-వలసపాలనలో జీవోలన్నీ ఆంధ్రాకు అనుకూలమే
-సెంట్రల్ వర్సిటీని దేశంలోనే నెంబర్ వన్గా మార్చుతాం
-టీఆర్ఎస్వీలో టీఎస్ఏ విలీనం సభలో ఎంపీ కవిత
తెలంగాణ ప్రభుత్వం చిత్రగుప్తుడిలా గత పాలకుల పాపాల చిట్టా రాస్తున్నదని, వలస పాలనలో తప్పిదాలను సవరించాకే ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణకు దిగుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్వీలో తెలంగాణ విద్యార్థి అసోసియేషన్ (టీఎస్ఏ) విలీనం సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గత ప్రభుత్వాల జీవోలన్నీ ఆంధ్రాకు అనుకూలమైనవేనని, అవి తెలంగాణ అభివృద్ధికి సరిపోవన్నారు. వలస ప్రభుత్వం తెలంగాణ, భాష, సంస్కృతి, నాయకులను కించపరుస్తూ గోబెల్స్ ప్రచారం చేసిందని.. ప్రజలు మాత్రం ఉద్యమంలో భాగమయ్యారని పేర్కొన్నారు. తెలగాణ పునర్మాణంలోనూ అదే చొరవను ప్రదర్శించాలని కోరారు. పునర్నిర్మాణమంటే పాలకుల అహంకారాన్ని కూలగొట్టడమే అన్నారు. -సెంట్రల్ వర్సిటీని దేశంలోనే నెంబర్ వన్గా మార్చుతాం
-టీఆర్ఎస్వీలో టీఎస్ఏ విలీనం సభలో ఎంపీ కవిత

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి