గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 26, 2014

కొడుకా.. ఎప్పుడు మాట్లాడుతవ్!

-పిల్లల క్షేమంపై ఆందోళనలో తల్లిదండ్రులు
-ఇంకా కోలుకోని బాధిత కుటుంబాలు
-యశోదాలో కొనసాగుతున్న వైద్యచికిత్స
-నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం
కొడుకా.. ఎప్పుడు లేస్తవ్? ఎప్పుడు మాట్లాడుతవ్? దవాఖాన మంచంపై పడి ఉన్న బిడ్డను తల్చుకుని ఓ తల్లి ఆక్రోశమిది. ఆమెదే కాదు.. అక్కడున్న తల్లిదండ్రుల్లో ఇదే ఆదుర్దా. తమ పిల్లలు ప్రాణాపాయం తప్పించుకుని బయటపడాలని వారు కోటి దేవుళ్లకు మొక్కుతున్నారు. తమ కంటిపాపలను కాపాడాలంటూ వైద్యులను వేడుకుంటున్నారు. ఇది మెదక్ జిల్లా మాసాయిపేటలో గురువారం స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై నగరంలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. రెండో రోజుకు కూడా వారు ఆ ఘోరకలి నుంచి తేరుకోలేదు.
alfaవార్డుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను చూసి గొల్లుమంటున్నారు. ఘటన జరిగిన రోజు దగ్గరుంచి అన్నీ చూసుకున్న మంత్రులు శుక్రవారం కూడా ఆస్పత్రికి వచ్చి, విద్యార్థులకు అందుతున్న చికిత్స, వారి ఆరోగ్యంపై వైద్యులను వాకబు చేశారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రిశశిధర్‌రెడ్డి, ఎల్ రమణ, నోముల నర్సింహయ్య, ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, మహిళ సంఘం నేత సంధ్య తదితరులున్నారు. 40 మంది సూపర్ స్పెషలిస్టు వైద్యుల బృందం, వంద మంది నర్సులు వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్నారు.

tableగాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి ఇదీ..: గాయపడిన 20 మంది విద్యార్థులూ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 10 మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పది మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. గాయపడిన చిన్నారులకు సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రిలో రక్తదానం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి