గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 03, 2014

తీరుమారని ఏపీఎండీసీ...!!

- తెలంగాణ ఉద్యోగులకు వేతనాలివ్వకుండా కొర్రీలు

రాష్ట్ర విభజన జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వరంగ సంస్థల్లో సీమాంధ్ర ఆధితప్యం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష తీవ్రంగా ఉంది. 
వేతనాలు కూడా సమయానికి ఇవ్వకుండా నానా కష్టాలు పెడుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయమేదీ లేదని, సంస్థలో ఉన్న నిల్వలన్నీ ఆంధ్రవేనంటూ వేతనాల చెల్లింపునకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆగస్టు నెల వేతనాలు సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులంతా 30వ తేదీనే అందుకోగా, తెలంగాణ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఇంకా బిల్లులే తయారు చేయలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సంస్థ నిధులను 58 : 42 నిష్పత్తిలో పంపిణీ చేయకుండానే కార్యాలయాన్ని విభజించారు. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అకౌంట్‌ను తెరిచారు. 

కానీ పైసా కూడా విదిల్చకుండానే కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటూ కార్యాలయాన్ని వేరుచేశారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయమేమీ లేదని సీమాంధ్ర అధికారులు చెబుతున్నారని, వేతనాల బిల్లును మంగళవారం సాయంత్రానికి కూడా రూపొందించలేదని ఓ అధికారి టీ మీడియాకు తెలిపారు. ఏపీఎండీసీకి ఏపీ ప్రభుత్వం నియమించిన ఎండీ శాలినీమిశ్రా లేఖ ప్రకారం అధికారాలను, బాధ్యతలను లాగేసుకొని, సీమాంధ్ర అధికారులకు కట్టబెట్టారు. నిపుణుల కమిటీ డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించలేదన్న సాకుతో నిధులను తెలంగాణ కార్పొరేషన్‌కు ఇవ్వకుండా కొర్రీ పెడుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి