గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 23, 2014

చంద్రబాబూ..నీ కుట్రలు జర ఆపుబాబూ!!

బ్లాగు వీక్షకులకు, తెలంగాణ ప్రజలకు

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!!





chandra


శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగులదాకా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి. 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జీవో 69 కూడా విడుదల చేసిండు. 770 అడుగులు ఉన్నపుడు కూడా కరెంటు ఉత్పత్తి చేసిన దాఖలాలున్నయి. మరి ఇప్పుడు 862 అడుగుల వరకు నీళ్లుంటే, తాగునీటి సమస్య అంటూ కరెంటు ఉత్పత్తి ఆపాలని కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖ రాస్తవా? అసలు నువ్వు రాజకీయాలకు అర్హుడివేనా? అంటూ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

-లేదంటే ఆంధ్ర కార్యాలయాలకు కరెంటు కట్

-శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపమనడం దుర్మార్గం
-770 అడుగుల వద్ద కూడా కరెంటు ఉత్పత్తి చెయ్యలేదా?
-చంద్రబాబు వైఖరికి నిరసనగా ట్యాంక్‌బండ్‌పై ఆందోళన
-టీటీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల మండిపాటు

శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్త్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్‌కు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాయడానికి వ్యతిరేకంగా మంగళవారం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టారు. పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం కరెంటు ఇవ్వకుండా అడ్డుకుంటున్నడని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని చంద్రబాబు కుట్రలు, తెలంగాణ టీడీపీ నాయకుల తీరును ఎండగట్టారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు హోరెత్తాయి. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, గొంగిడి సునీత, కనకారెడ్డి, వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఆమోస్, బీ వెంకటేశ్వర్లు, భానుప్రసాద్‌రావు, యాదవరెడ్డి, సలీం, సుధాకర్‌రెడ్డి, జగదీశ్, పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేశ్, నాయకులు ప్రేమ్‌కుమార్ థూత్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రలో ఓట్లు నమోదు చేయించుకోండి: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్


తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం గెలిచినట్లుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్లు విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు ప్రమాణం చేసిన పదిరోజుల్లోనే పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా పీపీఏలను రద్దు చేసిండు. తెలంగాణ అంధకారంలో ఉండాలి.

ఏపీ మాత్రం సల్లగుండాలి అనే దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నరు. కరెంటు కష్టాలను తీర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో న్యాయబద్దంగా తెలంగాణకు 54 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని 12 రోజులుగా ఉత్పత్తి ఆపించి, 800 మెగావాట్లను దొంగతనంగా వాడుకుంటున్నరు.

బాబు చర్య నీచాతి నీచం: ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్


20 ఏండ్లు టీడీపీ, 40 ఏండ్లు కాంగ్రెస్ ఈ రాష్ర్టాన్ని పాలించిండ్రు. ఇక్కడ బొగ్గు ఉంది, నీళ్లున్నయి. కానీ విద్యుత్‌కేంద్రాలను మాత్రం ఆంధ్రల పెట్టిండ్రు. చివరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన కరెంటును కూడా ఇయ్యకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తుండ్రు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని లేఖ రాయడం నీచాతి నీచం.

babu


ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ కుట్రలా?: ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు


ఒకవైపు చంద్రబాబు కరెంటు ఆపుతుంటే, ఇంకోవైపు టీటీడీపీ ఎమ్మెల్యేలు కరెంటు కోతలంటూ ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? కలిసున్నపుడు అరవయ్యేండ్లు ప్రతిదానిలో తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు న్యాయపరంగా కరెంటు వాటా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లో భ్రమ కల్పించేందుకు కుట్ర చేస్తున్నరు. చంద్రబాబు వైఖరి నచ్చకే చాలామంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరిండ్రు. త్వరలో ఆ పార్టీ ఖాళీ అయితది. ఉమ్మడి రాజధాని పేరిట సకల సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తూ కుట్రలు చేయడం సిగ్గుచేటు.

బద్మాష్ యాత్ర: ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు


ఒకవైపు చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, ఇంకోవైపు టీ టీడీపీ నాయకులు బస్సు యాత్ర చేస్తరు. వాళ్లది బస్సు యాత్ర కాదు.. బద్మాష్ యాత్ర. వారి కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మరు. అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆరువేల మెగావాట్ల విద్యుత్తు కోసం ఒప్పందం చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? ఇప్పటికైనా టీటీడీపీ నేతలు తెలంగాణ ప్రజల కోసం పని చేయాలి.

కుట్రలు ఆపకుంటే ఆంధ్ర కార్యాలయాలకు కరెంట్ కట్: ఎమ్మెల్సీ యాదవరెడ్డి


అసలు రాష్ట్రంలో కరెంటు కష్టాలకు బాధ్యులెవరో తెలంగాణ టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి. 60 ఏండ్లు ఆంధ్రలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రులు, విద్యుత్‌మంత్రులు అందరూ వాళ్లే అయి ఈ కుట్ర చేసిండ్రు. కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ఈ కుట్రలన్నింటినీ ప్రజలకు చెప్పిండ్రు.

అందుకే పునర్విభజనచట్టంలో తెలంగాణకు 54 శాతం కరెంటు రావాలని పొందుపరిచినరు. న్యాయపరంగా రావాల్సిన కరెంటును ఇవ్వకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబు ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనుగోలు చేయకుండా కూడా కుట్రలు చేస్తున్నరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలి. చంద్రబాబు కుట్రలు ఆపకుంటే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర కార్యాలయాలకు కరెంటు కట్ చేస్తం.

ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి


తెలంగాణలో అంతా బోర్ల మీద వ్యవసాయం చేస్తరు. అందుకే వీటిని ఎట్ల నిలుపుదల చేయాలా అని చంద్రబాబు కుట్రలు చేస్తున్నరు. కృష్ణపట్నం, లోయర్ సీలేరు నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కరెంటు దక్కేలా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకోవాలి. హుదూద్ తుపాన్ వస్తే విశాఖకు విద్యుత్ పరికరాలు సరఫరా చేసి సహకారం అందించినం. కానీ తెలంగాణ రైతాంగం బాధలు పడుతుంటే కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నరు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి