-అక్కడ అవసరం లేనివి తీసేస్తం.. లారీలో ఆంధ్రాకు పంపిస్తం
-జగమెరిగిన మహానేత లక్ష్మణ్బాపూజీ
-తెలంగాణ కోసం తొలి పదవీత్యాగం చేసిన మహనీయుడు
-జలదృశ్యం కూల్చిన పాపం చంద్రబాబుదే
-దానిని సమీక్షించి.. చిరస్మరణీయం చేస్తాం
-త్వరలో చేనేత అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం
-బాపూజీ విగ్రహావిష్కరణ సభలో సీఎం కే చంద్రశేఖర్రావు
‘తెలంగాణ కోసం ప్రాణమున్నంతకాలం తపించి పోరాడిన మహనీయుడు.. తొలి పదవీ త్యాగం కూడా ఆయనదే. 1969లోనే మంత్రి పదవిని తృణప్రాయమనుకున్నడు. ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ జగమెరిగిన మహానేత’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. రాష్ట్రంలో యూనివర్సిటీకో, లేదంటే ఏదైనా గొప్ప సంస్థకో ఆ మహానుభావుడి పేరు పెట్టి భావితరాలకు గుర్తుండిపోయేటట్లు చేస్తం అని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్బాపూజీ 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పద్మశాలి భవన్ ముందు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడున్న అవసరం లేని వ్యక్తుల విగ్రహాలను తీసేస్తామన్నారు. వాటిని లారీల్లో తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రాకు తరలిస్తుందన్నారు.-జగమెరిగిన మహానేత లక్ష్మణ్బాపూజీ
-తెలంగాణ కోసం తొలి పదవీత్యాగం చేసిన మహనీయుడు
-జలదృశ్యం కూల్చిన పాపం చంద్రబాబుదే
-దానిని సమీక్షించి.. చిరస్మరణీయం చేస్తాం
-త్వరలో చేనేత అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం
-బాపూజీ విగ్రహావిష్కరణ సభలో సీఎం కే చంద్రశేఖర్రావు

రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై పెట్టాలని, అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
ఆంధ్రా మొత్తం భూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలంగాణ మహా వ్యక్తి విగ్రహం కనిపించదు. అదే తెలంగాణలో కుప్పలు తెప్పలుగా ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఎక్కడ బడితే అక్కడ పెట్టారు. తెలంగాణలో ఏ ఒక్క మహా వ్యక్తి లేడా? తెలంగాణ వారు ఆంధ్రకు అవసరం లేనపుడు ఆంధ్ర వారి విగ్రహాలు తెలంగాణలో ఎందుకు పెట్టుకుని దండలు వేసి దండాలు పెట్టి పూజించాలి? సమానత పాటించి ఉంటే ఈ తీసివేతలు - కూడికలు ముందుకు వచ్చేవి కాదు. ఒక సమాజాన్నే వివక్షతకు గురిచేసినపుడు ఆ సమాజంలో ఇలాంటి భావం ఏర్పడటం సహజమే.
నిజం చెప్పారు స్వామిగారూ! కేసీఆర్గారి మాటల సారాంశం కూడా అదే. మన మహోన్నతులు వారికి కనపడనప్పుడు వారి మహాత్ములు మనకెందుకు కనులముందుండాలి? మనకు అక్కరకురాని వాళ్ళ విగ్రహాల్ని వాళ్ళదగ్గరికే పంపుదామంటున్నారు మన ముఖ్యమంత్రిగారు. మన మహనీయులను వివక్షకు గురిచేయడం సహింపరానిది. వాళ్ళు ఈ విషయంలో సమత్వం చూపలేదు. అందుకే ఈ కూడికలు, తీసివేతలు అనడం సబబే. ధన్యవాదాలు. స్వస్తి.
కామెంట్ను పోస్ట్ చేయండి