-హఫీజ్పేట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అక్రమాలపై సీరియస్
-ఆగమేఘాల మీద పరిశ్రమల శాఖ సమావేశాలు
-వివరాల సేకరణలో అధికారులు తలమునకలు
-ఆగమేఘాల మీద పరిశ్రమల శాఖ సమావేశాలు
-వివరాల సేకరణలో అధికారులు తలమునకలు


ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూములన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం మినహాయింపులు లేకుండా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) శేరిలింగంపల్లి శాఖ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతే ఉన్నత స్థాయి అధికారులతో, శాసనసభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
లీజు మాటున కోట్ల విలువ చేసే భూమిని కబ్జా పెట్టిన అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర భూ పరిరక్షణ విభాగం కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర భూ బకాసురులపై ఉక్కు పాదం మోపాలని టీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి కోరారు. అక్రమార్కులకు సహకరించిన సీమాంధ్ర అధికారులను కూడా వదిలి పెట్టవద్దని ఆయన సూచించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులపై తెలంగాణ ప్రభుత్వమైనా స్పందించాలని సీపీఎం శేరిలింగంపల్లి కార్యదర్శి సీ శోభన్ డిమాండ్ చేశారు. భాను టౌన్షిప్కు వేసిన దారి, వోల్వో సర్వీసింగ్ సెంటర్, కున్ సర్వీసింగ్ సెంటర్, తేజ పవర్ కంట్రోల్స్ భూములు అక్రమంగా పొందినవని స్వయంగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ స్థాయి అధికారే ఆర్టీఐ కింద సమాచారమిచ్చారని తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి