్చిందా? వాళ్ల ఎమ్మెల్యేబోయి మా ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ.. మా ఎమ్మెల్యే ప్లేసులో రెడ్‌హ్యాండెండ్‌గా నోట్ల కట్టలతో దొరికన తర్వాత కూడానా? కచ్చితంగా ఇందులో చంద్రబాబు పేరు ఉంది. చంద్రబాబు వేర్వేరు వ్యక్తులతో మాట్లాడారు. చంద్రబాబు అనుచరులు కూడా వేర్వేరు వ్యక్తులతో మాట్లాడారు. ఇప్పుడు దానిని విచారణ సంస్థలు కాల్ డేటా ఆధారంగా బయటకు తీశాయి.

ఆ ఫోన్లు ఇప్పటికే కోర్టుకు డిపాజిట్ చేశారు. ఇంకా ఏం జరిగిందండి.. మా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రేవంత్‌రెడ్డి అప్రోచ్ అయినప్పుడు ఆయన నేరుగా ఏసీబీ డీజీ వద్దకు వెళ్లి కైంప్లెంట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణ మొదలు పెట్టింది. అప్పుడు మాత్రమే కొన్నిసార్లు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు! కొన్నిసార్లు కట్ అండ్ పేస్ట్ చేశారని అంటున్నారు! ఆ గొంతు చంద్రబాబునాయుడితో కాదో ఆయన మొదట చెప్పాలి. దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? డబ్బులు ఇచ్చారా? లేదా? వాళ్ల ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారా? లేదా? స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారా? లేదా? ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పడం లేదు? మీరంతా లైవ్ మీడియా.

హైదరాబాద్ నగరంలో గతేడాది కాలంలో ఒక్క చిన్న ఘటన అయినా జరిగిందేమో మీరు చెప్పగలరా? ఇక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య ఉందా? కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ర్టానికి అనేక విధాలుగా వ్యతిరేకంగా ప్రవర్తించారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన విద్యుత్‌ను ఇవ్వలేదు. ఒక వైపు విద్యుత్ ఆపేసి.. మరోవైపు వాళ్ల ఎమ్మెల్యేలను ధర్నాలు చేయాలని, యాత్రలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు చేస్తున్న పని సరైంది కాదని కేంద్రం నియమించిన సంస్థలు సైతం హెచ్చరించాయి. వాటిని కూడా చంద్రబాబు తోసిపుచ్చేశారు. చట్టాన్ని ఉల్లంఘించింది మీరు. చట్టం స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించింది మీరు. మళ్లీ ఇతరులపైకి తప్పు నెట్టేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి.

మీడియా: ఉద్యోగులను వేధిస్తున్నారని ఫిర్యాదులున్నాయి..ఇండ్లు కూల్చేశారు.

.
కేసీఆర్: ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? సంబంధిత మంత్రికి ఎవరైనా చెప్పారా? ఎవరి ఇండ్లు కూలగొట్టామండి? చంద్రబాబు నాయుడిదా? గురుకుల్ ట్రస్ట్‌లో ఆంధ్రవాళ్ల ఇండ్లే కూలగొట్టారా? అక్రమ నిర్మాణాలు కూల్చిండ్రు. అందులో తెలంగాణవాళ్లున్నరు.. ఆంధ్రవాళ్లున్నరు. అందరు.. ప్రపంచమంతా ఉన్నరు. లేరా? తెలంగాణ వాళ్ల ఇండ్లు కూలలేదా?

మీడియా: ఈ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉండాలనే డిమాండ్లు వస్తున్నాయి.. మీ వెర్షనేంటి?


కేసీఆర్: నాకో వెర్షనంటూ ఉండదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. అరిసి.. గాయిజేసి దొరికిన దొంగలాగ పట్టుబడి..రాజకీయాలను మలినం జేసే ప్రయత్నంజేసి ముఖానికి మసిబూసుకుని! ఏం సమాధానం చెప్తరండీ ఇయాల? అద్చెప్పవేందయ్యా? అది మాట్లాడవు? అసలు విషయం పక్కకు పోయింది.. ట్యాపు..ట్యాపు.. ఏం ట్యాపు?

మీడియా: ఆయన కండ్లు తెరిస్తే, ఒకొక్క అస్త్రం వదిలితే మీరు మాడి మసై పోతారంటున్నారు..


కేసీఆర్: ఈ మొగోడు ఇట్ల మాట్లాడబట్టి పదేండ్లయింది. అదొక పెద్ద అరిగిపోయిన రికార్డు. మాకు తెల్వదా? ఈ రోజు నీ పరిస్థితి బాగలేక నీ కిందికి నీళ్లుదెచ్చుకోని ఇంక నువ్వు కన్ను ఎన్నడు తెరవాలె.. నేనెన్నడు మసిగావాలె? ఆల్రెడీ నిన్ను నువ్వే మసిజేసుకున్నవ్.. అయిపోయింది.. ఒడ్సిపోయింది!

మీడియా: తనను అరెస్టు చేస్తే మీ ప్రభుత్వం పడిపోతుందని ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు చెప్పారు...


కేసీఆర్: ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. ఇది సహించరానిది. ఏ అధికారంతో చెప్తున్నారు? ఏమధికారం ఉందండి.. చంద్రబాబునాయుడుగారికి? ఈయన ఏమైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఈయన ఒక దొరికిన దొంగ. ఆయనను అరెస్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి అది ఆఖరి రోజని ఆయన ఏ అధికారంతో చెప్తారు? చంద్రబాబు కావచ్చు.. ఎక్స్‌వైజెడ్.. ఎవరైనా కావచ్చు.. వాళ్లకు తెలుసు. మీరు బీజేపీ మద్దతు పోటీ చేసి గెలిచారు. కానీ ఇక్కడ మేం మా సొంత బలంపై గెలిచాం.

ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం. నువ్వుకాదు.. నీ తాత జేజమ్మ కూడా మా వెంట్రుక కూడా పీక్కోలేరు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండాల్నా? వద్దా? అనేది చట్టంలోనే చెప్పారు. అది చాలు. గవర్నర్ కూడా ఒక సంవత్సరం నుంచి చూస్తున్నడు. ఎవరి చరిత్ర ఏంది? ఎవరి బాగోత మేంది? ఎవరు ఎంతలోతు నీళ్లలో ఉన్నరు? అన్నీగూడ ఉన్నయ్.

ఈ రోజు ఒకటే నేనడిగేది.. మెజార్టీ లేకుండా పోటీ చేసిన పార్టీ ఎవరు? మేం వైసీపీ మాకు హామీ ఇచ్చిన తర్వాత ఇక ఏపార్టీ ఎమ్మెల్యే అవసరం లేకుండా ఈ చిల్లర మేనేజ్‌మెంట్ అవసరం లేకుండ.. రైట్ రాయల్ పద్ధతిలో మేం గోదాలోకి దిగినం. నువ్వు దేనిమీద దిగినవు చెప్పు. కేవలం 16 మంది ఎమ్మెల్యేలే ఉన్న తర్వాత చంద్రబాబు ఎలా పోటీలోకి దించారు? చంద్రబాబు ప్లానేంటి? ఆయన చెప్పాలి! 16మందితో ఎమ్మెల్సీని గెలువలేరు. మరి ఎందుకు పోటీ చేశారు? దీనికి మీ సమాధానమేంటి?

మీడియా: టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా! మీరు 15మందే అని చెప్తున్నారు?


కేసీఆర్: అవన్నీ ఉంటాయండీ.. వాళ్లు అల్రెడీ టీఆర్‌ఎస్‌లో చేరారు. కంప్లయింట్ తీసుకున్నరు.. కోర్టుకు పోయిండ్రు.. ప్రస్తుతం అది స్పీకర్‌గారి పరిధిలో ఉంది. దానిపై నేనేమీ కామెంట్ చేయకూడదు. ఎవరూ స్పీకర్‌ను ప్రశ్నించజాలరు. ఆఖరుకు నేను కూడా!


మీడియా: స్టీఫెన్‌సన్‌తో చేసిన బేరసారాలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా? దీని వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదని మీరు అనుకుంటున్నారా?


కేసీఆర్: వాళ్లకు చాలా కలలున్నాయి. పాపం వాళ్లకు వాళ్లే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి..గాయిజేసి గత్తరగత్తరజేసి బయటపడదామనే పిచ్చి ప్రయత్నంలో ఉన్నరు. ఈ రోజు ఆయన దొరికిన కథ చెప్తే మీరు పరేషన్ అయితరు. చాలుంది బాగోతం.

మీడియా: చెప్పండిసార్..


కేసీఆర్: నేనెందుకు చెప్త? చెప్పవల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్త. నాకేం అవసరముంది? తెలంగాణ ప్రభుత్వ అధినేతగా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తది. ఏది చెప్పాలి? ఏది చెప్పకూడదు? అనేది వేరే విషయం. కానీ.. పీకల్లోతు కూరుకునిపోయి ఉన్నడు చంద్రబాబునాయుడు.

మీడియా: ఢిల్లీలో ప్రయత్నాలపై మీ కామెంట్?


కేసీఆర్: ఏం ప్రయత్నం వయ్! ఆళ్ల కాళ్లు ఈళ్ల కాళ్లు పట్టుకుంటున్నడు. ఈ రోజు చంద్రబాబుకు కొత్తనా? నాకర్థంకాదు! అందితె రాళ్లు తప్పితే కాళ్లు!

మీడియా: రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతున్నదా?


కేసీఆర్: రాజీ ఏముంది ఇందులో? మాకేం పంచాయతీ ఉంది రాజీ ఉండటానికి!

మీడియా: స్ట్రింగ్ ఆపరేషన్ చేశారంటున్నారు?


కేసీఆర్: నువ్వు జేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితే ఏంది? స్ట్రింగ్ అయితేనేం బింగ్ అయితేనేం? నువ్వు దొరికినవా? లేదా?

మీడియా: మీరు కూడా ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు!


కేసీఆర్: నేనెందుకు పోతున్న? నాకేం ఖర్మ? 12న నేను ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆ సమావేశం రద్దయింది. దాంతో ఢిల్లీ వెళ్లటం లేదు.

మీడియా: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ఎవరైనా ఫోన్ చేశారా?


కేసీఆర్: ఇప్పటి వరకూ అయితే ఎవరూ ఫోన్ చేయలేదు. నేననుకోవడం.. ఈ విషయానికి సంబంధించి ఎవరూ ఫోన్ చేయరు. నరేంద్రమోదీ ఇలాంటి ముడుపుల కేసును సపోర్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. దేశంలో మునుపెన్నడూ లేనంత చండాలపు అవినీతి ఇది.

ఒక ఎమ్మెల్యే ఓటును ఐదు కోట్లకు కొనుగోలు చేయడం అంటే.. ఎంత నీచం? మీరంతా మీడియాలో వచ్చిన రేవంత్‌రెడ్డి సంభాషణలు వినలేదా? చంద్రబాబు మీడియాను అడుగుతున్నాడు! మీడియాకు సోర్స్ ఉండదా? ఏం సోర్స్ ఉందో తెచ్చుకు వేసుకున్నారు. టీవీకి ఇచ్చిండ్రా.. ప్రపంచమంతా ఇచ్చిండ్రు. మీరు చేసిన తప్పును ఆపితే మాత్రం.. ఎన్నాళ్లీ సంకెళ్లు..! మీ తప్పును బయటపెడితే మాత్రం సంకెళ్లు ఉండొద్దా? ఎటుపాయెనండి.. ఈ సంకెళ్లు?

మీడియా: మీ ఒక్క చానలే ఇచ్చిందంటున్నారు!


కేసీఆర్: మళ్ల అట్లనే అంటున్నవయ్య! నిమిషాల తేడాలో ఇస్తరందరూ! ఎవనికి ముందుగాల అందితే వాడు ఇస్తడు.

మీడియా: కోర్టుకు సబ్‌మిట్ చేయాలిగానీ ఇలా మీడియాకు ఇవ్వడమేంటని అంటున్నారు..


కేసీఆర్: నీకు తెలుసా? నాకు తెలుసా? కోర్టుకు ఎవరు ఏం సబ్‌మిట్ చేశారో!

మీడియా: ఈ కేసులో ఏసీబీ నోటీసు వస్తే నేను తీసుకోనని చంద్రబాబు అంటున్నారు..


కేసీఆర్: దీనిపై నేను మాట్లాడ. చట్టం ఉంటది.. దాని పని అది చేస్తది.

మీడియా: మీపై ఏపీలో 79 కేసులు నమోదయ్యాయి!


కేసీఆర్: చూడండి.. ఇలాంటి కేసులు నాపై 790 నమోదయ్యాయి. ఉద్యమం సమయంలో నాపై ఆంధ్రప్రదేశ్‌లో వందల కేసులు నమోదయ్యాయి. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని. తెలంగాణ పౌరుడిని. భారతదేశ పౌరుడిని. మా తెలంగాణలో పెడితే వాళ్ల దగ్గర పెట్టరా? కేసు పెట్టడమే పెద్ద గొప్పతనమా? తెల్లారకల్లి వెయ్యి కేసులు పెట్టనీకి రాదా తెలంగాణ ఉద్యమకారులకు. తెలంగాణ వాదులకు?

అదో విషయమా? నేననేది.. చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత కతెందుకయ్యా? ఈ సమస్య నీది.. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్ జెప్పిండు.. నీ సమస్యను ప్రజల సమస్యగా మారుస్తున్నవని! ఆంధ్ర ప్రజలు ఆంధ్రలో.. తెలంగాణ ప్రజలు తెలంగాణలో సంతోషంగ ఉన్నరు. వాళ్లకెందుకు పూస్తవయ్యా నీ మసి? మడుగులపడిన దున్నపోతు పది మందికి తన బురద పూసిందన్నట్లు!

మీడియా: వైసీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ అయిందనే విమర్శలున్నాయి!


కేసీఆర్: ఈ కుమ్మక్కులకు, కుంభకోణాలకు పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు. నేనో సైనికుడిని. పోరాటయోధుడిని. ఎవరో పెట్టిన పార్టీలోకి వచ్చి గుంజుకుని ముఖ్యమంత్రినిగాలె. నేను ఒక పార్టీ వ్యవస్థాపకుడిని. ఒక కారణం కోసం పోరాడి.. దానిని సాధించాను. అంతిమంది నేను తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్నాను. తెలంగాణ ప్రజల దయతో నా సొంతంగా నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఏ మాట్లాడుతారండి? వీళ్లకు సంస్కారం ఉన్నదా? నేను మంత్రి పదవి ఇవ్వకుంటే గొర్లు కాసుకునేవాడని అంటడా? అన్లేదా? ఎవరిది గొర్లు కాసే బతుకు? నీదా? నాదా? తలపొగరు ఎవరికి ఉంది? అహంకారం ఎవరిది ఉంది?

మీడియా: మీకు చంద్రబాబే ట్రెయినింగ్ ఇచ్చారంట!


కేసీఆర్: ఎవలు? నిజంగ నాకు ఆయన ఇయ్యలేదుగాబట్టి బతికిపోయిన. ఆయన శిక్షణ తీసుకుని ఉంటే ఈ రోజు నేను జైల్లో ఉండేవాడిని.


మీడియా: లేటెస్ట్ శాటిలైట్ ఎక్విప్‌మెంట్‌ను వెహికల్స్‌లో పెట్టి.. సీఎం, అధికారుల ఇండ్ల పక్కన పెట్టి.. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అంటున్నారు!


కేసీఆర్: చాలా స్పష్టంగా చెప్తున్నా. మేం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదు. చట్టవిరుద్ధంగా మేం ఏమీ చేయలేదు. మాకు మా పరిమితులు తెలుసు. మా పరిమితుల్లోనే మేం ఉన్నాం. నాదొక రిక్వెస్టు. పెద్ద ఉద్యమం జరిగి రాష్ట్రం వచ్చింది. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నరు. దినంరాత్రిబవళ్లు కష్టపడుతున్నం. దానికే నువ్వు చాలా ఆటంకాలు కల్పిస్తున్నావ్. చలా రకాలు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నవ్.

అడ్డదారిల ఏడు మండలాలు ఎత్తుకుని పోయినవ్. ఆ తదనంతరం కరెంటు ఇవ్వనన్నావ్. పొద్దున లేస్తే కిరికిపెడతవ్. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద హైకోర్టుకు వెళితే నీ ముఖం పగిలిపాయె. టెన్త్ షెడ్యూలులోని ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ తెలంగాణకే చెందుతాయని హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇట్లా ఎన్ని దుర్మార్గాలు జేసినవ్? నీ దురాశకు ఒక అంతున్నదా? నువు పక్క స్టేట్ ముఖ్యమంత్రివి. నీకు తెలంగాణతో సంబంధం లేదు.

మాట్లాడితే కామన్ కేపిటల్ అంటవ్. కామన్ క్యాపిటల్ ఏంటి? ఇది ఫెసిలిటేటింగ్ క్యాపిటల్. అది పదేండ్ల వరకూ ఉమ్మడి రాజధాని కాదు.. పదేండ్లు మించకుండా ఉమ్మడి రాజధాని. చట్టం చదువుకో. నీ విజ్ఞత ఏమైపోయింది? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక గెస్ట్ చీఫ్ మినిస్టర్. అక్కడ మీ కార్యాలయాలు ఉండయి కాబట్టి..కట్టుకునే వరకూ కల్పించిన వెసులుబాటు. నీకు హక్కుగాదు. హైదరాబాద్ మీద నీ జురిస్‍డిక్షన్‌ఉండదు.

చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది ఒక టెరిటోరియల్ పోస్టు. డీజీపీ పోస్టు టెరిటోరియల్ పోస్టు. ఏపీ డీజీపీ ఏపీ టెరిటోరియల్‌లోనే పని చేయాలి. ఏపీ చీఫ్ మినిస్టర్ టెరిటరీ ఆంధ్రప్రదేశ్. అంతేకానీ తెలంగాణ రాష్ట్రం కాదు. మీరు రాజధాని నిర్మించుకునేంత వరకూ ఉమ్మడి రాజధాని అనేది ఒక ఫెసిలిటీ మాత్రమే. అది ఒక గౌరవంతో నీకిచ్చిన మర్యాద. దాని పేరుతో నువ్వు తెలంగాణనే శాసిస్తననుకుంటవా? ఇక్కడ ఒక గవర్నమెంటు ఉంది. ఒక పద్ధతుంది. ఇక్కడకొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని నేను రాజకీయం చేస్తననుకుంటే ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చుంటారు! నేను ఎమ్మెల్యేలను కొంట.. మీరు సహకరించాలి..

ఇయ్యకుంటే గాయి చేస్త! ఇదేనా? ఇది నీతా? నా ఎమ్మెల్యేను కొనడానికి వెళ్లి నా ఎమ్మెల్యే ఇంటకాడ పట్టుపడటం నిజం కాదా? ప్రపంచం ముందు లేదా? ప్రజల్లేరా? అరిసి.. బొబ్బపెట్టి.. ఎందుకండి? చాలా వస్తది ఇంకా! పైసలెక్కడికెల్లి వచ్చినయ్..అందంతా రావద్దా? మొత్తం వస్తది కదా! కథెక్కడ జరిగింది? ఎవడు  ఎవడితో మాట్లాడిండు.. ఎవడి ఫోన్లో మాట్లాడిండు.. అవన్నీ వస్తయి. ఇప్పుడైందా ఇది..

మీడియా: 150 కోట్లతో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే కుట్ర జరిగిందంటున్నారు.

.
కేసీఆర్: తెలంగాణలో నీవు లేని పరిస్థితి ఉంది. ఎందుకు ఈ దందా పెట్టావు? మా ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నావు? అందరికి ఈ సందేహాలు వస్తాయి. దీన్నిట్లనే వదిలేస్తే మా ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరుస్తవు కదా! వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. ఈ సమాచారం నాకొచ్చింది. నేను వాళ్ళను అలెర్ట్ చేశాను. వెంటనే వాళ్ళు అందర్నీ తీసుకుని వెళ్ళి గండిపేటలో క్యాంపు పెట్టుకున్నారు. వైసీపీ డిసైడ్ చేసింది.

సీపీఐ, సీపీఎం ఓటింగ్‌కు దూరంగా ఉంటానన్నాయి. అప్పుడు వారు స్టార్ట్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పిలిచి.. బెదిరించి, భయపెట్టి బేరసారాలు సాగించారు. ఐదు ముఠాలు రంగంలోకి దిగాయి. ఇందులో ఒక ముఠా పట్టుబడింది. దాంతో మిగిలిన ముఠాలు జారుకున్నాయి. నేను పోలీసు అధికారిని కాదు. వారిని అరెస్టు చేయడానికి. దానికి ప్రత్యేక సంస్థ ఉంది. స్వతంత్ర సంస్థ ఉంది. వారు చూసుకుంటారు.

మీడియా: చంద్రబాబు ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు..


కేసీఆర్: కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటున్నారు. అది ఆయనకు అలవాటు. కేంద్రం ఇలాంటి దొంగలకు సహాయం చేస్తుందని, మద్దతు ఇస్తుందని నేను అనుకోను. గతంలో చాలా మంది ఇలాగే దొరికారు. ప్రధానికూడా కోర్టు ముందు నిలబడ్డారు. చరిత్రలో ఇవన్నీ ఉన్నాయి. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడం ప్రభుత్వ పని కాదు.

సంస్థలు ఉన్నాయి. ప్రత్యేక విభాగాలున్నాయి. పోలీసులు ఉన్నారు. చంద్రబాబు కోరుకున్నట్లు కేంద్ర వ్రభుత్వం ఎక్కడైనా తప్పుచేసి సెక్షన్ 8మీద ఏదైనా చేయబోతే కేంద్ర ప్రభుత్వం తన ముఖానికి కూడా మసిపూసుకుంటది.

వారు ఖర్మకాలి సెక్షన్ 8 పెట్టినా.. ఏసీబీ ఆ సెక్షన్‌లోకి రాదు. ఇదంతా చంద్రబాబు ఆడే డ్రామా. ఆధిపత్యం. దాదాగిరి. ఏపీ పోలీసు ఇక్కడ ఏమీ అధికారం చెలాయించడానికి లేదు. ఎవరైనా సీఎం పక్క రాష్ర్టానికి వెళితే అక్కడి ప్రభుత్వం సెక్యురిటీ కల్పిస్తుంది. చెన్నైకి పోతే చెన్నై ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు దొరికిన సంగతి చెప్పు. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. నీ అంతట నీవే సరెండర్ అవుతావా? స్టేట్‌మెంట్ ఇస్తావా? నిర్ణయం నీదే. మిగతావన్నీ తర్వాత మాట్లాడుదాం.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, జూన్ 10, 2015

బాబుపై ఎఫ్‌ఐఆర్...!!!???

babu

-లెక్కకు మించిన సాక్ష్యాధారాలతో రంగం సిద్ధం చేసిన ఏసీబీ?
-వీడియో, ఆడియో ఫుటేజ్‌లు, నిందితుల విచారణ అంశాలతో రెడీ
- సెక్షన్ 120 (బీ) ప్రకారం కుట్ర కేసు నమోదుకు అవకాశాలు
- బాబును విచారించేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ బృందాలు
- సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులకు చాన్స్
- ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ డీజీలతో సీఎం కేసీఆర్ భేటీ
- కేసు పూర్వాపరాలు వివరించిన ఉన్నతాధికారులు !
- ట్యాపింగ్ వార్తలను ఖండించిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్


ఓటుకు నోటు కేసులో సంచలన నిర్ణయాలకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయంపై పక్కా ఆధారాలు సంపాదించిన ఏసీబీ అధికారులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది. అంతే కాకుండా సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులుకూడా ఇచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు అవకాశాలు లేకపోలేదని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ఏసీబీ అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. 

ఈ కేసులో లభ్యమైన ఆడియో, వీడియో విజువల్స్, విచారణ సందర్భంగా రేవంత్ అండ్ బ్యాచ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా చంద్రబాబుపై సెక్షన్ 120 బీ (నేర పూరిత కుట్ర విత్ కామన్ ఇంటెన్షన్), పీసీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం కేసులు నమోదు చేసేందుకు లాంఛనాలు పూర్తి చేస్తున్నట్లు ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు చంద్రబాబు నివాసం, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ పోలీసుల భద్రతను తొలగించి.. ఏపీ పోలీసులను నియమించుకోవడం ఆసక్తి రేపుతున్నది. అందులోనూ గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణవాదులపై అరాచకాలకు పాల్పడిన కర్నూలు బెటాలియన్‌ను దిగుమతి చేయడం గమనార్హం. ఇదంతా చంద్రబాబును పట్టి పీడిస్తున్న అభద్రతా భావానికి నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. తన అరెస్టును తప్పించుకునేందుకు ఢిల్లీలో మంతనాలు జరిపేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారన్న అభిప్రాయాలు కూడా విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌లు మంగళవారం రాత్రి కలిశారు. ఓటుకు నోటు కేసుపై చర్చించారని సమాచారం.

ఆ మూడే కీలక ఆధారాలు: స్టీఫెన్‌సన్‌కు రూ.5కోట్లు ఆఫర్ చేసిన రేవంత్.. ఆ సంభాషణలో పదే పదే బాస్, బాబు, చంద్రబాబు అంటూ 72సార్లు చెప్పడం, నేరుగా స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో, తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్టీఫెన్‌సన్ ఫిర్యాదును ఏసీబీ ప్రధాన ఆధారాలుగా తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. రేవంత్ అండ్ బ్యాచ్‌ను నాలుగు రోజులు విచారించిన మరిన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలనుకూడా సేకరించినట్టు తెలిసింది. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఉద్దేశించిన రూ.50లక్షలను ఎవరు సమకూర్చారో ఆధారాలతో ధ్రువీకరించుకున్నట్లు సమాచారం.

అన్ని రకాలుగా విచారించవచ్చు..


ఏదైనా కేసులోగానీ, ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినపుడుగానీ ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తికి నోటీసులు జారీచేసే అధికారం కేసును దర్యాప్తు చేసే అధికారికి సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద ఉంటుందని సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ కుట్ర కేసులో ఎవరినైనా ప్రశ్నించే అధికారం తెలంగాణ పోలీసులకుందని మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములుకూడా స్పష్టంచేశారు. నోటీసులు, సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి, కోర్టు ద్వారా సమన్లు ఇప్పించేందుకు అన్ని అధికారాలు తెలంగాణ ఏసీబీకి ఉన్నాయని పేర్వారం తేల్చిచెప్పారు. రాజధానిలో పోలీసులు మొత్తం తెలంగాణ పోలీస్ శాఖ పరిధిలోనే పనిచేస్తారని, ఏపీ పోలీసులకు హైదరాబాద్ పోలీసులపై ఎలాంటి అధికారం, పెత్తనం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్యకు కూడా కుట్ర చేసిన బాబుపై క్రిమినల్ కేసు నమోదుచేసి, విచారణ చేసే అధికారం దర్యాప్తు విభాగాలకు చట్టం కల్పించిందని శ్రీరంగారావు తెలిపారు. రేవంత్ చెప్పిన అంశాలు, ఆఫర్‌ను నెరవేరుస్తామని చంద్రబాబే స్వయంగా స్టీఫెన్‌సన్‌కు ఫోన్‌లో చెప్పడం కేసు నమోదుకు వజ్రాయుధంలాంటిదని శ్రీరంగారావు అభిప్రాయపడ్డారు.

ఇక దూకుడుగానే..


ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించి దొరికిపోయిన రేవంత్ అరెస్ట్ అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఏసీబీ ఎక్కడా దుందుడుకుగా వ్యవహరించలేదు. కేసులో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ బాస్ అనే ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబుపై అన్ని సాక్ష్యాధారాలను సేకరించింది. ఇక ఇప్పటినుంచి దూకుడుగానే వెళ్లాలన్న నిర్ణయంతో ఏసీబీ అధికారులున్నట్టు తెలుస్తున్నది. ఈ కేసు వ్యవహారంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. కేసు పూర్వాపరాలపై సీఎంతో చర్చించినట్టు తెలిసింది. చంద్రబాబుకు నోటీసులిచ్చి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడమా? లేకా సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్ వేసి కేసులు నమోదు చేసి విచారించాలా? అన్న విషయంలో తమకు కొంత సందిగ్ధం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కేసు నమోదు ఎప్పటికైనా తప్పదని, అందుకు లెక్కకు మించిన ఆధారాలు సాధించామని వారు తేల్చిచెప్పారు.

సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో కొత్తముఖాలు..


రేవంత్ అండ్ బ్యాచ్ కస్టడీ తర్వాత వెలుగులోకి వచ్చిన అనేక సాక్ష్యాధారాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుతో పాటు ఓ రాజ్యసభ ఎంపీ, ఆయనకు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఈవో, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నాయని ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర, శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా కుట్ర చేసినందుకు వారిపై కూడా క్రిమినల్ కేసులను నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు అనుమానిస్తున్న మరికొందరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్పాయి.

ట్యాపింగ్ వార్తల్లో నిజం లేదు: ఏకే ఖాన్


ఏపీ ముఖ్యమంత్రి సహా కొంతమంది ప్రముఖుల టెలిఫోన్లు ట్యాప్ చేసినట్ట్టు కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఖండించారు. అవన్నీ అవాస్తవమని, నిరాధారమైనవని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఏకే ఖాన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ ఒక పారదర్శకమైన విచారణ ఏజెన్సీగా డీజీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. చట్టం పరిధిలోనే నడుచుకుంటుందన్నారు.

అరెస్ట్ భయంలో బాబు.. ఇంటి చుట్టూ సొంత భద్రత


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకున్నట్టు కన్పిస్తున్నది. ఇప్పటిదాకా చంద్రబాబు నివాసం, ఆయనకు చెందిన టీడీపీ కార్యాలయం వద్ద తెలంగాణ పోలీసులే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. రేవంత్‌రెడ్డి అండ్ బ్యాచ్‌పై జరుగుతున్న విచారణ.. ఆ సందర్భంగా బయటికి వస్తున్న కొత్త విషయాలు, ఈ వ్యవహారానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు ఏసీబీ సంపాదిస్తున్న సాక్ష్యాధారాల నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ తప్పదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన రక్షణను సొంత పోలీసులకు అప్పగించినట్లు అర్థమవుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలంటూ ఏపీ ఉన్నతాధికారులు ఒత్తిడితీసుకువచ్చారు. ఆ సిబ్బంది విధులు ముగించుకోకముందే కర్నూలు బెటాలియన్‌కు చెందిన ఒక కంపెనీ (128 మంది) సిబ్బందిని రంగంలోకి దించారు.

ఆంధ్రా గ్రేహౌండ్స్ విభాగం నుంచి 35 మందిని, ఉగ్రవాద, తీవ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వాడాల్సిన ఆక్టోపస్ యూనిట్‌నుంచి సైతం 45 మందిని చంద్రబాబు ఇంటి వద్ద కాపలాకు దించారు. అత్యంత పటిష్టమైన ఆక్టోపస్‌ను స్వంత లాభానికి వాడుకోవడం వివాదాస్పదమేనని సీనియర్ ఐపీఎస్‌లు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చంద్రబాబు ఇంటి వద్ద బుధవారం నుంచి 250 మందికి పైగా ఏపీ పోలీసులను భద్రతలో చంద్రబాబు నిమగ్నం చేసినట్టు ఆ రాష్ట్ర పోలీస్ వర్గాలద్వారా తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని పాత ఇంటినుంచి చంద్రబాబు ఇటీవలే మరో ఇంట్లోకి మారారు. ఆ రెండు ఇండ్ల వద్ద భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. అరెస్ట్ సమయం వచ్చినా, లేదా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చినా అనుమతివ్వకుండా తెలంగాణ పోలీస్ అధికారులను అడ్డుకోవడం లేదా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగేవారిపై దాడులకు తెగబడటమే టార్గెట్‌గా ఈ బెటాలియన్లను రంగంలోకి దింపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అరాచకానికి అడ్రస్ కర్నూలు బెటాలియన్!


కర్నూలు స్పెషల్ పోలీస్ బెటాలియన్ అంటే పోలీస్ శాఖలో అరాచకం అనే పేరుందని తెలంగాణ పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న సమయంలో ఓయూతో పాటు అసెంబ్లీ, సెక్రటేరియేట్ పరిసర ప్రాంతాల్లో ఈ బెటాలియన్ ఫోర్స్‌నే ఆంధ్రా పాలకులు రంగంలోకి దించి దాడులకు పాల్పడ్డారని వారు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్‌పై వివక్షేంటి?


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పోలీస్ శాఖను అవమానపరిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన జరిగిన ఏడాదినుంచి రాజధానిలో ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. అలాంటిది.. ఉన్నపళంగా ఏపీ సీఎం నివాసాలు, కార్యాలయాల వద్ద విధుల నుంచి తెలంగాణ పోలీసులను తప్పించారు. ఏపీ సీఎంపై ఆరోపణలు వస్తే తెలంగాణ పోలీసులను తొలగించడం ఇక్కడి పోలీసులను అవమానపర్చడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



మంగళవారం, జూన్ 09, 2015

బాబుగేటు వెనుక భారీ కుట్ర...!!!

-తొలి లక్ష్యం.. తెలంగాణను అస్థిర పరచడం
-రాష్ట్రం విఫలమైందని చూపే యత్నం
-150 కోట్లు పెట్టుబడి.. 20మంది ఎమ్మెల్యేలు టార్గెట్
-ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కుట్ర కోణం?
-ఏసీబీ విచారణలో బయటికి వస్తున్న కొత్త నిజాలు!
గెలిచినా ఉపయోగంలేని ఒక ఎమ్మెల్సీ స్థానంకోసం ఒక ఎమ్మెల్యే ఓటును ఐదు కోట్లతో కొనేందుకు చంద్రబాబు అండ్ బ్యాచ్ ఎందుకు సిద్ధపడటం వెనుక భారీ కుట్ర కోణం ఉందని తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఏసీబీ కూపీ లాగుతుంటే భారీ కుట్రల డొంకలు కదులుతున్నాయి. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను కొనేందుకు పరిమితమైన వ్యవహారం కాదని, మొత్తంగా 20 నుంచి 25 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే భారీ పన్నాగంలో ఇదొక భాగం మాత్రమేనని, దీనికి చంద్రబాబు అండ్ పార్టీ రూ.150 కోట్ల పెట్టుబడితో సిద్ధమైందనే నివ్వెరబోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. 




త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వెన్ను విరిచేలా ఫలితాలు సాధించడం.. రాష్ట్రంలో అస్థిర వాతావరణాన్ని నెలకొల్పి.. మొత్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే కుప్పకూల్చి.. ఆ స్థానంలో తన తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే భయంకరమైన కుట్ర ఉందని విశ్లేషణలు విన్పిస్తున్నాయి. అన్నింటికి మించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నమని తేల్చే దుష్టబుద్ధి ఉందని తెలుస్తున్నది. అందుకోసమే ఇంత భారీ పెట్టుబడితో సిద్ధమయ్యారని సమాచారం. తాము దాదాపు 20 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేసేందుకు ప్రయత్నించామని అంతర్గత సంభాషణల్లో టీడీపీ నాయకులే చెప్తుండటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన సీటు గెల్చుకోవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే సరిపోతారు. కానీ.. ఇంత మందిని తమవైపు తిప్పుకోడానికి టీడీపీ ప్రయత్నం చేసిందంటే.. అంతిమంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందనే విషయం స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆదినుంచి తెలంగాణ పట్ల వ్యతిరేకతే!


తెలంగాణ ఏర్పాటును అడ్డుకోడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్న విషయం యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. పలువురు టీడీపీ నేతలు సైతం ఈ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి ఉంది. తన అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయిన వాస్తవాన్ని అనేక సందర్భాల్లో యావద్దేశం చూసింది. తెలంగాణ రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టడానికి కరెంటు విషయంలో, కృష్ణా జలాల విషయంలో అనేక దుష్టయత్నాలకు తెర తీస్తూ, టీఆర్‌ఎస్ పరిపాలన చేయలేదని తేల్చాలని చంద్రబాబు అనేక కుట్రలకు పాల్పడ్డారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటుకు

బెడిసికొట్టాయి. ముందు చూపుతో వ్యవహరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దాదాపు పాతికేండ్ల తర్వాత మండుటెండల్లోనూ కరెంటు కోతలనేవే లేకుండా చేసి.. రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు అనుభూతించారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం కిరికిరిపెడితే.. బోర్డుల ముందు పంచాయితీ పెట్టి.. రాష్ట్రవాటాను సాధించింది ఇక్కడి ప్రభుత్వం. ఇవన్నీ చూసిన చంద్రబాబుకు కన్నుకుట్టిందని, అందుకే ప్రభుత్వాన్నే కూలదోయాలనే పరాకాష్టకు తన ఏజెంట్ల ద్వారా వెళ్లారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే 150 కోట్ల పెట్టుబడితో 20-25 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పథకం రచించుకున్నారని సమాచారం. ఒక్క ఎమ్మెల్సీ గెలువడానికి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం కాగా టీడీపీకి బీజేపీ మద్దతు కలుపుకొని 16 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే టీడీపీ బరిలోకి దింపిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలువడానికి కేవలం ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తే సరిపోతుంది.. కానీ 20 మంది ఎమ్మెల్ల్యేలను కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నాలు దేనికి సంకేతం? 20 మంది ఎమ్మెల్యేలు టచ్ చేశామని టీడీపీ నాయకులు అంటున్నారంటేనే.. దీర్ఘకాలంలో ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర తప్ప ఇందులో మరొకటి లేదని విశ్లేషకులు అంటున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!