గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 21, 2014

వీళ్ళు...మారరుగాక...మారరు...!!!

 
-శ్రీశైలం విద్యుత్తు ఆపించండి..కృష్ణా ట్రిబ్యునల్‌కు చంద్రబాబు ఫిర్యాదు
-హక్కు ప్రకారమే ఉత్పత్తి: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయించాలని ఫిర్యాదులో పేర్కొంది. రాయలసీమలో మంచినీటి కోసం ముందు జాగ్రత్త చర్యగా శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించడంతో సోమవారం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. 

కుట్రల బాబు తాజా ఎత్తు:

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని రైతులు అల్లాడిపోతున్నారని తెలిసినా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అయితే శ్రీశైలం విషయంలో బాబు ఎన్ని పాచికలు వేసినా అవి పారవని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 860.2 అడుగుల వరకు నీరు ఉంది. నిబంధనల ప్రకారం చూసినా జలాశయంలో 834 అడుగులకు చేరే వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శ్రీశైలంలో 770 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి చేశారని వారు గుర్తు చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం (సోమవారం) 860.2 అడుగులు ఉంది. ఈ మాత్రానికే మంచినీటి కొరత ఏర్పడే ప్రసక్తే లేదని నిపుణులు చెప్తున్నారు. 

ప్రాజెక్టు కట్టిందే విద్యుత్తు కోసం:

 అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. దీన్ని ఇతర అవసరాలకు వాడబోమని ఆనాడు చెప్పారు. ప్రాజెక్టు కట్టిన తర్వాత కుంటి సాకులు, గుడ్డిసాకులు చెప్పి నీటిని రాయలసీమకు తరలించడం ప్రారంభించారు. విషయం ఇది కాగా శ్రీశైలం జలాశయంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దొంగచాటుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే... దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని టీ ఇంజినీర్లు విమర్శిస్తున్నారు.

ఆ ఫిర్యాదు నిలువదు:

 విద్యాసాగర్ రావు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమి లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. పాత నిబంధనలు పరిశీలిస్తే, ఏపీ వాదనలో బలం లేదని తేలిపోతున్నదని స్పష్టం చేశారు. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న నీటిమట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిబంధనలే చెప్తున్నాయని, ఈ విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ తొందరపడి నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏ తప్పూ లేదని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి