-చార్జిషీటులో పేరును చేర్చిన సెబీ..
-2000 సంవత్సరంలోనే కుంభకోణానికి బీజం!
-ఆ సమయంలో సత్యం డైరెక్టర్గా శ్రీనిరాజు..
-షేర్లు అమ్మి రూ.2 వేల కోట్లు ఆర్జించిన డైరెక్టర్లు
-ఆ నిధుల నుంచే టీవీ9 చానల్ ప్రారంభం?
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేశంలో అతిపెద్దదైన ఈ కార్పొరేట్ అకౌంటింగ్ కుంభకోణానికి 2000 సంవత్సరంలోనే బీజం పడిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అంటున్నది. ఈ స్కాంలో టీవీ9 ప్రమోటింగ్ సంస్థ ఐల్యాబ్స్ ప్రమోటర్, ప్రముఖ ఏంజిల్ ఇన్వెస్టర్ చింతలపాటి శ్రీనివాసరాజు (శ్రీనిరాజు) పేరును కూడా ఈ నెల తొలినాళ్లలో నమోదు చేసిన చార్జిషీటులో చేర్చింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, శ్రీనిరాజుతోపాటు మొత్తం 13మంది, వారికి చెందిన కొన్ని సంస్థలు కలిసి కుంభకోణం సమయంలో రూ.2000 కోట్లకు పైగా సంపాదించారని నియంత్రణ మండలి వెల్లడించింది. -2000 సంవత్సరంలోనే కుంభకోణానికి బీజం!
-ఆ సమయంలో సత్యం డైరెక్టర్గా శ్రీనిరాజు..
-షేర్లు అమ్మి రూ.2 వేల కోట్లు ఆర్జించిన డైరెక్టర్లు
-ఆ నిధుల నుంచే టీవీ9 చానల్ ప్రారంభం?

శ్రీనిరాజు, ఆయనకు చెందిన కంపెనీలు కలిసి ఈ సమయంలో సత్యంకు చెందిన 73 లక్షల షేర్లను విక్రయించాయని చార్జిషీటులో తెలిపింది. కుంభకోణం చోటు చేసుకున్న సమయంలోనే శ్రీనిరాజు తండ్రి దివంగత అంజి రాజు కూడా 2.5 లక్షల సత్యం షేర్లను విక్రయించారని వెల్లడించింది. తద్వారా వచ్చిన నిధుల నుంచే శ్రీనిరాజు టీవీ9 చానల్ను స్థాపించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2004లో టీవీ9 బ్రాండ్నేమ్తో శ్రీనిరాజు తెలుగు న్యూస్ చానెల్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థ 7 ప్రాంతీయ భాషల్లో న్యూస్ చానళ్లు కలిగిఉంది.
ఇప్పటికే టీవీ9లో కొంత వాటాను విక్రయించిన శ్రీనిరాజు.. తనపేరిట వాటాలను మొత్తంగా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం కంపెనీ విలువ మదింపు ప్రక్రియ సాగుతున్నది. కానీ తెలుగు చానెల్ ప్రసారాలను తెలంగాణ ఎంఎస్వోలు నిలిపివేసిన నేపథ్యంలో మదింపుకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టీవీ9 రూ.400 కోట్ల మేర పలుకవచ్చని అంచనా.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి