బ్లాగువీక్షకులకు తెలంగాణ ప్రజలకు
తెలంగాణ స్వాతంత్ర్యదినోత్సవ
శుభాకాంక్షలు
-చరిత్రలో 1948 సెప్టెంబర్ 17
-ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్
-భారత యూనియన్లో హైదరాబాద్ విలీనం
- ఐదురోజుల మహత్తర పోరు
- నైజాం పాలన చివరి ఘడియలు
తరతరాల రాచరిక పాలనకు చరమగీతి పాడిన రోజు. హైదరాబాద్ సంస్థానంలో స్వేచ్ఛా వాయువులు వీచిన రోజు 1948 సెప్టెంబర్ 17. ఆపరేషన్ పోలో పేరిట సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు జరిగిన పోలీస్ యాక్షన్ ప్రజాస్వామ్య పాలనకు దారులేసింది. అది విలీనమని కొందరు.. విమోచనమని మరికొందరు.. విద్రోహమని ఇంకొందరు? ఇలా ఎవరి వాదాలు వారికున్నాయి. మరి ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సెంటర్స్ప్రెడ్లో చూడండి.-ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్
-భారత యూనియన్లో హైదరాబాద్ విలీనం
- ఐదురోజుల మహత్తర పోరు
- నైజాం పాలన చివరి ఘడియలు

రేడియో బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఉండేది. అంతటి వైభవోపేతమైన సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడం ఇష్టంలేని నిజాం ప్రభుత్వంతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని సైతం ఉల్లఘించాడు. మరోవైపు పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్బాటెన్ భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు రాజకీయ ప్రయత్నాలెన్ని చేసినా ఫలితం లేకపోయింది.

యుద్ధం మొదలైంది..


కీలక దశ..

దీంతో ప్రధాని భారత సైన్యాన్ని ప్రతిఘటించేందుకు రజ్వీ సైన్యాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే నాలుగు బెటాలిన్లు పంపించారు. సెప్టెంబర్ 16 ఉదయం వరకు హైదరాబాద్కు భారత సైన్యం 25కిలో మీటర్ల దూరంలోకి వచ్చేసింది. హైదరాబాద్ సంస్థానంలో భారత యూనియన్ ప్రతినిధి అయిన కేఎం. మున్షీని కంటోన్మెంట్ నుంచి ప్రధాని నివాసం రాజ్భవన్ పక్కనే ఉన్న లేక్ వ్యూ అతిథి గృహానికి తరలించింది. మరోవైపు ఖాసీ రజ్వీ జన్నాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తున్నాడు. యుద్ధంలో నిజాం సైన్యం వాస్తవ స్థితిని మార్చి రేడియోల్లో ప్రసారం చేస్తున్నారు.
చివరి అంకం..

ప్రజాస్వామ్యంలోకి...

మేజర్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించడంతో నిజాం నామమాత్రపు అధినేతగా మారారు. అతడి సైనిక దళాలను రద్దు చేయడంతో పాటు.. అతడి ఆధీనంలో ఉన్న రాష్ర్టాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకున్నారు. మిలటరీ పాలన రెండు సంవత్సరాలు కొనసాగింది. అనంతరం ఎంకే. వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రజా ప్రతినిధులను రాష్ట్రేతర సివిల్ అధికారులనతో గూడిన ప్రభుత్వం 1950లో జూన్లో ఏర్పడింది. నిజాం రాజ ప్రముఖ్గా నియమించబడ్డారు. ఈ ప్రభుత్వం 1952 మార్చిలో సార్వజనీన ఎన్నికలు జరిగి ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడు వరకు పనిచేసింది.
సెప్టెంబర్ 17.. ఓ చారిత్రక దినం. తరతరాల రాచరిక పాలనకు చరమగీతి పాడిన రోజు. హైదరాబాద్ సంస్థానంలో స్వేచ్ఛా వాయువులు వీచిన రోజు. అవును.. 1948 సెప్టెంబర్ 17 నిజాం పాలన అంతమవడమే కాదు.. ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజు కూడా. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు మహాకవి దాశరథి. కోటి రత్నాల వీణే కాదు.. నిలువెల్ల గాయాల కోన కూడా ఇది. తెలంగాణ దారిపొడవునా పారిన నెత్తుటి చారికలు కనిపిస్తాయి. రాచరిక పాలనను, రజాకార్ల అరాచకాలను, భూస్వాముల ఆగడాలను, వలస దోపిడీని, పీడనను ఎదిరించి నిలిచిన చరిత్ర తెలంగాణ సొంతం.
త్యాగాల పునాదులపై స్వయం పాలనకు పాదులేసుకుంది తెలంగాణ. ఆపరేషన్ పోలో నాటి ఐదు రోజులు మిగిల్చింది విషాదమవునో కాదో కానీ..తెలంగాణ నేలపై తరువాత స్వేచ్ఛా వాయువులు వీచింది మాత్రం నిజం. భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమవడమే అందుకు నిదర్శనం. ఇది విలీనమేనా? లేదా విలీనం పేరిట జరిగిన విద్రోహమా? లేక విమోచనమా? అన్నదానిపై ఎన్నో వాదాలు.. ఎన్నెన్నో చర్చలు నేటికీ నలుగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ కాసేపు పక్కనపెట్టి 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..
దక్కన్ రేడియో..
రెండు శతాబ్దాల అసఫ్జాహీల పాలన దక్కన్ రేడియో వేదికగా ముగిసింది. నిజాం సైన్యం లొంగిపోవడానికి గొంతు అందించింది. మారిన పరిణామాల నేపథ్యంలో మనం ఓడిపోయాం.. అంతా లొంగిపొండి అంటూ నిజాం స్వయంగా రేడియో స్టేషన్లో ఫర్మాణా చదివి వినిపించారు. దీంతో నిజాం సంస్థానంలోని సైనికులు, రజాకార్లు భారత ప్రభుత్వానికి తలొగ్గారు.
షా మంజిల్..
నేటి రాజ్భవనే నాటి షా మంజిల్. నిజాం ప్రధాని లాయక్ అలీ నివాసం. ఆ రోజు రాత్రి లాయక్ అలీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నిద్రలేదు. భారత సైన్యాలు దూసుకొస్తున్నాయి. బీబీనగర్ వరకు వచ్చాయనే సమాచారం ఫోన్ ద్వారా అందింది. నిజాం లాయక్ అలీ నేతృత్వంలోని మంత్రి వర్గాన్ని రద్దు చేస్తాడని తెలియగానే ఆయనలో ఆందోళన మొదలైంది. చెమటలు పట్టాయి. లాయక్ అలీ నిజాం సామ్రాజ్యపు చివరి క్షణాలకు షా మంజిల్ వేదిక అయింది.
కింగ్ కోఠి రెసిడెన్సీ
కోఠి రెసిడెన్సీ నిజాం అధికారిక నివాసం. నిత్యం రాజసం ఉట్టిపడే ఈ భవనంలో సెప్టెంబర్ 17న విషాదం అలుముకుంది. అధికారం చేజారుతోందనే ఆందోళన నిజాంని ఉక్కిరిబిక్కిరి చేసింది. అధికార యంత్రాంగం, మంత్రులు రాజీనామాతో నిరాశ ఆవహించింది. వేగులు భారత సైన్యం చుట్టుముడుతోందన్న సమాచారాన్ని అందించారు. భవిష్యత్తు అంతుచిక్కక నిజాం ఆలోచనలో మునిగిపోయాడు. లొంగుబాటు తప్పదనే నిర్ణయాన్ని ఈ వేదిక నుంచే తీసుకోవడం గమనార్హం.
ఇదీ నాటి స్థితి..
విస్తీర్ణం: 82,698 చదరపు మైళ్లు
జనాభా: 16.34 మిలియన్లు
హిందువులు: 35 శాతం
ముస్లిం: 12శాతం
(1941 సెన్సెక్స్ ప్రకారం)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మధుసూధన్ గారు
ధన్యవాదాలు స్వామిగారూ!
కామెంట్ను పోస్ట్ చేయండి