-పోలవరం అథారిటీలో తెలంగాణ అవసరం లేదు
-హోంమంత్రికి ఆంధ్ర టీడీపీ ఎంపీలు మెమోరాండం
-సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: ఎంపీ సీతారాంనాయక్
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ముంపుప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకున్న ఆంధ్రనేతల కళ్లు ఇప్పుడు ఖమ్మంజిల్లాలోని బూర్గంపాడుపై పడ్డాయి. ఆ గ్రామాన్ని కూడాఆంధ్రప్రదేశ్లో కలుపాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నేతృత్వంలోని ఒక బృందం పార్లమెంటులో రాజ్నాథ్సింగ్ను కలిసి 4పేజీల మెమొరాండంను అందజేసింది. హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల భద్రతకు ఇబ్బంది ఏర్పడిందని, గవర్నర్కు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అధికారాలకు అదనంగా అంతర్గత భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణను కూడా ఆయనకు అప్పగించాలని కోరారు.-హోంమంత్రికి ఆంధ్ర టీడీపీ ఎంపీలు మెమోరాండం
-సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: ఎంపీ సీతారాంనాయక్

సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: సీతారాంనాయక్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ ఆర్డినెన్సును తీసుకురావడంలో సీమాంధ్ర నాయకుల ప్రవర్తనను యావత్తు తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తున్నదని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ చెప్పారు. ముంపు ప్రాంతాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమం చేస్తామన్నారు. పోలవరం డిజైన్ మార్చడం ద్వారా సుమారు 2లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు కాకుండా చూడడంతో పాటు ప్రాజెక్టు వల్ల ఒనగూరే ప్రయోజనాలను కూడా సాధించుకోవచ్చునని స్పష్టం చేశారు. గతంలో అనేక ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన గిరిజనులకు ఇప్పటివరకూ పరిహారం, పునరావాసం లభించలేదని, ఇప్పుడు పోలవరం విషయంలో ఏ మేరకు న్యాయం జరుగుతుందో కూడా చెప్పడం లేదని అన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోనూ ముంపు ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్సులు రూపొందించలేదని ఆయన ప్రశ్నించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి