గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 30, 2014

పోలవరం ముసుగులో తెలంగాణ ఖనిజ దోపిడీకి రహదారి!

-పోలవరం ముసుగులో సక్రమం కానున్న అక్రమాలు
-రంగంలోకి దిగనున్న ఆంధ్రా పెట్టుబడిదారులు
-ఏడు మండలాల్లో సంపదను కొల్లగొట్టేందుకు సిద్ధం
-బాక్సైట్, రంగురాళ్లు, గ్రాఫైట్, టేకు.. అన్నీ ఖతం
పార్లమెంట్‌లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల అనందానికి అవధుల్లేకుండాపోయాయి. భద్రాచలం ఏజెన్సీలోని ఏడు మండలాల్లోని ఆదివాసీలను తరిమికొట్టి అపారమైన ఖనిజ సంపద, కలప,ఇసుకను ోచుకునేందుకు ిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ ఈ ప్రాంతం తెలంగాణలో ఉండడం, ఆదివాసీచట్టాలు అడ్డురావడంతో దొడ్డిదారిన దోచుకున్న పెట్టుబడిదారులు ఇప్పుడిక రాజమార్గంలోనే రూ.30 లక్షల కోట్లు విలువైన సంపదను లూటీ చేయనున్నారు. 
విలువైన బాక్సైట్, రంగురాళ్లు మింగుడే: చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య 30 కిలోమీటర్ల మేర లక్ష హెక్టార్లలో ఖనిజం విస్తరించి ఉన్నట్లు అంచనా. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే 200ఏండ్లు బాక్సైట్‌ను వెలికి తీస్తూ 50వేల మం దికి ఉపాధి కల్పించవచ్చు. టన్ను బాక్సైట్ రూ.15వేల నుంచి రూ.20వేల ఉంది. మొత్తం రూ.5లక్షల కోట్ల ముడిఖనిజం ఇక్కడ లభ్యమవుతుంది. చింతూరు నుంచి మోతుగూడెం వరకు పదికిలోమీటర్లలో 20 వేల హెక్టార్లలో రంగురాళ్లున్నాయి. జైపూర్, ముంబై కంపెనీలతోపాటు ఆంధ్రా పెట్టుబడిదారులు ఇప్పటికే చాలా వరకు వీటిని తరలించుకుపోయారు. ఇప్పుడు ఆంధ్రా పెట్టుబడివర్గం చూపంతా రంగురాళ్లపైనే ఉంది. చింతూరు మండలంలో రూ.10 లక్షల కోట్లు విలువ చేసే గ్రాఫైట్ ముడిఖనిజం 50వేల హెక్టార్లలో విస్తరించి ఉందని అంచనా. గతంలోనే ఆంధ్రా పెట్టుబడదారులు క్వారీలు తవ్వడానికి ప్రయత్నిచంగా స్థానికుల తిరుగుబాటతో వెనుదిరిగారు.

ఇక్కడ పరిశ్రమ ఏర్పడితే 50 ఏండ్లపాటు ఉత్పత్తి కొనసాగుతుంది. 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ ఖనిజాన్ని కూడా ఆంధ్రా పెట్టుబడివర్గం తమ ఖాతాలో వేసుకోనుంది. ఏజెన్సీలో లక్షల హెక్టార్లలో టేకుప్లాంటేషన్లున్నాయి. 2011లో చింతూరు మండలం కొమ్మూరులో రూ.6 కోట్ల విలువైన ఒక టేకు ప్లాంటేషన్‌ను దొడ్డిదారిన దోచుకెళ్లారు. వీఆర్‌పురం, కూనవరం, భద్రాచ లం మండలాల్లోనూ టేకు ప్లాంటేషన్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంటేషన్ 20, 30 హెక్టార్లలో విస్తరించిన వీటి విలువ రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ఇసుక ర్యాంపుల మునక: భద్రాచలం రాముడి పాదాలు తాకుతూ సుమారు 300 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నది. న్యాయబద్ధమైనవి 12 ఇసుక ర్యాంపులున్నాయి. న్యాయబద్ధంగా లేనివి వందల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మరెక్కడా దొరకని నాణ్యమైన ఇసుక ఈ ఏజెన్సీలో ఉంది. యంత్రాలతో తవ్వినా తరగని ఇసుక గని భద్రాచలం. దీనిపైనా ఆంధ్రా పెట్టుబడిదారులు కన్నేశారు. ఇప్పటికే బినామీపేర్లతో ఇసుక టెండర్లను కైవసం చేసుకొని కోట్లు కూడబెట్టారు. ఇప్పుడు కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం, వేలేరుపాడు, కుక్కునూరు, బుర్గంపాడు మండలాల్లో ఇసుక ర్యాంపులు ఉండవు. పోలవరం పుణ్యమాని నీటమునగక తప్పదు. పోలవరం నిర్మాణం జరిగితే నీరు స్టోరేజీ అవుతుంది. ఈ ర్యాంపులు శాశ్వతంగా కనుమరుగవుతాయి. ఆదివాసీలకు కనీసం కూలిపని కూడా దొరకదు.

ఆదివాసీల భూములకు దిక్కెవరు: ఏజెన్సీలోని గోదావరి పరిహారక ప్రాంతం నల్లరేగడి, కండ కలిగిన భూమి కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెం దిన వలస రైతులు అమాయక ఆదివాసీల వద్ద కౌలుకు తీసుకొని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అంతా చౌదరి, నాయుడు, రాజు సామాజికవర్గం వారే. 80 శాతం ఆదివాసీల భూములు వీరి గుప్పిట్లోనే ఉన్నాయి. ఏడు మండలాలు ఆంధ్రా లో విలీనమైనందున ఆదివాసీల భూములను లాక్కునేందుకు కుట్రపన్ననున్నారు. పీసా, 1/70 చట్టాలను తొక్కిపట్టి ఆంధ్రా అగ్రకులాలు ఆదివాసీల భూములను లాక్కునే ప్రమాదం ఉంది. ఏడు మండలాల ఆదివాసీల భూములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు భరోసా ఇవ్వలేదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి