గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 29, 2014

ట్రాన్స్‌కోలో గ్లోబల్ టెండర్లకు కుట్ర!


బ్లాగువీక్షకులకు, మిత్రులకు, తెలంగాణ ప్రజలకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

- విద్యుత్ సబ్‌స్టేషన్లపై అజమాయిషీకి సీమాంధ్రుల ప్రయత్నం
- రోడ్డున పడనున్న తెలంగాణ కాంట్రాక్టర్లు, కార్మికులు 
transco

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) లోని సీమాంధ్ర అధికారులు మరో కుట్రకు తెరలేపారు. ఒకేసారి 150కి పైగా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టడమే కాకుండా అడ్డదారుల్లో దాదాపుగా రూ.10-15 కోట ్లఅవినీతికి పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్‌స్టేషన్ల నిర్వహణకు గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు కొత్త కుట్రకు తెరలేపారు. ఈ కొత్త విధానంలో ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా చేసి కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లకే వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

సీమాంధ్రకు చెందిన కొంతమంది ఉన్నతాధికారులే తెరవెనుక ఉండి ఈ కథ నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లు ఎవరికీ రూ.5కోట్ల టర్నోవర్ లేదు. ఈ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్లు ఎవరూ అర్హులు కాకుండాపోతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఇంకా తమ ఆధిపత్యమే కొనసాగాలని భావిస్తున్న సీమాంధ్రులు కుట్రపూరితంగా ఈ నిబంధనలు రూపొందించారనే విమర్శలున్నాయి. 

తెలంగాణ కాంట్రాక్టర్లకు మొండిచేయి..: తెలంగాణ పది జిల్లాల్లో 132/33 కేవీ సబ్‌స్టేషన్లు నూటడ్బ్బైమూడు , 220/33 కేవీ సబ్‌స్టేషన్లు యాభైనాలుగు, 400 కేవీ సబ్‌స్టేషన్లు ఆరు ఉన్నాయి. ఇవి కాక ట్రాన్స్‌మిషన్ లైన్‌ల తనిఖీ, నిర్వహణకు రాష్ట్రంలోని పదిజిల్లాల పరిధిలో 43 గ్యాంగ్‌లు ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణ ప్రస్తుతం 150 మంది చిన్న కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనల మేరకు 10 నుంచి 14 మంది అర్హులైన కార్మికులను జౌట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుని నిర్వహణ బాధ్యతలు చూస్తారు. కొందరు రెండు, మరి కొంతమంది మూడు సబ్‌స్టేషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వీరు నిబంధనలకు విరుద్ధంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారినే కార్మికులుగా నియమించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఇకపై సీమాంధ్ర కాంట్రాక్టర్ల ఆటలు సాగవని గుర్తించిన సీమాంధ్ర ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సబ్‌స్టేషన్ల నిర్వహణకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్న కొత్త కుట్రకు తెరలేపారు. తెలంగాణ కాంట్రాక్టర్లను పక్కన పెట్టే ఎత్తుగడలో భాగంగా రూ.5కోట్ల టర్నోవర్ నిబంధనను తెరపైకి తెచ్చారు. గతంలో ట్రాన్స్‌కో సీఎండీగా ఉన్న సురేష్ చందా ద్వారా ఈ విధానాన్ని అమల్లోకి తేవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన బదిలీ కావడంతో ఈ విధానం అమలయ్యేలా చూడాలని ప్రస్తుతం జేఎండీగా ఉన్న కార్తికేయ మిశ్రాపై సీమాంధ్రులు తీవ్ర స్థాయలో ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. 

ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి

- ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కొనసాగించేందుకు సీమాంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్లకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మింట్‌కంపౌండ్‌లో బుధవారం తెలంగాణ ట్రాన్స్ కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి పది జిల్లాలకు చెందిన ట్రాన్స్‌కో కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల నిర్వహణ బాధ్యతలను గంపగుత్తగా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించేందుకే రూ. 5కోట్ల టర్నోవర్ నిబంధన సీమాంధ్ర అధికారులు తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గ్లోబల్ టెండర్ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే ఆం దోళనకు దిగుతామని హెచ్చరించారు. 

సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, ఇంధనశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీకి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్రప్రతినిధులు పిచ్చయ్య, శ్రీను, బుచ్చిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, పండరినాథ్, శివకుమార్, రామసుబ్బారెడ్డి, శంకర్, బాలరాజు, లక్ష్మణచారి, ఖయ్యూం, మునీరుద్దీన్, ప్రవీణ్‌కుమార్, నర్సింహారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు తెలంగాణ పదిజిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 
telangana-sustations

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి