-ప్రతాపరుద్రుని మరణం..
-కాకతీయ అంతం కాదు!
- దంతెవాడలో రాజ్యాన్ని స్థాపించిన అన్నమదేవుడు
- 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో సామ్రాజ్యం ఏర్పాటు
- ఆరువందల ఏండ్లపాటు 20 మంది రాజుల పాలన
- నేటికీ ప్రజా మద్దతు పొందుతున్న రాజు కమల్చంద్ర
- జగదల్పూర్లో ఘనంగా ప్రతి ఏటా దసరా ఉత్సవాలు
చరిత్ర విస్మరించలేనిది! అణచివేయలేనిది! శతాబ్దాలుగా మట్టి కప్పేసినా.. వాస్తవాల మేఘాలు ఉరిమితే.. ఒక్క జోరువానతో మళ్లీ తళతళ మెరిసేది! ఈ కథనం చరిత్రలో ఒక పేజీలో నిక్షిప్తమై ఉన్న ఒక ధీర వారసత్వం మెరుపుల గురించి!! ఓరుగల్లు కేంద్రంగా తెలుగుజాతిని ఏలిన ఒక అపురూపమైన వంశం ఆనవాళ్ల గురించి! ప్రతాపరుద్రుడి మరణంతో అంతమైపోయిందని ఇన్నాళ్లూ మనకు చరిత్ర బోధిస్తూ వచ్చిన ఒక అసత్యాన్ని పటాపంచలు చేసే సత్యం గురించి! మనం చదువుకోని మన చరిత్ర ఇది! -కాకతీయ అంతం కాదు!
- దంతెవాడలో రాజ్యాన్ని స్థాపించిన అన్నమదేవుడు
- 13వేల చ.కి.మీ. విస్తీర్ణంలో సామ్రాజ్యం ఏర్పాటు
- ఆరువందల ఏండ్లపాటు 20 మంది రాజుల పాలన
- నేటికీ ప్రజా మద్దతు పొందుతున్న రాజు కమల్చంద్ర
- జగదల్పూర్లో ఘనంగా ప్రతి ఏటా దసరా ఉత్సవాలు

-జూలకంటి రాజేందర్రెడ్డి, నల్లగొండ, నూర శ్రీనివాస్, వరంగల్
అది 1323! ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉల్లుగ్ ఖాన్ చేతిలో ఓడిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు బందీగా వెళుతున్న సమయం! అంతర్గత..


అది 1324! రాణి రుద్రమదేవి మనుమడు.. దత్తపుత్రుడిగా పట్టాభిషిక్తుడైన ప్రతాపరుద్రుని మరణానంతరం ఆయన సోదరుడు అన్నమదేవుడు బస్తర్ జిల్లాలో రెండవ కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. ఒక రాజ్యం పతనమై.. మరోచోట అవతరించి.. శతాబ్దాల తరబడి మనుగడ సాగించడం అరుదైన సందర్భం. ఆ అరుదైన ఘనత కాకతీయులకే దక్కింది. దట్టమైన అడవుల మధ్య, ఆదివాసీలు అధికంగా నివసించే చోట ఏర్పడిన ఈ సామ్రాజ్యం.. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేంత వరకూ కొనసాగింది. రాజ్యాలు గతించి.. రాచరికపు పాలన అంతరించినా.. నేటికీ బస్తర్ పాలకులు మహారాజ హోదాలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అన్నమదేవుడి (అన్నమ్దేవ్) వారసుల్లోని కమల్ చంద్ర భంజ్దేవ్ కాకతీయ (అక్కడ అలా పిలుస్తారు) రాజ సింహాసనాన్ని అధిష్ఠించారు. తొలుత బస్తర్ అనే చిన్న గ్రామం ఈ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నా.. తదుపరి కాలంలో పాలనా కేంద్రాన్ని బడే డోంగర్కు.. అటు నుంచి జగదల్పూర్కు మార్చారు. ఇప్పుడు అక్కడ రాజ ఠీవి ఉట్టిపడే అద్భుత సౌధం ఒకటుంది. ఈ సౌధంలోనే మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయతోపాటు రాజమాత కృష్ణకుమారీదేవి, రాజకుమారి గాయత్రీదేవి కూడా ఉంటున్నారు.
బస్తర్ పాలకులు కాకతీయ వంశస్తులేనా?


దాంతో బస్తర్ పాలకులకు పాక్షిక స్వయం ప్రతిపత్తితో రాజ్య హోదా కల్పించారు. ఆరు శతాబ్దాల పాటు బస్తర్లో కాకతీయుల సామ్రాజ్యం కొనసాగిందని ఆచార్య రంగా తన పుస్తకంలో ప్రస్తావించడం గమనార్హం. అక్కడ కొనసాగిన రాజులు తమది కాకతీయ వంశమేనని ప్రకటించుకున్నారని ఆయన తన పుస్తకంలో తెలిపారు. 1940 నాటికి బస్తర్ సామ్రాజ్యం 13,062 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. దక్షిణాన ఆంధ్ర, ఉత్తరాన ఒరిస్సా, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా బస్తర్ రాజ్యం విస్తరించింది. ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలను బస్తర్ జోన్గా చెబుతారు.
దేవ్లు భంజ్దేవ్లు ఎందుకయ్యారు?

ఆదివాసుల ఆరాధ్యుడు ప్రవీర్చంద్ర భంజ్దేవ్ కాకతీయ

ఇదే తిరుగుబాటులో అనేక మంది ఆదివాసీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణానంతరం ఆయన సోదరుడు విజయ్చంద్ర భంజ్దేవ్ కాకతీయ, ఆ తర్వాత భరత్చంద్ర భంజ్దేవ్ కాకతీయ బస్తర్ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. అన్నమదేవుడి వంశంలో 23వ రాజు అయిన కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయ ప్రస్తుతం మహారాజ హోదాలో ఉన్నారు. లండన్లో విద్యాభాస్యం చేసిన కమల్.. ప్యాలెస్లోనే ఉంటూ.. ఈ మధ్యే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. బస్తర్ వంశస్తుల ఆరు వందల ఏండ్ల పరిపాలనలో రాజధానిని నెలకొల్పిన ప్రతిచోటా బ్రహ్మాండమైన భవంతులు నిర్మించారు. వాటిలో కొన్ని శిథిలమైతే.. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు జగదల్పూర్లోని రాజప్రాసాదమే మిగిలి ఉంది.
దంతేశ్వరీదేవి వరప్రసాదం!


ఇప్పటికీ ఘనంగా దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాలంటే మైసూర్ లేదంటే కలకత్తా నగరంలో జరిగే వేడుకలే గుర్తొస్తాయి. కానీ.. జగదల్పూర్లో బస్తర్ పాలకుల కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్న దసరా వేడుకలకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. ఆ మాటకొస్తే మైసూర్, కలకత్తాలను మించి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అది కూడా ఒకటి రెండు రోజులుకాదు.. ఏకంగా 75 రోజులపాటు! కాకపోతే.. అన్ని చోట్ల రావణాసురుడి వధకు గుర్తుగా దసరా నిర్వహిస్తే ఇక్కడ మాత్రం బస్తర్ రాజుల కులదైవమైన దంతేశ్వరిదేవి ఉత్సవాలుగా చేసుకుంటారు. దంతేవాడలోని దంతేశ్వరిదేవి ఆలయంలో మొదలయ్యే ఈ వేడుకలు 75 రోజుల తర్వాత ముగుస్తాయి. అందులో చివరి ఏడు రోజుల్లో రాజకుటుంబీకులు హాజరయ్యే సంబురాలకు మాత్రం జగదల్పూర్ వేదికగా ఉంటుంది. ఇక్కడి మహారాజా ప్యాలెస్లో ఈ వేడుకలు ముగుస్తాయి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది.
మైసూర్ దసరా ఉత్సవాలకు 400 ఏండ్ల చరిత్ర ఉంటే.. బస్తర్ వేడుకలకు మాత్రం ఆరువందల ఏండ్ల చరిత్ర ఉంది. బస్తర్ కాకతీయ రాజుల్లో నాలుగవ వాడైన పురుషోత్తందేవ్ ఈ ఉత్సవాలను మొదలు పెట్టినట్లు చరిత్ర చెబుతున్నది. దంతేవాడ నుంచి తరలి వచ్చే దంతేశ్వరిదేవి డోలీని మహారాజ పరివారం స్వీకరించే సన్నివేశం కన్నులపండువగా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో ఉపయోగించే రథాన్ని 14వ శతాబ్దంలో ఒడిశాలోని పూరీ రాజులు బస్తర్ మహారాజులకు కానుకగా ఇచ్చినట్లు చెప్తారు. దసరా ఉత్సవాల్లో దంతేశ్వరి పూజారిగా మహారాజే ఉండటం విశేషం. మహారాజును దైవాంశసంభూతునిగా భావించే ఇక్కడి ఆదివాసీలు, ఐదు జిల్లా ప్రజలు ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. పది రోజులు జగదల్పూర్లోనే గడుపుతారు. దసరా వేడుకల సమయంలో రాజదర్బార్ జనంతో సందడిగా ఉంటుంది. ప్రజలంతా రాజును దర్శించుకుంటారు. ఇక్కడి ఉత్సవాలకు ఇతర రాష్ర్టాల ప్రజలతోపాటు.. విదేశీయులు కూడా వస్తుంటారు. కానీ.. ఇంతటి ఘనమైన పండుగ బయటి ప్రపంచానికి ప్రచారం కాలేదు.
కాకతీయ సామ్రాజ్య పతనం
కాకతీయ సామ్రాజ్య వైభవం, అక్కడి అంతులేని సంపదలపై ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కన్నుపడింది. దీనిపై తొలి దాడి 1303లోనే జరిగింది. ఢిల్లీ సైన్యాలను కాకతీయ సేనలు ఉప్పరపల్లి వద్ద అడ్డుకున్నాయి. అక్కడ భీకర యుద్ధం జరిగింది. ఢిల్లీ సైన్యాలు తోకముడిచాయి. అయినా ఆశ చావని సుల్తాన్ 1309లో మరోసారి మాలిక్ కాఫర్ నేతృత్వంలో సేనలను పంపాడు. సిరిపూర్, హన్మకొండ కోటలను కాఫర్ జయించాడు. దీర్ఘకాలం యుద్ధం తర్వాత ఓరుగల్లు కోటను తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు.
పెద్ద ఎత్తున విధ్వంసానికి, దోపిడీకి, హత్యలకు తెగబడ్డాడు. ఆయనతో ప్రతాపరుద్రుడు ఒడంబడిక కుదుర్చుకుని పెద్ద మొత్తంలో కప్పం కట్టాడు. 1320లో ఢిల్లీ కోటలో అధికార మార్పిడి జరగడంతో ప్రతాపరుద్రుడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఆ సమయంలో ఖిల్జీ వంశం అంతమై.. ఘియాజుద్దీన్ తుగ్లక్ వంశం పాలన మొదలైంది. 1323లో తుగ్లక్ తన కుమారుడు ఉల్లుగ్ ఖాన్ అలియాస్ మహ్మద్ బిన్ తుగ్లక్ను మళ్లీ ఓరుగల్లు కోటపైకి పంపాడు. తుగ్లక్ సేనలను కూడా ప్రతాపరుద్రుడు తరిమికొట్టాడు. దీంతో నెల తర్వాత తుగ్లక్ మరింత భారీ సైన్యంతో దండెత్తాడు.
అప్పటికే పలు యుద్ధాలతో బలహీనపడిన కాకతీయ సైన్యం చివరకు పరాజయం పొందింది. ప్రతాపరుద్రుడు బందీగా చిక్కాడు. ఢిల్లీకి తరలించే సమయంలో నర్మద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చివరి రాజు ప్రతాపరుద్రుడి మరణంతో సామంత పాలకుల హయాంలో గందరగోళం, అరాచకం ప్రబలాయి. ఆ తర్వాత కమ్మ రాజులు, ముసునూరి నాయకులు (గతంలో కాకతీయ రాజ్యంలో సైనిక పదవులు నిర్వహించినవారు) వివిధ తెలుగు ప్రాంతాలను ఏకం చేసి, ఢిల్లీ సుల్తానుల నుంచి ఓరుగల్లును తిరిగి సంపాదించి దాదాపు యాబై ఏండ్లపాటు ఓరుగల్లు రాజ్యాన్ని ఏలారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణంలోనూ ఇక్కడి నుంచి వెళ్లినవారే కీలక పాత్ర పోషించారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
చరిత్రను తిరగరాయాలంటున్న చరిత్రకారులు
మూడు వందల ఏండ్లు పాలించిన కాకతీయులు ఒక్కసారిగా ఎలా కనుమరుగయ్యారు? వారి వారసులందరూ ప్రతాపరుద్రుడిలా బందీలయ్యారా? బందీలు కాకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లారా? వెళితే ఎక్కడున్నారు? అనే ఆసక్తికర అంశాలను ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కనీసం మాటమాత్రమైనా పరిశోధనలు చేయించని దుస్థితి నెలకొన్నది. మరోవైపు ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కాకతీయుల వారసులున్నారనే ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే వాళ్లు కాకతీయుల వారసులేనా? కాదా? అన్న అంశాలపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని చరిత్రకారులంటున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలని సూచిస్తున్నారు.

అలా లెంకల్లో పనిచేసిన వారి పేర్లు, ఇంటిపేర్లు కాలక్రమంలో లెంకలు అని వచ్చి ఉంటాయేమో పరిశోధించాలి. ఛత్తీస్గఢ్లో కాకతీయులమని చెప్పుకునేది శుద్ధకాకతీయులా? లేదా అప్పుడున్న పరిస్థితుల్లో అన్నమదేవుడు ఆయన తరువాత రాజ్యానికి వచ్చినవారు కానీ, ఇక్కడి నుంచి వెళ్లిన వారు కావచ్చు, లేక సంకరమై ఉండవచ్చునేమో అన్నది అనుమానంగా తోస్తున్నది. ఛత్తీస్గఢ్లో ఉంటున్నవారు కాకతీయుల వారసులమని చెప్పుకుంటున్నారంటే వారి చారిత్రక ఆధారాలను పరిశోధిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు. మొత్తానికి వాళ్లు కాకతీయులు అసలే కాదు అని చెప్పడానికి, కొట్టిపారేయడానికి మాత్రం వీలులేదు.
- ప్రొఫెసర్ పోలవరపు హైమావతి, విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ

వాటితో ఎవరికి మేలు? ఎవరు కాకతీయుల గురించి తెలుసుకున్నారు? అంటే శూన్యం. అదే ప్రభుత్వం అక్కడ హంపి (విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగి 500 ఏళ్లు అయిన సందర్భంగా) ఉత్సవాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఇదే వివక్ష మొదటినుంచి అనుసరించారు. అదే వివక్షను చరిత్ర పరిశోధనలోనూ కొనసాగించారు. అందుకే ఇవ్వాళ కాకతీయుల చరిత్రేకాదు యావత్ తెలంగాణ చరిత్ర అంతా వాళ్లకు ఇష్టమొచ్చినట్టుగా రాసుకున్నారు. ఈ పద్ధతికి స్వస్తిపలకాలి. కొత్తగా శాస్త్రీయబద్ధంగా, హేతుబద్ధంగా చరిత్ర రచన జరగాల్సి ఉంది. ఇవ్వాళ విశ్వవిద్యాలయాల్లో ఆ చొరవ, చైతన్యం కొరవడింది.
- ప్రొఫెసర్ ఎనగందుల బొబ్బిలి, విశ్రాంత ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం, చరిత్ర శాఖ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి